Books / Love is Your Very Life

1. Love is Your Very Life

భగవద్దత : నేపథ్యం (Background)

భగవద్గీత దీనినే మనం గీతా అని కూడా అంటాము. దీనిని చాలా పవిత్ర గ్రంథంలా భావిస్తారు. ఇది స్మృతి. (స్మృతి అంటే వినటం ద్వారా ఒకరి నుంచి మరొకరు నేర్చుకునేది) మన ప్రాచీన పవిత్ర గ్రంధాలయిన వేదాలు, ఉపనిషత్తుల లాగానే ఇది కూడా స్మృతి వేదాలు, ఉపనిషత్తులు చాలా మంది అనుకుంటున్నట్లుగా భగవంతుడు ఇచ్చినవి కావు. గొప్ప గొప్ప ఋషులు సమాధి స్థితిలో ఉండగా వారికి కలిగిన జ్ఞానంతో వారిలోని అంతరంగం జ్ఞానంతో చెప్పబడినవి.

భగవద్గీత హిందూ పురాణమయిన మహాభారతంలో ఒక భాగం. ఇది శాశ్వత సత్యాలను వెల్లడి చేసే వేదాలు వంటిది కాదు. వేదాలు మహారుషులు అంతరంగపు జ్ఞానంతో చెప్పబడిన సత్యాలు. అలాగే ఇది మహాఋషుల బోధనలయిన ఉపనిషత్తుల వంటిది కూడా కాదు. మనకి ఉన్న ఏ పురాణం కూడా గీతకున్న ప్రాముఖ్యతని కలిగిలేవు. గీత శ్రీకృష్ణుని యొక్క అత్యున్నత చేతన స్థితి నుంచి, పరబ్రహ్మ నుంచి ఉదయించినది. అందుకే దీనిని పవిత్ర గ్రంథం అంటారు.

మహాభారతం అంటే అర్ధం గొప్ప భారతం. ఇది ఎంతో గొప్ప సంస్కృతి కలిగిన భారత దేశం గురించి చెబుతుంది. దీనిని భరతుడు అనే చక్రవర్తి పరిపాలించాడు. అందుకే ఈ ప్రాంతాన్ని భారత్ అంటారు. మహాభారత కథ, రెండు వర్గాలకి సంబందించిన యుద్ధ కథ. వాళ్ళే కౌరవులు, పాండవులు. వాళ్ళు చాలా దగ్గర సంబంధం కలిగిన రక్త సంబంధీకులు. అంధరాజు అయిన ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి రాజు. ఆయన వందమంది కౌరవులకు తండ్రి. ఆయన పాండురాజుకు అన్నయ్య. పాండురాజు అయిదుగురు కొడుకులూ పాండవులు.

ధృతరాష్టుడు పెద్దవాడయినా, పాండురాజుని హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఎందుకంటే ధృతరాష్టుడు అంధుడు. రాజ్యపాలన చేయలేదు. అందుకని ఆ బాధ్యత పాండురాజు మీద పడుతుంది. అయితే పాండురాజు ఒక మునీశ్వరుని శాపానికి గురి అవుతాడు. అప్పుడు పాండురాజు తన రాజ్యాన్ని, బిడ్డలని ధృతరాష్టునికి అప్పచెప్పి అతని భార్యలయిన కుంతి, మాద్రులతో కలిసి అడవికి వెళ్ళిపోతాడు. ఈ మహాభారత కథ చెప్పిన వ్యాసుడు పాండవులు కుంతీ, మాద్రిలకు దేవతల ద్వారా జన్మించినట్టు చెబుతారు. ఎందుకంటే ముని శాపం వలన పాండురాజుకు పిల్లలు పుట్టరు. కుంతి చిన్నతనంలో దైవశక్తిని ఆహ్వానించగలిగే శక్తిని వరంగా పొందుతుంది.

దుర్యోధనుడు కౌరవుల యువరాజు. అతనికి పాండవులకి మధ్య మంచి సంబంధాలు, (పేమ ఏర్పడలేదు. అతని తమ్ముడు, దుర్మార్గుడయిన దుశ్శాసనుడుతో కలసి పాండవులని చంపాలని చాలా [పయత్నాలు చేస్తాడు. అయితే ఆ విషయంలో అతను ఎప్పడూ విజయం సాధించలేకపోతాడు.

కుంతికి సూర్యదేవుని అనుగ్రహంతో ఒక కుమారుడు ఆమె అవివాహితగా ఉన్నప్పుడు జన్మిస్తాడు. అతనే కర్ణుడు. అతను పాండవులకంటే పెద్దవాడు. అయితే కుంతీకి

వివాహం జరగని కారణంగా అతనిని వదిలి వేస్తుంది. అయితే ఇక్కడ కథ ఒక కొత్త మలుపు తిరుగుతుంది. కర్ణుడు ధుర్యోధనుడితో చేతులు కలుపుతాడు.

ఆ తరువాత పాండవులలో పెద్దవాడయిన యుదిష్టిరునికి దృతరాష్ఠుడు అర్ధరాజ్యాన్ని ఇస్తాడు. యుదిష్టిరుడు ఇంద్రప్రస్తని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేస్తుంటాడు. అతడు తన తమ్ములయిన భీమ,అర్జున, నకుల, సహాదేవులతో కలసి రాజ్యపాలన చేస్తాడు. అర్జునుడు స్వయంవరంలో ద్రుపదరాజు కుమార్తె [దౌపదిని గెలుచుకుంటాడు. పాండవులు అయిదుగురు వాళ్ళ తల్లికి ఇచ్చిన [పమాణం [పకారం ఐదుగురూ [దౌపదిని వివాహమాడతారు.

ధుర్యోధనుడు యుధిష్టిరుని జూదమాడటానికి ఆహ్వానించుతాడు. శకుని దుర్యోధనుని తరపున జూదమాడి యుధిష్ఠిరుని ఓడించుతాడు. దాంతో యుదిష్టిరుడు రాజ్యాన్ని, తమ్ములని, భార్యని చివరికి తనను తాను కౌరవులకి పోగొట్టుకుంటాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని నిండు సభలో అవమానించాలని చూస్తాడు. ఆ తరువాత వాళ్ళు పదమూడు (13) సంవత్సారాలు అరణ్యవాసం ఆ తరువాత ఒక సంవత్సరం ఆజ్ఞాతవాసం చేయివలసి వస్తుంది.

పద్నాలుగు సంవత్సరాల తరువాత పాండవులు తమ రాజ్యాన్ని ఇవ్వవలసినదిగా కోరతారు. ఈ సందర్భంలో శ్రీ కృష్ణుడు పాండవులకు సహాయం చేస్తాడు. శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం. అయితే రాజ్యాన్ని తిరిగి ఇవ్వటానికి ధుర్యోధనుడు సమ్మతించడు. చివరికి పాండవులు కౌరవుల మధ్య గొప్ప యుద్ధం [పారంభ మవుతుంది. అదే మహాభారత యుద్ధం. చాలా రాజ్యాల రాజులు కౌరవులు పాండవులకు సహాయంగా యుద్దంలో పాల్గొంటారు.

(పేమే మీ జీవితం

శ్రీ కృష్ణుడు యాదవరాజ్యానికి రాజు. ఆయన కౌరవులకి పాండవులకి సహాయంగా ఉంటానంటాడు. ఆయన వారితో ఇలా అంటాడు, "మీలో ఒకరు నన్ను తీసుకొండి. అయితే నేను యుద్ధం చేయను. మరొకరు మా యాదవ సైన్యాన్ని తీసుకోండి". ధుర్యోధనుడు యాదవ సైన్యాన్ని కోరుకుంటాడు. అందరూ కురుక్షేత్రంలో యుద్దానికి దిగుతారు.కురుక్షేత్రం ప్రస్తుతం హర్యానాలో ఉన్నది. శ్రీకృష్ణుడు అర్జునుని రథసారధి అవుతాడు. యుద్ధారంభంలో తన శత్రు సమూహంలోని అన్నతమ్ములని, స్నేహితులని, గురువులని, బంధువులని చూసిన అర్జునుడు అవరాధ భావంతో దుఃఖపడతాడు. దాంతో అర్జునుడు యుద్ధ భూమిని వదిలి వెళ్ళిపోతానంటాడు.

అప్పుడు శ్రీకృష్ణునికి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణే భగవద్గీత. భగవద్దీత అంటే అర్ధం భగవంతుని పాట. శ్రీకృష్ణుడు అర్జునుని ఆయుధాలు చేపట్టి శతృనాశనం చేయమంటాడు. "వీళ్ళంతా మరణించారు. నిన్ను ఎదుర్కొంటున్న వీళ్ళందరూ అప్పటికే మరణించారు. కాబట్టి ముందుకి వెళ్ళు. నీవు చేయదలచుకున్నది చేయి. అది నీ బాధ్యత" అంటాడు.

భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి. ఇదంతా కూడా సంజయుడు ధృతరాష్టునికి చెప్పటమే. దృతరాష్ఠుడు యుద్దాన్ని చూడలేదు. కాబట్టి సంజయుణ్ణి అక్కడ జరిగే విషయాలు [ప్రతి ఒక్క సంఘటనా వివరంగా చెప్పమని అదుగుతాడు. అప్పుడు సంజయుడు యుద్దాన్ని యధాతథంగా అంధరాజయిన ధృతరాష్టునికి చెబుతాడు. మహాభారత యుద్గం పద్దెనిమిది రోజులు జరుగుతుంది. చివరికి పాండవులు యుద్ధంలో గెలుస్తారు. తిరిగి తమ రాజ్యాన్ని పొందుతారు.

ఈ యుద్ధంలో కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ భగవంతునికి (నారాయణు నికి) మనిషికి (నరునికి) మధ్య జరిగిన సంభాషణ. సంస్కృతంలో వీరిని నర,

నారాయణులు అని అంటారు. అర్జునుడు అడిగిన [ప్రశ్నలు, వెల్లడి చేసిన అనుమానాలు మనందరిలోనూ ఉన్నాయి. భగవాన్ శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానాలు ఏ కాలానికి అయినా ఏ సమయానికి అయినా సరిపోతాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు నేటికి కూడా అత్యంత విలువయినవే.

కొన్ని వేల సంవత్సరాల క్రితం అర్జునుడు ఏ విధంగా తన గురువు, దైవం అయిన శ్రీకృష్ణునితో సంభాషణ చేసాడో ఈ రోజు మీరు అదే విధంగా గురువు సమక్షంలో ఉన్నారు. గురువు మాటలు మీలోని అనుమానాలని నివృత్తి చేయుగాక. అమాటలు మీ [ప్రశ్న‌ల‌కి జ‌వాబులునిచ్చుగాక‌. నిత్యానందం.

ఈ గ్రంధంలో యువకుడయిన జ్ఞానోదయం పొందిన గురుదేవులు శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM భగవద్గీతపై వాఖ్యానించుతారు. కొన్ని సంవత్సరాలుగా భగవద్దీతపైన ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. అన్నింటికంటే ముందుగా చెప్పదగిన వ్యాఖ్యానం గురుదేవులు శ్రీ ఆదిశంకారాచార్యులవారిది. ఆయన దానిని కొన్ని వేల సంవత్సరాల క్రితం [ప్రచురించారు. ఆధునిక కాలంలో గురుదేవులయిన రామకృష్ణ పరమహంస, భగవాన్ శ్రీరమణ మహర్షి భగవద్గీత మీద చాలా విస్తృతంగా మాట్లాడారు. ఎంతో మంది ఈ పవిత్ర గ్రంధం మీద ఎన్నో గ్రంధాలు రాసారు.

ఈ పుస్తకంలో మేము శ్లోకాన్ని, దాని అర్దాన్ని వివరంగా ప్రతి పదానికి ఇచ్చాము. అలాగే ఆ శ్లోకం యొక్క భావాన్ని క్లుప్తంగా ఇచ్చాము. అలా ఇవ్వటం వలన దీనిని మరొక గ్రంధంతో పోల్చనవసరం లేదు. అలా పోల్చడం ఆపేస్తారు. భగవద్దీతపై శ్రీTHE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చేసిన వాఖ్య కేవలం తర్జమా కాదు. ఆయన ఒక్కొక్క శ్లోకం గురించి

మాట్లాడే సమయంలో చదివేవారిని ప్రపంచం మొత్తం నుంచి తీసుకువెళతారు. భగవద్గీతలో [పతి శ్లోకానికి ఐదు స్తితులలో అర్దాలు ఉన్నాయని చెబుతారు. మామూలుగా వచ్చే వాఖ్యానాలు మొదటి దశలో అర్థాన్ని మాత్రమే కలిగి వుంటాయి. ఇక్కడ జ్ఞానోదయం పొందిన గురుదేవులు సామాన్యస్థితి నుంచి అసాధారణ స్తితికి ఎంతో సులభంగా తీసుకువెళతారు.

పరమహంస THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM గీతావాఖ్యానం చాలా అరుదయినది. అది మనకి అరుదయిన ఆత్మదర్శనం కలిగిస్తుంది. ఇది చదవటం మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప అనుభవం, ఇది ఒక ధ్యానం.

ఆదిశంకరాచార్య, గొప్ప తత్వవేత్త, గురుదేవులు ఈవిధంగా చెబుతారు.

భగవత్ గీతా కించితా ధీతా గంగాజల లావా కనికపితా సకృతాపి ఏన మురారి సమార్చ క్రియాతే తస్యా యామేన చర్చా

భగవద్గీతని కొంచెం చదివినా, గంగానదిలోని ఒక నీటిబొట్టుని తాగినా, శ్రీకృష్ణని ఒక్కసారి తలచినా, మనం మరణాన్ని సమీపించే సమయంలో ఎటువంటి సమస్యని ఎదుర్కోము.

(పేమే మీ జీవితం

భగవద్గీత ముందు అధ్యాయంలో అర్జునుడు భగవానుని విశ్వరూపం చూపించమని ప్రార్దిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించుతాడు. అదే శ్రీకృష్ణని విశ్వరూపం. భగవాన్ శ్రీకృష్ణుడు ఎంతో ఓపికతో అర్జునుని అనుమానాలన్నీ తీరుస్తాడు. అడిగిన [ప్రశ్న‌ల‌న్నింటికి జ‌వాబులు ఇస్తాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుని అసలు రూపమయిన, రూపంలేని రూపాన్ని చూడాలనుకుంటాడు. అది నాశనం లేనిది. అనంతమయినది, మరణం లేని దివ్యత్వం ఆ స్థితి.

భగవాన్ శ్రీకృష్ణుడు తన స్నేహితుడు, శిష్యుడు, సర్వమానవులకి [ప్రతినిధి నరుడు అయిన అర్జునుడి కోరకని మన్నించుతాడు. శ్రీకృష్ణుని విశ్వరూపం దర్శించిన అర్జునుడు అందులోని అద్భుతశక్తికి తట్టుకోలేకపోతాడు. ఆ విశ్వరూపాన్ని చూడలేకపోతాడు. అర్జునుడు శ్రీకృష్ణుని తిరిగి మామూలు రూపానికి, తన స్నేహితుడు, యాదవరాజు, తన రథసారథి అయిన కృష్ణుని రూపానికి వచ్చేసేయమని [ప్రార్థేయపడతాడు. తనలోని విశ్వాన్ని, సర్వసృష్టి యొక్క రూపాన్ని అర్జునునికి

చూపించి, ఆ విశ్వశక్తి యొక్క అనుభవాన్ని చేతన స్థితిలో అర్జునునికి ఇచ్చి, ఆ తరువాత భక్తి గురించి అర్జునునికి వివరిస్తాడు. అదే భక్తి [పేమ, దివ్య [పేమ, దైవ [పేమ.

శ్రీకృష్ణుడు అర్జునునికి చూపించిన విశ్వరూపం ఈ సర్వవిశ్వం యొక్క సచేతన స్థితి. అదే భగవానుని చేతన స్థితి. అదే మనందరిలోనూ ఉండే సమూహ చేతన స్థితియొక్క సంపూర్ణ రూపం. శ్రీకృష్ణని విశ్వరూపదర్శనంతో అర్జునుడు తాను కూడా ఈ విశ్వచేతనలో భాగమేన్న విషయాన్ని అర్ధం చేసుకున్నాడు. అంతేకాకుండా తాను చూడగలిగే కృష్ణుడు ఆయన యొక్క అనంతమయిన, శాశ్వతమయిన విశ్వాత్మలో ఒక చిన్న భాగమని అర్ధం చేసుకున్నాడు.

దైవికమయిన శ్రీకృష్ణ భగవానుని విశ్వదర్శన అనుభవం తరువాత అర్జునునిలో ఎన్నో [ప్రశ్నలు ఉదయించాయి.

  • తాను ఇంతకుముందు చూసిన విశ్వరూపం ఈ సర్వవిశ్వం యొక్క అద్భుత సత్యమేనా?

  • తాను నిజంగా తన దృష్టిని కేంద్రీకరించవలసిన స్థితి ఇదేనా?

  • శ్రీకృష్ణుడు తాను ఇంతకుముందు చెప్పిన చాలా ముఖ్యమయిన విషయం, రూపంలేని ఆత్మ యొక్క స్థితి ఇదేనా?

మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే భక్తి (దైవ[పేమ) తరువాత ఆధ్యాత్మిక అనుభవం జరుగుతుంది అనుకుంటారు. కానీ, మీకు అసలు నిజమేమిటో చెబుతాను. ఆధ్యాత్మిక అనుభవం అయిన తరువాత మాత్రమే భక్తి ప్రారంభమవుతుంది. ఎప్పుడూ కూడా నిజమయిన భక్తి అనేది ఆధ్యాత్మిక అనుభవానికి ముందు జరుగదు.

తూర్పుదేశాల సమాజంలో వారి నమ్మకం ఏమిటంటే, ఆధ్యాత్మిక అనుభవం జరిగాక మాత్రమే సమాజ సేవ చేయగలరు అని. కానీ పశ్చిమదేశాలకి సంబంధించిన మతాలు మాత్రం సమాజ సేవ మాత్రమే ఆధ్యాత్మిక అనుభవాలకి దారితీస్తుంది అని నమ్ముతారు. అయితే అలా ఎప్పటికీ జరగదు. మన అంతరంగంలో మార్పు జరగనంత వరకూ, మనం ఎదుటివారికి సహాయం చేయగలం అనేది అసలు జరగదు. ఎప్పడయితే మనం అలా చేసామో అది కేవలం ఏదో పైపైన చేసే పనిమా(తమే అవుతుంది. అటువంటి సేవని మనం మన అహంకారాన్ని తృప్తి పరచటానికి మాత్రమే చేస్తాము. మనం చేసే సేవ చూసి అందరూ మనని మంచివారు, కరుణ కలవారు అని మెచ్చుకుంటారని చేస్తాము.

కానీ ఎప్పడుయితే ఆధ్యాత్మిక అనుభవం ద్వారా అహంకారం పూర్తిగా మాయమవుతుందో అప్పుడే మీరు ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. ఎదుటివారిని సర్వవిశ్వ చేతన స్థితిలో భాగమే అని మీరు అంగీకరించుతారు. అప్పుడే మీరు అందరూ ఒక్కటే, అందరం ఆ చేతన శక్తిలో భాగమే అని అనుకోగలుగుతారు. మనలో ఉండే పేద ధనిక తేదాలు, నలుపు తెలుపు రంగుల భేదాలు ఉండవు అని అర్ధమవుతుంది. అప్పడే, కేవలం అలా తెలుసుకోగలగినప్పుడే మనం ఎదుటివారికి ఎంతో కొంత అర్ధవంతమయిన సహాయం చేయగలుగుతాము.

ఎవరయితే ప్రతీ ఒక్కరూ విశ్వచేతన స్థితిలో భాగమే అనే అనుభవాన్ని పొందుతారో అటువంటి వ్యక్తి మాత్రమే నిజమయిన (పేమని అన్ని వైపులకీ వెదజల్లగలుగుతారు. ఆ (పేమని అన్ని దిశలలో వ్యాపింపచేయగలుగుతారు. అటువంటి వ్యక్తికి మాత్రమే [పేమ అంటే ఏమిటో తెలుస్తుంది. మరెవరికీ కూడా నిజమయిన [పేమ అంటే తెలియదు. మిగతా వారు [పేమిస్తున్నాము అని అనుకుంటారు. లేదా [పేమిస్తున్నట్టు నటిస్తారు. స్పష్టంగా అర్ధం చేసుకోండి. చాలామంది [పేమిస్తున్నట్టుగా అనిపిస్తారు.

కొన్నిసార్లు అలా నటిస్తూ వాళ్ళు నిజంగానే [పేమిస్తున్నాము అని అనుకుంటారు. కానీ మీరు [పేమని ఎప్పడూ నటించలేరు.

(పేమ మీ అంతరంగంలో మీ అసలయిన ఉనికి నుంచి పొంగి [పవహించాలి. [పేమ అనేది మీరు విశ్వ చేతన శక్తిని అనుభవించేటప్పుడే తెలుస్తుంది. మీ అహంకారం పూర్తిగా పోయినప్పుడు, మీకు ఆధ్యాత్మిక అనుభవం కలిగినప్పుడు మాత్రమే అటువంటి [పేమ మీలో సృష్టించబడుతుంది. శ్రీకృష్ణుడు ఈ పద్ధతిని ఒక (క్రమమైన రీతిలో ఒక దాని తరువాత ఒకటిగా మనకోసం తీసుకువచ్చాడు. నేను మీకు చెబుతున్నాను : ఆధ్యాత్మిక అనుభవం తరువాత అంతులేని కృతజ్ఞత మీ లోపలినుంచి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మీలో పొంగి [పవహించే (పేమ అన్నివైపులకీ వ్యాపిస్తుంది. దానికోసం మీరు ఎటువంటి [పత్యేకమయిన [ప్రయత్నాలు చేయనవసరం లేదు. ఎవరూ కూడా ఆధ్యాత్మిక అనుభవం లేకుండా [పేమని చూపించలేరు, [పేమ అనుభూతిని పొందలేరు.

నిజమయిన, షరతుల లేని [పేమని సృష్టించలేము. ఎప్పుడయితే మీ మనస్సు (మైంద్) నిశ్శబ్దంగా, పవిత్రంగా ఉంటుందో అప్పుడే అటువంటి [పేమ మీలో వికసించుతుంది. అయితే మనం మామూలుగా చెప్పుకునే [పేమ నిరంతరం షరతులు, నిబంధనలతో ఉండే [పేమ. మనం మన [పేమతో వ్యవహారాలు నడుపుతాము. అది ఈ విధంగా పనిచేస్తుంది. ముందుగా మనం ఎదుటి వారి మాటలకి, పనులకి మన అనుమతిని ఇస్తాము. అలా ఇచ్చిన సర్టిఫికెట్లకి బదులుగా వాళ్ళు మనం కోరుకున్న విధంగా ఉండాలి అని మనం ఆశిస్తాము.దీనినే మనం [పేమ అంటాము.

మనం ఎదుటి వారిని [పేమిస్తున్నాము అని చెబుతుంటాము. మనం ఈ [ప్రపంచాన్ని [పేమించగలుగుతున్నామని గర్వపడుతుంటాము. నిజజీవితంలో చూసినప్పుడు మాత్రం మన పక్క ఇంటివారిని [పేమించటం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు మనకంటే ధనవంతులయినప్పుడు మనకంటే ఒక మెట్టు పైన ఉన్నప్పుడు ఇదీ మరీ కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది ఎదుటివారి రెండు కళ్ళు పోతాయి అంటే తన ఒక కన్నుని పోగొట్టుకోవటానికి ఆనందంగా సిద్దపడతారు. అటువంటి వ్యతిరేక భావాలు అసూయ, అత్యాశ వలన కలుగుతాయి. మనం మన పక్క ఇంటివారినే [పేమించలేనప్పుడు విచిత్రం [ప్రపంచాన్ని ఎలా [పేమించగలుగుతాము. మనం మన వాళ్ళు కోసం మాత్రమే పాటు పడేటప్పుడు, సమాజానికి ఎలా సేవ చేయ కలుగుతాము.

కొంతమంది నన్ను అడుగుతుంటారు 'స్వామీజీ, మీరు మీ శిష్యులని, భక్తులని ధ్యానం చేయి,ధ్యానం చేయి అంటుంటారు. దానివలన ఉపయోగం ఏమిటి? అది స్వార్థం కదా? వాళ్ళని సమాజ సేవ చేయమని ఎందుకు చెప్పరు? అది చాలామందికి ఉపయోగపడుతుంది కదా.' అని అంటారు.

చాలా ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. అవి ఆధ్యాత్మిక సంస్థలు అని చెప్పుకుంటాయి. అవన్నీ పేరుకోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం, లేదా సమాజంలో గొప్ప కోసం అలా చేస్తుంటాయి. ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. అవి ఇటువంటి దానధర్మాలు చాలా చేస్తుంటాయి. ఇటువంటి సంస్థలని నడిపేవారు, ఇటువంటి కార్యక్షమాలలో ఉండేవారు ఫోటోలు తీయించుకొని న్యూస్ పేపర్లలోనూ మేగజైన్లలోనూ వేయించుకుంటారు. అలాంటివి మీరు చాలా చూసి ఉంటారు.

నేను ఎప్పుడూ చెబుతుంటాను. దానధర్మాలు చేయటం, సమాజసేవ అనే కార్యక్రమాలు చేయటం అనేది మిమ్మలని మీరు చాలా అందంగా మోసం చేసుకోవటం, అలాగే ఎదుటివారినీ మోసం చేయటం. ఇది కేవలం పైన బయటకి వెల్లడి చేయటమే కానీ అంత రంగంలో ఏర్పడిన కోరిక కాదు. ఏ క్షణంలో అయితే మీరు ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించాలని అనుకుంటారో అప్పుడే

[పేమే మీ జీవితం

ఈ కార్యక్రమం మొత్తం తన నాణ్యతని, రంగుని అసలు ఉద్దేశాన్ని పోగొట్టు కుంటుంది. ఇది మీకు ఆధ్యాత్మిక అనుభవం అయిన తరువాత జరిగితే అప్పుడు అది అలా [ప్రవహిస్తుంది. అదే నిజమైన [పేమని వెల్లడి చేస్తుంది.

ఎదుటివారిని మార్చటానికి [ప్రయత్నించేముందు, మన అంతరంగంలో మార్పురావాలి. ఎవరయితే తాను ఈ సర్వవిశ్వశక్తిలో భాగం అని అనుకోరో అలాగే ప్రతివ్యక్తి తనతో ప్రతి వ్యక్తికీ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయని తెలుసుకోరో, అటువంటివారు ఎదుటివారి కోసం నిజమయిన [పేమతో ఏమీ చేయలేరు. వాళ్ళు చూపించేది కేవలం కృతిమమైన, కపటమయిన [పేమ మాత్రమే. అటువంటి వాళ్ళు వంచకులు.

మనందరం ఈ అనంత విశ్వసాగరంలో ఒక భాగమే. అందులో మనందరం నీటి బిందువులమే. మనం ఎంతకాలం అలా నీటి బిందువులుగా ఉండిపోతామో, ఎంతకాలం మనం ఆ మహాసాగరంలోని ఒక భాగమే అని అర్ధంచేసుకోమో, అంతకాలం మనం ఈ అనంత సాగరానికి వేరుపడి ఉంటాము. ఈ విధంగా వేరుగా ఉన్నంతకాలం మనలో నిజమయిన [పేమ ఉండదు. మన అనుభవాల అనుభూతులు పూర్తిగా 'నేను' 'నాది' అనే వాటి మీదే ఆధారపడి ఉంటాయి. ఇటువంటి భేద భావం ఉన్నంతకాలం నిజమయిన [పేమ ఉదయించదు. అటువంటప్పుడు షరతులు లేని [ప్రేమని వెల్లడి చేయలేము.

జెన్ బౌద్ధమతంలో ఒక విషయాన్ని చాలా చక్కగా చెబుతారు. బుద్ధుడు ఏమిచేసినా, ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఏమి చేసినా , అది ఎవరినైనా చంపటం అయినా అది మంచి మాత్రమే చేస్తుంది. అది బుద్ధునికి, ఆ వ్యక్తికీ ఇద్దరికీ మంచి చేస్తుంది. బుద్ధుడు నిరంతరం విశ్వచేతన శక్తితో ముందుకు నడపబడతాడు. అందుకే అది ఎప్పుడయినా అందరికీ మంచిని మాత్రమే చేస్తుంది.

కానీ ఒక సామాన్యమయిన వ్యక్తి (జ్ఞానోదయం పొందని వ్యక్తి) అహంకారంతో ఏమి చేసినా, అది ఒక గొప్ప సేవ అయినా అది వారికీ మంచి చేయదు అలాగే సమాజానికీ మంచిది కాదు. మంచికాని చెడుకాని మనం చేసే పనివలన నిర్ణయింపబడవు. అది మన అంతరంగపు ఉనికి యొక్క నాణ్యతని బట్టి నిర్ణయింపబడుతుంది. జ్ఞానోదయమయిన వ్యక్తి చేసే సామాన్యమయిన చిన్న పనులు కూడా చాలా గొప్ప విషయాలుగా మారతాయి. అవి ప్రపంచానికి చాలా మంచి ఫలితాలని ఇస్తాయి. అదే సామాన్యమయిన ఒక వ్యక్తి లోతయిన అజ్ఞానంతో, అమాయకత్వంతో చేస్తే, గొప్ప సత్యాలు కూడా దురవస్థకి, వినాశనానికి దారి తీసాయి.

చూడండి : బుద్ధుడు చెప్పిన చాలా సామాన్యమయిన మాటలు "మీ శ్వాసని గమనించండి, మీ ఉచ్వాస నిశ్వాసలని పరిశీలించండి" ఇలాంటి చిన్న విషయాలు, సామాన్యమయిన సత్యాలు ఇవే వేలమందిని జ్ఞానోదయం పొందేలా చేసాయి. కేవలం చాలా సామాన్యమయిన ఉపాసన అనే ధ్యానం ఎంతో మందికి జ్ఞానోదయం కలిగేలా చేసింది. ఉపాసన అనేది చాలా చిన్నది, సామాన్యమయిన పద్ధతి. అయినా అది కొన్ని వేలమంది జ్ఞానోదయం పొందే విధంగా వారికి సహాయం చేసింది. వాళ్ళ జీవితాలని మార్చింది. దాని ఫలితంగా ఈ ప్రపంచమే మారిపోయింది.

ఎప్పుడయితే బుద్ధుడు మాములుగా ఉండే చిన్న సత్యాన్ని చెప్పాడో అది కొన్ని వేలమందిని ఉన్నతయిన చేతనస్థితికి చేర్చింది. ఒక మామూలు వ్యక్తి, గొప్ప గొప్ప సత్యాలని చెబితే అవి నాశనానికి దారి తీస్తాయి. ఉదాహరణకి అటామిక్ బాంబ్, అది గొప్ప సూత్రం. అది రెలటివిటీ థియరీ, గొప్ప సూత్రం, అది గొప్ప సత్యం. అయితే అది జ్ఞానోదయం లేని వ్యక్తి మైండ్లోనికి వస్తే దాని ఫలితం అంతులేని వినాశనమే.

నేను ఒక మేగజైన్‌లో కొన్ని విషయాలకి సంబంధించిన డేటా చూసాను. ప్రపంచంలో అన్ని దేశాల ప్రభుత్వాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. అవన్నీ కలిపి ప్రయోగిస్తే భూమిని వెయ్యిసార్లు నాశనం చేయవచ్చు. వాళ్ళ దగ్గర నిలువ వుంచిన అణ్వాయుధాలు ఈ భూమిని ఒకసారి కాదు వెయ్యిసార్లు నాశనం చేస్తాయి. అయితే నేను చదివిన రిపోర్లు పాత రిపోర్లు. ఈ నాటికి అవి రెట్టింపు అయి ఉంటాయి. ఇదంతా కూడా ఒక జ్ఞానోదయం పొందని సామాన్య మైండ్ చేసిన పని వలన వచ్చిన ఫలితం.

ఇప్పుడు మన శాస్త్రీయమయిన క్లోనింగ్, స్లెమ్ సెల్స్ అనే పనుల్లో మునిగిపోయాము. వాటి ఫలితాలు ఆ పరిశోధనలలో నిమగ్నమయిన వ్యక్తుల అంతరంగపు ఉనికి యొక్క నాణ్యతమీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని వారి మైంద్ యొక్క నాణ్యత మీద కాదు. మైండ్ ఎప్పుడు అహంకారం చేతులలో ఉంటుంది. కానీ మన అంతరంగపు ఉనికి మనలోని విశ్వపేమని తెలుసుకోగల సచేతన స్థితి ఆధీనంలో ఉంటుంది.

తప్పు ధృక్సధంతో ఉండే ఒక వ్యక్తిని అధికార పీఠం మీద కూర్చోబెడితే అతను మానవాళికే ప్రమాదకారిగా తయారవుతాయి. మనకి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక చేయవలసినది కేవలం బటన్ నొక్కటమే ఆలస్యం. అయితే మతిలేని క్రూర స్వభావం కలవాడు ఆ పని చేస్తే ప్రపంచంలో నరమేధ జరుగుతుంది. అందరూ మరణిస్తారు. అదే ఎన్నో అణ్వాయుధాలు నిలవచేయబడి ఉండటమే ఇటువంటి స్థితికి ఒక ఉదాహరణ.

చూడండి. అణుశాస్త్రం ఒక గొప్పసత్యం. అది అణువిచ్చేద సూత్రం. ఇందులో సూత్రం ఏమిటంటే, అణువుని విచ్చిన్నం చేసినప్పుడు అందులోంచి చాలా ఎక్కువ

శక్తి పుడుతుంది.అది చాలా గొప్ప సూత్రం, కానీ అది ఒక సామాన్యమయిన, జ్ఞానోదయం పొందని మైండ్ నుంచి వచ్చిన సత్యం. దానిని, ఆ సూత్రాన్ని ఎన్నో అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చు. ఆ సూత్రంతో [ప్రపంచాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు. కానీ ఇది ఎప్పుడయితే అహంకారంతో నిండి ఉన్న సామాన్యమానవుల మైండ్ నుంచి వస్తుందో, అటువంటి వారిచేత ఉపయోగింపబడుతుందో అది సర్వనాశనానికి మాత్రమే దారి తీస్తుంది.

