(ప్రశ్న: స్వామీజీ మీరు విగ్రహారాధనను అంగీకరిస్తారా?
(ప్రశ్న: స్వామీజీ మీరు విగ్రహారాధనను అంగీకరిస్తారా?
మొట్టమొదట, బాగా స్పష్టంగా ఉండండి. మనమనే 'విగ్రహారాధన' విగ్రహాల ఆరాధన కాదు!
అవి విగ్రహాల ద్వారా ఆరాధన.
స్పష్టంగా, విగ్రహారాధకుడెవడూ విగ్రహాన్నే ఆరాధించటంలేదు. అతడు దృశ్యరూపంలో ఉన్న విగ్రహాన్ని దైవంగా భావించి ఆరాధిస్తున్నాడు.
అది తెలివి తక్కువ విషయమా?
ఈ విషయాన్ని లోతుగా వీక్షించండి.
మనకు తెలిసినట్టుగా, జీవితమంతా ఒకే మూలం నుండి వస్తుంది. విశ్వంలోని ప్రతి వస్తువు ఒక రకమయిన ముడి పదార్ధంలా నుంచి సృష్టింబడుతుంది. విశ్వానికి సమానమయిన అంతర్నిర్మాణముంది. మనం ఉపరితల వైవిధ్యాలను మాత్రమే చూస్తున్నాము కాబట్టి దీని గురించి మీకు తెలియకపోవచ్చు. విశ్వంలో భాగంగా మనం విశ్వం యొక్క ఖచ్చితమయిన రచనా నిర్మాణాలను ప్రతిబింబించే అద్దాల లాగా ఉంటాము. ఈ భావనను స్పష్టంగా అర్థం చేసుకోండి.
లోని ప్రతి వస్తువు సంబంధించి ఉంటుంది. విశ్వం అయిదు మహామూలకాల తోను, అయిదు మహాశక్తులతోను - నేల, నీరు, నింగి, నిప్ప, గాలి - కూర్చబడింది.
ఈ మూలకాలన్నీ (సంస్కృతంలో పంచభూతాలని వీటిని వ్యవహరిస్తారు) దైవంగా లేదా పరాశక్తిగా మనం అభిభాషించే విశ్వశక్తి వ్యక్తీకరణలు.
మానవుడు తాను (ఆత్మ) బ్రహ్మ లక్షణాలను ప్రతిబింబిస్తాడు. మనుష్యుడు కూడా ఈ అయిదు మహాశక్తుల నుండి ఏర్పడ్డాడు, అతడు కూడా పంచభూతాల నుండి నిర్మించబడ్డాడు. అతడు ఈ మూలకాల నుండి ఉద్భవించాడు, ఈ మూలకాలలో జీవిస్తున్నాడు, తుదకు ఈ మూలకాలలోకి తిరిగి వెళ్ళిపోతాడు. సహజంగా, జీవిత కాలమంతా మనుష్యుడు తన అసలు ఉత్పత్తి స్థానానికి తిరిగి వెళ్ళటానికి తహతహ లాడుతుంటాడు, కాబట్టి అతడు తాను ఈ మహాశక్తులతో కలిసి సమగానం చేయటానికి ప్రయత్రిస్తాడు.
మతం మనుష్యుడు ఈ కీలక శక్తుల మధ్య జరిగే సమ్మేళన సృజన ప్రక్రియ మాత్రమే.
విశ్వశక్తి సాంద్రరూపం భూమి. మనిషిలో, అది మన శరీరంలో ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. దైవంతో తాను సమెక్యం కావటానికి మొదటి మెట్టుగా మనిషి తన స్వరూపంలో ఉన్న మట్టి విగ్రహ స్వరూపంలో ఉన్న భూమితో సంబంధాన్ని అన్వేషిస్తు న్నాడు. మనిషికి ఈ రూపం దైవంతో సంభాషించటంలో సాయపడటానికి అవసరం.
ఆధ్యాత్మిక యాతలో ఉన్న ప్రారంభకుడికి, అమూర్తంగా ఉన్న దైవాన్ని ఊహించటం కూడా కష్ఠం. దానికి రూపాన్నిచ్చినప్పుడు, అతడు అర్థం చేసుకోగలిగే, అన్వయించుకోగలిగే మూర్త పదార్థ విశేషంగా దైవం రూపొందుతుంది. విగ్రహంతో, అతడు తనకు పరిచయమున్న భాషలో దైవంతో సంభాషించగల్గుతాడు.
వందలకొద్ది ఉన్న హిందూదేవతలు దైవ వ్యక్తీకరణలు మాత్రమే, అయినా ఎవరైనా వాటితో మాట్లాడవచ్చు, వాటితో ఆడుకోవచ్చు, ఓదార్పును అన్వేషించవచ్చు లేదా కృతజ్ఞతలు సమర్పించుకోవచ్చు.
భయమయిన అనిర్వచనీయమయిన మొత్తం దైవ ప్రకృతి విగ్రహరూపంలో సుఖ నిష్పత్తులలో ఉండేటట్టు తగ్గించబడింది. అది ఈ విధంగా ఉండాలి. సాధారణ మనసుకు నిరాకారుడయిన భగవంతుడు కేవలం భయంకరమయిన భావన.
గాఢతర సూక్ష్మతరస్థాయిలో, ఇంకో సందేశం ఉంది :
మీముందున్న విగ్రహం మీ రూపంలాగానే ఉంది.
అయినా అది దేవుడు.
మీ గురించి అది ఏమి చెప్తాంది? దాని గురించి ఆలోచించండి. కాబట్టి విగ్రహాలు మొదటి మెట్టుగా ఖచ్చితంగా అవసరం, సహాయకారులు. విగ్రహం ఆధ్యాత్మికతలో ప్రవేశించటానికి దూకే బల్లలాంటిది.
మీరు ఆధ్యాత్మికంగా వికసించేకొద్దీ, ధ్యాననిమగ్నులుగా మీరు మీముందు ఏ భౌతిక రూపం లేనప్పటికి మీరు దైవంతో చక్కగా సంభాషించగల్గుతారు. పిల్లలు వయసు పచ్చిన తర్వాత ఆట వస్తువులతో ఆడటం మానివేసినట్లు, సమయం వచ్చినప్పుడు, మీ అంతట మీరు విగ్రహారాధన మానివేస్తారు. ఇది మతం యొక్క అంతిమ లక్ష్యం.
ప్రశ్న: స్వామీజీ! మీరు కాషాయ వస్త్రాలనెందుకు ధరిస్తారు?
ప్రతిరోజు కనీసం పదిసార్లు నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసి వస్తోంది. భారతంలో ముఖ్యంగా కాషాయ వర్ణం హిందుత్వంతో గాఢ సంబంధం కలిగి ఉంది.
నా కాషాయవస్తం (వాస్తవంగా అది జేగురురంగు వస్త్రం) గురించి సంశయాత్ములు ముఖ్యంగా యువతీ యువకులు అనేక ప్రశ్నలు వేస్తున్నారు.
నూతనంగా ఆవిర్భవిస్తున్న వర్ణ చికిత్సా క్షేత్రం గురించి విన్నారా?
రంగులు మీ మానసిక స్థితిపై గాఢ ప్రభావం కలిగించే సూక్ష్మ లక్షణాలను కలిగి ఉంటాయనే వాస్తవంపై ఆధారపడి వర్ణ చికిత్స ఉంది. మీకు తెలిసినా, తెలియక పోయినా, భిన్న భిన్న వర్ణాలు, భిన్న భిన్న ఆలోచనలను, భావోదేకాలను పుట్టిస్తాయి.
దీనికి ఖచ్చితంగా శాస్త్రీయ వివరణ ఉంది :
మనం పదార్థం యొక్క వర్ణం అనేది అది ప్రతిబింబించే కాంతి తరంగ దైర్ఘ్యం మాత్రమే. మన చుట్టూ అద్భుశ్య విద్యుదయస్కాంత క్షేత్రం ('కాంతి పుంజం' లేదా 'జీవుదవ్యశరీరం' అని విదితం) మనకు ఉంది కాబట్టి మన సొంత అయస్కాంత క్షేతం 'అనుభూతులు' లేదా 'భావోదేకాలు'గా మనం అన్యయించే చలనాన్ని లేదా ప్రతిచర్యను సృష్టించటానికి భిన్నవర్ల తరంగాలతో ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు, ఒక రంగు యొక్క తరంగ దైర్ఘ్యం, వ్యక్తి క్షేత పౌనఃపున్యం పరస్పరం సరిపోతే, అది క్రమబద్ధత, శాంతి భావాన్ని కల్గిస్తుంది.