మాటలు కాని, పనులు కాని వాటంతట అవే మంచీ చెడు ఏమీ చేయవు. అవి మంచికాని చెడు కానీచేసేది అవి వచ్చిన వ్యక్తి చేతన స్థితి ఆధారంగా మాత్రమే చేయగలుగుతాయి. ఈ చేతన స్థితి, తెలుసుకునే తత్వం అనేది మనకి ఎదుటివారి పట్ల ఉండే భావం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తిలోని ఉనికి యొక్క తెలుసుకోగల తత్వం, లక్షణం యొక్క నాణ్యత మాత్రమే, అతను చేసే పనులు ప్రపంచానికి, సర్వ మానవాళికి మంచి చేస్తుందా లేదా నాశనం చేస్తుందా అని నిర్ధయించేది.

మీ అంతరంగం, మీ నిజమయిన ఉనికి కృతజ్ఞతా భావాన్ని అనుభవించినప్పుడే ఇది సాధ్యపడుతుంది. ప్రతీ ప్రాణి భగవంతుని రూపమే అని మీకు అనుభవం కావాలి. అప్పుడు మాత్రమే మీలో [పేమ అన్ని వైపులకి వెదజల్లుబడుతుంది. ఆ [పేమ విషయంలో మీరు పూర్తిగా నిస్సహాయులు. భక్తి, [పేమ అనేవి మీ ఆధ్యాత్మిక అనుభవాలని వెల్లడి చేసే పద్ధతులు మాత్రమే.

భగవానుడు భక్తియోగం పై తన [ప్రవచనాలని విశ్వరూప సందర్శనం తరువాత మాత్రమే ప్రారంభించుతాడు. ఆ అనుభవాన్ని అర్జునుడికి ఇచ్చిన తరువాత మాత్రమే క్ష్మదు అనుభవాన్ని వెల్లడి చేసే విషయం మీద మాట్లాడతాడు. ఆయన భక్తిపూర్వకమయిన దైవ [పేమ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఆ శ్లోకం ఏమిటో చూద్దాం.

అర్జున ఉవాచ : యేవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః (12:1)

అర్థం : అర్జున ఉవాచ = అర్జునుడు ఈ విధంగా అడిగాడు. ఏవం = ఈ [ప్రకారంగా సతతా = ఎల్లప్పుడూ : యుక్తా : = నిమగ్నమయిన : ఏ = ఎవరయితే : భక్త = భక్తులు : త్వం = నీవు : పర్యుపాసతే = ఉపాసించుచున్నరో : ఏ = ఎవరెతే : చ= మరియు : అపి = కూడా : అక్షరం = నాశనం లేనిది : అవ్యక్తం = ఇంద్రియములకు గోచరం కాని : తేషాం = ఆ ఇరు తెగల వారిలో : కే=ఎవరు : యోగ–వి–తమః = యోగమును బాగుగా తెలుసుకున్నవారు.

అర్జునుడు ఈ విధంగా అడిగాడు : ఈ [ప్రకారం ఎల్లప్పుడు నీయందే మనస్సుని నెలకొల్పిన వారై ఏ భక్తులు నీ రూపాన్ని పూజించుతారో లేదా ఎవరయితే నాశనం లేని, కనిపించని రూపం లేని నిన్ను పూజించుతారో : ఈ ఇద్దరిలో ఎవరు యోగ్యులు.

[పేమే మీ జీవితం

చూడండి : అర్జునుడు [ప్రశ్నించే పద్ధతి మాట్లాడే విధము పూర్తిగా వేరుగా ఉంటుంది. అతని దృక్పధం, పద్ధతిలో పూర్తిగా మార్పు ఉంటుంది.

అర్జునుడు ఈ విధంగా అడుగుతాడు " భగవాన్, ఎవరు పాటించే పద్దతి మంచిది : ఎవరు భక్తిభావంతో నిన్ను, నీ రూపాన్ని పూజిస్తూ ఉంటారో వాళ్ళ పద్దతి మంచిదా? లేకపోతే ఎవరయితే రూపంలేని అనంత బ్రహ్మాండమయిన విశ్వశక్తి, విశ్వ ఆత్మలో,విశ్వచేతనస్ధితిలో విలీనమయిపోతారో వాళ్ళ పద్దతి మంచిదా? వీళ్ళ ఇద్దరిలో ఎవరి పద్ధతి మంచిది?"

స్పష్టంగా అర్ధం చేసుకోండి : ఇక్కడ అర్జునుడు తన కోసం అడగటం లేదు.ఇక్కడి నుంచి భగవానుని [ప్రవచనం చిన్న సంభాషణలా ప్రారంభమవుతుంది. ఇది ఒక సత్యాన్ని రాబోయే కాలం కోసం రికార్డు చేయటానికి ప్రయత్నించటమే. ఇక్కడి నుంచి వచ్చే [ప్రశ్నలు అన్నీ కూడా అనుమానాలు కాదు. అలాగే విచారణ (ఎంక్వయిరీ) కాదు. ఆ సత్యం మొత్తాన్ని ఒక డాక్యుమెంట్ కిందికి తెచ్చి రాబోయే కాలంలో నుంచి పొంగిపోరలే [పేమ. ఇది అర్జునుని యొక్క దివ్య అనుభవాన్ని వెల్లడి చేయటమే. ఇదంతా ప్రశ్నల రూపంలో వెల్లడి చేసి భగవంతుని దగ్గర నుంచి వచ్చిన జవాబులని రాబోయే కాలం కోసం రికార్డు చేయటమే.

అర్జునుడు కృష్ణుడిని ఇలా అడుగుతారు. నీలో సంపూర్ణంగా స్థిరపడిన వ్యక్తి ఎవరు? అతను నీ భక్తుడా? లేక జ్ఞానోదయం పొందిన వ్యక్తా? ఎవరు?

ఇక్కడ మనం రెండు విషయాలు అర్ధం చేసుకోవటానికి [ప్రయత్నించాలి. మతాన్ని ఆచరించే వ్యక్తులు, సామాన్యులు ఈ శ్లోకంలోని అర్ధాన్ని సరిగ్గా అర్ధంచేసుకోలేదు. వాళ్ళు కొంచెం అయోమయపడ్డారు. వాళ్ళు అర్జునుడి [ప్రశ్నని వేరుగా అర్ధంచేసుకుంటారు. అర్జునుడు శ్రీకృష్ణుని "నీ రూపాన్ని పూజించటం మంచిదా లేకపోతే రూపంలేని నిన్ను పూజించటం మంచిదా?" అని అడిగినట్లు అర్ధం చేసుకుంటారు. ఇటువంటి వాళ్ళు ఎంత అయోమయంలో ఉంటారంటే అసలు

వాళ్ళకి ఏది సరియైనదో, ఏది తప్పో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు తమకి ఉన్న తెలివితేటల అహంకారంతో తప్పు సమాచారాన్ని ఇచ్చి అందరినీ అయోమయంలో పడేసారు. అలా

కానీ నేను మీకు చెబుతున్నాను, అర్ధం చేసుకోండి, అర్జునుడి [ప్రశ్నలో అర్ధం అది కాదు. మీరు శ్రీ కృష్ణుడు ఇచ్చిన జవాబులని గమనించితే ఈ విషయం మీకు అర్ధమవుతుంది.

అర్జునుడు ఈ విధంగా అడుగుతాడు. చేతన స్థితి యొక్క అనుభవంలో స్థిరపడి, అక్కడ ఉండి, ఆ స్థితినుంచి పొంగి ప్రవహించే శాశ్వత ఆనందాన్ని పొందటం మంచిదా? లేకపోతే విశ్వచేతన స్థితిలో కలిగిన అనుభవాన్ని [పేమ, కృతజ్ఞతారూపంలో [ప్రపంచంలోని ప్రతి [ప్రాణి పట్ల వెల్లడి చేయటం మంచిదా? ఏది సరియైన పద్ధతి? దేనిని పాటించాలి?

చూడండి. కొంతమందికి అటువంటి ఆధ్యాత్మిక అనుభవం కలిగాక అదే స్థితిలో కళ్ళు మూసుకొని ఉండిపోతారు. అంతే. వాళ్ళు కళ్ళు మూసుకుని మాత్రమే భగవంతుని చూస్తారు. వాళ్ళు కళ్ళు తెరవటానికి అసలు ఇష్టపడరు. వాళ్ళు స్పర్శావయవాలని ఉపయోగించటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారిలోని బ్రహ్మానందం చాలా గొప్పది. ఎంతో అందమయినది. వారు స్పర్శేంద్రియాల ద్వారా పొందే ఏ ఆనందం ఆ పరమానందానికి సాటిరాదు.

కాని కొంతమంది భగవంతుని ద్వారా కళ్ళు తెరచి, తమలోని శాశ్వతానందపు అనుభవాన్ని అందరికీ వెల్లడి చేయాలి అని చూస్తారు. కొంతమంది పండితులు సవికల్ప సమాధి, నిర్వి కల్ప సమాధి విషయంలో అంతులేని వాదనలు చేస్తుంటారు. సవికల్ప సమాధి స్థితిలో వారి అనుభవం నిరంతరం సాగుతూ ఉంటుంది. నిర్వికల్ప సమాధిలో ఆ అనుభవాన్ని వెల్లడి చేయటం ప్రారంభమవుతుంది. సవికల్ప సమాధి అనేది క్రింది స్థితి. అది దాని తరువాతది, ఉన్నత స్థితిలో ఉండే నిర్వికల్ప సమాధి గురించి పనిచేస్తుంది. ఈ విధంగా రెండు స్థితులూ జరుగుతాయి అనేది కొంతమంది విషయంలో నిజమే అవుతుంది. అలా జరగవచ్చునేమో నాకు తెలియదు. కానీ నా విషయంలో ఈ రెండు స్థితులు ఒకేసారి జరిగాయి. నేను ఈ రెండు స్థితులని వేరు వేరుగా సాధించలేదు. నాకు ఇవి ఒక్కసారే జరిగాయి. నేను నా అనుభవాలని వెల్లడి చేసే స్థితికి చేరాను.

ఇదంతా భగవంతుని (పరాశక్తి) సంకల్పం. ఒక విషయం అర్ధంచేసుకోండి. వీళ్ళు ఈ స్థితిలో ఉండాలి అనేది వాళ్ళు ఎంపిక కాదు. ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందినవారికి ఇటువంటి ఎంపిక చేసే అవకాశం ఉండదు. సామాన్య ప్రజలకి అలా ఎంపిక చేసుకునే స్వేచ్చ ఉంటుంది. దానికి వారు కర్మని (తీరని కోరికల వృత్తం) అనుసరించుతారు. కానీ ఎవరయితే సర్వాంతర్యామి అయిన విశ్వశక్తి (పరాశక్తి) అనుభవాన్ని పొందుతారో వాళ్ళు ఆ ఎంపిక అనే స్థితికి అతీతంగా వెళ్ళిపోతారు. వాళ్ళు వేసే ప్రతి అడుగూ భగవంతుని నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అదే విశ్వ శక్తి, అదే శ్రీకృష్ణుని ఉన్నతమయిన చేతనస్థితి. ఆ విషయంలో వారికి ఎంపిక అవకాశం ఉండదు. వాళ్ళు కళ్ళుమూసుకుని కూర్చోవాలా లేకపోతే కళ్ళు తెరచి సర్వమానవాళికి మంచి చేయాలా అనే నిర్ణయం వాళ్ళ చేతులలో ఉండదు.

ఈ విషయం అర్జునుడికి తెలియదు అని కాదు. ఆయనకి భగవంతుని దివ్య అనుభవం అయిన తరువాత ఈ ఎంపిక లేని స్థితిని పూర్తిగా అర్ధం చేసుకున్నాడు. అటువంటి అనుభవం అయిన అందరికీ ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అర్జునుడికి తన విషయంలో ప్రతి నిర్ణయం స్పష్టంగా అర్ధమవుతుంది. అర్జునుడికి తన విషయంలో ప్రపతి నిర్ణయం చేసేది శ్రీకృష్ణుడే కాని తాను కాదు అని తెలుసు, కానీ ఆయన శ్రీకృష్ణని అన్నీ అడుగుతాడు. ఈ విధంగా ఈ విషయాలన్ని అందరికీ తెలియచేయాలనేది అర్జునుని కోరిక.

ఈ కారణంతోనే భగవద్గీతని ఈరోజుకి సజీవంగా నిలిచి ఉన్న పవిత్ర గ్రంధంగా చెప్పవచ్చు. ఈ కారణం వలననే అందులోని మాటలు ఇప్పటికీ ప్రతి ధ్వనిసుంటాయి. ఇందులోని ప్రతి సంభాషణా సత్యాన్వేషణ చేసే అన్వేషికి వచ్చే ప్రశ్నలన్నింటికీ జవాబులని ఇస్తుంది. ఈ సందర్శంలో అర్జునుని పాత్ర ఆధ్యాత్మిక అన్వేషకుల ప్రతినిధి.

అర్జునుడు ఏమని అడిగాడు. కళ్ళు మూసుకొని కూర్చున్న వ్యక్తి గొప్ప వాడా లేకపోతే కళ్ళు తెరచి ప్రతి ఒక్కరిలోనూ ప్రతిప్రాణిలోనూ భగవంతుని చూడగలిగిన వ్యక్తి గొప్పవాడా?

అర్ధం చేసుకోవటానికి [ప్రయత్నించండి : ఆయన రూపాన్ని ఆరాధించటం గొప్పదా? రూపంలేని భగవంతుని ఆరాధించటం గొప్పదా అని అదగలేదు. కాకపోతే మత సంబంధమయిన మతాధికారులు చేసిన వాఖ్యానం ఇది. వాళ్ళే శంకరాచార్యులకి, రామానుజునికి మధ్య సమస్యలని సృష్టించినది కూడా.

శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గాన్ని అనుసరించారు. రామానుజులు భక్తి మార్గాన్ని అనుసరించారు. జ్ఞాన మార్గ రూపంలేని భగవంతుని మీద కేంద్రీకరింపబడి ఉంటుంది. అదంతా విజ్ఞానదాయకమయిన ప్రశ్నలతో నిండి ఉంటుంది.

భక్తి మార్గం పూర్తిగా భక్తి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అది భగవంతుని రూపాన్ని ఆరాధిస్తుంది. భగవంతుని ప్రాణమున్న రూపంలో చూసారు. ఎవరయితే శంకరాచార్యులు తత్వాన్ని, రామానుజల తత్వాన్ని లోతుగా తెలుసుకుంటారో, వారు రామానుజునిలోని జ్ఞానము,శంకరాచార్యులులోని భక్తిని తెలుసుకోగలుగుతారు. రెండూ కూడా కలసిపోయి ఉంటాయి. ఒకటి లేకుండా రెండవది పని చేయదు.

సౌందర్యలహరి చదివిన ఏ వ్యక్తి అయినా ఆ మహాయోగికి జగన్మాత మీద ఉన్న [పేమకి కదిలిపోకుండా ఉండలేరు. ఈ కావ్యంలో అద్భుతమయిన ఆది భౌతిక తత్వపు [ప్రాముఖ్యత వేదాంతపరంగా చెప్పబడి ఉంటుంది. ఇది శంకరాచార్యుల రచనలన్నింటిలోనూ ఉంటుంది. కానీ ఆయన అందంగా భక్తితో వర్ణించిన రూపానికి ఎంతో కదలిపోతారు.ఆయన జగన్మాతని తల నుంచి కాళ్ళ వేళ్ళ వరకూ ఆమె తన ముందు నిలడి ఉన్నట్లే వర్ణించుతారు. ఇది చిత్రాలతో కూడిన వర్ణన. [పేమతో నిండిన వర్ణన. ఆయనలో పొంగి ప్రవహించే భక్తిని వెల్లడి చేసే వర్ణన.అదేవిధంగా రామానుజాచార్యుని వేదాంత జ్ఞానం యొక్క లోతులు ఆయన అందించిన సూత్రాల పై వాఖ్యానాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన చూపించిన పద్ధతులు, ఆయన రాసిన పవిత్ర గ్రంథాలు గొప్ప జ్ఞాన సంపదలు. శంకరాచార్యుని రచనలకి ఏమాత్రం తగ్గవు. అందుకే అంటాను జ్ఞానం లేకుండా నిజమయిన భక్తి ఉండదు. భక్తి లేకుండా నిజమయిన జ్ఞానం ఉండదు.

అయితే ఈ వాదనలు అలా జరుగుతూఉంటాయి. కానీ మీరు జవాబులని గమనించితే అర్జునుడు అడిగిన [ప్రశ్న ఇది కాదు అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అర్జునుడు అడిగిన విషయం, తాను తనకి కలిగిన ఆధ్మాత్మిక అనుభవంలోనే స్థిరపడిపోవాలా లేకపోతే తనలో జరుగుతున్న కృతజ్ఞతాభావాన్ని వెల్లడి చేయాలా అని మాత్రమే.

తనలో జరిగిన ఆధ్యాత్మిక అనుభూతి, కృతజ్ఞతా భావాన్ని వెల్లడి చేయటమే భక్తి, అనుభవంలో ఆనందాన్ని పొందుతూ, ఆ అనుభవంలో ఉండటాన్ని జ్ఞానం అంటారు. అంతే.

ఈ [ప్రశ్నకి శ్రీకృష్ణుడు చెప్పిన జవాబు ఈ రెండూ ఒక్కటే.

ఈ రెండు మార్గాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. మొదటి మార్గం రెండవదానిలోనికి, రెండవ మార్గం మొదటి దానిలోనికి దారితీస్తుంది. మీరు ఛేదించలేని వృత్తం గురించి విని ఉంటారు. అందులో మొదటి నుంచి రెండవదానికి, దాని నుంచి తిరిగి మొదటి దానికీ వెళుతూనే ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు ఈ సందర్భానికి మరొక కొత్త పదాన్ని చెబుతాను. అది వాస్తవమయిన ధర్మచక్రం, ఛేధించలేని చక్రం తక్కువ స్థితికి తీసుకువెళుతుంది. వాస్తవమయిన ధర్మచక్రం ఉన్నత స్థితిలోని శక్తికి దారి తీస్తుంది. అది ఉన్నత స్థితిలోని చేతనస్థితికి చేరుస్తుంది. ఈ చక్రంలో పరమానందం, కృతజ్ఞత : పరమానందం భక్తి : కృతజ్ఞత, పరమానందం అనే రెండు రూపాలు ఈ వృత్తాన్ని తయారు చేస్తాయి. ఇది మనని అత్యున్నతయిన చేతనస్థితికి తీసుకువెళుతుంది.

పరమానందం లేదా నిత్యానందం అంటే మీలోని కృతజ్ఞతా భావాన్ని, సేవాభావాన్ని వెల్లడి చేయటమే. అలా వెల్లడి చేసినప్పుడు ఆ సేవా భావం కృతజ్ఞతా భావం మనలో పరమానందాన్ని కలిగిస్తాయి. ఒకటి మరొకదానిలోనికి దారి తీస్తుంది. తిరిగి రెండవది మొదటి దానిలోనికి వస్తుంది. అందుకే దీనిని virtuous circle లేదా ధర్మచక్రం అనవచ్చు.

మామూలుగా మనందరం ఈ చేధించలేని వలయంలో చిక్కుకుని ఉంటాము. భయం నుంచి అత్యాశకి, అత్యాశ నుంచి భయానికి తిరుగుతూ ఉంటాము. భయం ఎప్పుడూ అత్యాశకి దారి తీస్తుంది. ఎక్కువ భయం అత్యాశకి దారి తీస్తుంది. అధికమయిన ఆశ అధికమయిన భయానికి దారి తీస్తుంది. దీనినే ఛేదించలేని చక్రం అంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ధర్మచక్రాన్ని ఆవిష్కరించాడు. శాశ్వతమయిన ఈ చక్రాన్ని ఆయన ధర్మం అని, న్యాయం, నీతి అని అంటారు. ఇది సత్యమార్గాన్నే అనుసరిస్తుంది.

ఈ ధర్మచుక్రం ఉన్నతమయిన చేతనస్థితి నుంచి, అత్యున్నతమయిన చేతనస్థితికి తీసుకువెళుతుంది. ఇది ఉన్నతమయిన అనుభవాల నుంచి, అత్యున్నతమయిన అనుభవాలకు దారి తీస్తుంది. సచేతన స్థితి, పరమానంద స్థితి తిరిగి సచేతన స్థితిని, పరమానందాన్ని వెల్లడి చేస్తాయి. అవి మరలా ఉన్నతమయిన అనుభవాలకి దారి తీస్తాయి.

8

ఇప్పుడు భగవానుడు శ్రీకృష్ణని జవాబు ఏమిటో విందాము :

శ్రీ భగవానువాచ : మయ్యా వేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే [శ్రద్ధయా పరయోపేతాస్తేమే యుక్తతమా మతాః (12:2)

అర్ధం : శ్రీ, భగవానువాచ = శ్రీ భగవంతుడు చెప్పెను.

మయి = నాయందు : ఆవేశ్య = నిలిపి : మనః = మనస్సును (మైంద్) : నిత్య = నిరంతరం (శాశ్వతంగా) : యుక్తా = నిమగ్నమై : ఉపాసన = ఆరాధించుతారో : [శ్రద్ధయా = [శ్రద్ధతో, నమ్మకంతో : పరమా = మిక్కిలి ఉన్నతమయిన : ఉపేతాః = కూడుకొనినవారై : తే= అటువంటి వారు : యుక్తా తమః = ఉత్తమ యోగులు : మే = నా యొక్క : మతాః = అభి(ప్రాయం.

భగవానుడయిన శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. ఎవరైతే నాయందు మనస్సు నిలిపి నిరంతరం మిక్కిలి శ్రద్ధతో, నమ్మకంతో నన్ను ఆరాధించుతారో అటువంటి వారిని ఉత్తమయోగులుగా నేను అంటాను. వారేనాలో ఐక్యమయిపోగల వారు.

భగవానుడు ఈ విధంగా చెప్పాడు : ఎవరయితే సచేతన స్థితిలో కృతజ్ఞతని, భక్తిని వెల్లడిచేయగల స్థితిలో స్థిరంగా ఉంటారో, వారే నిరంతరం నాయందు నిమగ్నమై ఉంటారు మరియు ఎవరైతే వారి నమ్మకాన్ని వారి ఆధ్యాత్మిక అనుభవం మీద కేంద్రీకరించుతారో వారు నాయందు నిమగ్నమై ఉంటారు. ఈ రెండూ కూడా అంతిమమయినవి. ఈ రెండు రకముల వారు కూడా నాలో ఐక్యమయిపోతారు.

సంస్కృతం చాలా అందమయిన భాష. మీరు ఏ పదంనుంచయినా ఏ రకమయిన అర్గానయినా పొందవచ్చును. ఈ కారణం వలననే భగవద్గీత మీద కొన్ని వేల వాఖ్యానాలు వచ్చాయి. భగవద్గీత మీద గురువులు, యోగులు ఎంతోమంది వ్యాఖ్యానాలు చెప్పారు. గీత మీద ఉన్నన్ని వాఖ్యానాలు మరి ఏ గ్రంధానికీ లేవు. ప్రతి ఒక్కరూ వారికి అర్గమయిన రీతిలో గీతకి అర్గాన్ని ఇవ్వటానికి ప్రయత్నించారు.

తిరిగి నేను మళ్ళీ నొక్కి చెబుతున్నాను. ఆధ్యాత్మిక అనుభవం లేని వ్యక్తి విషయాలని వివరించటం, ఉపన్యసించటం మొదలుపెడితే అతను సహజంగానే సమస్యలలో చిక్కుకుంటాడు. అలాగే ఎదుటివారికి కూడా సమస్యలని స్పష్టిస్తారు. ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక అంధుడు మరొక అంధునికి దారి చూపిస్తే, ఆ ఇద్దరూ ఏవిధంగా సమస్యలలో చిక్కుకుంటారో ఇది అలానే ఉంటుంది. అదే విధంగా ఆధ్యాత్మిక అనుభవం లేని వ్యక్తి మాట్లాడినా వాఖ్యానం ఇచ్చినా అతను చేసే పని గ్రంధాన్ని చిత్రహింస చేయటమే.

ఎప్పుడయితే ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక అనుభవం అవుతుందో, ఎప్పుడయితే అతను తన అంతరంగపు మాటల నుంచి స్వేచ్ఛ పొందగలుగుతాడో, అప్పుడు అతను తనకి తాను అలాగే ఎదుటి వారికి నిజమయిన వ్యక్తిలా ఉండగలుగుతాడు. అప్పుడే ఆ వ్యక్తి స్పష్టంగా, నిజాయితీగా దేనినైనా విదుటివారి గురించి ఆలోచించకుండా భరించుతాడు. ఎప్పటివరకూ అంతరంగపు మాటల ఉంటాయో అంతవరకూ ఆ మాటలని వడపోస్తుంటారు. దానిని తిరిగి అనటం చేస్తుంటారు. మనలో నిరంతరం జరిగే అంతరంగపు మాటలని బయటకి మాట్లాడే ధైర్యం చేయం. ఎందుకంటే బయటికి అనే మాటలని ఎవరూ స్వీకరించరని భయపడతాము. కాబట్టి మనం మన జీవితాలని పూర్తిగా అబద్దాలతో నిం పేస్తాము.

ఈ చిన్న ఉదాహరణని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. నేను ఇప్పుడు మీకు ఈ బొమ్మ చూపించి వివరిస్తున్నాను. కొన్ని రోజుల అయ్యాక మీరు ఈ కార్యక్రమం మీద ఆడియో సి.డి.ని మీ స్నేహితునికి వినిపిస్తారు. అతను ఈ ప్రోగ్రూంకి రాలేదు. మీకు ఆధ్యాత్మిక అనుభవం లేదు. అప్పుడు మీరు అతనికి ఎంత వివరించగలరు. మీరు కేవలం నా అనుభవాన్ని అనువాదం చేస్తారు. నా అనుభవాన్ని మీరు ఎంతవరకూ వివరించగలరు? దానిని ఎంత బాగా వివరించుగలరు? మీ స్నేహితుడు ఎంత అర్ధం చేసుకోగలడు? మీరు సరిగ్గా వివరించలేరు. పూర్తిగా వెల్లడించలేరు. ఎందుకంటే ఆ అనుభవం మీది కాదు.

నేను మీకు ఈ బొమ్మ చూపించి వివరిస్తున్నాను. మీరు దీనిని చూడగలిగితే, వినగలిగితే విషయాన్ని అర్ధం చేసుకోగలగుతారు. అప్పుడు కూడా సత్యాన్ని అర్ధం చేసుకోవటం కష్టం. కాబట్టి మీరు మీ స్నేహితుడుకి ఒక ఆడియో సి.డి. ఇస్తే, అతను ఈ కార్యక్రమానికి రాకుండా దానిని వింటే, అతను విషయాన్ని ఎంతవరకూ అర్ధం చేసుకోగలగుతాడు. అదే విధంగా ఆ సి.డి. విని అందులో విషయాల మీద అతను వేరే వారికి ఉపన్యాసం ఇవ్వాలి అని అనుకుంటే అది ఎంతవరకూ కచ్చితంగా ఉంటుంది.

అదే విధంగా ఈ కార్యక్రమానికి రాకుండా దీనిని ఒక పుస్తకంలో లేదా ఆడియో సి. ది. ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటే అతనికి ఏమీ అర్ధం కాదు. భగవద్దీత కూడా ఒక ఆడియో రికార్డు మాత్రమే. ఇది తిరిగి వ్రాయబడిన ఆడియో మాత్రమే. ఇది పూర్తి ఆడియో రికార్డింగ్ కూడా కాదు. మీరు ఆడియో రికార్డింగ్‌ని వింటే కనీసం కొన్ని విషయాలు మీరు అర్ధం చేసుకోగలుగుతారు. ఇక్కడ మాటలలో, కంఠస్యరంలో ఉండే మార్పులు కూడా ఏమీ మీకు తెలియదు. ఎందుకంటే అది ఆడియోని విని తిరిగి వ్రాసి రికార్డు చేయబడిన సి.డి. దానిని మీరు ఎంతవరకూ అనువాదం చేయగలరు. దానిపై ఎంతవరకూ వ్యాఖ్యానించగలరు?

అందుగురించే స్వామి వివేకానంద మరీ మరీ చెప్పేవారు : "వ్యక్తిగతంగా మీరు సత్యాన్ని అనుభవించకుండా, దాని గురించి చదవకండి. ఆ అనుభవం పొందని వ్యక్తి చెప్పినప్పుడు దానిని వినకండి.

మరీ ముఖ్యంగా ఆయన ఇలా చెప్పేవారు. "ఏమిచెబుతున్నారో పట్టించుకోవద్దు. ముందుగా ఎవరు మీకు చెబుతున్నారో ఆ విషయం పట్టించుకోండి" అని ఆయన ఎప్పడూ వ్యక్తిగత అనుభవానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చేవారు. ఆయన ఈ విధంగా చెప్పేవారు. "ప్రపంచంలోని అన్ని గ్రంథాలయాలలో ఉండే అన్ని పుస్తకాలు మిమ్మలని సత్యం వైపుకు తీసుకు వెళ్ళవు. మీరు సత్యాన్ని తెలుసుకున్న తరువాత మీకు పుస్తకాలతో అవసరం వుండదు."

అర్ధం చేసుకోవటం, మేధస్సుతో అర్ధం చేసుకోవటం అనుభవం కాదు. అర్ధం చేసుకోవటం అనేది మైండ్ చేసే పని. అది అహంకారం యొక్క ఉపవస్తువు by product మనం ఏదయితే అర్ధం చేసుకున్నామో అది మైండ్, అహంకారం వడపోయగా మిగిలిన విషయం మాత్రమే. ఈ పద్ధతిలో మైండ్ ఏవిధంగా ఒక విషయాన్ని చూడగలుగుతుంది?దానిని ఏ విధంగా అర్ధం చేసుకోగలుగుతుంది? ఒక వ్యక్తి తాను పొందిన అనుభవమే సత్యం. అనుభవం ముఖ్యంగా ఆధ్యాత్మిక అనుభవం మనలోని అహంకారాన్ని, మన మైండ్‌ని పూర్తిగా మార్చి వేస్తుంది. అదే స్పష్టమయినది రంగులు లేనిది, శాశ్వతమయినది.

మనం అర్ధం చేసుకున్న విషయాన్ని చెప్పగలిగితే ఏవో కొన్ని నిజాలని, విషయాలని, అభి(ప్రాయాలని మాత్రం వెల్లడి చేయగలం. కానీ అసలు సత్యాన్ని ఎప్పటికీ సత్యాన్ని ఎప్పటికీ వివరించలేము. సత్యాన్ని వెల్లడి చేయాలన్న, వివరించాలన్న దాని అనుభవాన్ని పొందాలి. అయితే మేధస్సుతో అర్ధం చేసుకోగలగితే మనం సత్యం గురించి చేసిన నిర్ణయాలని బలపరచుకోవచ్చు. ఇది ఆధ్యాత్మిక అనుభవం కావాలి అనే కోరిక ఉన్నవారికి అవసరం.

ఇక్కడ భగవానుడు ఇలా చెప్పాడు : మయ్యావేశ్య మనో యేమా నిత్యా యుక్తా ఉపాసతే [శ్రద్ధయా పరయోపే తాస్తేమే యుక్తతమా మాతాః (12:2)

ఎవరయితే తమలోని అనుభవాల అనుభూతిని భక్తి రూపంలో వెల్లడి చేస్తారో దానికి ఉపయోగించిన పదం 'ఉపాస్తే'. ఉపాసన అనే పదాన్ని చాలా విధాలుగా అనువాదం చేయవచ్చు. ఎప్పుడయితే ప్రతి ఒక్కరిలోనూ మీరు భగవంతుని చూడగలుగుతారో, ఎప్పుదయితే మీలోని ఆధ్యాత్మిక అనుభవాన్ని వెల్లడి చేయగలుగుతారో అప్పుడు మీరు ఏది చేసినా అది ఉపాసన.

స్పష్టంగా అర్ధం చేసుకోండి. మీరు భగవంతుడిని అందరిలో చూడలేనప్పుడు మీరు భగవంతుడిని విగ్రహాలలో చూడలేరు. లేదా ఆయనని గురువులో కూడా చూడలేరు. కాబట్టి మీరు భగవంతుడిని [ప్రతి[ప్రాణిలో చూడలేనప్పుడు మీరు సర్వాంతర్యామిని దేవుడిలో చూడలేరు గురువులో కూడా చూడలేరు.

ఒకసారి ఒక వ్యక్తి రామానుజులవారి దగ్గరకి వెళతాడు. రామానుజులు గొప్ప గురువు. అయితే అయన దృష్టిలో దక్షిణభారతదేశం పూర్తిగా ఆధ్యాత్మికతను కోల్పోతుంది. శంకారాచార్యులు ఉత్తర భారత దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారు. ఆయన దక్షిణ భారతదేశంలో పుట్టి పెరిగినా ఎక్కువభాగం ఉత్తర భారతదేశంలోనే ఉన్నారు. రామానుజాచార్యులు మూలంగా ఆధ్యాత్మికత దక్షిణ భారతదేశంలోనే తిరిగి తన వైభవాన్ని తెచ్చుకున్నది. ఆయన చివరివరకూ దక్షిణభారతదేశంలోనే ఉన్నారు. అంతేకాకుందా శంకారాచార్యులు ముప్పయిరెందు సంవత్సరాలే జీవించారు. కానీ రామానుజులు ఈ భూమి మీద చాలాకాలం జీవించారు. కొన్ని వేల మందిని ఆధ్మాత్మికరంగలో ఉత్తేజపరిచారు.

ఒక యువకుడు రామానుజుల దగ్గరకి వెళ్ళి "గురుదేవా ! దయచేసి భక్తిని ఎలా సాధించాలో చెప్పండి. భక్తి మార్గాన్ని ఎలా పొందాలి? భగవంతుణ్ణి ఎలా పొందాలి?" అని అడుగుతాడు. రామానుజులు ఆ యువకుడిని " నీవు జీవితంలో ఎవరినైనా (ప్రేమించావా?" అని అడుగుతారు. దానికి ఆ యువకుడు కదిలిపోతాడు. ఆ యువకుడు "గురుదేవా ! నేను బ్రహ్మచారిని. మీరు నన్ను ఆ ప్రశ్న ఎలా అడిగారు? నేను మీ దగ్గరకి భగవంతుని గురించి తెలుసుకోవాలనే కోరికతో వచ్చాను. మీరు నన్ను ఇటువంటి ప్రశ్న అడిగారు" అని అంటారు.