వేర్వేరు వ్యక్తులు రంగులకు భిన్న రీతులలో స్పందిస్తారు, కాని చాలా సాధారణ పరిస్థితులున్నాయి. లషర్ వర్ల పరీక్ష బాసెల్ పటంలో 25 రంగులను చూపింది. ఈ పరీక్ష చాలామంది ఖచ్చితమయిన భిన్న 'వ్యక్తిత్వాలు' కలవారు ఒకే రకమయిన రంగులను ఎంచుకున్నారు. ఈ ప్రతిస్పందనలు భావోదేకం కాదు, మనం మానసిక మార్పుగా కూడా వీటిని చూడవచ్చు. చాలా తరచుగా, అది ఒక రంగు ప్రమాదకరమయినదిగా, పశాంతమయినదిగా, సంతోషమయినదిగా… అన్వయించ టానికి మనల్ని ప్రేరేపించే శరీరంలోని శారీరక పరిణామం.
నీరుపు రంగుకు గురి చేయబడ్డప్పుడు చాలామందికి శ్వాస క్రియ సూచి పెరగటం, గుండె వేగంగా కొట్టుకోవటం, రక్తపోటు అధికం కావటం జరిగింది - కాబట్టి సహజంగా, మనం ఎరుపు భావోదేకాన్ని లేదా ప్రమాదాన్ని కల్గిస్తుందని భావిస్తాము.
శుద్ధ నీల వర్ణాన్ని చూచినప్పుడు, శరీర ప్రతి క్రియ తద్భిన్నంగా ఉంటుంది - నీలం సామాన్యంగా ప్రశాంత పరిచే రంగుగా మనం అనుభూతి చెందుతుంటాము.
ప్రతి తల్లికి తెలుసు - తన బిడ్డకు నిదపట్టకపోతే, గదిలో నీలం రంగు బెడ్లైట్లో సుఖనిద్ద తన బిడ్డకు పడుతుంది. (తల్లికి కూడా బాగా నిద్దపడుతుంది!) ఈ కారణంగా కొన్ని నిర్ధిష్ట రంగులు సాంప్రదాయికంగా నిర్ధిష్ట గుణాలతోను భావోదేకాలతోను సంబంధం కలిగి ఉన్నాయి. దానికి పేరు పెట్టకుండానే, శతాబ్దాల తరబడి మనం వర్ణ చికిత్సను అభ్యసిస్తున్నాము. భారతలో, ఆహారం నుంచి మానవ ప్రకృతి వరకు ప్రతి వస్తువును దాని సహజ లక్షణాలను బట్టి మూడు విధాలుగా వర్గీకరించారు: సాత్వికం (ప్రశాంతం), రాజసికం (క్రియాత్మక మయినది), తామసికం (విధ్వంసక మయినది). రంగులను కూడా ఈ విధంగా విభజించవచ్చు: ఉదాహరణకు, ఎరుపు రంగు రాజసికం : ఇది మెదడులోని కార్యకలాపాన్ని ఉత్తేజరుస్తుంది. ఆ కారణంగా ఎరుపురంగు ప్రమాదకరమయిన రంగు - ప్రేమ రంగు! తెలుపు సాత్విక వర్ణం: మీరు తెలుపు ధరించినప్పుడు, శక్తి ప్రసారం బాగుంటుంది. తెలుపు రంగు మిమ్మల్ని ఇతోధికంగా ప్రశాంతంగా గ్రహణశీలిగా ఉంచుతుంది. తెలుపు సమాచారాన్ని అధిక ప్రభావవంతంగా గ్రహించేటట్లు మీకు సాయపడుతుంది. ఆ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా, తెలుపు పాఠశాల దుస్తులుగా ఎంచుకోబడుతుంది!
ఇదే విధంగా కషాయంరంగు (జేగురురంగు)కు మీమనస్సుకు ఓదార్పు కల్లించే శక్తి ఉంది. అది మీ కీలక శక్తిని ఉత్తేజపరుస్తుంది. తెలుపు దుస్తులను ధరించే వారిని మాత్రమే కాకుండా తెలుపును చూసే వారిని కూడా మనోధ్యాన స్థితిని స్పష్టిస్తుంది. ఈ కారణంచేతనే భారతలో ఆధ్యాత్మిక ఆచార్యులు సాంప్రదాయికంగా కాషాయ వస్తాలను ధరిస్తున్నారు. హిందుత్వానికి దీనికి సంబంధం లేదు!
బాగా స్పష్టంగా ఉండండి: ఈ పురాతన ఆచారాలన్నిటికి వారికి నిర్ణీత శాస్త్రీయ ఆధారం ఉంది. ఆచారాలు వందల వేల సంవత్సరాల వివేకాన్ని జ్ఞానుల తపస్సును కాచి వడపోస్తే లభించాయి. కాలం గడిచేకొద్దీ ఆచారాల వాస్తవ అర్థం జన సామాన్యంలో మరుగుపడిపోయిన కారణంగానే, నేడు ఆచారాలు విశ్వసనీయతను కోల్పోయాయి. ఆచారం గుల్త మాత్రమే మిగిలి ఉంది. ఆత్మవదిలి వెళ్ళిపోయింది.
ఈ రోజు, నిర్ణీత రంగులు, ధ్వనులు, చర్యలు మీ మానసిక స్థితిపై ప్రభావం చూపగలుతాయి, మీ మెదడులోని వాంఛిత ప్రదేశాలను ఉత్తేజపరచగల్గుతాయి, మీ చేతనను వ్యాప్తి పొందిస్తాయి - ఈ విషయాల్ని శాస్త్రం ఒప్పకొంటుంది. ఆచారాల వెనక ఉన్న శాస్త్రీయత మీకు తెలియనంత మాత్రం చేత వాటి ప్రాముఖ్యాన్ని నిర్లక్ష్యం చేయటం సూక్ష్మక్రిములను మీరు చూడనంత మాత్రం చేత వాటి ఉనికిని నిరాకరించటంలా ఉంటుంది!
నేడు అవి మీకు అసందర్భమనిపించినా ఆచారాల వాస్తవ శక్తిని తక్కువ అంచన వేయువద్దు. ఆచారాలను సరయిన మార్గంలో నిర్వహించినప్పుడు, వాటి ఊహాతీతమయిన జాగృతి, పరిణామ స్థాయిల్ని కల్పించే అద్భుతశక్తి ఉంది.
(ప్రశ్న) : స్వామీజీ ! ఆధ్యాత్మిక జీవితాన్ని గడపటానికి శాకాహారమవసరమా? అవును!
ఇప్పుడు మీరు ఆలోచించటం మొదలుపెట్టారు. ఎందుకు? నాసొంత అనుభవ బలంతో మీతో మాట్లాడుతున్నానని చెప్పితే, మీరు నన్ను విశ్వసించటం సులభంకాదు. ఎందుచేతనంటే మన మనస్సులు ప్రతిదానికి శాస్త్రీయ నిరూపణను కోరటానికి అలవాటు పడ్డాయి. మన ప్రతిదిన జీవితాలలో మన ఐన్స్టీన్ వ్యోమకాలంవంటి లేదా క్వాంటమ్ భౌతిక శాస్త్రాల సిద్ధాంతాల వంటి మూలాంశాలను ఎప్పుడూ ఎదుర్కోనప్పటికీ (భవిష్యత్తుత్తులో ఎదుర్కోలేనప్పటికీ, ఈ భావనలను అంగీకరించటానికి మనం సిద్ధపడుతున్నాము.
ఎక్కడో ప్రయోగశాలలో పరీక్షించబడ్డాయి. కాబట్టి, కొన్ని గణాంకాలు వాటికి ఊత ఇవ్వటానికి ఉత్పన్నం చేయబడ్డాయి కాబట్టి, మీరు నమ్మక తప్పటం లేదు.