బ్రహ్మచారి :

బ్రహ్మచారి సంస్కృత పదం. దీని అర్ధం బ్రహ్మ+ఆచారి. అంటే ఎవరయితే (ఆచారి) °సర్వాంతర్యామి ((బ్రహ్మ) యొక్క శృతిలో, అదేవిధంగా ఉండగలరో అతనే బ్రహ్మచారి. దీని అర్ధం ఏమిటంటే, బ్రహ్మచారి ఎటువంటివి, ఏమీ ఆశించకుండా జీవించుతాడు. కానీ ఈరోజులలో దీనిని చాలా తప్పగా అర్ధం చేసుకున్నారు. బ్రహ్మచారి అంటే అవివాహితుడు అనే అర్గాన్ని ఇస్తున్నారు.

రామానుజాచార్యులు ఆ యువకుడితో ఇలా చెబుతారు "ముందుగా నీవు వెళ్ళి ఎవరినైనా (ప్రేమించు : నీవు ఎవరినైనా (ప్రేమించినప్పుడు నీకు ఏమనిపిస్తుందో గమనించు. ఆ తరువాత నా దగ్గరకిరా, అప్పుడు నీకు భగవంతుని గురించి చెబుతాను. నీకు భక్తిని బోధిస్తాను".

సహజంగానే ఆ యువకుడు ఒక అడుగు వెనక్కి వేస్తాడు. గురుదేవుని మాటవిని ఆశ్చర్యపోతాడు. అతను రామానుజులు చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకోలేక పోతాడు.

మీరు చూస్తున్న వ్యక్తి పట్ల (ప్రేమభావాన్ని అనుభవించకపోతే ఆ వ్యక్తి పట్ల (ప్రేమ చూపకపోతే మీరు ఎప్పుడూ చూడని వ్యక్తిని ఎలా (ప్రేమించగలుగుతారు. మీరు ప్రతిరోజు చూడగలుగుతున్న మనుషులని (ప్రేమించలేనప్పుడు, అసలు ఎప్పుడూ చూదని భగవంతుడిని ఎలా (ప్రేమించగలుగుతారు? రామానుజులు చెప్పినది సత్యం. మనం ఒక విషయం అర్ధం చేసుకోవాలి. మనం నివసించే పరిసరాలలో (ప్రేమని వెదజల్లలేకపోతే, మనం భగవంతుడయిన ఈ సర్వలోకాన్ని, మనపైన ఉన్న విశ్వాన్ని, ఎలా (ప్రేమించగలం?

నేను మరలా మరలా చెబుతున్నాను. ఈ ప్రపంచాన్ని (ప్రేమిస్తున్నాను అని చెప్పటం చాలా సులభం. కానీ మీరు మీ భార్యని (ప్రేమించటం చాలా కష్టం. ఈ ప్రపంచం మొత్తాన్ని (ప్రేమించటం చాలా సులభం. ఎందుకంటే ఇక్కడ మీరు చేయటానికి ఏమీ లేదు. మీరు చేసేదంతా కేవలం, నేను ఈ ప్రపంచాన్ని (ప్రేమిస్తున్నాను అని చెప్పటమే. అదే మీ భార్యని (ప్రేమించుతున్నాను అని చెబితే మీదృక్సధం మార్చుకోవాలి. మీ మైండ్‌ని మార్చుకోవాలి. మీ మాటలని మార్చుకోవాలి. మీరు చేసి చూపించగలిగే పనులు చేయాలి.

మీరు మీతో జీవితాన్ని గడిపేవారిని నిజంగా (ప్రేమించాలి అని అనుకుంటే, మీరు ముందుగా 'నేను' 'నాది'అనే వాటిని పూర్తిగా వదిలివేయాలి.మీ భార్యని మీ సొంత ఆస్తిగా చూసినంతకాలం మీ హృదయంలోనూ, మీ మనస్సులోనూ ఉండేది హింసా ప్రవృత్తి మాత్రమే. అంతేకాని అది (ప్రేమ కాదు. మీరు ఎదుటివారిని కంట్రోలు చేయాలనుకుంటారు. మీరు వారిపై అధికారి, సొంతదారుడు అని నిరూపించాలని ప్రయత్నిస్తుంటారు. నేను చెబుతున్నాను. నిజ‌మ‌యిన (ప్రేమ అంటే (ప్రేమని పొంది ఆధీనపరచుకోవాలి అనే అలోచనని వదిలి వేయాలి.

లెబనాన్ తత్త్వవేత్త, కవి కలిల్ జిబ్రాన్ (ప్రేమ గురించి అతని ప్రసిద్ధ గ్రంధంలో ఇలా చెబుతారు. మీ భార్యతో బ్రెడ్‌ని పంచుకోండి. కానీ అందులో నుంచి మీరు తినవద్దు. మీరు తాగేది మీ భార్యతో పంచుకోండి. కానీ ఆ కప్పులోనిది మీరు తాగవద్దు. మీరు ఒకరిపై ఒకరు సొంతగా అధికారులు కాదు.

మీలో చాలా మంది మీ భార్య లేదా భర్తతో ఏమి చెబుతారు. మీరు ఏం చెప్పాలను కుంటారో అది చెప్పేసారు. ఏమి అనాలనుకుంటారో ఆ మాట అనేస్తారు. అలా అనే హక్కు మీకు ఉన్నది అని అనుకుంటారు. ఎవరయినా ఆ హక్కు మీకు లేదు. అని అంటే మీరు చాలా బాధపడతారు. అవును కదా? లేకపోతే ఇలా అనుకుంటారు : ఇవే మాటలు కొత్తవారితో అనే ధైర్యం ఉంటుందా? లేదు మనం సమాజ మర్యాదలని పాటించాలి. కానీ ఆ మర్యాదలు భార్య/ భర్త విషయంలో వర్తించవు. దానికి మీరు చెప్పే కారణం మీరు వారిని (ప్రేమిస్తున్నాను అని. మీలో ఎంతమంది మీ భార్యలతో మాటలో మాటలో ఏభైశాతం ఏ నిబంధనలూ, షరతులూ లేని (ప్రేమనుంచి వస్తున్నాయి అని చెప్పగలరు. మీ గుండె మీద చేయచేసి చెప్పండి.

కానీ మీరు మీ భార్యని నిజంగా (ప్రేమించగలగినప్పుడే మీరు ఈ ప్రపంచాన్ని ఎలా (ప్రేమించాలో తెలుసుకుంటారు. మన వివాహ పద్ధతిలో ఉండే మంత్రాలు, ప్రమాణాల ముఖ్య ఉద్దేశ్యం ఇదే. ఎందుకు వివాహ బంధాన్ని ప‌విత్ర బంధం అంటారు? ఎందుకంటే, ఇద్దరి మధ్య (ప్రేమ బంధాన్ని సృష్టించి వారి మిగతా జీవితామంతా కలసిమెలసి ఉంటే అందులో వారు పొందే అసుభవాలు, అనుభూతులే సత్యం. కాబట్టి ఈ సత్యమే మిమ్మలని సర్వమానవులను (ప్రేమించే దిశగా తీసుకువెళుతుంది. వారి ఇద్దరి మధ్య నిజమయిన (ప్రేమ లేనప్పుడు,వారి ఇద్దరిలో ఏఒక్కరయినా సర్వమానవులకి (ప్రేమించగలిగే విషయంలో ఎలా (ప్రతిభ సాధించగలరు.

అటువంటి సచేతన స్థితిలో స్థిరపడి దానిని సర్వ విశ్వానికి వెల్లడి చేసే విషయంలో ఇద్దరూ ఒక్కటే. ఎప్పుడయితే ఒక వ్యక్తి దీనిలో ఐక్యమయిపోతాడో, ఎప్పుడయితే అతను దీనిలో స్థిరపడతాడో, అప్పడు అతను అ(ప్రయత్నంగానే (ప్రేమని వెదజల్లగలుగుతాడు. స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఎప్పుదయితే (ప్రేమ అనేది జరగదో, ఎప్పుడయితే దానిని వెల్లడి చేయలేరో, ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక అనుభవం కాలేదు అని అర్ధం.

ఎప్పుడయితే నిజమయిన అనుభవం సంభవించుతుందో, అది అ(ప్రయత్నంగానే వెల్లడి అవుతుంది. అనుభవం అనే దానిని మీరు స్వాధీనం చేసుకొని మీ బీరువాలో దాచలేరు. అనుభవమే మిమ్మలని స్వాధీనపరచుకుంటుంది. అది మిమ్మలని దాని లోపలికి ముంచి వేస్తుంది. అది ఎంపికలేని విధంగా పొంగి ప్రవహించుతుంది.

ఒక జెన్ బౌద్ధ గురువుని అతని శిష్యుడు ఈ విధంగా అడుగుతాడు గురుదేవా, జ్ఞానోదయమయిన వ్యక్తి మాట్లాడతాడా?

ఆ ప్రశ్నకు గురుదేవులు ఇలా చెబుతారు "లేదు. జ్ఞానోదయమయిన వ్యక్తి ఎప్పుడూ మాట్లాడడు. ఎవరికైతే ఏమీ తెలియదో అతనే మాట్లాడతాడు".

అప్పుడు శిష్యుడు ఇలా అడుగుతాడు " అంటే జ్ఞానోదయమయిన వ్యక్తి మౌనంగా ఉంటాడా?"

గురువు వెంటనే "లేదు. జ్జానోదయమయిన యోగి అసలు మౌనంగా ఉండలేడు. అతను అలా మౌనంగా ఉంటే స్పష్టంగా అర్ధం చేసుకో, అతనికి జ్ఞానోదయం కలుగలేదు అని అర్ధం.

శిష్యుడు చాలా అయోమయంలో పడిపోతాడు. "గురుదేవా! మీరు అతను మాట్లాడడు అంటున్నారు. అతను నిశ్శబ్దంగా ఉండడూ అని అంటున్నారు. మరి ఆయన ఏమి చేస్తాడు?

శిష్యుడి ప్రశ్నకు గురువు ఇలా జవాబు ఇస్తాడు " అతను పాట పాడతాడు. అతని ఉనికి మొత్తం పాడుతుంది. అతను మాట్లాడడు.అతను మౌనంగా ఉండడు. జ్ఞానోదయమయిన వ్యక్తి యొక్క ఉనికి మొత్తం ఒక సంగీత వాహినిలా సాగుతుంది".

ఇలా ఎందుకు జరుగుతుందంటే అనుభవాన్ని మీరు స్వాధీనం చేసుకోలేరు. అనుభవమే మిమ్మలని స్వాధీన పరచుకుంటుంది. ఎప్పుడయితే అనుభవం మిమ్మలని స్వాధీన పరచుకుంటుందో మీరు ఏమి చేసినా అది మధుర గానంలా ఉంటుంది. మీ నుంచి వచ్చే ప్రతి మాట ఒక చక్కని గీతంలా ఉంటుంది. మీ ఉనికి మొత్తం lప్రకాశంవంతంగా ఉంటుంది. మీ నడక నాట్యంలా మనోహరంగా ఉంటుంది. మీ ప్రతి శరీర కదలిక, శరీభాష మీలోని అద్భుత సోయగాలని వ్యాపింపచేస్తుంది. మీరు వెల్లడి చేసే ప్రతిదీ ఒక సేవగా మారతాయి. అదే సమాజానికి దొరికే అద్భుతమయిన సేవ. బౌద్ధగురువు చాలా అందంగా చెప్పారు. జ్ఞానోదయమయిన వ్యక్తి మాట్లాడడు, మౌనంగా ఉండడు, అయన పాడతాడు అని.

ఈ కారణం వలననే గీతని ఒక మధుర గీతంలా ఒక పాటలా చెప్పారు. గీత పాఠం రూపంలో ఉండదు. ఇది ఒక మధుర సంగీత భరితమయిన పాట. గొప్పగొప్ప సత్యాలని తర్శంతో హేతుబద్ధంగా వివరించలేము. వాటిని కవిత రూపంలో, పాటల రూపంలో మాత్రమే వెల్లడి చేయగలం. పాఠం తర్శంతో కూడుకున్నది. అది గట్టిగా స్థిరపడి ఉంటుంది. కాని పాటలు, కవితలు అంటే భావాలు. అది (ప్రేమ. అది ప్రవహించుతూ ఉంటుంది.

శ్రీ కృష్ణుడు ఈ విధంగా చెబుతాడు. ఏ వ్యక్తి అయితే సచేతన స్థితిలో స్థిరపడతాడో అతను చాలా గొప్పవాడు. అయితే ఏ వ్యక్తి తన ఆధ్యాత్మిక అనుభవాలని వెల్లడి చేయగలుగుతాడో, ఎవరయితే అ అనుభవాలని అందరికీ పంచగలుగుతాడో, ఎవరయితే తనలోని (ప్రేమని అ(ప్రయత్నంగా అన్ని దిశలకీ వెల్లడి చేయగలుగుతాడో ఆ వ్యక్తి సచేతన స్థితిలో స్థిరపడిన వ్యక్తికంటే చాలా గొప్పవాడు. అయితే సత్యమేమిటి అంటే సచేతన స్థితిలో స్థిరపడిన వ్యక్తి, ఆ అనుభూతులని, (ప్రేమని వ్యాపింప చేస్తాడు. అతను మధురగీతాలని అలపించుతాడు. పాట పాడతాడు.

నేను మీకు వారణాసిలో నివసించే ఒక భక్తుని కథ చెబుతాను అతను గొప్ప కృష్ణభక్తుడు. అతని దగ్గర చిన్న భగవద్గీత పుస్తకం ఉండేది. అదే ఆయన సర్వస్వం. అది ఆయనకి ఉన్న సర్వ సంపద. ప్రతిరోజు ఉదయం ఆయన గంగానదిలో స్నానం చేసి, ఆ తరువాత భగవద్గీతని చదివేవాదు. అలా శ్రీకృష్ణని సందేశమయిన భగవద్గీతని భక్తి పారవశ్యంతో చదివే వాడు. ఆయన ఆ రోజంతా కూర్చొని శ్రీకృష్ణనిపైన ధ్యానం చేసేవాడు. అతను నిరంతరం శ్రీకృష్ణ భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఉండేవాడు. అతను కృష్ణ భక్తిని నిరంతరం వెదజల్లుతూ ఉందేవాడు. అతని భక్తి, ప్రేమ నిరంతరం కృష్ణని వైపు ప్రవహించుతూ ఉండేది.

అయితే అటువంటి వ్యక్తులని మీరు భరత్ లోనే చూడుగలరు. చాలామంది అలా కూర్చోని భక్తి పారవశ్యంలో పూర్తిగా నిమగ్నమయి పోయి ఉంటారు. సమాజం వారిని, వారి నిశ్చలతని భంగం చేయదు. ఎవరూ వారి జోలికి వెళ్ళరు. వాళ్ళ బాగోగులు సమాజం చూసుకుంటుంది. అదే మరే దేశంలోనైనా అయితే వాళ్ళని అనాధలుగా గుర్తించి వాళ్ళని దానికి సంబంధించిన హోమ్స్‌కి పంపించి వేస్తారు. వాళ్ళని సమాజం చిన్న చూపు చూస్తుంది. పోలీసులు, ప్రజలు వారిని అలా ఉందనీయరు. అయితే హిందూ సంస్కృతి చాలా అందమయినది అద్భుతమయినది. మీరు ఏమీ చేయకుండా అలా కూర్చున్నా భక్తి పారవశ్యంతో ఉన్నా మిమ్ములని గౌరవించుతుంది. మిమ్మలని ఆరాధిస్తుంది.

ఈ కృష్ణ భక్తుడు కృష్ణుని పేరు స్మరించుతూ, కృష్ణని ధ్యానం చేస్తూ అటువంటి భక్తి పారవశ్యంలో ఉంటాడు. అతను నిరంతరం శ్రీకృష్ణుని పై ధ్యానం చేస్తూ, క్బష్టనామాన్ని స్మరిస్తూ ఉంటాడు. అతను పూర్తిగా శ్రీకృష్ణుని సచేతన స్థితిలో తనను తాను పోగొట్టుకునేవాడు.

ఒకరోజు ఒక బిక్షగాదు అతని దగ్గరికి వచ్చి "స్వామీ! దయచేసి నాకు ఏమయినా ఇవ్వండి. నేను భోజనం చేసి మూడు రోజులయింది" అని అడుగుతాదు. భక్తునికి ఏమి చేయాలో తెలియదు. అతనే ఒక బిక్షగాదు. అతనికి ఉన్న ఒకే ఒక ఆస్తి భగవద్గీత. అంతకుమించి అతని దగ్గర ఏమీ లేవు. అతను నిరంతరం భక్తి పారవశ్యంలో ఉంటాడు. ఎవరయినా ఏమయినా ఇస్తే తింటాడు. లేకపోతే క్సష్టనామాన్ని స్మరించుతూ ఆ ఆనందంలో మునిగి ఉంటాడు. అతనికి వున్న ఒకే ఒక ఆస్తి గీతా పుస్తకం.

ఆ పరిస్ధితిలో ఒక బిక్షగాడు వచ్చి, తాను మూడ రోజుల నుంచీ ఏమీ తినలేదని ఏమయినా ఉంటే ఇవ్వమని అడుగుతాదు. భక్తుడు చాలా బాధపడతాడు. చుట్టూ చూస్తాదు. అతనికి ఏమీ కనిపించవు. ఒక్క భగవద్గీత పుస్తకం తప్ప. ఆ పుస్తకాన్ని అతను ఎన్నో సంవత్సారాల నుంచి దాచి వుంచాడు. అతను రోజూ దానిని పూజిస్తాడు. అది అతనికి ఉన్న ఒకే ఒక ఆస్తి. అదే అతనికి దైవం. అదే అతని సర్వస్వం.

ఆకస్మాత్తుగా అతను ధైర్యం తెచ్చుకుని ఆపుస్తకాన్ని చేతో పట్టుకుని ఆ బిక్షగానితో "అయ్యా ! నాదగ్గర ఏమీ లేదు. నీకు నిజాయితీగా చెబుతున్నాను. నాదగ్గర ఈ పుస్తకం తప్ప ఏమీ లేవు. అయితే నేను నీకు ఒక విషయం చెబుతాను. నీవు పట్టణంలోనికి వెళ్ళి ఈ పుస్తకాన్ని నేను నీకు ఇచ్చానని చెప్పి అమ్ముకో. దీనిని ఎవరయినా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. ఎందుకంటే చాలామందికి నేనంటే చాలా గౌరవభావం ఉన్నది. వాళ్ళు నా భక్తులు. శ్రీకృష్ణని దీవెనలు దీనికి ఉన్నాయి. నీవు బజారుకి వెళ్ళి ఈ పుస్తకాన్ని అమ్ముకో. ఆ డబ్బుతో ఏదయినా కొనుకొని దాంతో సంతోషంగా ఉండు" అని అంటాడు.

బిక్షగాదు ఆ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మర్నాదు భక్తుదు శ్రీకృష్ణుని పేరు స్మరించుతూ గీత చదివే సమయంలో చెబుతాదు "శ్రీకృష్ణా ! నేను నీ మాటలు నిలబెట్టటానికి నీ మాటలని ఇచ్చివేసాను." శ్రీకృష్ణని మాట ఏమిటి? భక్తిని ప్రేమని మీ జీవితం వెదజల్లమని, సేవని వ్యాపింపచేయమని, అందుకే ఆ భక్తుదు' నీమాట నిలపటానికి, నీ మాటలని ఇచ్చేసాను' అంటాడు

ఇతను నిజమయిన భక్తుడు. అతను సత్యాన్ని చూడగలిగాదు. ఆయన సత్యాన్ని అసుభవించాడు. ఆ అనుభూతుల్ని వెల్లడి చేయగలిగాడు. అతను శ్రీకృష్ణుని ప్రేమని, సేవా మార్గాన్ని, భక్తిని తన తోటివారికి వెల్లడి చేయగలిగాదు.

భగవద్గీతని తన దగ్గరే ఉంచుకోవటంకంటే కృష్ణుని మాటలు నిలబెట్టటం చాలా ముఖ్యం. అందుకే ఆ భక్తుడు కృష్ణని మాట నిలబెట్టి, కృష్ణుని మాటలని ఆయన గీతాన్ని ఇచ్చేయడం ద్వారా ఆయన మాట నిలబెట్టాడు.

నిజానికి మీరు ఆ పుస్తకాన్ని నిజంగా మీ దగ్గరే ఉంచుకొని, దానిని నిజాయితీగా ఉపయోగించ గలిగితే, మీరు తప్పకుండా ఆ మాటల్ని అనుభూతి చెందుతారు. అప్పుదు శ్రీక్షస్థుని మాటలని మీరు అన్ని దిశలకూ వ్యాపింప చేయగలుగుతారు. ఎప్పడయితే మీరు ఆయన పుస్తకాన్ని నిజంగా మీ దగ్గర ఉంచుకోలేకపోతారో పోగొట్టుకుంటారో ఆయన మాటలను నిలబెట్టలేకపోతారు. ఆతని మాటలని మీ దగ్గర పెట్టుకునే అవకాశం కూడా పోగొట్టుకుంటారు.

భగవానుడు ఇలా కొనసాగిసాడు

శ్లోకం 12.3 - 12.4

యే త్యక్షర మ నిర్దేశ్య మవ్యక్తం పర్యుపాసతే
సర్వతగమచిన్యం చ కూటస్థమచలం ధ్రువమ్ (12:3)
సంనియ మ్యేన్షియగ్రామం సర్వత సమబద్ధయః
తే ప్రాప్పువన్తి మాయేవ సర్వభూతహితే రతాః (12:4)

**అర్థము:** ఏ=ఎవరయితే : తు= కాని : అక్షరం = నాశనములేని : అనిర్గేశ్యం = నిర్వచించలేనిది (ఇది అని చెప్పలేనిది) : అవ్యక్తం = వ్యక్తం చేయలేని (వివరించలేని) : పర్యుపాసతే = ధ్యానించుచున్నారో, ఆరాధించుచున్నారో : సర్వతగం = అంతటా వ్యాపించినది : అచిన్యం = ఊహించలేనిది : చ = కూదా : కూటస్థమ్ = నిర్వికారమైనది : స్గిరమయినది : అచలమ్ = చలించనిది : ధృవం = స్దిరముగా ఉన్నది (నిత్యమయినది) :

సంనియమ్య = స్వాధీనపరచుకొన్నది : ఇందియాగ్రామమ్ = ఇందియమముల సమూహం : సర్వతా = అంతటా : సమబుద్ధి = సమాన భావము కల : తే = వారు : ప్రాపున్యువంతి = సాధించి : మామ్ = నేను : ఏవ = ఒక్కటే : సర్వభూత వితే = సమస ప్రాణులయందు మంచి చేయాలనే సంకల్చం కలవారు : రాతః = నిమగ్నమయి ఉన్నారు.

ఎవరైతే నాశనం లేని పరుబహ్మను, నిర్వచింపలేని దానిని, ఇందియ గోచరము కానిది, సర్వవాప్తి అయినది, ఇది అని నిరూపించలేని, స్గిరమయినది, మార్పు లేనిది, శాశ్వతమయిన పరబ్రహ్మను, ఎవరయితే ఇంద్రియ నిగ్రగహముతో ఆరాధించుతారో, ఎవరయితే నిష్పాక్షిక బుద్ధితో సర్వమానవాళి హితం కోసం పని చేస్తారో వాళ్ళు కూడా నన్ను పొందుతారు.

శ్రీకృష్ణుడు సుగుణ బ్రహ్మ. అతను విశ్వం యొక్క భౌతిక రూపం. ఆ రూపాన్నే ఆయన విశ్వరూప సందర్శనంలో అర్హనునికి చూపించుతాదు. కృష్ణుడు నిర్ధుణ బ్రహ్మకూడా ఆయన రూపంలేని సచేతన స్థితి. ఆయన రూపంతోను, రూపంలేని స్థితిలోనూ ఆయన శ్రీకృష్ణదే. ఆయన దైవమే. ఆయన దివ్య చేతనస్దితి గలవాడే.

అక్షరం అంటే నాశనం లేనిది. అదే దైవత్వంలోని శాశ్వతత్త్వం. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి పదార్గం వస్తుంది,పోతుంది. కనిపించుతుంది. మాయమవుతుంది. కానీ దైవం, దివ్యత్వం శాశ్వతమయినవి. అవి ఎల్లకాలం ఉంటాయి. అనిర్దేశ్యం అనేది చాలా ప్రత్యేకమయినది. దానిని మరి దేనితో కూడా పోల్చలేము. అది అత్యున్నతమయినది. అవ్యక్తం అంటే వ్యక్తపరచలేనిది. దానిని ఏస్పర్శచేత కూడా వ్యక్తపరచలేము. అచింత్యం అంటే ఒక వ్యక్తి యొక్క శరీరం, మైండ్ తనకు జరిగిన ఆధ్యాత్మిక అనుభవాన్ని దైవదర్శనాన్ని, దాని అనుభవాలని ఎందుకు వ్యక్తం చేస్తుందో అదే అచింత్యం.

సర్వ త్రాగం అంటే సర్వాంతర్యామి. అన్ని చోటులలో ఉండగలిగే దివ్యత్వం. దైవం లేని చోటు ఉండదు. ఆయన సర్వాంతర్యామి.

రాక్షసరాజయిన హిరణ్యకశపుని కుమారుదు ప్రహ్లాదుడు. అతను ప్రహ్లాదుని హరినామ జపం చేయవద్దని అంటాదు. అప్పుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశపునితో "నారాయణుడు అన్ని చోటులలో ఉంటాదు. ఆయన ఈ కొమ్మలో ఉంటాదు, ఈస్తంభంలో ఉంటాడు" అని అంటాడు.

ప్రహ్లాదుడు ఈవిషయాన్ని చెప్పే సమయానికి శ్రీమన్నారాయణుడు, ఆయననే విష్ణుమూర్తి అని కూడా అంటాము, ఆయన వైకుంఠంలో లక్ష్మీదేవితో ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి చాలా హడావిడిగా బయలుదేరతాడు. అప్పుడు అందరు భార్యలూ అడిగినట్లే లక్ష్మీదేవి కూడ విష్ణుమూర్తిని " ఈ సమయంలో ఎక్కడికి బయలుదేరారు" అని అడుగుతుంది. జగన్మాత ప్రశ్నకు విష్ణుమూర్తి ఇలా సమాధానం ఇస్తాడు " నాభక్తుడు ప్రహ్లాదుడు నన్ను పిలవబోతున్నాడు. అతను తన వేలిని ఎటువైపు చూపిస్తాదో నాకు తెలియదు. అది చెట్లు కొమ్మ అయినా అవుతుంది లేదా రాతి సంభమయినా అవుతుంది. అతను ఎక్కడ చూపించితే నేను అక్కడ ప్రత్యక్షమవ్వాలి. నేను అతనిని ఈ విషయంలో భంగపరచను".

నిజమయిన భక్తుడు తన స్వామినీ, తనదైవాన్ని ప్రతి చోట చూడగలుగుతాదు. రామకృష్ణ పరమహంస నిజమయిన భక్తుని యొక్క ప్రేమ గురించి ఈ విధంగా చెబుతాదు. భార్యకి భర్తపట్ల ఉన్న పవితమయిన ప్రేమ వంటిది, పిసినారికి తాను దాచిన ఐశ్వర్యం పట్ల ఉన్న వ్యామోహం లాంటిది. లౌకిక సుఖాలపట్ల ఒక మామూలు వ్యక్తి ఉన్న ఆశలాంటిది, ఇవన్నీ ఒకదానిలో కలిస్తే, అవన్నీ భగవంతుని వైపు ప్రయాణిసే అదే భక్తి

పరబ్రహ్మ మారనివాదు. స్ధిరమయినవాడు, కదలనివాదు. అతను రూపంలేని వాదు, రూపంకలవాడు.నిజమయిన భక్తుడు చేతన స్ధితిలో, తన సర్వేంద్రింగ్రియాలని భగవంతుని మీద కేంద్రీకరించి, ఆయన అనుభవాలని పొందుతాదు. అలాగే సర్వ మానవులకు సేవచేసూ అతను శాశ్వతానందపు అనుభూతులని పొందుతాదు. అటువంటి భక్తులు, భగవంతుని తాను కలసిన అందరిలోనూ చూడగలుగుతాదు. అతనికి తన స్వామి యొక్క అనుభవాలే అతను వెల్లడి చేసే ప్రేమ అవుతుంది.

రాధ ఒకసారి గోపికలతో ఇలా చెబుతుంది. "నాకు ఏమయిందో తెలియటం లేదు. నా మీదకి ఏమి వచ్చిందో తెలియదు. నేను అందరిలోనూ కృష్ణుణ్ణి మాత్రమే చూడగలుగుతున్నాను. అందరూ నాకు శ్రీకృష్ణుని లాగానే కనిపిసున్నారు. నాకు ఏం జరుగుతుందో తెలియటం లేదు".

ఒక గోపిక ఇలా చెబుతుంది "రాధా! నీకు ఉన్నది భక్తి. భక్తి నీకంటికి కాటుకలా ఉన్నది".

ఇది ఈ విధంగా ఉంటుంది. మీరు కళ్ళకి నల్లటి కళ్ళద్దాలు పెట్లుకుంటే, సమస్త్రం మీకు నల్లగా కనిపిస్తుంది. అలాగే ఆకుపచ్చ అద్దాలు పెట్టుకుంటే అంతా ఆకుపచ్చగా ఉంటుంది. అదే విధంగా మీరు భక్తి అనే కాటుకని పెట్టుకుంటే, మీరు ఎవరిని చూసినా వాళ్ళు శ్రీకృష్ణునిలా ఉంటారు. అందరూ భగవత్ స్వరూపులుగానే అనిపించుతారు.

ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమి చెబుతాదంటే :ఎవరయితే అత్యున్నతమయిన చేతన స్ధితిలో స్తిరపడతారో,ఎవరయితే భక్తిని వెదజల్లుతుంటారో ఈ ఇద్దరూ ఒకటే. వాళ్ళు రెండు వేరు వేరు గ్రూపులు కాదు.

అర్థం చేసుకొండి. శ్రీకృష్ణదు రెండు గ్రూపులని తయారు చేయటంలేదు. అర్జునుడు తాను చూసిన నిజంని రెండు గ్రూపులుగా చెబుతున్నాడు. వాళ్ళే. ఒకరు చేతనిస్థితిలో స్గిరపడిన వారు : ఒకరు భక్తిని ప్రేమని వెల్లడిచేసేవారు. ఇక్కడ శ్రీకృష్ణదు ఈ ఇద్దరూ ఒక్కటే అని చెబుతున్నాడు. ఆయన వారిని రెండు గ్రూపులుగా చేయటం లేదు. ఈ విషయాన్ని స్పష్టంగా అర్దం చేసుకోండి.

శ్రీకృష్ణుడు ఏమని చెప్పాదు. ఎవరయితే చేతనస్థితిలో స్గిరపడతారో అతను ప్రేమని వెదజల్లుతాదు, అన్ని దిశలలో వ్యాపింపచేస్తాడు. భక్తుడు ఎవరయితే భక్తిని, ప్రేమని వ్యాపింపచేస్తాదో సచేతన స్థితిలో స్దిరపడతాదు. నేను ఇంతకుముందు చెప్పిన శాశ్వత ధర్మచక్రం ఇదే .

రామకృష్ణ పరమహంస ఇలా చెబుతారు. "విప్పుడయితే గంట కొదతామో ప్రతి గంటకీ దాని శబ్దం దానికి ఉంటుంది. అలా గంట కొట్టటం ఆపిన తరువాత కూడా ఆశబ్దం మనకి వినిపిస్తూనే ఉంటుంది. భగవంతుడు అదే విధంగా రూపంతోనూ, రూపం లేకుండా మనకి కనిపించుతాడు.

భజగోవిందంలో శంకరాచార్యులు ఈ విధంగా చెబుతారు.

భజగోవిందం

గురుచరణాం భుజ నిర్శరభకా సంస్మృత్
అచిరత్ భవముకా రం రాణి సేంద్రియా మానస నియామత్ ఏవమ్ దిక్రసి నిజ హృదయాత్యం దేవం

ఎవరయితే తన ఇందియాలని నిగ్రహించుతాదో, తన మనస్సుని పూర్తిగా గురువు మీద కేంద్రీకరించుతాదో, ఎవరు పూర్తిగా గురువునకు ఆధీనమవుతాదో, అటువంటివ్యక్తి తన హృదయంలో భగవంతుని చూడగలుగుతాడు.

శ్రీ కృష్ణుడు ఇక్కడ మరొకసారి ఇలా చెబుతాదు. ఎప్పదయితే రూపరహితమయిన భగవంతుని శాశ్వతము, నాశనము లేని, నిర్వచించలేని భగవంతుని, ఇంద్రియనిగ్రహం కలవాడె తెలుసుకుంటాదో అతడు మానవుల మంచి కోసం పాటుపడతాడు.

రూపంలేని భగవంతుని యొక్క అనుభవం, రూపంతో ఉన్న భగవంతుని యొక్క అనుభవంలాంటిదే. రెండూ కూడా ఒకే సత్యం వైపు దారి తీస్తాయి. అదే సర్వ చేతనస్సితిలో ఒక భాగం

అలా తెలుసుకున్న విషయాన్ని వెల్లడి చేయటమే లోతయిన కరుణ, వినయం. ఇదే కృతజ్ఞత ఆధీనతారూపంలో ఉంటుంది. అప్పుదు అటువంటివారు విశ్వశక్తితోపాటు ముందుకి వెళ్ళగలుగుతారు. వారికి జీవితంలో ఎదురువచ్చే కెరటాలతో పోరాటం చేయవలసిన అవసరం ఉందదు.

చైనా తత్త్వవేత్త అయిన తావొ ఇటువంటి ప్రపాహం గురించి, ప్రవహించటం గురించి చక్కగా చెబుతారు. నీటిప్రవాహానికి తలవంచే నీటి మొక్క బతుకుతుంది. చక్కగా ఎదుగుతుంది. నిటారుగా ఉండే మొక్క ప్రవాహ ధాటికి వంగిపోయి, ఇరిగిపోతుంది. అది చివరికి లేకుండా పోతుంది. మనం చిన్న నీటి మొక్కలా పూర్తిగా ఆధీనమయినపోయి మన చుట్టుపక్కల వాటిని యధాతధంగా స్వీకరించగలిగితే మనం ప్రకృతితో పోరాదవలసిన అవసరం ఉండదు. అప్పుడు మనం నిరంతరం శాశ్వతానందంలో ఉందవచ్చు

ఎప్పుడయితే మనం అహంకారంతో నిండి ఉంటామో, మనం నియంత్రణలో ఉన్నట్టు అనుకుంటాము. ఈ ప్రపంచంలోని అల్లకల్లోలాలని ఒక క్రమ పద్గతిలో పెట్టగలమని అనుకుంటాము. ఈ భూమి ఈ విశ్వం మొత్తం మనం లేకపోయినా వాటిపని అవి నిరాటంకంగా చేసుకు పోతాయి అనే విషయం తెలుసుకోవటానికి ఒక్క క్షణం చాలు. కొన్ని కోట్ల నక్షతాలు, గ్రహాలు ఈ విశ్వంలో సృష్ణమయిన అవ్యక్త స్థితిలో (కల్లోల స్లితిలో) పనిచేస్తన్నాయి. ఈ సమస్త విశ్వం నిరంతరం అవ్యక్తస్థితిలోనే ఉంటుంది.