వాస్తవంగా, శాస్త్రం విశ్వంలోని గొప్ప సత్యాలను నిరూపించలేదు. ఆ సత్యాలు అతీతాలు. ఐన్స్టీన్, ఆధునిక క్వాంటమ్ భౌతిక శాస్త్రజ్ఞులతో చాలా మంది అంగీకరిస్తారు!
ఏమైనప్పటికీ, ఆధ్యాత్మిక జీవనంలో శాకాహార ప్రయోజనాల గురించి నన్ను శాస్త్రీయ వివరణను ఇవ్వనివ్వండి.
Part 3: Open the door...let the breeze in!
మళ్ళీ రహస్యమయినది ఏదీ కాదు!
దీని అర్థం చేసుకోవటానికి, మొదట మీరు మానవ మస్తిష్కం పనిచేసే మార్గాన్ని గురించి కొంత తెలుసుకోవాలి.
మెదడు కార్యకలాపాన్ని సూక్ష్మవిద్యుత్పవాహ రూపంలో నమోదు చేస్తుంది. సమాచారాన్ని అందుకొన్నప్పుడు లేదా నిశ్చిత విధులను నిర్వర్తించినప్పుడు, అది భిన్న పౌనఃపున్యాలలో విద్యుత్ ప్రవాహాలను లేదా లయలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రవాహాలను మస్తిష్క తరంగాలంటారు.
భిన్న కార్యకలాపాలకు సమంగా మస్తిష్క తరంగాలు నాలుగు మౌలిక రకాలుగా ఉన్నాయి. డెల్టా తరంగాలు (గాఢ నిద్దలో ఉద్భవిస్తాయి). ఆల్ఫా తరంగాలు (ధ్యానంలో ఉద్భవిస్తాయి). తీటా తరంగాలు (గాఢ భావోదేక సమయంలో ఉద్భవిస్తాయి); బీటా తరంగాలు (సంక్షిష్ట గణిత సంబంధి లేదా విశ్లేషాత్మక కార్యకలాపాల సమయంలో మస్తిష్కలలాట ఖండం ఉత్తేజపరచబడినప్పుడు ఉద్భవిస్తుంది). ఆల్ఫాతరంగాలు ధ్యానానికి టెలిపతికి ప్రత్యేకమయిన శాంతి, ప్రశాంతతా, విశ్రాంత ఏకాగ్రతలను ప్రేరేపిస్తాయి. స్పుహలో ఉన్నప్పుడు లేదా స్పుహలో లేనప్పుడు అన్ని ధ్యాన విధానాలు మెదడులో ఆల్ఫా తరంగాల ఉత్పత్తి కోసం ఒప్పయిన పరిస్థితులను కల్పించటానికి ప్రయత్నిస్తాయి. ఆల్ఫా తరంగాల గురించిన విషయమేమిటంటే, మెదడు ప్రాణవాయు సరఫరా తక్కువగా ఉన్నప్పుడు మస్తిష్కంలో అవి (ఆల్ఫా తరంగాలు) ఉద్భవిస్తాయి. తక్కువ ప్రాణ వాయు సరఫరా మస్తిష్క కార్యకలాపాన్ని తగ్గిస్తుందని సామాన్యంగా మనం భావిస్తుంటాం. కాని వాస్తవమేమిటంటే, తక్కువ ప్రాణవాయువున్న సమయాల్లో మస్తిష్కం అలసిపోయేటట్లుగా పనిచేస్తుంది. మెదడులోని రక్షనాళాలు అధిక రక్త అంతఃప్రవాహాన్ని అధికం చేస్తాయి. ఇది సడలింపు అనుభూతిని కల్గిస్తుంది. ఏకకాలంలో మెదడు సడలింపు ఆల్ఫా తరంగాలను ఉత్పాదన చేయటానికి ప్రారంభిస్తుంది. మెదడుకు తక్కువ ప్రాణవాయు సరఫరా చేయటమనేది ఆల్ఫా తరంగాల ఉత్పత్తికి ఒక ప్రధాన హేతువు.
ఇది ఏవిధంగాను మస్తిష్కాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయదు.
ఇప్పుడు ఆహార విషయం.
ప్రకృతిలో మాంసం మిక్కిలి ఆమ్లమయినది, రక్తామ్లాన్ని నేరుగా పెంచుతుంది. దీని పూరించటానికి, ఊపిరితిత్తులు తక్కువ బొగ్గుపులుసు గాలిని (ఇది కూడా ఆమ్లమే) తీసుకుంటాయి, మారుగా ఎక్కువ ప్రాణవాయువును తీసుకుంటాయి. కాబట్టి మెదడుకు చేరే రక్తం కూడా ఎక్కువ ప్రాణవాయువును తక్కువ బొగ్గు పులుసుగాలిని కల్గి ఉంటుంది. పోల్చి చూస్తే, శాకాలు రక్తకార్యకలాపాన్ని తగ్గిస్తాయి. రక్తంలోని ఆమ్లక్షార సమతౌల్యాన్ని యథాస్థితిలో ఉంచటానికి, ఊపిరితిత్తులు ఎక్కువ ఆమ్ల బొగ్గు పులుసు గాలిని తీసుకుంటాయి. కాబట్టి మెదడుకు చేరే రక్తం కూడా తక్కువ ప్రాణవాయువును కలిగి ఉంటుంది.
ధ్యానంలో సహాయపడే ఆల్ఫాతరంగాల ఉత్పత్తి ప్రారంభానికిగాను ఇది మెదడుకు పూర్ణ పరిస్థితిని కల్గిస్తుంది.
ఈ కారణంగానే ప్రాచీన కాలం నుంచి ఋషులు తక్కువ ప్రాణవాయువు కల ఎత్తెన ప్రదేశాలలో (ఋషులు హిమాలయాలలో ఉండటానికి ఇష్టపడేవారు). శాకాహార తత్త్వం, వెనక ఉన్న శాస్త్రం చాలా తక్కువ మందికి తెలుసు. మీకు తెలుసుకోవలసిన అవసరంలేదు. శాకాహారంతో మీకు యాంత్రికంగా ఆ భేదం తెలుస్తుంది. ఒకసారి మీరు నియతంగా ధ్యానం చేస్తుంటే, మీ శరీరం క్రమంగా శుద్ధి అవుతుంది, ఇతోధికంగా ధ్యానానికి తగి ఉంటుంది. అప్పుడు, మీకడుపు గందరగోళమయినప్పుడు మీ శరీరానికి ఏ ఆహారం తీసుకోకూడదో తెలిసినట్లుగానే,
సహజంగా అది మీరు ధ్యానం సరిగా చేయటాన్ని నిరోధించే ఆహార పదార్హాల్ని ఆపివేస్తుంది.
మీరు ధ్యానాన్ని అవలంభించాలని అనుకున్నప్పటికీ మీ మీద మీరు శాకాహారాన్ని బలవంతంగా రుద్దుకొనండి.
దాన్ని చేస్తే, అణచబడ్డ కోరికలు ఇంకా ఎక్కువగా పెరుగుతాయి, సామాన్యంగా మీరు వాటి ప్రభావం నుంచి బయటపడలేరు.
పెద్ద కష్టం లేకుండా మాంసాన్ని మానివేయ గలిగితే, మానివేయండి.
అలాకాకుంటే, చింత లేదా దోషభావన లేకుండా మాంసాహారాన్ని కొనసాగించి ఆనందించండి.
దయచేసి దాని గురించి దోషభావనకు తావీయకండి ! తుదకు, దోష భావన మీ వ్యవస్థలో మిక్కిలి శక్తి నిరోధ స్థితిని కల్గిస్తుంది, అది మాంసం కంటె అధికతర హాని కల్ల చేస్తుంది !
మీ శరీరం సిద్ధపడినప్పుడు, తనంతట తానే అది అలవాటును అడ్డుకుంటుంది.
* * * *
ప్రశ్న : ఉపవాసం వాస్తవంగా ఆరోగ్యానికి లాభదాయకమా?
అవును.
సక్రమ మార్గంలో చేస్తే, ఉపవాసం నిక్కచ్చిగా లాభదాయకమే.