అహంకారం నిండిన మనం ప్రతీదీ ఒక క్రమపద్ధతిలో ఉండాలి అని అనుకుంటాము. నిజానికి మనమే ఒక క్రమం లేని స్గితిలో ఉంటాము. అసలు సత్యమేమిటంటే మనవేు కల్లోలంగా ఉంటాము. ఎప్పుడయితే మనం ఈ విశ్వశక్తికి ఆధీనమయిపోతామో, అప్పుడు మనం ఆ అవ్యక్తి స్గితిలో, ఆ కల్లోల స్గితిలో ఉండే అద్భుతమయిన క్ర‌మ ప‌ద్ద‌తిని చూడ‌గ‌లుగుతాము. మ‌నం ఎప్పుడ‌యితే కోరిక‌ల‌ని వదిలివేస్తామో, మనం కోరినవి పొందుతాము. మనం నిజంగా కోరుకున్నవి పొందినప్పుడు సర్వ మానవ జాతికి ఉపయోగపడగలుగుతాము. ఎందుకంటే మనం ఆధీనమయిపోయినప్పుడే శ్రీకృష్ణుడు మన బాధ్యత తీసుకుంటాడు.

భగవాన్ శ్రీకృష్ణుడు ఈ విషయం మీద ఇంకా ఇలా వివరిస్తాడు.