రోజురోజుకు చెడ్డగా మారుతున్న తినే అలవాటు కారణంగా మనకాలంలో ఉపవాసం చేయటం అంతకంతకు ముఖ్యమవుతోంది !
మత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపవాసం చేస్తున్నారని అనుకోవద్దు. ఈ సంప్రదాయాలన్నిటి వెనక నిశ్చిత శాస్త్రీయ హేతువులున్నాయి.
సంస్కృతంలో అన్నం బ్రహ్మ, అన్నం దేవుడు అని మనం చెబుతుంటాం.
మన జీవితాలను పోషించే ఆహారం శక్తి. భక్షణం ఒక రకమయిన పూజ.
కాని సామాన్యంగా మనం మన కడుపులను ఎలా పరిగణిస్తున్నాము? మనం దేన్నెనా, ప్రతి దానిని దానిలోకి తోసివేస్తున్నాము!
ఏ ఇతర జంతువు 2, 3 ఆహార పదార్థాల కన్న ఎక్కువ తినదు. వాస్తవంగా పెంపుడు జంతువులు తప్ప, ఇతరమైనవి తమ తమ జీవిత కాలంలో ఒకే రకమయిన ఆహారాన్ని తింటాయి. సింహం మాంసాన్ని మాత్రమే తింటుంది. లేడి గడ్డిని మాత్రమే తింటుంది. వాటికి అవసరమయిన పోషకాన్ని ఆ ఒక ఆహారమే సరఫరా చేస్తుంది. అంతేకాదు, ప్రతి ఇతర జంతువు నిర్దిష్ట సమయంలో తనకు అవసరమయినంత పుట్టుకు మాత్రమే తింటుంది. జంతు ప్రపంచంలో అత్యాశ వినపడదు!
మీరు బిడ్డలను గమనిస్తే, వారికి అవసరమయిన దానికంటె మీరు వారి నెంతబలవంత పెట్టినాప్పటికి ఒక పాల చుక్కను కూడా తాగరు! కాని మన పొట్ట ఇచ్చే హెచ్చరిక సూచనలను మనం పూర్తిగా పెడచెవిని పెడతాము. మనం కడుపును అన్ని రకాల ఆహార పదారాలతో నింపటమే కాకుండా, మనం మనకు అవసరమయిన దాని కుప్ప ఎక్కువ తింటున్నాము. మనం మనకడుపులను తిండి చెత్తకుండీలలా పరిగణిస్తున్నాము!
ఆహార ప్రయోజనమేమిటి? శక్తినివ్వటం. కాని తిన్న తర్వాత మనం సాధారణంగా శక్తి కలవారంగా అనుభూతి పొందుతున్నామా? లేదు! సామాన్యంగా మనమంతా తిన్న తర్వాత కునుకుతీయటానికి ఇష్టపడతాము! తిన్న తర్వాత మనకు కుసుకు పడుతుందనటం సూర్యుడుదయించినప్పుడు చీకటి పడుతుందని చెప్పటంలా ఉంది! అది పూర్తిగా అసహజం, మనమేమి తప్పచేస్తున్నాము?
మనం మన ఆహారంతో మన వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాము.
జీర్ణంలో ఉపయోగించే శక్తి ఆహారం విడుదల చేసే శక్తి కంటే అధికం కాబట్టి తిన్న తర్వాత మనం వాస్తవంగా శక్తి తక్కువ కలవారమవుతున్నాము.
మన శరీరంలోని జీర్ణశక్తి జఠరాగ్ని అని పిలవబడుతుంది -
మూలాగ్ని.
పంచభూతాలలో అగ్ని పదార్థం, శక్తి కలుసుకునే బిందువు. అగ్ని పదార్థాన్ని శక్తిగా మార్చేది. సాధారణ దినాలలో, మనం ఎక్కువగాను నిర్లక్ష్యంగాను తినటంవల్ల మన క డుపులను శ్రమపెట్టి నప్పుడు, జఠ రాగ్ని వెబుత్తం శక్తి ఈ ఆహారాన్ని జీర్ణంచేసుకోవటంలోను, టాక్సిన్ల ప్రధాన భాగాన్ని శుభపరచటంలోను ఉపయోగ పడుతుంది. అది 'నిర్వహణకార్యం'లో ఇరుక్కుంటుంది. మనం జఠరాగ్నికి తన ఇతర ప్రధాన విధులను నిర్వర్తించే అవకాశాన్ని ఇవ్వము.