#### శ్లోకం 12.5

```Sanskrit
క్షేశో ధికతరసేషామవ్యకాసక చేతసామ్
అవ్యక్తా హి గతిర్లుఃఖం దేహవద్శిర వాప్యతే. (12:5)

**అర్గం:** క్షేశో = కష్టములు : అధికతరః = అధికమయిన : తేషాం = వారిలో : అవ్యక్తాసక్త చేతసామ్ = ఎవరయితే నిర్గణ పరమాత్మాయందు మనస్సుని స్పిరపరచి ఉంటారో : అవ్యక్తా = నిర్మణమయిన : హి = ఏల అనగా : గతిః = మార్ధము : దుఃఖం = దుఃఖము : దేహద్భిః = దేహాభిమానం గలవారిచే : అవాప్యతే = పొందబడుచున్నది.

భావము : అవ్యక్త పరమాత్మ పై ఎవరు మనస్సుని స్దిరపరచి ఉంచుతారో వారు ముందుకుపోవటానికి ప్రయాస పడతారు. ఎందుకంటే రూపంలేని నిర్గుణపాస మార్గము దేహాభిమానం కలవారు అతికష్టం మీద పొందుతారు.

ఇక్కడ శ్రీకృష్ణుడు మనలో చాలామంది సత్యం అనుకునే విషయం గురించి చెబుతాదు. తెలివితేటలు కలవారు భగవంతుని గ్రహించటానికి కష్టపడతారు.

ఒకసారి బ్రహ్మ, విష్ణవు వారిలో ఎవరు గొప్ప వారో తెలుసుకోవాలని అనుకుంటారు. వాళ్ళు ఇద్దరూ శివుడి దగ్గరకి వెళతారు. శివుదు లింగాకారంతో ఒక కాంతి పుంజంలా ఈ విశ్వమంతా వ్యాపించుతాదు. దానికి ఆది, అంతం ఉందవు. అప్పుడు శివుడు వారితో " మీలో ఎవరయితే నా చివరలు కనుగోనలుగుతారో వారే గొప్ప వారు" అని అంటాడు

అప్పుడు విష్ణుమూర్తి వరాహరూపంలో భూమిని తవ్వుతూ శివలింగం యొక్క కాంతి పుంజం చివర చూడాలని వెళతాడు. బ్రహ్మ హంస రూపంలో ఎగురుతూ పైభాగం చూదటానికి వెళతాదు. అలా చాలా సమయం గడిచాకా విష్ణువు, శివుని అంతం కాని, ఆది కాని తెలసుకోలేను అని అర్ధం చేసుకొని శివుని దగ్గరకి వచ్చి క్షమాపణ కోరతాడు.

బ్రహ్మ అలా వెళుతూ ఉంటాదు. అలా వెళ్ళేటప్పుడు బ్రహ్మ ఒక పూవు క్రిందికి రావటం గమనిస్తాడు. అది ఏమిటో కనుక్కుంటే ఆ పూవు శివుని శిరస్సునుంచి పడినట్టుగా తెలుస్తోంది. ఆ వ్రూవు అలా కొన్ని బ్రహ్మజీవితకాలాలపాటు పదుతూ ఉన్నది అని అర్ధం చేసుకుంటాడు. అప్పుడు బ్రహ్మ శివుని తల చివరి వరకూ వెళ్ళలేను అని నిర్ణయించుకుంటాడు. అతను ఆ పూవుని తనతోపాటు శివుని దగ్గరకి బలవంతంగా తీసుకువెళతాడు. తాను ఆ పూవ్వుని శివుని తల పై నుంచి తెచ్చినట్టు దానికి ఆ వూవుని సాక్ష్యం చెప్పమని చెబుతాడు.

బ్రహ్మ ఆ పూవుతో పాటు శివుని దగ్గరకి వెళ్ళి ఈ కథ చెబుతాదు. బ్రహ్మ అబద్దం చెప్పినందుకు శివునికి కోపం వచ్చి అతని ఒక తలను తీసేస్తాడు. బ్రహ్మ పూజకి అనర్శుడని శపించి, ఆ పూవుని తన పూజకి పనిరావని శపించుతాడు.

ఈ కథలోని అసలు అర్ధం ఏమిటి అంటే విష్ణమూర్తి ఐశ్వర్యానికి, బ్రహ్మ మేధస్పుకి ప్రతిరూపాలు. ఐశ్వర్యంతో ఉన్న శక్తి భగవంతుని చేరలేరు. దానికి ఆ విషయంలో అనుమానం లేదు. అయితే అతనికి తన లోపాలని ఒప్పుకునే వినయం అణకువా ఉంటాయి. అతను సత్యాన్వేషణలో అవసరమయితే తన ఐశ్వర్యాన్ని వదులుకోవాలంథే వదిలేస్తాడు. కాని మేధస్సు కలిగిన వ్యక్తి సత్యాన్వేషణలో తన అహంకారం వదులుకోడు. అందుకే అతను ఎప్పటికీ భగవంతుని కనుక్కోలేడు, భగవంతుని చేరలేదు.

సత్యాన్వేషణలో రూపంలేని పరమాత్మని చేరే మార్దంలో మేధావులయిన సత్యాన్వేషికులు వారి మేధస్సు మీద ఆధారపడతారు. వారి అన్వేషణలో అహంకారం వారికి అడ్డుగా ఉంటుంది. దానితో వారికి ఆ మార్గం కష్టంగా ఉంటుంది.

శరీరాభిమానం గలవారు, వారి శరీరంతో పాటు మైండ్‌ని కూడా తీసుకువెళతారు. ఆ మైండ్ తనతో పాటు అహంకారాన్ని తెస్తుంది. మైండ్ శరీరం ఉన్నతమయిన స్థితికి చేరనంతవరకూ ఆధ్యాత్మిక పురోగతి సాధ్యం కాదు. ఈ విషయాన్నే శ్రీకృష్ణుడు స్పష్టంగా వివరించుతాదు.

అహంకారాన్ని వదిలివేయటమనేది మైండ్, శరీర వ్యవస్దకి చాలా కష్టమయిన పని. అహంకారం ఈ వ్యవస్గకి ఒక ఆధారాన్ని గుర్తింపుని ఇస్తుంది. ఫ్రెంచ్ తత్త్వవేత్త అందుకే ఈవిధంగా అంటారు. నేను ఆలోచించుతాను అందుకే నేను' అని. ప్రపంచం ఈ రోజున కాని శ్రీకృష్ణుని రోజులలోకానీ ఆలోచనల శక్తి చుట్టూ మాత్రమే తిరుగుతుంది. ఆశక్తి జ్ఞానాన్ని సామర్యాన్ని ఇస్తుంది. అందుమూలంగానే ఒక వ్యక్తికి గుర్తింపు రావాలన్నా జీవితంలో ఒక స్థితికి చేరాలన్న ఈ వ్యవస్ద అవసరమవుతుంది

రామకృష్ణ పరమహంస అవతారమూర్తి. అయినా ఆయన ఎంతో వినయంతో అణకువతో ముగ్గురిని తన గురువులుగా స్వీకరించారు. అందులో సత్యం ఏమిటి అంటే ఆయన వారిలోని అహంకారాలు పోయేటటట్టుగా చేసారు.

భైరవి, రామకృష్ణునికి తాంత్రిక పద్ధతులని నేర్సించినది. ఆమె రామకృష్ణునికి శిష్యురాలుగానే ఉండిపోయింది. రామకృష్ణుని సహాయంతో ఆమె తనలోని అహంకారం పోగొట్టుకోవటానికి కొన్ని సంవత్సరాలు కష్టపడింది.

తోటపూరి గొప్ప అధ్వైత పండితుడు. ఆయన ఎక్కడా కూడా మూడు రాత్రులకి మించి ఉండడు. ఆయన రామకృష్ణకి భగవంతుని యొక్క అద్వెత తత్వాన్ని నేర్పించాలని అనుకుంటాడు. అప్పుడు రామకృష్ణ ఎంతో సామాన్యునిలా అమ్మ అనుమతి తీసుకువస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తోటపూరి ఆశ్చర్యపోయి రామకృష్ణ వెనుకనే వెళతాడు. అక్కడ రామకృష్ణ కాళీమాత విగ్రహంతో మాట్లాడటం చూస్తాడు. అప్పుడు తోటపూరి రూపంలేని దైవం మీద ధ్యానం చేయమని చెబుతాడు. దానికి రామకృష్ణ అమ్మని వదలనంటాడు. తోటపూరి కోపంగా ఒక గాజుముక్కని రామకృష్ణ కనుబొమ్మల మధ్య ఆయన మూడవ కన్ను దగ్గర గుచ్చి కాళీమాతని ముక్కలుగా చేయమంటాడు. అప్పుడు రామకృష్ణ సమాధి స్థితి (మైండ్‌లేని స్థితి)కి వెళ్ళిపోయి అలా మూడు వారాలపాటు ఉండిపోతాడు. తోటపూరి ఇంతవరకూ ఎవరినీ అంతకాలం సమాధి స్థితిలో చూడలేదు. అంతకాలం సమాధిలో ఉండి తిరిగి మైండ్, శరీరం చేతనస్థితికి వచ్చిన వారిని చూడలేదు. అతను రామకృష్ణతో చాలాకాలం ఉండిపోయాడు.

రామయిత్ బాబా అనే జఠధారి వైష్ణవుడు. ఆయన రామ్‌లాల, అంటే శ్రీరామచంద్రుని చిన్నతనపు విగ్రహంతో రామకృష్ణ దగ్గరకి వస్తాడు. ఆయనకి రామ్‌లాల విగ్రహం కాదు. ఆయన దృష్టిలో బాలుడయిన శ్రీరాముడే. అతను రామలాలకు స్నానంచేయించి, భోజనం పెట్టి ఆ విగ్రహంతో మాట్లాడతుంటాడు. కొన్ని రోజులు రామకృష్ణ దగ్గర ఉన్న తరువాత ఆయనకి రామలాల ఎక్కువ సమయం రామకృష్ణతో గడుపుతున్నట్లు తెలుస్తుంది. అతనికి కోపం వస్తుంది. ఆయన దక్షిణేశ్వరంలో చాలాకాలం ఉంటాడు. ఎందుకంటే రామలాలకి రామకృష్ణ అంటే ఇష్టం కాబట్టి. జటధారి చివరికి ఒకరోజు రామకృష్ణని వదలి వెళ్ళిపోవటానికి నిర్ణయించుకుంటాడు. అతను రామకృష్ణతో "రామ్‌లాల మీతో ఉండటానికి ఇష్టపడుతున్నానని చెప్పాడు. రామలాల నిన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తృప్తిగా ఉన్నది. చివరికి రామలాల్ నాకు కనిపించాడు. అది నీ వలన జరిగింది. రామలాలని నీ దగ్గర వదిలివెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను ఎంతో పరమానందంలో ఉన్నాను " అని చెబుతాడు. అప్పటినుంచి రామలాల రామకృష్ణ దగ్గర ఉండిపోతాడు.

రామకృష్ణ పరమహంస ఎంతో సామాన్యస్థితిలో ఉంటూ, సమాధి స్థితిలో ఉంటూ గొప్పగొప్ప పండితులకి వారి అహంకారం వదిలే విధంగా చేయగలిగాడు. మైండ్ శరీర స్థితిలో అటువంటి వ్యవస్థలో అహంకారం వదలటం అనేది చాలా కష్టమయిన పని. ఇది ముఖ్యంగా ఎవరయితే తమ మేధస్సు మీద ఆధారపడతారో, తమ జ్ఞానం మీద కేంద్రీకరించి ఉంటారో వారికి అహంకారాన్ని వదలటం చాలా కష్టంగా ఉంటుంది.

శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతాడు :

యే తు సర్వాణి కర్మాణి మయి సన్నుస్య మత్సరాః అనన్యేవైవ యోగేన మాం ధ్యాయన ఉపాసతే (12:6) తేషామహం సముద్ధర్తా మృత్య సంసార సాగరాత్ భవామి న చిరాత్పార్ల మయ్యావేశిత చేతసామ్ (12:7)

అర్ధం : ఏ= ఎవరు :తు = కానీ : సర్వాణి = సమస్తములయిన : కర్మాణి = కర్మములు : మయి = నాయందు : సన్నృస్య = సమర్పించి : మత్సరాః = నన్నే తమ అత్యున్నత గతిగా తలచి : అనన్యేన = పూర్తిగా నిలిపి : ఏవ = అయినా : యోగేన = యోగము చేత : మామ్ = నన్నే : ధ్యాయంతః = ధ్యానం చేస్తున్నారో: ఉపాసతే = ఆరాధించుచున్నారో

తేషామ్ = అట్టివారికి : అహమ్ = నేను : సముద్ధర్తా = రక్షించేవాడిని : మృత్య సంసారసాగరాత్ = జనన మరణాలు అనే సముద్దం నుంచి: నచిరాత్ = శీఘ్రముగా: పార్దా = అర్జునా! మయి = నాలో : అవేశిత చేతసామ్ = ఉంచబడిన మనస్సు గల

అర్జునా! ఎవరయితే సమస్త కర్మలని నాయందే వుంచి, ఒకే ఆలోచనతో అనన్య చిత్తముతో నన్నే ధ్యానించి పూజించుచున్నారో, నన్నే పరమగతిగా తలచుకున్న వారై ఉన్నరో. ఎవరు నాయందు మనస్సు లగ్నం చేసారో అట్టి వారిని జనన మరణాల అనే సంసార సముద్రం నుంచి శీఘ్రముగా బయటకి తీసుకువస్తాను.

భగవానుడు ఇక్కడ ఒక ప్రస్తూణం చేస్తాడు.

శ్రీకృష్ణ భగవానుడు నిశ్చయంగా, నిస్పందేహంగా ఇలా చెబుతాడు. నేను వారిని ఈ లౌకిక ప్రపంచం నుంచి విడుదల చేస్తాను. అదే సంసార సాగరం నుంచి, జనన మరణాల చక్రం నుంచి వారిని నేను బయటకి తీస్తాను.

ఇదంతా చేయటానికి ఆయన తన భక్తులని అడిగినది ఒక్కటే. వారు వారిని తనకు సమర్పించుకోవాలి. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు. మీరు నాకు ఆధీనులయిపోతే, మీరు చేసే పనులు (కర్మలు) వాటి ఫలితాలని కూడా నా ఆధీనం చేయండి. నా సేవ చేయంది. నా మీద ధ్యానం చేయండి. నా సచేతన స్థితి మీద ఒకే ఒక మనస్సుతో ఉండండి. నేను మిమ్మలని అన్నింటి నుంచి బయటకి తెస్తాను. మీకు ఈ చక్రబంధాలనుంచి స్వేచ్ఛని ఇస్తాను. మీకు మోక్షం ప్రసాదించుతాను. మీరు తిరిగి జన్మించకుండా చేస్తాను.

ఇది ఒక సింహగర్జన. ఇది ఈ విశ్వానికి మహారాజయిన వాని గర్జన. నాకు ఆధీనలుకండి, బంధాల నుంచి విముకులని చేస్తాను. నన్ను సేవించండి మీకు స్వేచ్ఛని ప్రసాదించుతాను.

ఒక నాస్తికుడు, భగవంతుని మీద నమ్మకంలేని వ్యక్తి, ఒక లోయలోనికి పడిపోతాడు. అలా జారిపోతుండగా అతను ఒక చెట్టు వేళ్ళలో చిక్కుకు పోతాడు. అతను ఆ వేళ్ళను అతికష్టం మీద పట్టుకొని వేలాడుతుంటాడు. అప్పుడు అతనికి భగవంతుడు ఉన్నాడా అని నమ్మాలా, వద్దా అనే ప్రశ్న వస్తుంది. అతనికి ఇప్పుడు ఉన్న బలమయిన కోరిక బతకాలని, అతనిని ఎవరైనా రక్షించాలి. అప్పుడు అతను గట్టిగా ఇలా అరుస్తాడు. "భగవంతుడా నువ్వు ఉన్నది నిజమే అయితే నన్ను రక్షించు"

అతనికి జవాబుగా ఒక గొంతు వినిపిస్తుంది. "సరే. నేను ఉన్నాను. నేను నిన్ను రక్షించుతాను. నీవు ఆ చెట్టు వేళ్ళని వదిలివేయి. అప్పుడు నేను నిన్ను రక్షించుతాను. నేను నిన్ను పట్టుకుంటాను"

అప్పుడు నాస్తికుడు " అయ్యో! భగవంతుడా! నన్ను రక్షించటానికి ఇంకా ఎవరయినా ఉన్నారా?" అని అరుస్తాడు.

మనకి భగవంతుని మీద ఉన్న నమ్మకం పైపైనదే. అన్నింటికంటే కూడా మనలో చాలామందికి భగవంతుడు అంటే అదొక కల్పన, భావము. మనం ఆ భావననే ఆరాధించుతాము. మన ఆరాధనలోచాలా సమయం మనం అడిగే విషయం మీదనే ఆధారపడి ఉంటాము. మనం చేసే ప్రార్ధన. నాకు ఇది ఇవ్వు భగవంతుడా! నాకు అది ఇవ్వు ప్రభూ! మన ప్రార్ధనకి భగవంతుడు జవాబు ఇచ్చీ ఇవ్వగానే మరొకటి మొదలుపెడతాము.

మన ప్రార్ధనలకి భగవంతుడు జవాబు ఇస్తున్నంతకాలం, మనం అడిగివన్నీ గురువులు నెరవేరుస్తున్నంతకాలం వారిమీద మన నమ్మకం అలానే ఉంటుంది. ఎప్పుడయితే మన ప్రార్ధనకి జవాబురాదో వెంటనే మన నమ్మకం కరిగిపోతుంది. అప్పుడు మనం మరొక దేవుడి వైపు వెళతాము. మరొక గురువు దగ్గరకి వెళతాము. మనం ఈ విధంగా అడుగుతాము. "ఇంకా అక్కడ ఎవరయినా ఉన్నారా? ఎవరయినా నా ప్రార్ధనకి జవాబు ఇవ్వగలరా? నేను అడిగిన విధంగా చేయగలరా?"

మనం ఒక విషయం అర్ధం చేసుకోము. భగవంతుడు మన మీద అంతులేని కరుణతో, ప్రేమతో మన మంచి కోసం కొన్ని ప్రార్ధనలకి జవాబు ఇవ్వడు. కానీ మనలోని అజ్ఞానంతో మనం అలా అడుగుతూనే ఉంటాము. అలా ఎటువంటి నిలుపుదలా లేకుండా బిక్ష అడుగుతుంటాము. మనం ఈ ప్రార్ధనలన్నింటికీ భగవంతుడు జవాబు ఇస్తే ఏమవుతుంది అని కనీసం ఆలోచించము. దీనివలన మన పరిస్థితి బాగుంటుదా లేకపోతే మనకి ఇంకా కష్టం వస్తుందా? అందుకే అంటుంటారు. అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగండి. మీరు అడిగినది పొందవచ్చు అని. ఆ భగవంతుడిది అంతులేని మేధస్సు. భగవంతుడు ప్రతిసారీ మన కోరికలని ఒక ప్రక్కన పెడతారు. మనం ధనవంతులు అవ్వాలని, పిల్లలు కావాలని ఇలా ఎన్నో కోరికలు. భగవంతుడు మన మంచి కోసం జవాబు ఇవ్వకపోతే, వెంటనే మరొక దేవుడి దగ్గరకి వెళతాము.

భగవంతునికి ఆధీనమవటం అనేది నిబంధన కాదు.అది సంపూర్తిగా ఉండాలి. దానిలో 'అయితే' 'కానీ' అనేవి ఉండకూడదు. నీవు నా కోరిక తీరిస్తే, నేను నీ భక్తునిగా ఉంటాను అనే పద్ధతి ప్రార్ధనలో ఉండకూడదు. అలా అంటే అది వ్యాపారమవుతుంది. మనలో చాలా వరకు భగవంతునితో సంబంధం వ్యాపార వ్యవహారంలా ఉంటుంది.

ఆధీనమవటం అనేది మూడు రకాలుగా ఉంటుంది.

మొదటి రకం ఆధీనత అనేది మేధస్సుని ఆధీనపరచటం. మనలో చాలా మందికి ఇది చేయడం సులభమే. విశ్వశక్తి అనేది చాలా గొప్పది. అది మన కంటే చాలా గొప్పది అని మనం అర్ధం చేసుకున్నప్పుడు మనం అత్యున్నతమయిన ఆ దివ్యశక్తిని ఒప్పుకుని ఆ శక్తికి మన తెలివితేటల దశలో ఆధీనులమయిపోతాము. కనీసం మీరు' నేను ఆధీనమయ్యాను' అని అనవచ్చు. అందుకే చాలామంది గుడిలో భగవంతుని ముందు, గురు దేవులముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. దాని అర్ధం పూర్తిగా ఆధీనులవటమే. ఆక్షణంలో మన అహంకారం వెళ్ళిపోతుంది.

ఆ తరువాత ఆధీనత భావాత్మక దశలో జరిగేది. భగవంతుడు లేదా గురుదేవుని స్మరించగానే కరిగిపోతారు. మన హృదయాలలోంచి ప్రేమ కృతజ్ఞతాభావం పొంగి ప్రవహిస్తుంది. కళ్ళలో నీరు క్రిందికి ప్రవహిస్తుంది. అప్పుడు మనం భక్తులుగా అయిపోతారు.

రామకృష్ణ పరమహంస ఈ విధంగా చెబుతారు. మీరు భగవంతుని కానీ, గురుదేవుని కానీ స్మరించగానే మీ కళ్ళలో నీరు వస్తే, స్పష్టంగా తెలుసుకోండి, ఇది మీకు చివరి జన్మ అని, మీరు స్వేచ్ఛ పొందటానికి సిద్ధంగా ఉన్నారు అని అర్ధం.

ఇక్కడ మనం సిద్గంగా ఉన్నాము. కానీ స్వేచ్ఛని పొందలేము. ఆ స్వేచ్ఛ మనం మూడవదశకి చేరినప్పుడు దొరుకుతుంది. ఈ దశలో మనం మన స్పర్శేంద్రియాలని ఆధీనపరిచేస్తాము. ఈ స్థితిలో చేసే ఆధీనత సంపూర్ణ ఆధీనత. ఇది నిబంధనలు లేని, అప్రయత్నంగా, సహాజంగా జరిగే ఆధీనత.

మహాభారతంలో వ్యాసుల వారు శ్రీకృష్ణుదు అర్జునిని గురించి ఒక సంఘటనని వివరించుతారు.

కృష్ణుడు అర్జునుడు నడుస్తుంటారు. ఆకస్మాత్‌గా కృష్ణుడు చెట్టు మీద ఉన్న కాకిని చూపించి "అర్జునా! ఆ ఆకుపచ్చని కాకిని చూసావా?" అంటాడు.

అప్పుడు అర్జునుడు, "అవును కృష్ణా నేను ఆకుపచ్చని కాకిని చూసాను అంటాడు".

వాళ్ళు ఇంకా కొంచెం ముందుకి వెళ్ళాక, కృష్ణుడు మరొక కాకిని చూపించి "అర్జునా! ఆ నల్లని కాకిని చూడు" అంటాడు.

దానికి అర్జునుడు, అవును కృష్ణా ! నేను నల్లని కాకిని చూసాను" అంటాడు. కృష్ణుడు అర్జునిని వైపు తిరిగి "అర్జునా! నీవు మూర్ఖుడివిగా ఉన్నావు. నేను నిన్ను తెలివయినవాడిని అని అనుకున్నాను. కాకి ఎలా ఆకుపచ్చగా ఉంటుంది? మొదటి నేను చూపించిన కాకి నల్లగా ఉన్నప్పుడు నీవు ఎలా దానిని ఆకుపచ్చ కాకి అని అన్నావు? నీవు నన్ను ఆనందపరచాలని చూస్తున్నావా?" అని అంటాడు.

అప్పుడు అర్జునుడు "కృష్ణా! నీవు చూపించి అకుపచ్చని కాకి అని అన్నప్పుడు నాకు ఆకుపచ్చని కాకి కనపడింది. నేను ఏం చేయను. నేను అప్పుడు నల్లటి కాకిని చూడలేకపోయాను. నా స్పర్శేంద్రియాలు నన్ను మోసం చేసాయి" అని అంటాడు.

అర్జునుడు స్పర్శేంద్రియాలు అతనిని మోసం చేయలేదు. అవి గురువుకి, భగవంతునికి ఆధీనమయిపోయాయి. ఒక్కసారి ఆ స్థితికి చేరితే ఇక వెనక్కి వచ్చే ప్రసక్తి ఉండదు. ఇదీ సంపూర్ణమయిన ఆధీనత అంటే.

కృష్ణుడు ఇలా చెబుతాడు "మీరు నా ఆధీనులయిపోతే మీకు స్వేచ్ఛని ప్రసాదించుతాను". ఆయనకి చేరటానికి మనం పూర్తిగా ఆధీనులమయిపోవాలి. మన స్పర్శేంద్రియాలని ఆధీన పరచాలి. మన పూర్తి చేతన స్థితి, మన తెలుసుకునే తత్వం సర్వం ఆయనే అయివుండాలి, అంతే కాని మరేది ఉండకూడదు. దీనికి మీరేం చేయనవసరం లేదు. ఇది చాలు చిన్న పద్ధతి. గురుదేవులు ఇలా చెబుతారు. "నాకు ఆధీనలవ్వండి. నేను మిమ్ములని రక్షించుతాను ఎటువంటి ఆలస్యం లేకుండా మిమ్ములని రక్షించుతాను, అని కానీ మనం ఏం చేస్తాం ఇంకా ఎవరయినా ఉన్నారా? అని ప్రశ్నించుతాము.

ఇది చాలా సామాన్యమయినది, సులభమయిన పద్ధతి. భగవంతుడు దానిని చాలా చిన్న పద్ధతిగా చేసాడు. అయినా అది మనకి కష్టంగా ఉంటుంది. భగవంతుడిని నమ్మటం మనకి చాలా కష్టంగా ఉంటుంది.

ఈ ప్రపంచంలోని పరమానందాన్ని చూసే వరకు ఈ లోకాన్ని విడిచి పెట్టవద్దని ప్రజలకు నేను ఎల్లప్పుడు చెపుతూ ఉంటాను. పరమానందం వైపు పనిచేయండి, దాన్ని విడుచుట ఎప్పుడు చేయకండి. ఎప్పుడైతే పరమానందం తటస్థిస్తుందో పూర్తిగా విడిచిపెట్టడం అనేది తనంత తానే నీలో సంభవిస్తుంది.

మయ్యేవ మన అధత్స్య మయి బుద్దిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్వం న సంశయః (12:8)

అర్ధం : మయి = నాయందు : ఏవ = మాత్రమే : మనః = మనస్సుని : అధత్ప్య = స్థిరముగా నిలుపు : బుద్దిమ్ = బుద్ధిని : నివేశయ = ప్రవేశపెట్ట : నివసిష్యసి = నివసింపగలవు : మయి = నాయందు : ఏవ = మాత్రమే : అతః ఊర్సమ్ = అటు పిమ్మట : న = లేదు : సంశయః = సందేహము

నాయందే మనస్సుని స్థిరముగా నిలుపు. నాయందే బుద్దిని ప్రవేశపెట్టు. ఆ తరువాత నాయందే నివసించుతావు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రేమే మీ జీవితం, ప్రతిష్ఠశాల

మీ మనస్సుని అత్యున్నతమయిన విశ్వాత్మనెన నాలో నిమగ్నం చేయండి. మీ మనస్సు, శరీరం, స్పర్శేంద్రియాలు అన్నింటినీ నాలోనే స్థిరపరచండి. అప్పుడు మీరు నాలో నివసించుతారు. ఈ విషయంలో మీకు ఎటువంటి సందేహం వద్దు (న సమస్య)

ఇప్పుడు శ్రీకృష్ణుడు పద్ధతి దగ్గరకి వచ్చాడు. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ధర్మచక్రం ప్రారంభం కావాలి. ముందుగా ఆయన ధర్మచక్రాన్ని వివరించుతాడు. ఆ తరువాత పద్ధతిని చెబుతాడు.

ఒక విషయం అర్ధం చేసుకోండి. ప్రేమ అంటే ఒక మూడ్ mood కాదు. అది కేవలం ఒక భావావేశం కాదు. అది మీ ఉనికి. అది ఎంత కాలం ఒక మూడ్‌లా ఉంటుందో అది వస్తుంది, పోతుంది. ప్రేమ రెండు రకాలు. సమాంతరపు (horizontal) ప్రేమ, ఊర్ధ్వ (లేదా) నిలువుగా ఉన్న (verticle) ప్రేమ.

దీనిని మీకు వివరించుతాను : సమాంతరపు ప్రేమ, సమాంతర రేఖలా అడ్డంగా ఉంటుంది. అది కాలానికి సంబంధించిన ఉంటుంది. అది ప్రారంభమవుతుంది. ముగిసిపోతుంది. స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఏదైనా ప్రారంభమయితే అది ముగిసి తీరుతుంది. అది ముగింపుకి రావటానికి ఎక్కువ సమయం పడితే దానిని శాశ్వతం అని అనుకోవద్దు. ఏదైనా ప్రారంభమయితే ముగిసితీరాలి. దానికి కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలూ పట్టవచ్చు. కానీ అది చివరికి వస్తుంది. అది శాశ్వతం కాదు. కాలపరిమితికి లోబడి ఉంటుంది. దీనినే సమాంతర ప్రేమ అనవచ్చు.

సమాంతర ప్రేమ కాలానికి సంబంధిన ఉంటే, ఊర్ద్వ ప్రేమ చేతనస్థితికి సంబంధించినది. ఈ ప్రేమ ప్రారంభంకాదు, ముగింపుకి రాదు. దీనికి వేరే భావం ఉండదు. ఇది మీ సహజలక్షణం. అది అలా ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ప్రేమించటంలో భేద భావం చూపించితే స్పష్టంగా తెలుసుకోండి. దానిని ప్రేమ అనరు. అది మోహం మాత్రమే. ఎదుటి వ్యక్తి మీ భావాల ప్రేమలో పట్టగలిగినంత కాలం, మీ ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడయితే ఆ వ్యక్తి అందులో సరిపడదో, మీ ప్రేమ మాయమవుతుంది. ఆ ఆర్థిక

మా ధ్యాన కార్యక్రమాలలో మొదటి క్లాసులో నేను అందరినీ వాళ్ళు ప్రేమించే వ్యక్తుల పేర్లు వ్రాయమంటాను. వాళ్ళని నిజాయితీగా వ్రాయమని చెబుతాను. వాళ్ళు జీవితాలలో వాళ్ళు నిజంగా ప్రేమించిన వ్యక్తుల పేర్లు, కనీసం ఇద్దరి పేర్లయినా వ్రాయమంటాను. మామూలుగా ప్రారంభంలో వాళ్ళు చాలా పెద్ద లిస్టు తయారుచేస్తారు. భార్య, భర్త, తల్లి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఇలా చాలా పేర్లు ఉంటాయి. వీళ్ళంతా ఎవరినయితే వీరు ఆనంద పరచాలనుకుంటున్నారో లేదా ఎవరయితే వీరిని ఆనంద పరుస్తారో వాళ్ళు పేర్లు ఈ లిస్టులో ఉంటాయి. రాజ

నేను ఎప్పుడయితే నిజమయిన ప్రేమ గురించి మాట్లాడతానో, వాళ్ళంతా ఆ లిస్టులో ఒక్కొక్కపేరు కొట్టేస్తారు. అలా జరిగినప్పుడు స్పష్టంగా తెలుసుకోండి, అది ప్రేమ కాదు. అయితే చాలామంది తమ కూతురు, కొడుకుల దగ్గరకి వచ్చేటపుటికి ఆగిపోతారు. నేను చెబుతున్నాను అర్ధం చేసుకోండి. మీ ప్రేమంతా మూడు కారణాలతో ఉంటుంది. ఆర్ధిక ఉపయోగాల కోసం, రెండవది మానసిక ఆధారం కోసం అంటే మీ కుటుంబం, మీ సమాజం, మీ వర్గం ఈ విధంగా మీకు ఏదయినా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు మీకు ఆధారంగా ఉంటారు. దీనినే మానసిక ఆధారం అంటారు.

మూడవ కారణం, మంచి వ్యక్తి అనే సర్టిఫికెట్ కోసం. మనకి తెలియకుండానే ప్రతి ఒక్కరూ దీనిని ఆశించుతారు. కొన్ని సార్లు మనం ప్రేమని చూపించుతాము. ప్రేమని పంచుతాము. ఇది ఆర్ధికపరమయిన ఉపయోగాల కోసం కాదు లేదా.

భగవద్దిత - అధ్యాయం 12

ప్రేమే) మీ జీవితం తిరిగిస్తుంది

మానసిక ఆధారం కోసం కాదు. మనం ఎదుటివారి నుంచి మంచి వ్యక్తి అనే సర్టిఫికేట్‌ని ఆశించి చేస్తాము. ఎదుటి వారి శ్రద్ధని ఆశించే ఆకర్షణ ఇందులో ఉన్నది. మనం ప్రేమని వ్యక్తం చేయటంలో ఎదుటివారిపై ఆధారపడే అవసరం అందులో ఉంటుంది. అటువంటి ప్రేమ షరతులు, నిబంధనలతోఉన్న ప్రేమ.

కొంతమంది నాతో అంటుంటారు. స్వామీజీ నేను నా పిల్లలని ఈ మూడు కారణాల వలన ప్రేమించటం లేదు అని. అప్పుడు నేను వాళ్ళతో సరే! అకస్మాత్‌గా మీ అబ్బాయి అన్నీ తన ఇష్ట ప్రకారం చేయటం మొదలు పెట్టాడనుకోండి. ప్రతిదీ తన నిర్ణయం ప్రకారం చేస్తున్నాడనుకోండి. అతను మీ పరిధిలోంచి వెళ్ళిపోయాడనుకోండి, అతను మీ మాట వినటం లేదనుకోండి, మీ రూల్స్ ప్రకారం నడచుకోవటం లేదనకోండి, అప్పుడు మీకు అతని మీద ఉండే ప్రేమ అలానే ఉంటుందా?

నిజాయితీగా ఆలోచించండి. సహజంగానే లేదు అంటారు. వారి ప్రేమ యొక్క నాణ్యతలో చాలా మార్పు వస్తుంది.

దీని అర్ధం ఏమిటి? మనం మన తరువాత తరం వారు మన జీవితాన్ని వారు జీవిస్తున్నంత కాలం ప్రేమిస్తాము. వారు మన జీవితాలకి చిన్న పొడిగింపులా ఉన్నంతకాలం ప్రేమిస్తాము. మన కోరికలని వారి ద్వారా తీర్చుకోవాలని చూస్తుంటాము. మన జీవితాలని వారి ద్వారా జీవించుతాము. మనం సాధించాలి అని అనుకున్నవన్నీ వాళ్ళ ద్వారా సాధించాలని చూస్తాము. వాళ్ళు మన జీవితంలో ఉన్నంతకాలం వారితో మన సంబంధాలు చాలా బాగుంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడయితే వారి నిర్ణయాలు వారే చేసుకుంటారో, వాళ్ళు ఎప్పుడయితే మీరు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని అనుకుంటారో, వాళ్ళు నిలబడి 'లేదు' 'కాదు' అని చెప్పటం మొదలుపెడతారు. అప్పుడు మీ సంబంధ బాంధవ్యాలు మొత్తం మారిపోతాయి.

పిల్లలు పెద్దవారికి లేదు అని చెప్పినపుడు వారు పెద్దవారయినట్లుగా అనుకొంటారు. ఇది చాలా సహజమయిన విషయం. లేదు అని చెప్పినప్పుడే మీరు ఒక వ్యక్తిని అని అనుకుంటారు. వాళ్ళు మీరు ఏమిచెబుతున్నారో పట్టించుకోరు. వాళ్ళకి తెలిసింది 'లేదు' 'కాదు' మాత్రమే. వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదు. వాళ్ళు లేదు, కాదు అని చెప్పినప్పుడు చాలా బలవంతులు అయినట్లు అనుకుంటారు. ఈ కారణంమూలానే ప్రపంచంలో యువత ఎదిరిస్తూ ఉంటారు. అది తూర్పు లేదా పశ్చిమదేశాలు కానీ, ఏ సంస్కృతిలోనైనా యువకులు 'లేదు', 'కాదు' అని చెబుతారు. ఎందుకంటే వాళ్ళు లేదు, కాదు అని చెప్పినప్పుడే చాలా గొప్పవారిగా, శక్తికలవారిగా అనుకుంటారు. కాదు అనేమాట వాళ్ళకి చాలా శక్తిని ఇస్తుంది.

మీకు ఒక విషయం చెబుతాను. మీ ప్రేమ ఔను అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఔను, సరే అనే మాట వచ్చినంతకాలం మీ ప్రేమ కూడా సరే. ఎప్పుడయితే మీరు లేదు, కాదు అనే వాటిని వినవలసివస్తుందో అప్పుడు మీ ప్రేమ కూడా లేదు, కాదు అవుతుంది. ఎందుకంటే ఇది సమాంతర ప్రేమ. అది ఏదో ఒక కారణంతో ముగుస్తుంది. అదే ఊర్ధ్వ ప్రేమ అయితే దానికి చివర లేదు. ఎందుకంటే దాని మొదలు ఉండదు. అది ప్రారంభం కాదు. దానిని మీరు ఆకస్మాత్‌గా గుర్తిస్తారు. మీరు ఎలా అయితే మీ శరీరంలో ఉన్నారో, అదేవిధంగా మీరు ప్రతి శరీరంలోనూ ఉన్నట్టుగా గురిస్తారు. అదే ప్రేమ.

ఉపనిషత్తులలో ఒక చక్కని ఉదాహరణ ఉన్నది. ఒక గురువుగారు తన శిష్యుడిని ఈ విధంగా అడుగుతాడు. నీవు నీ స్పర్శేంద్రియాలతో పూర్తిగా ఆనందాన్ని పొందుతున్నావా?" అని శిష్యుడు అవును అని సమాధానం చెబుతాడు. అప్పుడు గురువు 'నీ స్పర్శేంద్రియాలలో ఒకదాని కోల్పోతే, నీకు అదే ఆనందం ఉంటుందా?" అని అడుగుతాడు.

ఆ ప్రశ్నకు శిష్యుడు "లేదు. అది ఇరవై శాతం తగ్గుతుంది. అలాగే రెండింటిని కోల్పోతే నలభై శాతం ఆనందం తగ్గుతుంది " అని జవాబు ఇస్తాడు.

అకస్మాత్‌గా గురువు ఈ విధంగా అడుగుతాడు " నీకు మరొక ఐదు స్పర్శేంద్రియాలు అదనంగా ఉంటే ఏమవుతుంది?"

అప్పుడు శిష్యుడు "సహజంగానే నా ఆనందం నూరుశాతం పెరుగుతుంది. అలాగే నాకు ఇంకొక శరీరం ఉంటే ప్రతిది రెట్టింపు ఆనందాన్ని పొందగలుగుతాను. లేదా నాకు ఐదు శరీరాలు ఉంటే ఐదురెట్లు ఆనందం పొందుతాను అంటాడు.

మీరు ప్రపంచంలోని ప్రతి శరీరంలో జీవిస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు ఆ అనుభవం ఎంత ఆనందాన్ని ఇస్తుంది? మీకు ఎంత పారవశ్యం కలుగుతుంది. లెక్కకట్టలేనంత ఆనందం అది. అది శాశ్వతమయినది. అంతిమయినది. అవును కదా!

ఈ ఆనందాన్నే జ్ఞానోదయమయిన యోగులు పొందేది. వాళ్ళు ఈ విశ్వమంతా ఉన్నారు అనే అనుభవాన్ని పొందుతారు. వాళ్ళు ప్రతి శరీరంలో ఉంటారు. అందుకే అద్భుతమయిన పారవశ్యంలో ఉంటారు. వాళ్ళు శాశ్వతమయిన నిత్యానందంలో ఉంటారు. అందుకే వాళ్ళు బయట ప్రపంచం నుంచి ఏమీ ఆశించరు.

ఒకసారి మా కార్యక్రమం అయిపోయాక ఒక పెద్దాయన నా దగ్గరకి వచ్చి, నాకు చాలా సానుభూతిని చూపించుతూ, 'అయ్యో! ఇంత చిన్న వయస్సులో మీరు యోగిగా అయిపోయారు. మీరు జీవితంలో చాలా కోల్పోయారు" అని అన్నారు.

ఆయన తన జాలిని చూపించాడు. ఆయన నేను ఏదో కోల్పోయాననుకుంటున్నాడు. నేను అతనితో ఇలా చెప్పాను "మీరు నా మీద సానుభూతి చూపించనవసరం లేదు. నిజానికి నేనే మీ పట్ల జాలి చూపించాలి. అరవై సంవత్సరాలు వయస్సు వచ్చి కూడా మీరు స్వేచ్ఛని పొందలేక పోయారు. ఈ వయస్సులో కూడా మీరు సంసార బంధాలలో కష్టపడుతున్నారు. కాబట్టి మీరు నాకు సానుభూతి చూపవద్దు. నాకే మిమ్ములని చూస్తే జాలిగా ఉన్నది అన్నాను.

మీరు పారవశ్యాన్ని, పరమానందాన్ని మీ అంతరంగంలో అనుభవించగలిగితే, మీరు బయట ప్రపంచంలో ఏదీ కోల్పోరు. మీకు ఇంకా ఈ బయట ప్రపంచంలో ఏమీ అవసరం ఉండవు.

మీరు ప్రపంచాన్ని వదలటం (సన్యసించటం) నిజమయిన సన్యాసం కాదు. అది నిజంగా వదులుకోవటం కాదు. ప్రపంచం మిమ్ములని వదిలివేయాలి. మీ అంతరంగంలో పరమానందం, పారవశ్యం, ఆనందం ఉన్నప్పుడు మీరు అప్రయత్నంగా వాటిని అన్ని వైపులకి వ్యాపింపచేస్తారు. అప్పుడు మీరు ఏదో కోల్పోయాము అని అనుకోరు.

నేనెప్పుడూ చెబుతుంటాను. మీరు మీ అంతరంగంలో అటువంటి పారవశ్యాన్ని పొందేవరకూ ఈ ప్రపంచాన్ని వదలకండి. దేనినీ వదలవద్దు. ఆ పారవశ్యపు అనుభవాన్ని సాధించే దిశగా పనిచేయండి. ఎప్పుడయితే ఆ పారవశ్యపు అనుభవాన్ని పొందుతారో, మీలో ప్రపంచాన్ని సన్యసించటం అనేది అప్రయత్నంగా జరుగుతుంది.

స్పష్టంగా అర్థం చేసుకోండి. మీ లోపల మీ ప్రపంచాన్ని ఏర్పరచుకోకుండా మీరు బయట ప్రపంచాన్ని వదిలివేస్తే, మీరు మానసిక వ్యధకి లోనవుతారు.

నేను చాలామంది సన్యాసులని చూసాను. వారు వారి అంతరంగపు ప్రపంచాన్ని సాధించకుండా, ప్రపంచాన్ని వదిలేసే మార్గంలో ఉంటారు. వాళ్ళే సమాజసేవ అనేదానిలో పడి అక్కడి నుంచి మానసిక కుంగుబాటుకు లోనవుతారు. అటువంటి వాళ్ళు నలభై, నలభైఐదు సంవత్సరాల వయస్సులో ఇటువంటి మానసిక కుంగుబాటుకి లోనవుతారు. వాళ్ళు లోతయిన మానసిక వ్యధలో ఉండి ప్రపంచంలో

వాసనలూ ఆహరమే. మీరు ఆనందించే స్పర్శ ఆహారం. కాబట్టి మీరు ఐదు స్పర్శేంద్రియాల ద్వారా లోపలికి తీసుకునేవన్ని ఆహారమే. అవి పరిశుభ్రంగా, స్వచ్చంగా ఉండాలి. అప్పుడే మీరు స్వచ్ఛతని అన్ని వైపులకీ వెదజల్లుగలుగుతారు. అప్పుడే మీరు పరమానందాన్ని, పారవశ్యాన్ని దివ్యమేధస్సుని వెదజల్లగలుగుతారు. దానిని అన్ని దిశలకూ వ్యాపింపచేయగలరు. అర్ధం చేసుకోండి. మీరు మీ ఆహారాన్ని స్వచ్చంగా, పరిశుభ్రంగా ఉంచకపోతే, మీకు కలిగే జ్ఞాపకాలను స్వచ్చంగా ఉంచలేరు.

నేను అదృష్టం కొద్ది పల్లెటూరులో పుట్టాను. ఆరోజులలో అక్కడ టి.విలు లేవు. నన్ను కొంతమంది అడుగుతుంటారు. "స్వామీజీ, మీరు విషయాలని అంత త్వరగా ఎలా గ్రహించగలుగుతారు? " అని. మీకు ఒక విషయం చెప్పాలి. నేను రెండు సంవత్సరాల క్రితమే ఇంగ్లీషు మాట్లాడటం నేర్చుకున్నాను. నేను ఇంగ్లీషు చదివాను కానీ నా చదవంతా నా మాతృభాష తమిళంలోనే జరిగింది. నేను ఆగష్టు 2003లో మొదటి సారి అమెరికా వచ్చినప్పుడే ఇంగ్లీషు మాట్లాడటం మొదలు పెట్టాను.

అందరూ అడుగుతుంటారు. నేను అంత త్వరగా ఎలా నేర్చుకోగలిగాను అని. కొంతమంది అడుగుతుంటారు, మీరు అన్ని పుస్తకాలు అన్ని పేజీలు ఎలా చదవగలుగుతున్నారు అని. ఎందుకంటే నేను ఎప్పుడూ టి.వి. చూడను. టి.వి. తిన్నగా వెళ్ళి మీ చేతనస్థితిని నాశనం చేస్తుంది. అర్థం చేసుకోండి. టి.వి. చూడటం వలన మీ కళ్ళని, మీ చేతన స్థితిని పాడు చేసుకుంటారు.

మీకు ఒక ముఖ్యవిషయం చెబుతాను. ఈ ఉదాహరణకి అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీరు ఏదో కారు లేదా స్కూటర్ మీద ప్రయాణం చేస్తున్నారనుకోండి. మీరు గంటకి 40 మైళ్ళ స్పీదుతో వెళుతున్నారనుకోండి. మీర రోడ్డు మీద బోర్డులని, అన్నీ చూడవచ్చు. రోడ్డు మీద ఉన్న వాటినన్నింటినీ మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ఒక వేళ మీరు గంటకి 100 మైళ్ళ వెళుతుంటే,

మీరు ఏమైనా చూడగలరా?

మీరు ఏమీ చూడలేరు. దేనినీ స్పష్టంగా చూడలేరు. ఎందుకంటే మీరు సెకండ్‌కి ఎక్కువ ప్రేమలని చూస్తున్నారు కాబట్టి. అందుకే మీరు దేనినీ స్పష్టంగా చూడలేరు. మామూలు స్థితిలో మీ కళ్ళు దేనినైనా సరే చూడాలన్నా, దానిని విశ్లేషించి, రికార్డు చేయాలన్నా సెకండ్‌కి ఆరు ప్రేమల స్పీదు మాత్రమే ఉండాలి. అంటే సెకండ్‌కి ఆరు ఫ్రేముల చొప్పున మీ కంటి ముందు ఏదైనా మారుతుంటే దానిని, అందులోని విషయాన్ని సందేశాన్ని మీ కన్ను చూడగలుగుతాయి. దానిని విశ్లేషించి, విభజించి తిరిగి దానిని మీ చేతనస్థితికి చేర్చగలుగుతాయి. కానీ ఆ మార్పు సెకండ్‌కి ఆరు ఫ్రేములని మించితే మీలోని తర్కం గతి తప్పుతుంది. బాలెన్స్ చేయలేదు. టి.వి.లో మీరు కనీసం సెకండ్‌కి పదహారు ఫ్రేములని చూస్తారు. అందులోని విషయం మీలోపలికి నేరుగా బలవంతంగా నెట్టబడుతుంది.

స్పష్టంగా అర్ధం చేసుకోండి. అది ఈ విధంగా ఉంటుంది. మీ ఇంటిముందు వాచ్‌మెన్ ఉంటాడు. ఒక దొంగ మీ వాచ్‌మెన్‌ని కొట్టి చంపి తిన్నగా మీ ఇంటిలోనికి వచ్చేస్తాడు. టి.వి. చూస్తున్నప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది.

తర్కం అనేది మీ కాపలాదారుడు (వాచ్‌మెన్), అతను మీకు కాపలా కాస్తూ నిలబడ్డాడు. అక్కడ తర్కం నిలబడి ఉంటుంది. మీ దగ్గరకి ఏవిధమయిన సమాచారం వచ్చినా, అది దానిని విశ్లేషించుతుంది. ఇది నిజము, ఇది అబద్ధము, ఇది బొమ్మ, ఇది నిజమయిన మనిషి ఇలా వివరాలు ఇస్తుంది. సమాచారాన్ని విశ్లేషణ చేసి దానిని రికార్డు చేస్తుంది. మీరు సినిమా చూసినప్పుడు సెకండ్‌కి పదహారు ఫ్రేములు మారుతుంటాయి. అలా సమాచారం మీ దగ్గరకి బలవంతంగా నెట్టబడినపుడు, మీ తర్కం తన శక్తిని కోల్పోతుంది. అది వచ్చిన సమాచారాన్ని విశ్లేషించే నైపుణ్యాన్ని పోగొట్టుకుంటుంది. అప్పుడు సమాచారం నేరుగా మీ చేతన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఆ సమాచారం మీ లోపలికి చొచ్చుకుని వెళుతుంది. ఇది ఎలా

ప్రేమే మీ జీవితం ప్రతిష్ఠను

అంటే దొంగ మీ కాపలదారుని చంపి నేరుగా మీ ఇంటిలోనికి ఎలా వస్తాడో అలా లోపలికి వెళ్ళిపోతుంది.

మరొక విషయం : సమాచారం నేరుగా మీకు చేరుతుంది. దాంతో మీరు తార్కికంగా ఆలోచించే శక్తిని పోగొట్లుకుంటారు. మీ భావావేశాలు కూడా అదుపు తప్పుతాయి. అకారణంగానే, సినిమాలో వాళ్ళు నటించుతున్నారు, అని తెలిసి కూడా వాళ్ళు ఏడిస్తే మీరు ఏడుస్తారు. ఆ పాత్ర చనిపోతే ఆ నటించే వాళ్ళు బతికే ఉన్నారని తెలిసి కూడా మీరు బాధపడతారు. అది నిజంగా జరగటం లేదు అని, అది అంతా నటన అని మీకు తెలుసు. అయినా వాళ్ళు నవ్వితే మీరు నవ్వుతారు.వాళ్ళు ఏడిస్తే మీరు ఏడుస్తారు.

అక్కడ జరిగే సీన్ ప్రకారం మీ మూడ్ కూడా మారిపోతూ ఉంటుంది. అక్కడ మానసిక వ్యధతో ఉన్న సీన్ వస్తే మీరు కుంగిపోతారు. ఎందుకు? మీరు చదువుకున్న వారు, అదంతా కేవలం నటన అని మీకు తెలుసు. అందులో నటీనటులు బ్రతికే ఉన్నారు అని తెలుసు. వాళ్ళని మీరు చూసి ఉంటారు కూడా. కానీ సినిమా చూసినప్పుడు మాత్రం మీరు బాధపడతారు ఎందుకు? ఎందుకంటే, సమాచారాన్ని విశ్లేషణ చేసే తర్కాన్ని మీరు పక్కన పెట్టేస్తారు. అది నిజమా, అబద్దమా అనే విషయం విశ్లేషించే అవకాశం ఉండదు. సమాచారం తిన్నగా, మీలోనికి చేరిపోతుంది. అది మీ వ్యవస్థలోనికి చేరిపోతుంది. అది మీ అచేతన స్థితిని చేరుతుంది. అప్పుడు మీ అచేతన స్థితి దానితో ప్రభావితం అవుతుంది. అందుకే స్పష్టంగా తెలుసుకోండి. మీకు మానసిక వ్యధ కలిగించే ఏవీకూడా చూడకండి.

అలా కాకుండా సరదాగా ఉండి మీకు సంతోషాన్ని కలిగించి, మిమ్మలని నవ్వించే కార్యక్రమాలు చూడటం మంచిదే. అవి మిమ్మలని బాధపెట్టవు. అవి మీ చేతనస్థితిని డైరెక్ట్గా బాధించవు. కాకపోతే దీని వలన మీకు సమయం వృధా (టైం వేస్ట్) అవుతుంది. అలాంటి కార్యక్రమాలు చూస్తూ తిన్నారనుకోండి. కొంచం భోజనం ఎక్కువ చేస్తారు. దానితో మీకు బరువుపెరిగే సమస్య రావచ్చు. లేకపోతే మరే సమస్యలేదు.

ఒక సర్వే ప్రకారం ఎనభై శాతం మంది టి.వి. చూస్తూ భోజనం చేస్తారు. దానితో బరువు పెరిగే సమస్యని ఎదుర్కొంటున్నారు. అయితే ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ మీ మనస్సుకి బాధ కలిగించేవి, మానసిక కుంగుబాటును తెచ్చేవి, అటువంటి కార్యక్రమాల మాత్రం చూడకుండా ఉండటమే మంచిది.

ఈ సందర్భంగా నేను మీకు మరొక మరొక ముఖ్యమయిన ప్రశ్నకు జవాబు చెప్పాలి. నన్ను చాలా మంది అడుగుతుంటారు. "స్వామీజీ, ఎక్కడయినా దెయ్యాలు, భూతాలు అనేవి ఉంటాయా? ఈ ప్రశ్న నన్ను చాలా సార్లు అడిగారు. మీకు స్పష్టంగా వివరించుతాను. అసలు దెయ్యాలు అనేవి లేవు. అలాగే భూతాలు, ఆత్మలు ఇవేవి లేవు. స్పష్టంగా తెలుసుకోండి. మీరు వెయ్యి ఉదాహరణలు, రెఫెరెన్సులు చెప్పవచ్చు. నాకు తెలుసు, మీ మైండ్స్ ఇప్పటికే చాలా సంఘటనలని పోగు చేస్తుంటాయి. మీరు చూసిన సినిమాలలో, మీరు పుస్తకాలలో చదివిన విషయాలోంచి మీ మైండ్ కొన్ని రిఫరెన్సులని పోగు చేస్తుంటుంది. స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఒక్కసారి మీ అచేతనస్థితి దెయ్యాలు ఉన్నాయి అని నమ్మితే అది మీ ముందుకు ఆ భావాలని తెస్తుంది. మీరు దానిని చూస్తారు. మీ అచేతన స్థితి ఏవిషయాన్ని నమ్మితే, ఆ విషయాన్ని మీ ముందుకి తెస్తుంది. అది మీరు నమ్ముతారు.

ఇప్పుడు హిప్నాటిజమ్ మీద చాలా పరిశోధనలు జరిగాయి. ఇప్పుడు వాళ్ళు చాలా గొప్ప గొప్ప సత్యాలతో ముందుకి వస్తున్నారు. ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేసి అతని చేతికి మండే మంటని ఇచ్చి నువ్వు గులాబీలని పట్టుకున్నావు అని ఆ హిప్నటైజ్ చేసే వ్యక్తి చెబితే, అతను నిజంగా చేతిలో గులాబీలు ఉన్నాయనే అనుకుంటాడు. అంతేకాదు చేతిలోంచి మంటను తీసేసాక చూస్తే చేయి గులాబీల

ప్రేమే మీ జీవితం ఎం.ఎస్

వాసన వస్తుంది. అంతే కాదు చేతిలో మంటని పట్టుకున్న చేయి కాలదు. హిప్పటిజమ్‌కి చాలాశక్తి ఉన్నది. అంటే అర్థం ఏమిటంటే మీ అచేతనస్థితికి అంతశక్తి ఉన్నది అని. మీకు తెలియని అచేతనస్థితిలో మీకు దెయ్యాలు ఉన్నాయి అని చెబుతారు. అది హిప్నటైజ్ చేసినట్టుగా ఉంటుంది. దాంతో మీరు దెయ్యాలని చూడగలుగుతారు. అలా మీకు ఒకసారి అనుభవమయితే దానిని మీరు చాలా నమ్ముతారు. అదే ఒక ధృఢమయిన నమ్మకమై పోయిపోతుంది.

ఇంతకంటే కూడా బాగా కలవరపెట్టే విషయాన్ని కనుక్కున్నారు. అమెరికాలోనే, క్రిందటి దశాబ్దంలో పిల్లలు తల్లిదండ్రుల చేతిలో లైంగిక హింసకి గురి అయి కష్టాలు పడినట్లు బయటకి వచ్చింది. ఈ విషయాలని వాళ్ళు పెద్దవారయ్యక (టీనేజ్‌కి వచ్చాక) కనుగొనగలిగారు. ఇలాంటి విషయాలు హిప్పటిజమ్ ద్వారా కనుక్కోగలిగారు. ఆ తరువాత పోలీసులు, అధికారులు ఈ కేసుల మీద కొంత పనిచేశారు.

అధికారులు, పోలీసులు కొంత పరిశోధనలు చేసాకా అసలు అటువంటి హింస జరగలేదు, ఇవన్నీ కూడా తీర్పులని తామే చేసేసి దాని ప్రకారం పేషెంట్స్‌ని ట్రీట్ చేసిన సైక్రియాటిస్టులు చేసిన పని. వాళ్ళే ఈ యువకుల మైండ్‌లోకి ఇటువంటి విషయాలని వెళ్ళేలా చేసారు అని తెలిసింది. మానసిక గాయాలని వ్యధని తమ చికిత్స ద్వారా బాగుచేయవలసిన సైక్రియాటిస్టులు, వాళ్ళని మరింత బాధలని గురిచేసారు. .

మీరు దయ్యాల సినిమాలు, హరర్ సినిమాలు వరుసగా మూడు రోజులు చూస్తే, మీకు దయ్యాలు కనిపిస్తాయి. కిటికీలకి, గుమ్మంకి కట్టిన కర్టెన్ కదిలినా అది దయ్యంలా కనిపిస్తుంది. మీ భార్య గదిలోనికి వస్తున్నా, దెయ్యం లోపలికి వచ్చినట్టు అనిపిస్తుంది. దీని గురించి మీరు దెయ్యాల సినిమాలు చూదనవసరం లేదు. ఎందుకంటే మీ చేతనస్థితిలో మీరు ఈ విషయంలో కలతతో ఉంటారు. సరే! మీ చుట్టూ ఏమి జరిగినా దానిని భూతాలతో సంబంధం పెట్టేసారు.

ఉదాహరణకి మీరు ఒక హరర్ సినిమా చూస్తున్నారనుకోండి. మీకు దాహం వేసి అప్పుడు మంచినీళ్ళు తాగాలని వంటింటిలోనికి వెళతారు. అప్పుడు అనుకోకుండా పిల్లి కిటికీలోంచి దూకిందనుకోండి. అంతే! సీన్ మొత్తం పూర్తి అయిపోతుంది. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయి అనే నమ్మకం చాలా ధృఢంగా ఏర్పడుతుంది. స్పష్టంగా అర్ధం చేసుకోండి. ఇది పూర్తిగా మీ అచేతనస్థితి మాత్రమే. ఎందుకంటే మీరు నమ్మటం మొదలుపెట్టినప్పటి నుంచీ, మీరు దానినే చూస్తుంటారు. అప్పుడు మీ నమ్మకం చాలా బలపడిపోతుంది. ఇది ఒక చేధించలేని చక్రంలా తయారవుతుంది.

మీ దగ్గరకి ఏ దయ్యం, భూతం ఈ భౌతిక శరీరంతో రాలేవు. చూడండి. మీకు మూడు శరీరాలు ఉంటాయి. భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కేవల శరీరం. ఒక వేళ దెయ్యాలు నిజంగా ఉండి ఉంటే వాటికి భౌతిక శరీరం ఉండదు. అసలు దెయ్యాలు అనేవి లేనే లేవు. ఉంటే అనే ప్రశ్న లేదు. కాకపోతే మనం విషయాన్ని తార్కికంగా అర్ధం చేసుకోవటం కోసం, నేను చెప్పే మాటలు మీకు అర్ధమవటానికి, అవి ఉండి ఉంటే అని అనుకుందాం. మీ అందరి వాదనలని తీసుకుంటాను. అలాంటప్పుడు దెయ్యాలు ఉండి ఉంటే వాటికి భౌతిక శరీరం ఉండదు. వాటికి కేవలం సూక్షుశరీరం, కేవలం శరీరం మాత్రమే ఉంటుంది. వాటికి భౌతిక శరీరం ఉండదు.

మీ దగ్గరకి ఏ దయ్యం, భూతం భౌతిక శరీరంతో రాలేవు. మహా వస్తే మీ భార్య లేదా మీ భర్త రావాలి అంతే. దీని అర్ధం ఏమిటి అంటే వాటికి 66% శక్తి మాత్రమే ఉంటుంది. మీకు మూడు శరీరాలు ఉంటాయి. అది వందశాతానికి సమానం. దీని అర్ధం ఏమిటంటే అవి మీకంటే చాలా తక్కువ శక్తి కలిగి ఉన్నాయని, వాటికంటే మీరే శక్తివంతులు అని. కాబట్టి అవి నిజంగా ఉండివుంటే మీరు వాటి విషయంలో అసలు భయపడనవసరం లేదు.

ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోండి. అవి నిజంగా ఉన్నా మీరు వాటికి భయపడనవసరం లేదు. అవి మీకంటే తక్కువ ప్రాణులు. మీకంటే చాలా తక్కువ దశలో జీవించే జీవాలు. ముందుగా చెప్పాలి అంటే అసలు అవిలేవు. మనవాదనకి అనువుగా ఉంటుంది అని అవి ఉన్నాయి అవి అనుకున్నా, అవి చాలా చిన్న ప్రాణులు. మనకంటే శక్తిలేనివి. అందుకే మీరు వాటిని చూసి భయపడనవసరం లేదు. స్పష్టంగా అర్ధం చేసుకోండి. దెయ్యాలతో మాట్లాడటం, మీడియాలద్వారా ఆత్మలతో మాట్లాడటం, చనిపోయిన మీ బంధువులతో మాట్లాడటం, ఇవన్ని కేవలం కధలే. ఒక కథ పుడుతుంది దాని మీద మరొక కథ అల్లుతారు. ఆ తరువాత ఇంకొక కథ. ఇది కేవలం కల్పన.

ఒక చిన్న కథ :

ఒకామె ఆత్మలతో మాట్లాడించే మీడియం దగ్గరికి వెళ్ళి కొద్దికాలం క్రితం చనిపోయిన ఆమె భర్తతో మాట్లాడాలనుకుంటుంది. ముందు ఆ మీడియం ఎదురు చూస్తుంది. గొణిగినట్లు వస్తుంది. ఆ తరువాత మాట్లాడటం మొదలు పెడుతుంది.

ఆమె అడుగుతుంది "ఏమండీ! మనకి డబ్బులు ఇవ్వవలసిన వారి వివరాలు చెప్పండి. మీరు డబ్బు ఎక్కడ ఎక్కడ పొదపు చేసారో పెట్టబడిపెట్టారో చెప్పండి" అంటుంది. ఆమె భర్త జవాబు ఇస్తాడు " మన పాలుపోసే అతను మనకి ముప్పై అయిదువేలు బాకీ ఉన్నాడు"

ఆమె ఇలా అడుగుతుంది "ఇంకా ఎవరు ఇవ్వాలి"

మీడియం ఇలా చెబుతుంది. "నేను రెండు లక్షలు మన బ్యాంక్‌లో డిపాజిట్ చేసాను దానిని తీసుకో మన ప్రక్క ఇంటి వాళ్ళు మనకి లక్షరూపాయలు ఇవ్వాలి. అది వాళ్ళ దగ్గర నుంచి తీసుకో.

ఇలా చాలా చెబుతుంటాడు. ఆమె సంతోషంగా వింటుంది. ఆకస్మాత్‌గా భర్త ఇలా అంటాడు. "లక్ష్మీ, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను నా స్నేహితుడికి పది లక్షలు ఇవ్వాలి. అతనికి అవి తిరిగి ఇచ్చేసేయి"

అకస్నాత్‌గా భార్య మీడియంతో ఇలా అంటుంది " ఈ గొంతు నాభర్త గొంతులా అనిపించటం లేదు ఇతను నా భర్త కాదు"

స్పష్టంగా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి. మీకు ఏ పనులకి ఆధారంగా ఉంటూ, సహాయపడుతున్నంతవరకూ ఇటువంటి భావనలన్నీ బాగానే ఉంటాయి. ఆ తరువాతే సమస్య. కాబట్టి ఇలాంటి మీడియం అనే వాటిని నమ్మకండి. మీకున్న సమయాన్ని ఇలాంటి మాటలు మాట్లాడుతూ వృధా చేయకండి. చనిపోయిన వారితో మాట్లాడుతూ మీ సమయాన్ని వృధా చేయకండి.

మనం మనచుట్టూ జీవించి ఉన్న వారితో మాట్లాడటానికే కుదరదు. సమయం సరిపోదు. అటువంటప్పుడు చనిపోయిన వారితో మాట్లాడి సమయం ఎందుకు వృధా చేసుకుంటారు. ముందుగా మనం మన వ్యవహారాలతో సంబంధం ఉన్న వ్యక్తులతో మన జీవితాలతో సంబంధాలు పెంచుకున్న వ్యక్తులతో మాట్లాడదాము. ముందుగా వారితో పనిచేద్దాము. ఎందుకు అనవసరమయిన విషయాలతో సమయం వృధా చేస్తారు.

ఇటువంటి భయంకరమయినవి జరగకుండా చూదండి. మీ చేతన స్థితిలోనికి మిమ్ములని బాధపెట్టే విషయాలు వెళ్ళనీయకండి. అప్పుడు మీ మేధస్సు భగవంతునిలో నిమగ్నమవుతుంది. మీ లోపలికి వెళ్ళే మీ ఆలోచనలు మీలో చాలా ముఖ్య పాత్రని పోషించుతాయి. ఈ విషయాన్నే శ్రీ కృష్ణుడు మాట్లాడతాడు. ఈ విధంగా చెబుతాడు " మీ మేధస్సుని నాలో నిలపండి. " అర్ధం చేసుకోవటానికి

భగవద్గిత - అధ్యాయం 12

్రపేమే మీ జీవితం ఎన్నిఎస్

ప్రయత్నించండి మీరు లోపలికి తీసుకునేది ఏదయినా అది మీ ఆహారం కానీ, ఏదయినా కానీ మీ మైండ్‌ని అక్కడ స్థిరపరచాలి. అందుకే మీరు లోపలికి తీసుకునే ఆహారం స్వచ్ఛంగా ఉండాలి. మీలో ఆహారశుద్ధి జరగాలి. అప్పుడు అప్రంగానే మీ సచేతన స్థితి భగవంతునిలో స్థిరపడుతుంది.

మీరు మళ్ళీ మళ్ళీ పదే పదే ఈ భావాలని బాగా గ్రహించండి. ఈ భావాలని మీలోపలికి చొచ్చుకుపోనీయండి. అంతేకాని మీకు మానసిక వ్యధ కలిగించేవి, మిమ్మలని కుంగదీసే ఆలోచనలని, భావాలని లోనికి రానీయకుండి. ఉదాహరణకి గత పదకొండు రోజులుగా మీరు ఈ భావాలని వింటున్నారు.ఇప్పుడు మీకు ఏదయినా సమస్య వచ్చిందనుకోండి. మీరు వెంటనే గురుదేవులు ఈవిధంగా చెప్పారు అని గుర్తు తెచ్చుకుంటారు. మీరు ఇలా చెబుతారు "నేను ఈ ఐడియాని విన్నాను. నేను దీనిని ఇప్పుడు అర్ధం చేసుకోవాలి". అనుకోకుండా అప్రయత్నంగా ఇది మీలో జరగటం ప్రారంభమవుతుంది.

ఇది గనుక బయటకి రావటం మొదలుపెడితే, మీరు నేను చెప్పిన విషయాలు విన్నట్లే. అలా కాకుండా ఉంటే దాని అర్ధం మీరు నిశ్శబ్దశ్రోత అని.

నిశ్శబ్దశ్రోత అంటే ఇక్కడ ఉండి మరేదో విషయం గురించి సీరియస్‌గా ఆలోచించే వాళ్ళు. మీరు నిశ్శబ్దశ్రోతనా లేక నిజంగా ఈ ప్రవచనాలని విన్నారా అనే విషయం తెలియాలి అంటే, మీ లోనికి నామాటలు ఎన్నిసార్లు మీ నేపధ్యంలో వినిపిస్తాయో అదే మీరు విన్నారా లేదు అనే విషయం కొలవగలిగే స్కేలు.

నేను ఎప్పుడూ చెబుతుంటాను, మీరు వినే మాటలు ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి దగ్గర నుంచి వస్తుంటే అవి మీలోనికి చొచ్చుకుపోతాయి. అప్పుడు అవి మీకు సహాయం కావాలి అనుకున్నప్పుడు అప్రయత్నంగానే మీ మైండ్‌లోనికి వస్తాయి.

కొంతమంది నన్ను అడుగుతుంటారు "స్వామీజీ ఇన్ని విషయాలని మేము ఎలా గుర్తుపెట్టుకోగలం, వాటిని ఎలా సాధన చేయగలం"అని నేను మీకు చెబుతున్నాను. ఈ విషయం గురించి మీరు అసలు పట్టించుకోవద్దు. కేవలం వినండి, అది చాలు. నేను ఈ మాటలని, మీకు నా అనుభవంతో చెబుతున్నాను. అవి సహాజంగానే మీ అంతరంగంలోనికి, మీ ఉనికిలోనికి చొచ్చుకుని పోతాయి.

మీకు అవసరం కలిగినప్పుడు మీరు వీటిని గుర్తుపెట్టుకోనవసరం లేదు. ఆ మాటలే మిమ్మలని గుర్తుపెట్టుకుంటాయి. మీరు గుర్తించుకోవాలి అని అనుకోవద్ద. అవే మిమ్మలని గుర్తుంచుకుంటాయి. మీకు ఎప్పుడు అవసరమయితే అప్పుడు అవే మీ దగ్గరకి వస్తాయి. అవి మీ చేతనస్థితిలో స్థిరపడతాయి, అవసరమయినప్పుడు పైకి వస్తాయి. అవి మీకు మార్గాన్ని చూపించుతాయి. కాబట్టి మీరు ఏమీ చేయనవసరం లేదు. కేవలం వినండి. మీ అంతరంగం నుంచి, మీ ఉనికి నుంచి వినండి. ఈ మాటలని పదే పదే వినండి. అప్పుడు సహజంగానే మీ చేతనస్థితి భగవంతునిలో స్థిర పడిపోతుంది.

శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు : మీ మనస్సుని (మైండ్) పూర్తిగా నాలో నిమగ్నం చేయండి. మీ పూర్తి ఏకాగ్రతని నా మీద చూపండి. ఎటువంటి సందేహం లేకుండా మీరు THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్థితికి చేరతారు అని.

అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్తిరమ్ అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనుంజయ (12:9) అభ్యాసే ప్యసమర్ధో సి మత్కర్మపరమో భవ మదర్థ మపి కర్మాణి కుర్వన్ సిద్ధిమ వాప్స్యసి (12:10)

అర్ధం : ధనుంజయా = అర్జునా : అధ = ఇక (అయితే) : చిత్తం = మనస్సును : సమాధాతుం = నిలుపుటకు : న=లేదు : శక్నోషి = శక్తుడువు (చేయగలవాడవు) మయి = నాయందు : స్తిరమ్ = స్తిరముగా : అభ్యాసయోగేన = యోగ సాధనలో : తతః = అప్పుడు : మామ్ = నన్ను : ఆప్తుమ్ = పొందుటకు : ఇచ్చ = కోరుము

అభ్యాసే = చేయుటయందు : అసమర్ధ : అసి = సమర్ధత లేనివాడైన చో : మత్కర్మ = నాపని : పరమః = ఆసక్తి కలవాడవై , ఆధీనుడవై : భవ = అగుము : మత్ అర్ధం = నా కొరకు : అపి = అయినా : కర్మాణి = పనులు : సిద్దమ్ = చక్కగా : అవాప్యపి = పొందగలవు.

ఓ అర్జునా! ఒక వేళ ఆ ప్రకారం మనస్సుని నాయందు స్తిరముగా నిలుపుటకు నీకు శక్తి లేనిచో యోగమును క్రమం తప్పకుండా సాధన చేసి నన్ను పొందుటకు ప్రయత్నించుము. ఒక వేళ అభ్యాసము చేయుట యందును నీకు శక్తి లేకపోయినచో నాకు సంబంధంమైన పనులు చేయుట యందు ఆసక్తి కలవాడివై వాటిని నా ఆధీనము చేయి. ఆవిధంగా నీవు సిద్ధిని సాధించగలవు.

శ్రీకృష్ణుడు ఇక్కడ అభ్యాసయోగము గురించి మాట్లాడతాడు. అభ్యాస యోగము అంటే ఏమిటి?

అభ్యాస యోగము అంటే యోగా పద్ధతులని సాధన చేయటమే. ఇది మైండ్‌ని నిరంతరం భగవంతునిలో నిమగ్నమయిన స్థితిని సాధన చేయటమే. ఇది శ్రీకృష్ణుని సచేతన స్థితిలో పూర్తిగా నిమగ్నమయిపోవటం.

ఎందుకు శ్రీకృష్ణుడు అభ్యాసయోగం గురించి మాట్లాతాడు? ఎందుకంటే విశ్వదర్శనమప్పుడు శ్రీకృష్ణుడు విశ్వచేతన స్థితి యొక్క దర్శనాన్ని కొద్ది క్షణాలు అర్జునునికి ఇచ్చాడు. కానీ అక్కడ అర్జునుడు శాశ్వతంగా ఉండలేకపోయాడు. పాత సంస్కారాల మూలంగా ఉండే భయంతో పాత జ్ఞాపకాల, కోరికల వలన అతను భయపడతాడు. అర్జునుడు మామూలు స్థితికి వచ్చేస్తాడు. అప్పుడు అతను సచేతన స్థితి నుంచి జారిపోతాడు. అందుకోసం కృష్ణుడు ఇప్పుడు అభ్యాసయోగం గురించి మాట్లాడతాడు. అటువంటి సచేతనస్థితిలో తమని తాము ఎలా స్థిరపరచుకోవాలో చెబుతాడు. అందుకే భగవానుడు సాధన గురించి మాట్లాడతాడు.

ఓ!అర్జునా! నీవు నీ మనస్సుని భక్తితో నామీద స్థిరపరచలేనప్పుడు మామూలుగా ఉండే భక్తి సూతాలని పాటించు. ఈ విధంగా చేయటం వలన, ఇటువంటి అభ్యాసంతో సాధనతో నీవు నాలో నిమగ్నమవ్వగలవు.

ఇక్కడ శ్రీకృష్ణుడు మన జీవితానికి భరోసా ఇవ్వటానికి చాలా చక్కని దృఢమయిన దారి ఏర్పరచుతాడు. దీనితో మనం ఆయన చేతనస్థితిలో స్థిరపడగలుగుతాము. మనం మన సాధారణ జీవితంలో నిరంతరం, పదే పదే ఈ భావాలని ఈ ఐడియాలని లోపలకి తీసుకుందాము. ఆ భావాలని మన చేతనస్థితిలో కలసి పోయేటట్లుగా చేద్దాము. మనలోని అంతరంగపు ప్రదేశమంతా ఈభావాలతో నింపుదాము. ఈ విషయంలో మనం కొన్ని క్షణాల సమయాన్ని కూడా వృధా

ప్రేమే మీ జీవితం

చేయవద్దు. మన అంతరంగం మొత్తం ఈ అద్భుతమయిన ఆలోచనలతో నింపుతాము. ఆ విధంగా మనం మన చేతన స్థితిలో స్థిరపడగలము.

శ్రీకృష్ణుడు వెదజల్లి వ్యాపింపచేయటానికి చాలా చిట్కాలు చెబుతాడు. శ్రీకృష్ణుడు తరువాత నాలుగు శ్లోకాలలో మనకి సూచనలని ఇవ్వటం మొదలుపెడతాడు. ఆయన మనకి చాలా ప్రత్యామ్నాయాలు ఇస్తాడు. అన్ని కూడా ఒక దశ తరువాత ఒకటి, ఒక క్రమపద్ధతిలో ఇస్తాడు. భగవానుడు ఇలా చెబుతాడు. మీరు ఇలా చేయలేకపోతే ఆవిధంగా చేయండి. మీరు ఆవిధంగా చేయలేకపోతే అప్పుడు ఇది చేయండి. లేదా ఇంకొకటి ఈవిధంగా శ్రీకృష్ణుడు మనకి చాలా ప్రత్యామ్నాయాలు ఇస్తాడు. అలాగే చాలా సూచనలని ఇస్తాడు.

ఆయన ముందుగా ఇలా చెబుతాడు :

ఓ! ధనంజయా నీ మనస్సుని నాయందు లగ్నం చేయి. క్రమం తప్పకుండా సాధన చేస్తూ, నన్ను పొందటానికి ప్రయత్నించు. అలా నీవు చేయలేనప్పుడు, నా కోసం కొన్ని పనులు చేయి.

రామకృష్ణ పరమహంస దగ్గరకి ఒకామె వచ్చి ఎంత ప్రయత్నం చేసినా తాను కాళీమాత మీద మనస్సు నిమగ్నం చేయలేకపోతున్నాను అని అంటుంది. అలా చేయమని రామకృష్ణ ఆమెకి చెబుతాడు. ఆమె ఆయన సలహాని అనుసరించి ఎన్నో సార్లు ఎంతగానో ప్రయత్నించింది. కానీ ప్రతిసారి ఆమె నిశ్చలత సడలిపోయేది. ఆమె రామకృష్ణ దగ్గరికి చాలా నిరుత్సాహంతో, ఇక ఆధ్యాత్మిక ప్రగతి సాధించలేననే నిరాశతో వచ్చింది.

రామకృష్ణ ఆమెని ఆమె ఏకాగ్రత మరొక దాని మీదకి ఏమైనా మళ్ళిందేమో అని విచారణ చేస్తాడు. ఆమె తన చిన్న మేనల్లుడి గురించే ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఆమెకి ఆ బాబు అంటే చాలా ఇష్టం. అప్పుడు రామకృష్ణ ఆమెని ఆ బాబు మీద ఏకాగ్రత నిలపమని, అతనిపైనే ధ్యానం చేయమని చెబుతాడు.

ఆమె కొన్ని వారాలయిన తరువాత రామకృష్ణ దగ్గరికి వస్తుంది. ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె తాను చాలా ఇష్టపడే ఆ చిన్న బాబు మీద ధ్యానం చేయటం మొదలుపెడుతుంది. అప్పుడు ఆమె బాగా ధ్యానం చేయగలుగుతుంది. ఒక్కసారి ఆమె ధ్యానం చేయగలను అనుకున్న తరువాత ఆమె ఏకాగ్రతని కాళీ మాతపైన పెట్టగలుగుతుంది. ఇప్పుడు కాళీమాత మీద ఆమె ధ్యానం చేయగలుగుతుంది.

మన మెండ్ మంచి శిక్షణని ఇవ్వగలము. అయితే ఇక్కడ ముఖ్యమయిన విషయం ఏకాగ్రతని నిలపగలగటం. ఒక్కసారి మనం మన ఏకాగ్రతని ఏదో ఒకదానిమీద పూర్తిగా నిలపగలిగితే, అప్పుడు మైండ్‌ని ఒకే ఒక పాయింట్ మీద ఉంచవచ్చు. దానిని ఒక లేజర్ కిరణంలా ఉపయోగించవచ్చు. లేజర్ కిరణాన్ని ఒక దాని నుంచి మరొకదాని మీదకి చాలా సులభంగా ఒకే పద్ధతిలో చాలా చక్కగా విజయవంతంగా మార్చవచ్చు.

వివేకానందుడు ఈ విధంగా చెబుతాడు. "ఒక్కసారి మీరు మీ పూర్తి ఏకాగ్రతని నిలిపి గుప్పెడు మట్టి గురించి తెలుసుకోగలిగితే, అప్పుడు మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్న మట్టి గురించైనా తెలుసుకోగలుగుతారు".

ఏదైనా ఒకపనిలో ఒకటి సాధించాలి అని అనుకుంటే దానికి క్రమశిక్షణ, సాధన అవసరం. మనం మన ప్రతి లక్ష్యానికి, మన ప్రాపంచిక లక్ష్యాల కోసం ఇదే పద్ధతిని అనుసరించగలిగితే మనం మన ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం కష్టాలు బాధలు అనుభవిస్తాము. మనం ఏమనుకుంటామంటే ఆధ్యాత్మిక అనుభవం దానంతట అదే వస్తుందని అనుకుంటాము. ఇప్పుడు మీరు భగవంతుని మాటలు విన్నారు కదా! అది అలా జరగదు అని.

శ్రీకృష్ణుడు ఈ సందర్భంగా ఏమని చెబుతాడంటే, నిరంతరం క్రమం తప్పకుండా ధ్యానం చేయటం ద్వారా మైండ్‌ని నియంత్రించవచ్చు. ధ్యానం యోగాలో ఒక సాధన పద్ధతి. ధ్యానం అంటే ప్రతిరోజు కళ్ళుమూసుకొని అరగంట సేపు కూర్చోవటం కాదు. ఇలా ప్రతిరోజు కానీ, లేదా మనకి టైమ్ దొరికినపుడు కానీ చేయటం కాదు. ధ్యానం అంటే పూర్తిగా భగవంతుని మీద స్థిర భావంతో నిరంతరం ధ్యానం చేయాలి. ధ్యానమే జీవితం కావాలి.

శ్రీకృష్ణుడు ధ్యానాన్ని మనకి ఒక మార్గంలా చెప్పాడు. మనం మన మనస్సుని అతనిపైన (భగవంతుని) ప్రేమతో భక్తితో హృదయపూర్యకంగా నిలపలేకపోయినప్పుడు ధ్యానం అనేది ఒక ప్రత్యామ్నాయ పద్దతిగా మనం ఎంచుకోవాలి. ఆయన ఏమని చెబుతాడంటే మీ మనస్సుని నాపై స్థిరపరచలేకపోతే, దీనిని ప్రయత్నించండి. ధ్యానం ద్వారా నాలో కలసిపోవటానికి పదే ప్రయత్నించండి.

ఈ రెండు పద్ధతులూ కూడా సాధ్యం కాకపోతే, భగవానుడు మనకి మరొక పద్ధతిని చెబుతాడు. నీవు ఏది చేయగలిగితే అది చేయి. నీవు చేయవలసిన పనులు, నీవు చేయగలిగిన పనులు నీవు చేయి. అయితే నీవు చేసే పనులన్నీ నా ఆధీనం చేయి. నీవు ఏం చేసావో, ఏమి చేస్తున్నావో నాకోసం చేయి.

మనం పూర్తి విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో ఆయనకి సంపూర్తిగా లోతుగా ఆధీనమయిపోయిన భావంతో పనులు చేస్తే, మనం ఆయనని చేరగలం.

శ్రీకృష్ణుడు ఇలా చెప్పటంలో రెండు విషయాలు ఇందులో ఉన్నాయి. మొదటిది ఏమిచేసినా అది ఆయనకి ఆధీనులమయ్యే ధృక్పధంతో చేయాలి. మనం చేసే అన్ని పనుల ఫలితాలు ఆయనకే చెందుతాయి. మన బాధ్యత కేవలం చేయటం. చేసే పనిని బాగా చేయటం మన భాద్యత. మనకి ఉన్న హక్కు కేవలం పనిచేయటమే

కానీ దానికి మనం సొంతదారులం కాదు. భగవంతుడే అన్నింటికి అధికారి, సొంతదారుడు. మన చేసే ప్రతి పనికి వచ్చే ఫలితాలకి కూడా ఆయనే అధికారి. ఆయన ప్రేమ మీద మనం చేసేవన్నీ ఆయన సొంతం.

ఎప్పుడయితే మనం ఇలా చేయటం నేర్చుకుంటామో, మనం అప్రయత్నంగా ఫలితాల మీద ఆశపెట్టుకోవటం మాని వాటితో ఎటువంటి సంబంధం లేకుండా ఉండగలం. ఏమి జరుగుతున్నది అనేది ఆయన చేతులలో ఉంటుంది. మన చేతులలో ఉండదు. అటువంటప్పుడు మనం వెళ్ళవలసిన మార్గం మీద ఏకాగ్రతని నిలుపుతాము అంతేకాని గమ్యం మీద కాని, మన లక్ష్యాల మీద కాదు. మనం పని చేసే పద్ధతి మీద మన దృష్టిని పెదతాము. అంతేకాని చివర వచ్చే ఫలితం మీద కాదు. ఇలా చేయగలగినప్పుడు మనం ఇంకా బాగా చేయగలుగుతాము. ఎందుకంటే ఎలా జరుగుతుందో ఏమవుతుందో అనే వత్తిడి మన మీద ఉండదు. చివరికి ఫలితం ఎలా ఉంటుందో అనే భయం ఉండదు. దాంతో మనం బాధపడదం మానేస్తాము. ఎందుకంటే దాని ఫలితం చాలా జాగ్రత్తగా ఆయన రక్షణలో ఆయన చేతిలో ఉన్నది. ఏమి జరిగితే అదే అందరికీ మంచిది. మనం తెలుసుకునే తత్వంతో ఏమార్గాన్ని నిర్ణయించుకున్నా ఏ గమ్యాన్ని మనం చేరినా, అది సరియైన గమ్యమే.