జఠరాగ్ని శుభపరిచే గొప్పబలం.
మనం ఉపవాసాన్ని అభ్యాసం చేసుకున్నప్పుడు, జఠరాగ్ని మన శరీరాల నుండి అధికంగా ఉన్న కొవ్వును కరిగించటమే కాకుండా మనం కూడబెట్లుకున్న వ్యతిరేక శక్తిని గూడా శుభపరుస్తుంది.
అనియత భోజనం అలవాటు మన భౌతిక శరీరాలలో పోగుపడటానికి కొవ్వు విక్షేపాలను కల్పించినట్టుగా, మన శక్తి భాగంలోని పొర నుండి మన అణచబడ్డ భావోదేకాలు విక్షేపాలను కల్పిస్తాయి. ఏళ్ళు గడిచేకొద్దీ, కొలెస్టరాల్ ధమనులను అడ్డి గుండెలోని రక్తప్రవాహాన్ని భంగపరిచినట్లు, 'శక్తి అవరోధాలు' మన శరీరమంతటా శక్తి స్వేచ్చా ప్రవాహాన్ని భంగపరుస్తాయి.
మనం కడుపుకు విశ్రాంతి కల్పించిన రోజులలో జఠరాగ్ని ఈ శక్తి అవరోధాలను తొలగించి వ్యతిరేక శక్తిని అనుకూల శక్తిగా మారుస్తుంది. అందుచేత, మీరు ఉపవాసం చేసినప్పుడు, సాధారణంగా మిక్కిలి తేలికగాను, శక్తిమంతంగాను అలిసిపోనట్లుగాను భావిస్తారు!
కొంచెం ప్రయత్నిస్తే మీ అంతట మీరే చూస్తారు. వాస్తవానికి, మీరు ఉపవాసం చేస్తున్న రోజులలో రోగనివారణ, ధ్యానం మంచి ఫలితాలనిస్తాయి.
మధుమేహం లేదా ఆమ్లతతో మీరు బాధపడుతుంటే ఉపవాస నిర్ణయానికి ముందు మీ డాక్టరును సంప్రదించటం మంచిది.
మీరు ఉపవాసం చేసే అసలు రోజులు ఏవి అన్నది ముఖ్యంకాదు, అది సాంఘిక సంప్రదాయాలకు సంబంధించినది. ప్రత్యేక దినాలలో ఉపవాసం చేయటాన్ని అనుసరిస్తున్నారు. ఎందుచేతనంటే ఆ రోజుల్చి గుర్తు పెట్టుకొని నియతంగా ఉపవాసం చేయటం సులభం (ఉదా - ప్రతి శుక్రవారం లేదా ప్రతి పౌర్ణమి).
కాని కనీసం పక్షానికి ఒకసారి ఉపవాసం చేయటం శరీరాన్ని శుభపరచటానికి ఒక ప్రపూర్ణం. సంపూర్ణ ఉపవాసం (నీటిని మాత్రమే తాగటం) సర్వశ్రేష్ఠం. కాని మీరు అలా చేయలేకపోతే, కనీసం రసం లేదా ఫలహారంతో ఉపవాసం చేయటానికి ప్రయత్నించండి.
అది అందరూ అనుకునేటంత కష్టంకాదు ! మొదటి కొన్ని గంటలు ఎక్కువగా ఉండే ఆకలి తర్వాత, అది తనంతతానే తగ్గిపోతుంది. చింతించకండి, మీకేమీ కాదు - మీరు చచ్చిపోరు! మీకు తెలుసా? ఆరోగ్యవంతుడు నీరు మాత్రమే తాగి 90 రోజులు జీవించగల్గుతాడు. మన శరీరంలో 90 రోజులకు సరిపడే శక్తి నిల్వలున్నాయి. మీ కడుపుకు 24 గంటల విరామమివ్వమని మాత్రమే నేను మిమ్ముల్ని అడుగుతున్నాను!