తమిళంలో పెరియపురాణం అరవైమూడు మంది గొప్ప యోగులు జీవితాలగురించి వివరంగా చెప్పబడి ఉంటుంది. వీరంతా జ్ఞానోదయం పొందిన జ్ఞానులు. మనం వారి జీవితాల గురించి చదివితే వాళ్ళు జీవితంలో ఏమిచేయలేదు అని అనిపిస్తుంది. వారు దైనందిన కార్యక్రమాలు మనలా మామూలుగానే చేసేవారు, కాకపోతే భగవంతుణ్ణి అత్యధికమయిన చేతనస్థితిలో వారికి తెలిసే స్థితిలో పూజించేవారు.

వాళ్ళు పూజకి పూలు కోసటప్పుడు కేవలం భక్తి అనే ఒక దృష్టితో కోసే వారు,

మరింకే ఆలోచనా ఉండేవి కావు. వాళ్ళు ప్రార్ధన చేసినా పాటలు పాడినా వారి మనస్సు, హృదయం వారి అంతరంగం అన్నీ పూర్తిగా వారు అనుభవిస్తున్న ఆనందంలో కలసిపోయేవి. వాళ్ళు అంతరంగంలో రూపంలేని భగవంతుని రూపాన్ని చూడగలిగే వారు. రాతివిగ్రహాలు,పంచ లోహ విగ్రహాలు వారితో మాట్లాడేవి. అది వారిలో ఉండే చేతనస్థితి.

మనం పూజలు, ప్రార్ధనలు చేసే సమయంలో ఏమవుతుంది? మన పూజ మొత్తం యాంత్రికంగా తయారవుతుంది. ఈ మహారుషుల విషయంలో వారుచేసే పని ప్రార్ధన, పూజ అయ్యేవి. పూజులు, వ్రతాలు చేసే వారిని గమనించండి. త్వరగా పూర్తి చేసేయాలి అనే ఆత్రుత కనిపిస్తుంది. తొందరగా పూర్తి చేసి వెళ్ళాలి అని ఉంటుంది. వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి? భగవంతునికి దూరంగా ఎక్కడకి వెళ్ళగలుగుతారు.

ఇటువంటి పూజల దగ్గర మనకి మోసగాళ్ళు, కపటమయినవారు కనిపిస్తుంటారు. వాళ్ళ దృష్టిలో పూజలు, ప్రార్ధనలు అనేవి వ్యాపార వ్యవహారాలు. భగవంతుడు అంటే అమ్మకానికి పెట్టిన వస్తువు. వాళ్ళు వ్యాపారవేత్తలు. వాళ్ళ దృష్టి అంతా హుండీలో ఎంత డబ్బులు వచ్చాయి అనే విషయం మీదే ఉంటుంది. స్వర్గం అనే మహా సామ్రాజ్యం, ఆర్ధికస్థితి వ్యాపారం, మొదటి తరగతి రేట్లుతో వస్తుంది అని అనుకుంటారు. మీరు జాగ్రత్తగా ప్రయత్నించితే స్వర్గానికి వెళ్ళటానికి ఉండే రేటులో డిస్కౌంట్ కూడా దొరుకుతుంది.

బాలీ ద్వీపంలో ప్రజలు హిందూ మతాన్ని అనుసరించుతారు. వాళ్ళకి కులవ్యవస్థ కూడా ఉన్నది. అయితే పూజారి మాత్రం జన్మతః బ్రాహ్మణ కులంలో జన్మించటం వలన పూజారి అవ్వదు. పూజారి అవ్వాలంటే దానికి తగిన యోగ్యతని పొందాలి. ఆ ద్వీపంలో ప్రజలకి భగవంతుని ఆరాధించటమే జీవితం. ప్రతి ఒక్కరూ, స్త్రీ, పురుష బేధం లేకుండా అందరూ ఇళ్ళలో పూజలు చేస్తారు. అలాగే బయట గుడికి వెళ్ళి అక్కడా పూజలు చేస్తారు. వాళ్ళు దేవుడికి పూలు, ఏదైనా నైవేద్యం సమర్పించుకుంటారు. మతము, ఆధ్యాత్మికత అనేవి వారి జీవితంలో ఒక భాగంలా ఉంటుంది.

ఎప్పుడయితే ఆరాధన మన జీవితమయితే, ఆధ్యాత్మికత అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగమయిపోతే, అప్పుడు భగవంతునికి ఆధీనమయిపోవటం అనేది మన ధృక్పధం అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏమి జరిగినా అది మనమంచికే అని అనుకుంటారు. అందరికీ మంచి జరిగేది ఏదయినా అది ప్రతి ఒక్క వ్యక్తికీమంచే అవుతుంది. అది మన ప్రక్కింటిలోవారికి కూడా. మనకి ఉన్నవన్నీ ఉన్నాయి అనే విషయం అసలు పట్టించుకోము. నిజానికి ప్రక్కింటివారికి అన్నీ ఉన్నాయని సంతోషపడతాము.

మనం ఆశించటం మానేస్తాము. ఆశించటం అంటే మనం ఏది పొందాలి అని ఆశపడుతున్నామో అది. ఆధీనమవటం అనేది జరిగినప్పుడు ఇక ఇది పొందాలి అనే దానికి మనం ఎంచుకున్న మార్గం ఎటు తీసుకువెళితే అదే సరియైన గమ్యం. ఎప్పుడయితే మనదృష్టి గమ్యం మీద ఉంచకుండా, మనమార్గం మీద ఉంటుందో, ఆశించటాలు, ఆశపడటం అనేవి పూర్తిగా మన నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమి జరిగినా అది మంచిదే అవుతుంది.

దేనినీ ఆశించకపోవటం, దేనితో సంబంధం పెంచుకోకుండా ఉండగలగటం అనేదే కర్మయోగానికి ప్రమాణము, ఒక గుర్తు. అతనే తన ప్రతి చర్యని భగవంతునికి అర్పిస్తాడు.

శ్రీకృష్ణుడు చెప్పినదానిలో మరొక విషయం కూడా ఉన్నది. ఆయన మనని తన సేవ చేయమన్నాడు. ఆయన మనందరినీ తన లక్ష్యం వైపుగా పనిచేయమన్నాడు. ఆయన ఈ విధంగా చెబుతాడు " మీరు చేసే ప్రతి పనీ నా తరువున చేయండి. అప్పుడు మీరు నన్ను పొందుతారు".

నేను ఎప్పుడూ చెబుతుంటాను. నేను మీతో భౌతికంగా ఉన్ననా లేదా అని ఆలోచించకండి. మీరు నా సమక్షంలో లేము అని బాధపడకండి. నేను మిమ్ములని వదిలి వేరొక చోటికి వెళ్ళేటప్పుడు కలత పడకండి. దుఃఖపడకండి. మీరు నావెంట పడితే మీరు నాతో ఎప్పుడూ ఉండలేదు.

మీరు నా లక్ష్యం వైపు పనిచేయండి. నా మిషన్ కోసం పనిచేయండి. మీరు ఏవిధంగా చేయగలిగితే ఆవిధమయిన పనులు అందరి మంచి కోసం చేయండి.నా తరుపున పనిచేయండి. అప్పుడు మీరు నాకోసం రానవసరం లేదు. నేనే మీ కోసం మీ వెంట వస్తాను. నేను నిరంతరం మీతోనే ఉంటాను.

భగవంతుని లక్ష్యసాధనకోసం పనిచేయండి. మీరు తప్పకుండా భగవంతుని చేరగలుగుతారు.

2

అథైతదప్యశక్తో సి కర్తుం మద్యోగ మాశితః సర్వ కర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. (12:11)

అర్ధం : అథ = ఇక : ఏతత్ అపి = దీనిని కూడా : ఆశక్తః : అసి = చేయిలేకపోలేవు : కర్తుం = ఆచరించుటకు : మత్ యోగం = నాగురించి, నా సంయోగం గురించి : ఆశ్రితః = ఆశ్రయించిన వాడవై : సర్వ కర్మా = అన్ని పనుల యొక్క : ఫల్ = ఫలితాలను : త్యాగమ్ = విడిచిపెట్టము : తతః = తరువాత : కురు = చేయి : యతాత్మవాన్ = మనస్సుని నియంత్రించగలవాడవై .

నీవు ఈ విధంగా కూడా చేయలేకపోతే నీ పనులని, నిన్ను నాకు ఆధీనము చేయి. ఫలితాలను నాకు వదిలివేయి. అన్నీ ఎటువంటి అహంకారం లేకుండా, నీమనస్సుని నియంత్రిస్తూ నాకు వదిలిపెట్టు.

శ్రీకృష్ణుడు అర్జునుడికి చాలా ప్రత్యామ్నాయాలని ఇస్తాడు. ఒకదాని తరువాత ఒకటి, ఇది కాకపోతే అది, ఇలా ఎన్నో చెబుతాడు. అర్జునుడి ఆధ్యాత్మిక అభివృద్ధి విషయంలో శ్రీకృష్ణుడు చూపించే కరుణ, దయ హద్దులు లేనివి. నీవు ఈ విధంగా చేయలేవా! సరే అయితే ఆవిధంగా చేయి. లేదా కనీసం ఈ పద్ధతిలో చేయి. ఇలా చెబుతూనే ఉంటాడు. చివరి నాలుగు శ్లోకాలలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా ప్రత్నామ్నాయాలు చెబుతూనే ఉంటాడు.

కృష్ణుడు ఇలా మొదలుపెడతాడు. నీ మనస్సుని నా యందు మాత్రమే స్థిరపరచు నాలో జీవించు. ఒక వేళ అర్జునుడు ఈ పని చేయలేకపోతే అనుకొని అర్జునుడికి మరొక పద్దతి చెబుతాడు. నీవు నాయందు నీ ఏకాగ్రతని, నీ మనస్సుని నిలపలేకపోతే, దానిని తిరిగి పదే సాధన చేయి. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా చెబుతాడు. ఒక వేళ నీవు పదే పదే సాధన చేయలేకపోతే ఇది నీకు కష్టం అనిపించితే, అప్పుడు నా మిషన్ పని, నా లక్ష్యసాధనకి కృషి చేయి. నీవు ఏమి చేసినా నా కోసం చేయి.

ఇప్పుడు కృష్ణుడు ఇలా చెబుతాడు. ఒకవేళ ఇది చేయటం కూడా నీకు సాధ్యం కాకపోతే, అంటే నాలక్ష్యసాధనకి పనిచేయలేకపోతే అప్పుడు కనీసం నీ అహంకారాన్ని వదిలి నీవు చేసే పనుల ఫలితాలని నాకు వదిలివేయి.

కృష్ణుడు అర్జునుడికి అతని దృష్టిలో చెప్పే విషయమేమిటి అంటే, కేవలం కృష్ణుని పనుల మాతమే చేయాలి అని. ఇక్కడ శ్రీకృష్ణుడు అనుకునేది ఏమిటంటే, ఏవో కొన్ని పరిస్థితుల మూలంగా అర్జునుడు తన సమయాన్ని మొత్తం కృష్ణుని పనికి కేటాయించలేకపోవచ్చు.

చూడండి, శ్రీకృష్ణుని బోధ ఎంత సమంజసంగా ఉన్నదో కదా! అది ఇప్పటి రోజులకి కూడా చక్కగా సరిపోతుంది. మనలో ఎవరూ కూడా ఖాళీగా కూర్చొని ఎవరో మన సంగతి చూసుకుంటారులే అని అనుకోము. మనందరం ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేటట్లుగా చూసుకుంటాము. మన దైనందిన నిజ జీవితంలో [పతి ఒక్కరు భగవంతుని లక్ష్యసాధనంవైపు మాత్రమే నిరంతరం పని చేయలేరు. వారు కొంత సమయాన్ని నిస్వార్ధపు పనులకి, సంఘ సేవకి, మానవజాతి మొత్తానికి ఉపయోగపడే పనులు అలాగే ఆధ్యాత్మిక సంబంధమయిన పనులు చేయగలుగుతారు. కాకపోతే కొంతమంది [పాపంచిక విషయాలకి సంబంధించి చాలా సమయాన్ని ఏదో [పపంచపు భౌతికమయిన అవసరాలు, లాభాలు కోసం పనిచేయవచ్చు. వసులాభం కోసం మాత్రమే ఒకరితో ఒకరు సంబంధాన్ని ఏర్సరచుకోవచ్చు.

దీని వలన మీరు ఏమీ పొగొట్టుకోరు అని మనకి భగవంతుడు భరోసా ఇస్తాడు.

శ్రీకృష్ణుడు భగవద్గీతలోని అతి ముఖ్యమయిన 'వదిలివేయటం' అనే విషయాన్ని ఇక్కడ [పసావించుతాడు.

భగవంతుడు ఇలా చెబుతాడు. నీవు ఏది చేయాలని అనుకున్నావో, ఏది చేయగలవో దానిని చేయి. ఆ పనులని నాకు అధీనదవయ్యి చేయి. ఆ పనుల ఫలితాలని మాత్రం పూర్తిగా నాకు వదిలివేయి. ఇలా చేసేటప్పుడు నీ మనస్సు మీద, నీ అహంకారం మీద పూర్తి నియంత్రణతో చేయి.

మనం నిరంతరం మనం చేసే పనుల ఫలితాలకు బాధ్యులం అని అనుకుంటాము. మనం చేసే పనులలో విజయం సాధించినా,అపజయం పొందినా మనదే భాధ్యత అని అనుకుంటాము. అలా మనం గర్యంగా అయినా సంతోషంగా అయినా లేదా

బాధపడుతూ అయినా లేదా అపరాధ భావంతో అయినా అనుకుంటాము. మనలో ఉండే అహంకారం మనలని బాధ్యులని చేస్తుంది. మనం మనకి మనం చేసే పసులలోను, వాటి ఫలితాలలో మాత్రమే గుర్తించగలుగుతాము. విజయము, అపజయము అనేవి మన విషయంలో గొప్ప తేదాని చూపించుతాయి. ఎదుటివారు మనని చూసే విధానంలో కూడా ఆమార్పు చాలా తేడాతో ఉంటుంది. దానితో మన సంబంధాల విషయంలో మనకి ప్రాపంచికమయిన కీర్తి [పతిష్ణల విషయంలోనూ ఆ భేదం కనిపిస్తుంది. దానిని మనం అలానే అన్వయించు కుంటాము.

ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు. నేను నీకు చెప్పినవన్నీ చేయలేకపోతే, కనీసం ఇదయినా చేయి. నీ అహంకారాన్ని వదిలివేయి నీవు చేసే పనుల ఫలితాలని వదిలివేయి. వీటనన్నింటినీ నాకు వదిలివేయి.

భగవానుదు మనకి ఇచ్చిన సలహాల ఫలితంగా మనం పొందే స్వేచ్చ నిజమయిన స్వేచ్చ. ఎప్పుడయితే ఈ విషయాన్ని మనం తెలుసుకుంటామో ఇక మనం మన గమ్యానికి అధికారులం కాదు. మనం చేసే పనుల ఫలితాలని నిర్హయించే అధికారులం కాదు. మనం మన భుజాల మీద బరువుని తీసేసిన అనుభూతిని పొందుతాము. ఇప్పుడు మనం చేసే పనుల ఫలితాలకు బాధ్యత తీసుకునేది భగవంతుడే. మనం కేవలం పనులు చేసే వారమే, కాని వాటిపైన అధికారులం కాదు.

మీరు ఈ విషయంలో కొంత అశ్చర్యపోవచ్చు. ఈ ప్రపంచంలో, మనిషిని మనిషే దోచుకునే ప్రపంచంలో, అత్యంత పోటీ ఉండే ఈ పోటీ ప్రపంచంలో (రాట్ రేస్) ఇటువంటి ధృక్సధంతో మనం ఎలా ఉండగలం? అని అనుకోవచ్చు.

గుర్తుంచుకోండి. మీరు ఈ రాట్ రేస్‌లో గెలిచినా మీరు రాట్(ఎలుక) గానే

మిగిలిపోతారు. మన పనులు వాటి ఫలితాలను నిర్ణయించుతాయి అనేది కేవలం మన మనస్సు కల్పించే ఒక (భమ మాత్రమే. అలా అది కొంత వరకూ చేయవచ్చునేమో! మనం చేసే ప్రతీపనీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. వీటి విషయంలో, అవి ఏమి చేస్తున్నాయో అనేదాని మీద మన నియం(తణ చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని సమయాలలో అవి మన నియం(తణలో ఉండవు. మన పనులు ఫలితాలను మనం నిర్ణయించుతాము అనేది కేవలం ఒక కల్పన, ఒక (భమ.

మనం మన తరువాత శ్వాస తీసుకునే వరకూ జీవించి ఉందగలం అని నమ్మకంగా చెప్పలేము. మన జీవితమే మన చేతులలో లేదు. అప్పదు ఏ అహంకారంతో, ఏ గర్వంతో మనం ఈ బయట ప్రపంచపు విషయాలని మనం నియంత్రించగలమనే ఊహ ఎంత గర్వం, అహంకారమో కదా! ఏమయినా మనం ఒక్కసారి ఈ విషయాలన్నీ తెలుసుకోగలిగితే, ఒక్కసారి మనకంటే చాలా గొప్పశక్తి ఇవన్నీ నిర్ణయించుతుంది అని అర్గం చేసుకోగలిగితే అప్పుడ మనం ఆ దివ్యశక్తి యొక్క మేధస్సుని నమ్ముతాము అప్పుడు మనకి చాలా కొత్త అనుభవాలు జరగటం ప్రారంభమవుతుంది.

మనం చేయవలసిన పని ఏమిటంటే ఆ విశ్వశక్తి, ఆ పరాశక్తి, శ్రీకృష్ణుడు, భగవంతుడిని మీ విషయంలో నిర్ణయాలు తీసుకోనీయటమే . మనకి ఏది మంచిదో ఆ నిర్ణయాలు భగవంతుదే చేస్తాడు. మనం చేసే ప్రపతి పని యొక్క ఫలితాన్ని ఆ భగవత్‌శక్తికి వదిలివేయటమే. అప్పుడు ఏమి జరిగినా అది మంచిదే. అది మనకు మంచిది, అలాగే అది అందరికీ మంచిది అవుతుంది.

మన మేధస్సుకి ఇది ఒక కొత్త అనుభవం. ఈపద్ధతి మన తెలివితేటల మైంద్‌కి విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకాలం మనం చదివిన చదువులు, నేర్చుకున్న జ్ఞానం మన పనులకి మనమే బాధ్యులం, వాటి ఫలితాలకి కూడా

Part 2: Love is Your Very Life

భగవద్గీత - అధ్యాయం 12

(పేమే మీ జీవితం

మనమే బాధ్యులం అని నేర్పించినది.

మనం ఈ విశ్వంలో ఉన్నాము. ఆ విశ్వశక్తి మనపై అంతా ఆవరించి ఉన్నది. ఆ శక్తి లేకపోతే మనం శ్వాసించలేము. జీవించలేము. ఆ ప్రాచీన శక్రికి మనం ఆధీనులం కాకుండా మనం ఏమీ సాధించలేము "నాకు ఏది మంచిదో అదే చేయిపభూ"! అని మీ సచేతన స్గితి నుంచి, తెలుసుకొని చూదండి. చివరికి మీకు భౌతికమయిన లాభాలు కలగటమే కాదు,మీకు గొప్ప ఆధ్యాత్మిక స్వేచ్చ మీనుంచి వస్తుంది. నాకు ఆధీసులవ్వండి అని భగవంతుడు చెబుతాడు. నాకు ఆధీనులవ్వండి మీకు స్వేచ్ఛని ఇసాను.

శ్లోకం (Sanskrit Verse)

(శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్యానం విశిష్యతే ధ్యానాత్మర్మ ఫలత్యాగస్యాగా ఛ్చాన్తిరన సరమ్ (12:12)

అర్ధం (Translation)

శ్రేయఃహి = [శేష్లమయినదిగా : జ్ఞానమ్ = జ్ఞానము : అభ్యాసాత్ = అభ్యాసము కంటే : జ్ఞానాత్ = జ్ఞానముకంటే : ధ్యానమ్ = ధ్యానము : విశిష్యతే = ఉన్నతమయినది : ధ్యానాత్ = ధ్యానము కంటే : కర్మ – ఫల–త్యాగః = మనం చేసే పనుల ఫలితాలని విడిచిపెట్టదం : త్యాగాత్: అనంతరం, త్యాగం చేసిన తరువాత : శాన్ిః = శాంతి : భవతి = కలుగుచున్నది

భావము (Meaning)

సాధన (అభ్యాసము) కంటే జ్ఞానము (శేష్టమయినది. జ్ఞానం కంటే ధ్యానం ఉన్నతమయినది. ధ్యానం కంటే చేసిన పనుల ఫలితాలని విడిచిపెట్టగలగటం సర్వోత్మష్టమయినది. అటువంటి కర్శఫల త్యాగంలో శీక్రుముగా (త్వరగా) శాంతిని పొందవచ్చు.

భగవాన్ శ్రీకృష్ణుడు చాలా సూచనలని ఇస్తాడు. ఒకదాని తరువాత ఒకటి ఒక క్ర‌మ ప‌ద్ద‌తిలో మ‌న‌కి చాలా అవ‌కాశాలు ఇసాం‌దు. ఇది కేవ‌లం అర్జునునికి మా‌(త‌మే కాదు, అన్ని రకాల వ్యక్తులకి రకరకాల మనత్పత్వాలకి ఇసాదు.

భగవాన్ రమణమహర్సి జీవితం నుంచి మీకు ఒక కధ చెబుతాను.

ఒక వ్యక్తి భగవానుని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాదు. "భగవాన్ నేను ఏవిధమయిన ఆధ్యాత్మిక పద్ధతిని ఉపయోగించాలి" అని.

దానికి రమణమహర్చి "ఆత్మ విచారణ చేయి. నిన్ను నీవు ఈ విధంగా ప్రత్నించుకో, నేను ఎవరిని?" అని అతనితో చెబుతాడు.

కొన్ని రోజులు గడిచాకా ఆ వ్యక్తి తిరిగి భగవానుని దగ్గరకి వచ్చి "స్వామీ! ఆత్మ విచారణ చాలా కష్టంగా ఉన్నది. నేను కేవలం ధ్యానంచేయగలనా" అని అదుగుతాదు. దానికి భగవానుడు "సరే! ధ్యానం చేయి" అని అంటాడు.

మరొక వారం గడిచాక ఆ వ్యక్తి రమణ మహర్షి దగ్గరకి తిరిగి వచ్చి "ధ్యానం చేయటం కూడా చాలా కష్టంగా ఉన్నది. నేను ఏదయినా జపం చేయవచ్చునా. అంటే ఏవైనా మంతాలని – స్రోక్రాతాలని పదే పదే జపించటం భగవానుడు "సరే! అలాగే చేయి", అని అంటాడు.

మరి కొన్ని రోజులు గడిచాక ఆ వ్యక్తి తిరిగి మహర్చి దగ్గరికి వచ్చి "భగవాన్! జపం చేయటం కూడా కష్టంగా ఉన్నది. నేను ఏదైనా పూజ చేయవచ్చునా! పూజలు అని అంటాడు.

మరలా కొన్ని రోజులు గడిచాక ఆ వ్యక్తి తిరిగివచ్చి "భగవాన్ ! పూజలు చేయటం కష్టంగా ఉన్నది. నేను కేవలం గుడికి వెళ్ళితే సరిపోతుందా" అని అదుగుతాదు. అప్పుడు భగవాన్ ఇలా అంటారు. "సరే! నీకు ఏది చేయాలనిపించితే అది చేయ".

మహా యోగులు, గురుదేవులు ఎవరికీ కూడా ఆధ్మాత్మిక ద్వారాలు మూయరు. అర్ధం చేసుకోండి. వాళ్ళు మనకి చాలా అవకాశాలు ఇస్తారు. ఇక్కడ ఈ నాలుగు శ్లోకాలలో శ్రీకృష్ణుడు అందరికీ ఎన్నో అవకాశాలని ఇచ్చాడు.

ఇదంతా అర్ధం చేసుకోవాలంటే మీరు దేనినైనా అభ్రంయత్నంగా చేయగలగాలి. అ(పయత్నపూర్వకంగానే మీరు ఈ నాలుగు సూచనలని పాటించగలుగుతారు. ఉదాహరణకి మీకు ధ్యానం చేయాలనిపించటం లేదనుకోండి, మీ మూద్ సరిగా లేదనుకోండి అప్పదు ఒక గదిలో తలుపులు వేసుకొని, కళ్ళు మూసుకుని ధ్యానం చేయటానికి బలవంతంగా [పయత్నించవద్దు.

అలా బయటకి వెళ్ళండి లేదా గుడికి వెళ్ళండి, స్వేచ్చగా, విశ్రాంతిగా నడవండి. ఎటయినా తిరగండి. అలా చేయటం వలన మీరు కొంత విరామస్సితిలోనికి వెళతారు.అప్పుడు మీరు ధ్యానంలోనికి వెళ్ళగలుగుతారు. ధ్యానం చేయగలుగుతారు. మీరు అలా కూడా చేయలేకపోతే ఇంకా ఏదైనా చేయండి. ఏదైతే మీకు విరామాన్ని ఇస్తుందో, మీకు హాయిగా అనిపిస్తుందో ఆపని చేయండి. ఆ తరువాత ధ్యానం చేయండి.

ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి దశలవారిగా, ఒకదాని తరువాత ఒక దశగా చాలా సూచనలని ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం అంతిమమయినది,చివరి దశ అయిన విశ్వచేతనస్థితిలో స్గిరపడే దశ. అదే నిత్యానందస్థితి. కానీ మీరు ఏదో ఒకటి చేయలేకపోయాము అని అన్నింటినీ వదిలివేయుకండి. ఏదో ఒకదానిని ప్రారంభించండి.

చాలా మంది ధ్యానం గురించి, ఆత్మసాధన గురించి మాట్లాడటం విన్నాను. వాళ్ళు అన్నీ చాలా కష్టతరమయిన పనులు గురించి మాత్రమే మాట్లాదుతుంటారు. అయితే దానిని నిజంగా చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మాతం, ధ్యానం గురించి ఆలోచించినప్పుడు మాతం వాళ్ళు చేస్తున్న పూజలు మిగతా జపాలు అన్నీ మానేస్తారు. చివరికి వారు ధ్యానం కూడా చేయిలేరు.

వాళ్ళని మీరు'ధ్యానం ఎందుకు చేయటం లేదు' అని అడిగితే, వాళ్ళు ఇలా అంటారు "స్వామీ! ఎందుకంటే నాకు టెం లేదు. నా మనస్సు దేనిమీద ఏకాగ్రగతని నిలుపలేకపోతున్నది. నిశ్శబ్దంగా కూర్చోలేకపోతున్నాను" ముందుగా వాక్ళు ధ్యానం చేసే నెపం మీద చేసే పూజలు అన్నీ మానేసారు. ఆ తరువాత ధ్యానం చేయటాన్ని మానేస్తారు. దీనికి మాత్రం చాలా కారణాలు చెబుతారు. అప్పుడు వాళ్ళకి అదీ వుండదు. ఇదీ ఉందదు. శ్రీకృష్ణదు అది మనకి జరగకుండా చూస్తున్నాదు. అందుకు మీరు అభ్రుయత్నత్వం ఉండాలి. ఆ నిమషంలో ఏది చేయాలో అది మీరు చేయగలగాలి.

నేను ఎప్పుడు అప్రయత్నం అనే మాటని ఉపయోగించినా నాకు సంఘటన గుర్తుకు వస్తుంది. ఇది మా ఊరిలో జరిగిన సంఘటన. మా ఊరు చాలా చిన్నది. ఇప్పుడు జిల్లాకి హెడ్‌క్వార్లరు అయింది. అక్కడ [పతి సంవత్సరం మహాభారత కధని చెప్పేవారు. భరత్ పల్లెటూరులలో [పతి సంవత్సరం మహాభారతం కధని చెబుతారు. అలా చేస్తే సమయానికి వర్వాలు పడతాయి అని వాళ్ళ నమ్మకం. అందుకే మహాభారత కధని చెబుతారు. అలాగే ఉత్తర భారతదేశంలో భాగవతాన్ని చెబుతారు. దక్షిణ భారతదేశంలో రామాయణాన్ని కానీ, మహాభారత కధ కాని చెబుతారు.

మా ఊరిలో సంవత్సరానికి ఒకసారి మహాభారత కధని అరవె రోజులపాటు చెబుతారు పగలు కధ చెబుతారు. రాత్రి పూట చిన్న చిన్న నాటకాలు వేస్తారు. ఆ

ఊరిలో ఓ నలుగురు ఆ నాటకాలని వేస్తారు. ద్రామా కంటే కూడా వాళ్ళు చేసే తప్పులని అందరూ సరదాగా చూసుంటారు.

ఊరిలో అందరూ ఈ సరదాలకోసం, నవ్వుకోవటానికి అక్కడ చేరతారు. అందులో నటించేవాళ్ళకి అన్ని వస్తువులు ఉండవు. సరస్వతి వీణగా ఉపయోగించిన దానినే తరువాత సీన్‌లో హనుమంతుదు గధలా ఉపయోగిస్తాడు. తరువాత సీన్‌లో సరస్వతి దానిని వీణగా ఉపయోగిస్తుంది. ఆ నలుగురే అన్ని పాత్రలు వేసేస్తారు. ఇదంతా చూడటానికి చాలా సరదాగా ఉంటుంది.

నటీనటులని చూస్తే మరింత సరదాగా ఉంటుంది. కృష్ణుని పాత ఓ ఎనభై ఏళ్ళ ముసలాయన వేస్తాడు. అతను కురతో నడుస్తాడు. సరిగ్గా నదవలేదు ఎవరి సహాయంతోనే స్టేజి మీదకి వచ్చి తన డైలాగ్ ఓ! అర్హునా ! లేచి నిలబడు అని చెప్పేటప్పటికి అతనుపడిపోతాదు. ఇలాంటివన్నీ చూదటానికి సరదాగా ఉంటుంది.

నేను (పతి రోజూ రాతిపూట ఈ డ్రామా చూదటానికి వెళ్ళేవాడిని. ఇందులో అన్ని పాతలు మగవాళ్ళు మాత్రమే వేసేవారు. దీనిని చాలా పవిత్రంగా, ఒక పూజలా చేసేవారు. ఇందులో నటించే వారంతా పవిత్ర దారాలని చేతులకి కట్టుకునే వారు. వాళ్ళు పధ్యం మొత్తం చెప్పాలి.

ఒకరోజు [దౌపతి వస్త్రాపహరణం అనే నాటకం వేయాలి. ఇది మహాభారతంలో ఒక ఘట్టం. ఇందులో ద్రైపతి పాత్ర వేసే వ్యక్తి ఏడు చీరలు కట్టుకోవాలి. నాటకంలో దుశ్శాసనుడు ద్రెపతి చీరలు లాగి ఆమెని అవమానించాలని చూస్తాదు. అతను ఒకదాని తరువాత ఒకటి చొప్పన ఆరు చీరలు లాగి ఇక లాగలేక నీర్పంతో పడిపోతాయి. అప్పుదు (దౌపతి కృష్ణా! కృష్ణా! నన్ను రక్షించు అని అరుస్తుంది. అప్పుడు కృష్ణుడు స్టేజి మీదకి రావాలి.

భగవద్గీత - అధ్యాయం 12

ఈ నాటకంలో దుశ్శాసనుదు చీరలు లాగేటప్పుడు వాటిని లెక్కపెట్టటం మరిచిపోయాడు. అతను అరు చీరలు లాగి స్బహ తప్పి పడిపోవాలి. [ద్రెపతి క్బష్టుని రక్షించమంటే కృష్ణుదు వస్తాదు. కానీ చీరలు లెక్కపెట్లడం మర్చిపోయి దుశ్శాసనుడు ఏదవ చీర కూడా లాగేస్తుంటాడు. ద్రాపతి పాత్రదారి అతనికి ఆ విషయం చెప్పటానికి ప్రయత్నిస్తాడు. "ఇది ఏదవ చీర! ఇది ఏడవ చీర' అని సైగ చేస్తుంటాదు, దుశ్శాసనుడికి అది అర్ధం కాదు. అతను ద్రెపతి బాగా నటిస్తుంది అని అనుకుంటాడు. అలా అని చీరలాగుతుంటాడు.

అప్పుడు ఆకస్మాత్‌గా ద్రాపతి దుశ్శాసనుడిని కొడతాడు. 'నా చీర వదుల, నా చీర వదులు " అని [దౌపతి పాత వేసిన వ్యక్తి దుశ్శాాననుడి మీదకి దాడి చేస్తాడు. నాటకం చూస్తున్న మా అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఉదయం చెప్పిన కథ ఒక విధంగా ఉన్నది ఇక్కడ నాటకం మరో విధంగా ఉన్నది. ఆరవ చీర లాగగానే దుశ్శాసనుడు పడిపోతాడు. ద్రాపతి కృష్ణుని పిలుస్తుంది. కృష్ణుదు స్తేజి మీదకి రావాలి.

అక్కడ క్సష్మడు పాత వేసిన వ్యక్తి [దౌపతి పిలుపు కోసం ఎదురు చూస్తూ బీడీ కాలుస్తుంటాడు. అతను స్టేజి వెనుక [పక్క ఉన్నాడు. కానీ [దౌపతి గట్టిగా ఏ! దుశ్శాసనా ఈ చీర తీయకు, అని అరుస్తుంటుంది. దుశ్శాసనుడికి అర్ధం కాదు. ద్రాపతి అతనిని కొదుతుంది. అయినా అర్గం కాదు. అతనికి చాలా కోపం వచ్చి చీర మొత్తం లాగేస్తాడు.

అప్పుడు ద్రాపతి ప్రాతధారి స్టేజిమీద సగం ఆడ సగం మగ వేషంలో ఉంటాడు. పైన జాకీటు, కింద ఫాంటుతో స్టేజి మీద నిలబడతాడు. వెంటనే ద్రాపతి పాత్ర వేసిన వ్యక్తి సమయస్పూర్తితో " హే కృష్ణా! నీవురాలేకపోయినందుకు నన్ను మగవాడిగా మార్చి నా గౌరవాన్ని కాపాదావా!" అని గట్టిగా అంటాడు.

ఈ విధంగా ద్రాపతి దుశ్శాసనుడు, కృష్ణుదు చేసిన తప్పులని కొంత సమయస్సూర్తితో కవర్ చేయగలిగాదు. అయినా కృష్ణుదు ఇంకా స్టేజి మీదకి రాకుండా [దౌపతి పిలుపుకోసం చూసుంటాడు.

మీరు సమయస్సూర్తితో వ్యవహరించగలిగితే మీరు చాలా విషయాలని నియం(తించగలరు. చాలా సంఘటనలతో జాగ్రత్తగా వ్యవహరించగలరు. నాకు సమయస్నూర్తి అనే మాట గుర్తు రాగానే ఈ కథ గుర్తు వస్తుంది.

నిజానికి సమయస్పూర్తి ఒక ఆధ్మాత్మిక లక్షణం. ఎవరైతే తన పాత జ్ఞాపకాలలో చిక్కుకుపోరో అతనే సమయస్సూర్తిగా, అప్రయత్నంగా ఉండగలడు. మీ పాత నిర్ణయాల మీద ఆసక్తి లేకపోతే అంటే మీరు గతంలో చేసిన తప్పులని పూర్తిగా తెలుసుకొని వాటిని ఇప్పుటి కాలానికి అనుగుణంగా సరియైన పద్ధతిలోనికి మార్చుకోగలిగితే, అప్పుద మీరు అప్రయత్నంగా, సమయస్నూర్తితో ఉండగలరు.

అలాకాకుండా మీకు మీ గతం మీద చాలా అభిమానం ఉండి ఉంటే, అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఇలా అనుకోవచ్చు. "అబ్బే! అసలు కుదరదు. నేను ఇన్ని సంవత్సరాలు ఈ విధమయిన నమ్మకంతో ఉన్నాను. నేను ఈ విషయాన్ని ఇంతకాలం ఇలాగే అర్గం చేసుకున్నాను. ఈ రోజు ఏదో చెప్పారు కదా అని నేను ఎందుకు మారాలి. నేను మారను. మారలేను. నేను ఎట్టిపరిస్థితిలో కూడా మారను. గత ఏభై ఏళ్ళగా నేను ఈ నమ్మకం మీదే బతికాను. ఇప్పుదు మారటం నా వల్ల కాదు" అలా అనుకుంటే మీరు ఎప్పటికీ సమయస్సూర్తిగా, అప్రయత్నంగా ఉండలేరు. అప్పుడు మీరు జీవితంలో చాలా పొగొట్లుకుంటారు. చాలా భయంకరంగా జీవితంలో చాలా పొగొట్టుకుంటారు.

స్సష్టంగా అర్గం చేసుకోండి. మీ జీవితం యొక్క నాణ్యతని మీరు ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవచ్చు. ఎంతకాలం మీరు మారే కాలానికి అనుగుణంగా మీ

జీవితాన్ని మెరుగుపరచుకుంటుంటారో అంతకాలం మీరు వివేకంతో ఉన్నట్లే. అలా ఆధునకరించటం ఆపేస్తే దానిని తెలివితేటలు అంటారు. అది వివేకం కాదు. వివేకం జీవంతో ఉన్న శక్తి

సంస్మృతంలో 'ధీ' అనే పదం ఉన్నది. దాని అర్ధం జీవించి ఉన్న అని. సంస్మృతంలో 'ధీ' అంటే వివేకం అని కూడా అర్గం. 'ధీ' అంటే శక్తి : జీవించిఉన్న శక్తి. అది నిరంతరం తనని తాను అభివృద్ధి పరచుకుంటూ ఉంటుంది. గాయత్రిమంత్రం అనేది హిందూ మతంలోని ఆరాధనలో ముఖ్యమయినది. అది భగవంతుని మనం ప్రార్ధన చేసేటప్పుడు మనని అభివృద్ధి చేయమని అడగటం.

ఎప్పుడయితే మీకు మీ గతం మీద ఆసక్తి ఉండదో, మీరు గతంలో చేసిన నిర్ణయాల గురించి ఆలోచించరో అలాగే మీ గత జీవితం ఎలా గడిచిందో అనే విషయాన్ని పట్టించుకోరో, అప్పుడే మీరు సమయస్సూర్తితో అప్రయత్నత్త్వంతో ఉండగలుగుతారు. సమయస్నూర్తి గొప్ప ఆధ్యాత్మిక విలువ కలిగినది.

సమయస్సూర్తి గురించి మీకు మరొక సంఘటనని చెబుతాను.

ఒకసారి, నేను ఈశవాస్య ఉపనిషత్తు మీద మాట్లాదుతున్నాను. అప్పుడు ఒక పెద్దాయన కూడా వచ్చాడు. చూడటానికి పండితుడిలా ఉన్నాదు. ఆయన హాలులోపలికి వచ్చాడు. నేను మాట్లాడటం పూర్తి కాగానే, కనీస మర్యాద అయినా లేకుండా ఏదో అడగటం మొదలుపెట్టాడు. అతను నిలబడి "ఈ తెలివితక్కువ వాళ్ళు ఏమీ చదవలేదు. దాంతో నీవు ఏవి చెబితే అది వింటారు. కానీ నాలాంటి పండితుణ్ణి నీవు చెప్పేది వినేలా చేయలేవు" అని అన్నాడు.

అప్పుడు నేను "సార్! కొంచెం దగ్గరకు రండి. మీరేమంటున్నారో నాకు వినపదటం లేదు " అన్నాడు.

అతను దగ్గరగా వచ్చాడు. తరువాత నేను "దయచేసి ఈ వైపుకి రండి, మీరు ఏమి చెప్పదలచుకున్నారు" అని అన్నాను.

అతను అటువైపు వచ్చాడు.

"అక్కడ టేబుల్ మీకు అద్గంగా ఉన్నది. మీరు కొంచెం ఇటు వైపురండి", అన్నాను. అతను అలాగే దగ్గరకి వచ్చాడు.

అప్పుడు నేను అతనితో ఇలా అన్నాను. "చూడండి! మీరు ఇప్పటికి నేను చెప్పిన దానిని మూడుసార్లు విన్నారు. ఇప్పుడు వెళ్ళి కూర్చొని నేసు చెప్పే విషయాలు వినండి. మీరు చూడటానికి చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు. కూర్చొని వినండి. "

మీరు సమయస్నూర్తి నుంచి తప్పించుకోలేరు. ఆ తరువాత ఇటువంటిదే ఒక సంఘటన ఒక జెన్ కథలో చదివాను. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత నేను ఆ పుస్తకం చదివాను. చాలా ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే ఇదే సంఘటన ఒక జెన్ బౌద్ధ గురువు జీవితంలో కూడా జరిగింది. చరిత్ర తిరిగి వస్తుంది అనే విషయాన్ని నిజంగా తెలుసుకొని ఆశ్చర్యపోయాను సరే! ఈ వ్యక్తి చాలా నిర్వాంతపోయాడు. నిజానికి మీకు సమయస్సూర్తి ఉంటే మిమ్మలని ఏదీ ఆపలేదు. సమయస్సూర్తి ఒక మంచి ఆధ్మాత్మిక లక్షణం.

ఇక్కడ శ్రీకృష్ణుడు మనకి నాలుగు రకాల సూచనలు ఇచ్చారు. మీరు భక్తియోగంలో నిమగ్నమవ్వవచ్చు. లేదా దైనందిన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపవచ్చు. లేదా మీ అన్ని పనుల (కర్శల) ఫలితాలని భగవంతునికి ఆధీనం చేయవచ్చు. లేకపోతే సచేతనస్థితిలో ఉంటూ ఏ పనినైనా చేయవచ్చు. మీకు ఏ పని చేయాలనిపించితే అది చేయవచ్చు. ఆయన ఏమని చెపుతాదంటే, కనీసం ఇది చేయి, లేదా అది చేయి సాధ్యపడకపోతే కనీసం ఇదయినా చేయి, అని అంటాడు.

ఇప్పుడు మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, కింది స్వాయిలో ఆగిపోకూడదు. ఎప్పుడూ ఉన్నతస్థితికి వెళ్ళటానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మీరు ఉన్నతస్థితికి వెళ్ళలేరో, కనీసం తక్కువ స్థాయి లోనైనా ఉండండి. అంతే కానీ ప్రయత్నాలు మాత్రం ఆపకండి. నన్ను ఒకరు ఈ విధంగా అడిగారు "స్వామీజీ, మనకి భరత్ లోనూ, తూర్పు దేశాల మతాలలోను ఎందుకు ఇంతమంది దేవుళ్ళు ఉంటారు"? అని

తూర్పుదేశాల మతాలలో చాలామంది దేవుళ్ళు ఉంటారు. మీరు హిందూ మతం, బౌద్ధమతం లేదా జైనమతం చూడండి. అన్నింటిలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలామంది ఋషులు, యోగులు, గురువులు ఉంటారు. అదే పశ్చిమ దేశాల మతాలలో ఒక్కడే దేవుడు. ఎందుకు?

ఈ సందర్భంగా వివేకానందుడు ఆయన ప్రవచనాలలో చాలా చక్కగా చెప్పారు. "స్వేచ్ఛ అనేది అభివృద్ధికి చాలా అవసరమయిన విషయం. ఇది ఏరంగమయినా సరే. ఎక్కడయినా అభివృద్ధి ఉన్నది అంటే అక్కడ స్వేచ్ఛ ఉన్నది అని అర్ధం.

తూర్పుదేశాల వారికి అంతరంగ ప్రపంచానికి సంబంధించి పూర్తి స్వేచ్ఛ వున్నది. మీ మతాన్ని ఎవరూ భంగపరచరు. ఏ ఆధ్యాత్మిక పద్ధతి అనుసరించాలి అనేది పూర్తిగా మీ నిర్ణయమే. అందుకే మనకి 'ఇష్టదేవత' అనే పద్దతి ఉంటుంది. ఇష్టదేవతా అంటే భగవంతుణ్ణి మీకు ఇష్టమయిన మీ మనస్సుకి సరిపోయే రూపంలో పూజించవచ్చు. కొన్ని పురాణలలో మొత్తం ముప్పయి మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెప్పబడి ఉంటుంది. నిజానికి, నేనేమనుకుంటానంటే బహుశః అప్పటి జనాభా ముప్పె మూడు కోట్లు ఉందవచ్చు. అంత మందికి ఎవరికి ఇష్టమయిన రూపంలో వారు ఆరాధించి ఉందవచ్చు. అదే పురణాలు ఇప్పుడు వ్రాస్తే వారిని ఆరువందల కోట్ల దేవుళ్ళు అని చెప్పేవారేమో, ఎవరికి ఇష్టమయిన

మార్గాన్ని వాళ్ళు ఎంచుకోవచ్చు. ఎవరికి ఇష్టమయిన దేవుడిని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. ఎవరికి వాళ్ళేతానే దేవుడుని అని చెప్పకోవచ్చు. అయితే అలా చెప్పగలిగే వ్యక్తి అందరిలో దైవత్వం చూడగలిగినప్పుడే చెప్పగలుగుతారు.

తూర్పుదేశాల వారికి అంతరంగ ప్రపంచానికి సంబంధించి అంతులేని స్వేచ్ఛ ఉన్నది. అందుకే ఆధ్యాత్మికత ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందినది. అదే పశ్చిమదేశాలలో మీరు మీ సొంత దేవుడిని నిర్ణయించుకునే అధికారం, స్వేచ్ఛ మీకు లేవు. కొన్ని రెడీమేడ్ అయిడియాలని స్పూనుతో తినిపించుతారు. తూర్పుదేశాలలో ఎవరైనా ఎప్పుడైనా తాను యోగినని ప్రకటించవచ్చు. దీనికి మీకు కావలసినది పది రూపాయలు. దాంతో పోస్టరు వేయించుకోవచ్చు. లేదా ఎవరైనా మీకు ఆ పోస్టర్ వేసిపెడతారు. అంతకుమించి మరేది అవసరం లేదు. మిమ్మలని మీరు యోగిగా, గురువుగా ప్రపకటించుకోవచ్చు. ఈ విషయంలో ఎటువంటి సమస్యాలేదు.

కానీ పశ్చిమదేశాలలో మీరు అలా చేయలేరు. మీరు చనిపోయాక, ఏదైన ఒక సంస్థ మీరు గురువు అని యోగి అని ప్రపకటించుతుంది. ఒక సంస్థ మీరు యోగి, గురువు అని ప్రకటించాలి.

ఇక్కడ దృక్పథం పూర్తిగా వేరే విధంగా ఉంటుంది. అయితే రెండింటిలోనూ మంచీ చెడూ రెండూ ఉన్నాయి. అయితే స్వేచ్ఛలో చాలా మంచి విషయాలు జరుగుతాయి. స్వేచ్ఛ వలన అంతరంగపు ప్రపంచం మీద ఎన్నో అద్భుతమయిన పరిశోధనలు జరిగాయి. ఎన్నో పరిశోధనలు జరిగాయో అన్ని సత్యాలు కనుగొనబడ్డాయి. అంతరంగపు ప్రపంచానికి సంబంధించి ఎన్నో విషయాలని వెలుగులోనికి తేగలిగారు. ఎన్నో అద్భుత విషయాలని మానవులకి అందించగలిగారు. ఎందుకంటే అంత ఎక్కువమంది ఈ రంగంలో పరిశోధనలు చేసారు. అయితే అక్కడక్కడా కొందరు మోసగాళ్ళు ఉంటారు. స్పష్టంగా అర్ధం చేసుకోండి. కొన్ని లక్షల మంది

ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు , కొన్ని లక్షల విషయాలు వెల్లడి చేయబడు తున్నప్పుడు, అక్కడక్కడా కొన్ని నల్లటి మచ్చలు ఉంటాయి. మూఢ విశ్వాసాలు ఆధ్యాత్మిక రంగలోనేకాదు శాస్త్ర విజ్ఞానంలో ఇంత కంటే ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికరంగంలో కనీసం స్వార్ధమనేది ఉండదు. వారు ఏదయినా ఒక సత్యాన్ని ప్రకటించారు అంటే అందులో వారికి స్వార్ధపూరిత కోరికలు ఉండవు. ఇలా చేయటం వలన యోగులకి గురువులకి వారి వ్యక్తిగత జీవితాలలో ఎటువంటి లాభమూ ఉండదు. వాళ్ళు ఆ మామూలు భోజనమే చేసారు. మామూలుగా సామాన్యంగా ఉండే ఏవో రెండు ముక్కలుగా ఉండే బట్టలు చుట్టుకుంటారు. వారి జీవితాలలో ఎటువంటి మార్పు ఉండదు.

అయితే శాస్త్రజ్ఞుల విషయంలో, వారు ఏదైనా ఒక సత్యాన్ని ప్రకటిస్తే అది వారికి పేరు ప్రతిష్టలని తెస్తుంది, ధనం ఐశ్వర్యాలనిస్తుంది. వారి జీవితాలలోనికి ఎన్నో సౌకర్యాలు వస్తాయి. కాబట్టి సహజంగానే వారిలో స్వార్థం ఉంటుంది. యోగులు, ఆధ్యాత్మిక గురువులు ఎంత ఎక్కువగా ప్రాపంచిక విషయాలని వదిలివేయగలిగితే,అంత ఎక్కువగా వారు సౌకర్యాలని వదిలివేస్తారు. వారు ఎంత సౌకర్యాలు వదిలివేస్తే,అంత ఎక్కువ గౌరవం పొందుతారు. కాబట్టి సహజంగానే వారు ఎన్ని సత్యాలు చెప్పినా వారి వ్యక్తిగతజీవితంలో పెద్ద మార్పు ఉండదు. వారి పరిశోధనలు వారి జీవితాలకి కొత్తగా ఏమీ సమకూర్చవు. వారు పొందే గౌరవం వారి జీవన పద్ధతుల మీద ఆధారపడి ఉంటుంది. కాని వారు చెప్పే మాటల మీద కాదు.

శాస్త్రజ్ఞుల విషయంలో వారు పొందే గౌరవం వారు చెప్పే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి శాస్త్ర విషయంలో నల్ల మచ్చలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒకరో ఇద్దరో మోసగాళ్ళు ఉన్నంతలో మతపరమయిన స్వేచ్ఛ తప్పు అని అనటం, ఆధ్యాత్మిక స్వేచ్ఛ సరియైన పద్దతి

కాదు అని అనకూడదు. ఇందులో ఎంతోమంచి ఉన్నది.

పశ్చిమదేశాలలో చాలా సమాజపరమయిన స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు వివాహం చేసుకోవచ్చు. మీ ఇల్లు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. చేస్తున్న ఉద్యోగాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మార్చుకోవచ్చు. మీకు ఎటువంటి డ్రస్ కావాలి అంటే అటువంటి డ్రస్ వేసుకోవచ్చు. ఎవరూ పట్టించుకోరు. ఈ రోజుల్లో కూడా భరత్ లో కుటుంబ సాంప్రదాయాలని పాటిస్తూ కుటుంబపరమయిన ఇళ్లలోనే ఉంటారు. కానీ ఇళ్ళు మార్చరు. వాళ్ళు ఉద్యోగాలని మార్చరు. వాళ్ళు జీవన పద్ధతులని మార్చరు. తూర్పుదేశాలలో వారికి సమాజ స్వేచ్ఛ ఉండదు. కానీ అంతులేని ఆధ్యాత్మిక స్వేచ్చ ఉంటుంది. పశ్చిమదేశాలలో సమాజ స్వేచ్ఛ ఉంటుంది. కానీ వారికి ఆధ్యాత్మిక స్వేచ్చ ఉండదు. ఏమయిన అభివృద్ధి సాధించాలి అంటే స్వేచ్ఛ అవసరం.

ఇక్కడ ఈ నాలుగు శ్లోకాలలో, శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక స్వేచ్ఛగురించి చెబుతాడు. ఆయన మనందరికి ఆధ్యాత్మిక స్వేచ్ఛని ఇస్తాడు. భగవానుడు ఈవిధంగా చెబుతారు "ఇక్కడ చాలామార్గాలు ఉన్నాయి. నీ మనస్సుకి నచ్చిన మార్గాన్ని ఎంచుకో. దానిని సాధనచేయి, ఏదో ఒకటి చేయి" అని. ఎందుకు పశ్చిమదేశాలలో ప్రజలు మతపరమయిన ప్రదేశాలకి వెళ్ళరు? నేను ఈ మధ్యనే ఎక్కడో చదివాను, అమెరికాలో కేవలం రెండు శాతం మంది మాత్రమే చర్చికి వెళతారు అని. భరత్ లో డెభై అయిదుశాతం మంది గుడులకి లేదా చర్చి ఇలా ఏవైనా మత సంబంధంమయిన స్థలానికి దర్శించుతారు. అది వారి వీధిలో ఉండే ఒక గుడి కానీ, లేదా దగ్గరలోనిది కాని. ఎలా అయినాసరే డెభై అయిదు శాతం మంది ఆధ్యాత్మిక స్థలాలకి క్రమం తప్పకుండా వెళుతుంటారు.

ఎందుకని ఈ విధంగా పశ్చిమదేశాలలో జరగదు? ఎందుకంటే పశ్చిమదేశాలవారు ఒక ముఖ్య విషయాన్ని మర్చిపోయారు. అది ప్రజలకి నిర్ణయించుకునే అవకాశాన్ని

భగవద్గీత - అధ్యాయం 12

(పేమే మీ జీవితం మూడిసి)

ఇవ్వలేదు. ఒక వేళ ఒక విషయాన్ని వాళ్ళు స్వీకరించితే సరే. లేకపోతే వారు మతాన్ని వదిలేస్తున్నారు. అంతే.

తూర్పు సంస్కృతుల వారికి చాలా అవకాశాలని ఇచ్చారు. ఒక వ్యక్తి మేధస్సు మీద ఏకాగ్రత ఉండి దానిని అభివృద్ధి చేయాలి, అంటే శివుడిని పూజించుతారు. వాళ్ళు నిరంతరం ధ్యానం చేస్తుంటారు. మరొకరు భక్తి మార్గంలో వెళ్ళాలి అని అనుకుంటే విష్ణుమూర్తిని ఆరాధించుతారు. ఈ మార్గంలో వెళ్ళేవారు పాటలు పాడతారు. నాట్యం చేసారు. చైతన్య ప్రభు, మీరాబాయి ఇటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు. భగవంతుని వైభవాన్ని భక్తితత్వంతో అద్భుతంగా పాడతారు. తమిళనాడులోని ఆళ్వార్లు అనే యోగులు విష్ణుభక్తులు. వారు ఈ మార్గాన్ని, ఎంచుకుంటారు. యోగా మార్గాన్ని ఎంచుకున్నవారు దేవిని పూజిస్తారు. ఆమెపై ధ్యానం చేస్తారు. వాళ్ళు పూజలు చేస్తారు. తాంత్రికాన్ని సాధన చేస్తారు.

ఇక్కడ ఈ విధంగా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీకు తిరిగి మళ్ళీ మళ్ళీ ఎన్నో అవకాశాలు ఇవ్వబడ్డాయి. మీకు సంప్రదాయమయిన పద్ధతులు, మార్గాలు ఉన్నాయి. అవి మీ వ్యక్తిగతమైన అభివృద్ధికి సహాయపడతాయి. కాబట్టి సహజంగానే ఒక మార్గాన్ని ఎన్నుకొని అందులో అత్యున్నత స్థాయికి చేరవచ్చు. ఇక్కడ అన్నిరకాల, అన్ని సైజులలో నిచ్చనలు దొరుకుతాయి. అన్ని రకా మెట్లు ఉంటాయి. మీకు నిరంతరం అవకాశాలు ఇవ్వబడతాయి. కాబట్టి సహజంగానే ప్రతి ఒక్కరూ ఏదో ఒకదానిని ఎంచుకుంటారు.

తూర్పుదేశాల వారు ఎంతో అన్వేషణ చేసారు. మన అంతరంగ ప్రపంచం లోతులోనికి అన్వేషణలు చేసి పరిశోధనలు చేసారు. పశ్చిమదేశాలవారు సమాజపరంగా చాలా సాధించారు. ఎందుకంటే వారికి స్వేచ్చ ఉన్నది. భరత్ లో ఆ స్వేచ్ఛ లేకపోవటం వలన చాలా పోరాడవలసి వచ్చింది, కానీ వాళ్ళు చాలా అద్భుతాలని ఆధ్యాత్మిక స్వేచ్చ ద్వారా సాధించగలిగారు.

ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా ఆధ్యాత్మిక అవకాశాలని వివరించుతాడు. ఇది చేయి, లేకపోతే అది చేయి. ఇది కేవలం తూర్పుదేశాలకి చెందిన గురువులకి మాత్రమే సాధ్యం. వారికి మనపైనే ఉండే అంతులేని ప్రేమ, కరుణ, దయ వలన మనకి ఉదారంగా ఎన్నో అవకాశాలని ఇస్తున్నారు. తూర్పుదేశాలలో ఆధ్యాత్మికత ఎంతో కరుణతోనిండి ఉంటుంది. అది మీకు చాలా అవకాశాలని ఇస్తుంది.

పశ్చిమదేశాలలో కొన్ని రంగాలలో మీకు గౌరవం ఇవ్వబదుతుంది. ప్రతి వ్యక్తీ గౌరవింపబడతాడు. ఉదా: కస్టమర్స్‌ని చాలా గౌరవంగా జాగ్రాత్తగా చూసారు. సమాజంలో వారికి చాలా అవకాశాలు ఉంటాయి. కావాలంటే భార్య లేదా భర్తతో ఉండవచ్చు లేదంటే విడిపోవచ్చు. వారికి ఆ స్వేచ్చ ఉన్నది.

కానీ భారతదేశంలో ఆధ్యాత్మిక స్వేచ్చకి చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తారు. ఈ నాలుగు శ్లోకాలలో, సమాజానికి ఆధ్యాత్మిక స్వేచ్చ ఎంత ఇచ్చారో అర్ధమవుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి, అతని ద్వారా అందరికి గొప్ప ఆధ్యాత్మిక స్వేచ్చని ఇస్తాడు.

కుంట్ గ్రామంల్యాసే వ్యసమర్దోసి ...... సిద్ధి మవాప్పుసి ...... (12:10)

నీవు భక్తి యోగాన్ని సాధన చేయలేకపోతే,నాకోసం పనిచేయి, ఎందుకంటే నా కోసం పనిచేస్తే, నీవు సంపూర్ణస్థితిని చేరతావు. సిద్ధిఅవప్యాసి. ఇలా ఒకదాని తరువాత ఒక అవకాశాన్ని వివరించి చివరలో ఇలా చెబుతాడు.

శ్రేయోహిజ్ఞానం ........ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే (12:13)

నీవు ఈ పద్ధతులేవీ పాటించలేకపోతే, నీవు జ్ఞానాన్ని సంపాదించు కోవటంలో నిమగ్నమవ్వు. ఆయన ఈ విధంగా చెబుతాడు. ఈ పరిష్కారాలన్నీ ప్రోగు చేసుకో. జ్ఞానాన్ని సంపాదించుకోవటమంటే జీవితపు చిక్కు సమస్యలకు పరిష్కారాలని

పోగుచేసుకోవటమే. మానసిక వ్యధను ఎలా తగ్గించాలి. ఏవిధంగా ధైర్యంగా ఉండాలి. ఎలా బలంగా ఉండాలి : కోరికలు, భావావేశాలు ఎలా నియంత్రించాలి, ఇవన్నీ జ్ఞానమే. ఈ విధమయిన జ్ఞానాన్ని మీరు తెలుసుకొని మిమ్మలని రక్షించుకోవటానికి ఉపయోగించాలి.

ఉదా: లాస్ యాంజిల్స్‌లో, కాలిఫోర్నియాలో భూకంపం కిట్స్, తుఫాన్ కిట్స్ అని చెబుతుంటారు. వాళ్ళు ఏం చెబుతారంటే అందులో మంచినీళ్ళు సీసాలు, ముఖ్యమయిన వస్తువులని పెట్టమంటారు. వాటిని కార్లలో ఉంచుతారు. వెబ్‌సైటులో ఫైర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చాలా పెద్ద లిస్టునే పెడతారు. అదే భూకంప కిట్టు అంటారు.

పశ్చిమదేశాలలో ప్రజలని ఇటువంటి విపత్తుల నుంచి ఎలా కాపాడుకోవాలో తయారుచేస్తారు. కానీ వారి అంతరంగాలలో వచ్చే భూకంపాలకి మాత్రం వారిని తయారు చేయరు. వారిలో వచ్చే భావావేశాల ఒదుదుడుకులని ఎలా బాలెన్స్ చేయాలో నేర్పించరు. బయట ప్రపంచంలో వచ్చే భూకంపాలని ఎదుర్కొనటానికి ఎలా అయితే అందరినీ తయారు చేస్తారో, ప్రతి ఒక్కరూ మనలోపల వచ్చే భూకంపాలని ఎదుర్కొనటానికి మన భూకంపాల కిట్టుని సిద్ధం చేసుకోవాలి. ఈ భూకంప కిట్టనే నేను జీవిత సమస్యలనకి సరిపడే పరిష్కారాల జ్ఞానం అంటాను.

ఈ జ్ఞానాన్ని మీరు జాగ్రత్తగా పోగుచేసుకోండి. మీ మనస్సులో వ్యధ, కుంగుబాటు అనేవి కలిగినప్పుడు మీరు ఈ కిట్టుతో తయారుగా ఉంటారు. స్పష్టంగా తెలుసుకోండి. మనందరం జీవితంలో ఏదో ఒక సమయంలో మన అంతరంగంలో ఇటువంటి భూకంపాన్ని ఎదుర్కొంటాము. ఆ వ్యక్తి మరణించితే సమస్యలేదు. ఎందుకంటే అప్పుడు భూకంపమనేది ఉండదు. అయితే మనం జీవించి ఉన్నకాలంలో మనం ఎందరివో దగ్గరవారి మరణాలని చూస్తాము, అనారోగ్యాలని చూస్తాము. వీటిని మనం తప్పించలేము.

మనం ఏక్షణాన్ని తప్పించలేము. దానినే మనం అర్ధం చేసుకోవాలి. నేను చెప్పే జ్ఞానం అంటే ఇదే. జీవితంలో తప్పించుకోలేనివాటిని అర్ధం చేసుకోవటం, పరిష్కారాల జ్ఞానాన్ని పోగుచేసుకోవటం, అటువంటి క్షణాలని జాంగ్రత్తగా నియంత్రించటానికి అవసరమయిన పరికరాలని సమకూర్చుకోవటం దీనినే నేను జ్ఞానం అంటాను. మనం ఇటువంటి భూకంపాల కిట్లుని మన జీవితం కోసం ఏర్పరచుకోవాలి. లేకపోతే మనం వాటి నుంచి విజయవంతంగా బయటపడలేము.

ఆ తరువాత ఫలితాలు భయంకరంగా ఉంటాయి. భయంకరమయిన తుఫాను గురించి మనం తయారుగా లేకపోతే ఆ తరువాత జరిగే విషయాలు భయంకరంగా ఉంటాయి. ప్రజలు చాలా పోరాడవలసి ఉంటుంది. అది చాలా కష్టం. అదే విధంగా మన అంతరంగంలో వచ్చే భూకంపాలు, తుఫానులకి మనం తయారుగా లేకపోతే ఆ తరువాత జరిగే పరిణామాలు చాలా కష్టంగా ఉంటాయి. వాటిని మనం సంభాళించలేము. అందుకే ఆ తరువాత జరిగే పరిమాణాలకి మనం ముందుగా సిద్ధమవ్వాలి.

తూర్పుదేశాలలో ప్రజలు వారి అంతరంగంలో వచ్చే తుఫానులకి నిరంతరం తయారవుతుంటారు. అక్కడ వచ్చే భూకంపాలని జ్ఞానం అనే భూకంప కిట్టతో సిద్ధంగా ఉంటారు. మనం అంతరంగంలో వచ్చే భూకంపాలని సిద్ధపడే కిట్టునే జ్ఞానం అంటాము. ప్రస్తుతం ప్రజలు ఎంతో అభివృద్ధి సాధించారు. వారు అంతరంగ ప్రపంచం, బయట మీరు మీ కారులో బయట ప్రపంచానికి సంబంధించిన భూకంపాల కిట్ట పెట్టుకోవచ్చు. మీ హృదయాంలో అంతరంగపు భూకంపాల కిట్లుని అమర్చుకోవచ్చు. మీరు ఇదా, అదా అని ఒకదానినే ఎంపిక చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఈ రెండింటినీ ఉంచుకోవచ్చు.

ఒకసారి నన్ను ఒక వ్యక్తి ఇలా అడిగాదు "స్వామీజీ! బుద్ధుడు జ్ఞానోదయం కలిగేలా చేసాడు. మరి మీ లక్ష్యం ఏమిటి? అని" నేను చెప్పాను. న్యూస్ పేపర్లు, టెలిగ్రాంలు, ఫోనులు, ఇంటర్నెట్, విమానాలు ఇవేమీ లేని రోజుల్లోనే బుద్ధుడు జ్ఞానోదయాన్ని కలిగించగలిగితే మనం ఇన్ని సౌకర్యాలని ఉంచుకొని కనీసం జ్ఞానోదయం కలిగించాలి. అప్పుడే ఈ సౌకర్యాలని కలిగి ఉండటంలో అర్ధం ఉంటుంది.

ఇప్పుడు మీకు అన్నీ ఉండవచ్చు. మీకు బయట ప్రపంచం ఉంటుంది. మీ అంతరంగ ప్రపంచం ఉంటుంది. మీకారులో ఒక భూకంపపు కిట్లు, మీ హృదయంలో అంతరంగపు భూకంప కిట్టు పెట్టుకోవచ్చు. మన అంతరంగంలో వచ్చే భూకంపాలని తేలికగా తీసుకోవద్దు.

అంతరంగపు భూకంపాలని తేలికగా తీసుకుంటున్నారు అంటే దాని అర్ధం మీరు అజ్ఞానంతో పనులు చేస్తున్నారు అని. అంటే మీరు చాలా పెద్ద సమస్యని ఆహ్వానిస్తున్నారు అని అర్ధం. దానికి సరిపడే విధంగా మీరు తయారుగా ఉండటం లేదు. స్పష్టంగా తెలుసుకోండి. బయటప్రపంచంలో భూకంపమొస్తే మీరు ఎవరో ఒకరిని నిందించవచ్చు. వారిని భాద్యులని చేయవచ్చు. గవర్నమెంటుని, అధికారులని, రాజకీయనాయకులని ఇలా అందరినీ భాద్యులని చేయవచ్చు. కానీ మీ అంతరంగపు ప్రపంచం విషయానికి వస్తే, మీరు బయటవారిని నిందించలేరు. మీరే భాద్యత తీసుకోవాలి.

ఇంతకుముందు అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు.

ఉద్దరేదాత్మనా త్మానం నాత్మనమవసాద యేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః

ఉన్నత స్థితికి చేరటానికి నీకు నీవే సహాయం చేసుకోవాలి. ఎప్పుడయితే నిన్ను నీవు అభివృద్ధి చేసుకోవటానికి సహాయం చేసుకుంటావో అప్పుడు నీకు నీవు

మంచి స్నేహితుడవి. లేకపోతే నీకు నీవు చెడ్డ శత్రువువి.

ఆయన మనకి చాలా మార్గాలు చూపించుతాడు. సాధన చేయటం, జ్ఞానాన్ని పెంపొందించుకోవటం, ధ్యానం, పనుల ఫలితాలను భగవంతునికి ఆధీనం చేయటం, అంటే కర్మఫల త్యాగం, ఇలా చాలా దారులు చూపించాడు.

ఈ మార్గాలు ఒకదానిని మించినది మరొకటి. ముందుగా జ్ఞానాన్ని పెంపొందించు కోమంటాడు. జ్ఞానానికంటే ధ్యానం మంచిది అని చెబుతాడు. ధ్యానంకంటే ఉత్తమయినది అన్నీ ఆ భగవంతుని పాదాలకు సమర్సించమంటాడు. ఈ విషయం మీద శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు.మనం చేసే పనుల ఫలితాలని భగవంతుని ఆధీనం చేస్తే మనకి త్వరగా మనశ్శాంతి దొరుకుతుంది. ఎంతకాలమయితే ఇవన్నీ నావి అనుకుంటానో అంతకాలం బాధ పడతావు. ఏక్షణానైతే నీవు ఆధీనమయిపోతావో, ఏక్షణానైతే సర్వం భగవంతునికి సమర్పించుతావో,నీలో గొప్ప చికిత్స జరిగిన భావం ఏర్పడుతుంది. మీ అంతరంగం భగవంతుని చికిత్సయొక్క దివ్య మారుత వీచికలు స్పృశించిన భావం మీకు కలుగుతుంది.

కొన్నిసార్లు కొంతమంది ఆధీనమవటం అంటే నియంత్రణ కోల్పోవటం అని అనుకుంటారు. అన్నీ సమర్పించేయటం బలహీనత అని అనుకుంటారు. అర్ధం చేసుకోండి. నియంత్రణ అంటే అహంకారాన్ని వెల్లడి చేయటం అనేది 'నేను, నాది' అనే సందర్భంలోనే వస్తుంది. నియంత్రణ అధికారాన్ని ఆశిస్తుంది. అధికారం కలుషితమయినది. అవినీతిమయినది.

ఆధీనత అంటే స్వేచ్చ. ఆధీనత అంటే ప్రత్యామ్నాయాలు లేని ఎంపికలేని దానిని వివరించటమే. నిర్ణయాలు భగవంతునికి వదిలివేయటమే. మనం పనిచేస్తాం నిర్ణయాలని భగవంతునికి వదిలివేస్తాం. మన ఆశలు, ఆశించటాలు అనే వాటిని వదిలివేయకపోతే మనం మన పనుల ఫలితాలతో ఎక్కువ సంబంధాలు

పెంచుకుంటాము. దానితో మనలో మనం ఒత్తిడి, వ్యధ అనే ఉపయోగంలేని వాటిని నింపుతాము. అవి మనం పనులని నాణ్యతతో చేయనీయవు. మనం బాగా చేయవలసిన పనులని తక్కువ నాణ్యతతో చేస్తాము.

మనం ఎప్పుడయితే పూర్తిగా మనం చేసే పని మీద, మనం నదుస్మన్న మార్ధం మీద ఏకాగ్రతని నిలుపుతామో, ఎప్పడయితే ఫలితాలగురించి కలతపడకుండా, మన గమ్యం గురించి ఆందోళన పడకుండా ఉంటామో అప్పుడు మనం ఏ పనిచేసినా చాలా అద్భుతంగా నాణ్యతతో త్వరగా, కచ్చితంగా చేయగలుగుతాము.

శ్రీకృష్ణని బోధనలు అన్నీ కేవలం ఆధ్యాత్మికమయినవి కాదు. అవి ఆరోగ్యకరమయిన జీవన పద్ధతులు. ఇవి కేవలం మన జన్మ తరువాత జరిగే విషయాలు కాదు, ఈ జీవితాన్ని అభివృద్ది చేసుకునే పద్దతులు.

శ్రీకృష్ణుడు శాంతి అనంతరం... అని అంటాడు. ఆయన ఈ విధంగా చెబుతాడు ఎవరయితే తాను చేసిన పనుల ఫలితాలని భగవంతునికి సంపూర్ణంగా సమర్సించుతారో (భగవంతునికి వదిలివేసారో) వారు శాశ్వతమయిన, శ్రీడ్రుమయిన శాంతి పొందుతారు. ఎవరయితే పనులని, వాటి ఫలితాల పైన అధికారాన్ని భగవంతునికి బదలాయించుతారో, వారు శాశ్వత శాంతి, పరమానందం అనే వాటిని పొందగలుగుతారు. చేసే పనుల ఫలితాల నుంచి బంధ విముక్తులవ్వగలిగితే, వారు సంపూర్ణమయిన స్వేచ్ఛని పొందుతారు. ఆ స్వేచ్ఛ మనం చేసే పనుల నుంచి మనం ఏమీ ఆశించనప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు ఆ వ్యక్తి తాను ఆక్షణంలో చేస్తున్న పనిమీద మాత్రమే పూర్తి ఏకాగ్రతని నిలుపగలుగుతాడు. ఎప్పుడయితే అతను వర్తమానంలో ఉంటాడో అప్పుడు అతను పశాంతంగా, పరమానందంలో స్వేచ్ఛలో ఉండగలడు. అదే మోక్షం అంటే.

20

अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च। निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी।। (12:13) संतुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः। मय्यर्पितमनोबुद्धिर्यो मद्भक्तः स मे प्रियः।। (12:14)

అర్ధం : అద్వేష్యా = ద్వేషం, శత్బత్వం లేనివాడు : సర్వభూతానమ్ = సమస్శ ప్రాణుల పట్ల: మైతః = స్నేహ భావం కలవాడు : కరుణః = దయ : ఏవ = గలవాడు : చ = మరియు : నిర్మమః = మమకారం లేనివాడు, అధికారం చూపనివాడు : నిరహంకారః = అహంకారం లేనివాడు : సమ = సమానమైన : దుఃఖ= దుఃఖములో : సుఖః = సుఖములో : క్షమా = ఓర్పుగలవాడు.

సంతుష్ణ = సంత్పప్తి : సతతం = ఎల్లప్పుడు : యోగీ = యోగములో ఉందువాడు: యతాత్మా = ఆత్మనియంత్రణ కలవాడు : ధృడనిశ్చయః = ధృద నిశ్చయం కలవాడు: మయి = నాయందు : అర్పితా = అర్పించిన : మనః = మనస్సు : బుద్ధిః = బుద్ధి లేదా మేధస్సు : యః = ఎవడు (కలదో) మత్ భక్తాః = నాయందు భక్తి కలవాడును : సః = అతడు : మే = నాకు : ప్రియః = ప్రియమయిన వాడు.

సమస్త ప్రాణులు యెడల ద్వేషము లేనివాడును, అందరియెడలా స్నేహాభావము, కరుణ కలవాడును, అహంకారం లేనివాడును, సుఖదుఃఖములయందు సమ భావము కలవాడు, యోగయుక్తుడు, ఓర్పుకలవాడు, ఎల్లప్పుడూ సంతృప్తితో ఉందువాడు, మనస్సుని నియంత్రించగలవాడు, నాయందు భక్తి కలవాడును, ఈ విధంగా ఎవరయితే ఉంటారో అతను నాకు ప్రియమయిన వాడు.

ండి పెళ్ళికం డి అంత శర్

ప్రేమే మీ జీవితం

ఇంతకుముందు శ్లోకాలలో శ్రీకృష్ణుడు అర్జునునికి నీవు ఇది చేయి లేదా అది చేయి అని చెప్పాడు. ఇప్పుడు ఇది చేయి అది చేయి అని చెప్పటం లేదు. ఆయన ఏమని చెబుతున్నాడంటే ఎవరైతే ఇవన్నీ చేస్తాడో అతనే నాకు ప్రియమయిన వాడు. ఒక వేళ నీవు అలా చేయకపోయినా పరవాలేదు. కానీ నీవు అలా చేయగలిగితే నాకు చాలా ప్రియమయినవాడివి అవుతావు. మరొక విధంగా చెప్పాలి అంటే ఆయన మానసికంగా బ్లాక్‌మైల్ చేస్తున్నాడు. అయితే అది డైరెక్టగా కాదు. తెలియకుండా ఇదంతా మన మంచి కోసమే.

ఎవరయితే ద్వేషబావం లేకుండా ప్రతి ప్రాణి పట్ల స్నేహభావంతో ఉంటారో ఎవరయితే తాను యజమానిని అని ఆలోచించరో, ఎవరికెతే అహంకారం ఉండదో, ఎవరయితే దుఃఖాన్ని సుఖాన్ని సమభావంతో చూడగలరో, ఎవరయితే నిత్యం తృప్తిగా ఉంటారో, మనస్సుని నియంత్రించి, దృఢ చిత్తంలో భగవంతుని సేవలో నిమగ్నమవుతారో, ఎవరయితే తమ మనస్సుని, మేధస్సుని నాపై నిమగ్నం చేసి ఉంటారో అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమయిన వాడు. అతనే నా ప్రియమయిన భక్తుడు.

ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. ఆయన ఈ విధంగా చెబుతారు. "ఎవరయితే ప్రతి ప్రాణి పట్ల ద్వేషభావం లేకుండా స్నేహభావంతో ఉంటాడో …." ఇవి చాలా విలువయిన లక్షణాలు. మనం మన మనస్సుని విశ్లేషించి చూద్దాము. మనం మన మనస్సుని నిజాయితీగా విశ్లేషించి చూస్తే మనకి ఒక విషయం అర్ధమవుతుంది. ఎప్పుడయినా ఎవరైనా మీ దగ్గరకి వచ్చి వాళ్ళు మిమ్ములని ప్రేమిస్తున్నారు, అని అంటే మీరు నమ్మరు. ముందుగా మీరు ఏమి ఆలోచిస్తారు. అతను ఏం కోరి, నా దగ్గర నుంచి ఏమీ ఆశించి అలా అన్నాడు అని. మిమ్ములని అతను ప్రేమించే అర్హత మీకు ఉన్నది అని మీరు నమ్మరు. తరువాత మరొక వ్యక్తి మిమ్మలని నిజాయితీగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మీరు నమ్మలేరు. ఎందుకంటే మీరు

నేను, నాది అనేవి వదలి వేయండి అని గురువు చెప్పినప్పుడు, వాటిని గురువు తీసేసుకుంటాడని ప్రజలు భయపడతారు. బహుశా ఆయన వాటిని తీసుకుంటే ఏం చేయాలి. వాటి అవసరం ఆయన కుందేమో అని ఆలోచిస్తారు.

ఎవరినీ నిజాయితీగా ప్రేమించలేదు కాబట్టి. మీరు ప్రతి విషయంలోనూ లెక్కలు కడతారు కాబట్టి అలాగే ఎదుటి వ్యక్తి కూడా లెక్కలు కడతాడని మీరు అనుకుంటారు. మన అందరి ప్రేమ పెపేని ప్రేమ

శ్రీకృష్ణుడు ఇక్కడ మరో విషయం చెబుతాడు. ఎవరయితే ప్రతి ఒక్కరి ప్రాణి పట్ల స్నేహభావంతో ఉంటాడో, ప్రతి ఒక్కరికి దయగల స్నేహితుడిగా ఉంటాడో, ఎవరైతే నిజాయితీగా సేవ చేసారో, ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉంటారో అబద్ధపు అహంకారపు లేకుండా ఉంటారో .... ఇక్కడ అబద్దపు అహంకారం అంటే ఏమిటో చూద్దాం. అహంకారం అంటే మీకు లేనిదానిని చూపించటం. అబద్దపు అహంకారం అంటే మీకు ఉన్నదానిని దాచిపెట్టటం.

అహంకారం రెండురకాలుగా ఉంటుంది. చురుకైన అహంకారం, నెమ్మది అయిన అహంకారం. చురుకైన అహంకారం అంటే మీకు లేనిదానిని చూపించటం, నెమ్మది అయిన అహంకారం ఇలాంటి ఆలోచనలతో ఉంటుంది. "నేనేమి చేయగలను, నేను ఒకసామాన్యమయిన వ్యక్తిని. నేను ఏదీ సాధించలేను. నేను ఏ పనీ చేయలేను" ఇలా తనకి ఉండే న్యూన్యతా భావం (ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్) ఇది విధమయిన ఒక రూపంలో ఉండే అహంకారం.

స్పష్టంగా అర్ధం చేసుకోండి. తనను తాను గొప్పగా భావించే సుపీరియారిటీ కాంప్లెక్స్‌లో ఒక మంచి గుణం ఉన్నది. అటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని గురించటం సులభం. దాంతో వారిని ఎదుర్కొనవచ్చు. సమాజం కూడా అటువంటి వారిని ఎదుర్కొంటుంది. వారికి తగిన సమాధానం ఇస్తుంది. అటువంటివారు తాము అహంభావంతో బాధపడుతున్నాము అని తెలుసుకోగలుగుతారు. అలా కాకుండా న్యూన్యతా భావంతో ఉండేవారిని అహంభావులుగా ఎవరూ గుర్తించలేరు. అది చాలా కపటంగా దాచిపెట్టబడి ఉంటుంది. అంతేకాదు ఆ భావం ఉన్నవారు దానిని గుర్తించలేరు కూడా. దాంతో న్యూన్యత వెనుక దాగిన మనిషి తను అహంకారంతో బాధపడుతున్నట్లు తెలుసుకోలేరు. దాంతో వీరు చాలా లోతుగా ఎక్కువగా ఆ బాధని అనుభవించుతారు.

ఏ వ్యక్తి అయితే పేరు ప్రతిష్టలకోసం ఎదురుచూస్తుంటాడో ఆ వ్యక్తి అలాగే ఎవరికైతే పేరు ప్రతిష్టలు అవసరం లేదో అటువంటి వ్యక్తి, ఇద్ద‌రూ కూడా అహంకారులే. పేరు ప్రతిష్ఠలు కావాలి అనుకుంటే అది అహంకారమే. అది వద్దు అని అనటం కూడా అహంకారమే. ఎవరయితే ఏది జరిగితే దానిని జరగనీయి అని అనుకుంటాడో, ఎవరైతే విషయాలని జరిగేవి జరగనిస్తాడో అతను మాత్రమే అహంకారంలేని సత్యంలో జీవిస్తాడు.

శ్రీకృష్ణ భగవానుడు ఒక వ్యాఖ్య చేస్తాడు. "నీవు ఎవరో ఎవరికి తెలుసుకోవాలని ఉంటుంది? ఎందుకు నీవు గొప్పవ్యక్తిని అని అనుకుంటావు? ఎందుకు నీకు గొప్ప పేరు ఉందనీ, అందరికీ నీపేరు తెలుసు అని అనుకుంటావు? ఎందుకు అందరూ నీ పేరు అనుకుంటే సిగ్గుపడి వెళ్ళిపోతావు? ఎందుకంటే నీపేరు చాలామందికి తెలుసు అనుకొని సిగ్గుపడి వెళ్ళిపోతావు. అందుకే నీ పేరు అందరికీ తెలియటం నీకు ఇష్టముండదు. నేను చెబుతున్నాను. నీ పేరు ఎవరికీ తెలియదు. రిలాక్స్ అవ్వు. విరామంగా ఉండు " భగవంతుడు "నీ పేరు ఎవరికీ తెలియదు విరామంగా ఉండు " అంటాడు .

ఎవరికీ మన పేరు తెలియదు. స్పష్టంగా అర్ధం చేసుకోండి. పేరు ప్రతిష్ఠలు కావాలి అనుకోవటం, అవి వద్దు అనుకోవటం రెండూ అహంకారమే. రెండు రకాల అహంకారం. న్యూన్యతతో ఉండే అహంకారం నెమ్మదిగా ఉండే అహంకారం. దానినే అబద్దపు అహంకారం అంటాం. మీరు రెండు అహంకారాల నుంచీ స్వేచ్ఛగా ఉండాలి. మీరు ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ వెనుక (న్యూనతా భావం) దాగవద్దు.

ఒక చిన్న కథ :

ఒక గురువుగారు తన శిష్యుడిని పిలిచి కాళ్ళు పట్లమంటాడు. దానికి ఆశిష్యుడు "అయ్యో! గురుదేవా! నేను పాపిని. నేను ఏవిధంగా మీ పవిత్ర పాదాలు ముట్టుకో గలను " అని అంటాడు. అతను సోమరి. అతనికి పనిచేయ బుద్ధి వేయదు. అందుకే అలా అంటాడు.

ఆ మరుసటి రోజు ఒక భక్తుడు గురువుగారికి పక్కు, ప్రసాదం తెచ్చి ఇస్తాడు. ఆయన కొంచం నోట్లో వేసుకొని మిగతావన్నీ అలా ఉంచేస్తాడు. ఆ తరువాత చూస్తే ఆ ప్లేటులోఏమీ ఉండవు. ఆయన శిష్యుడిని పిలచి ప్లేటులో ఉండే పక్కు, ప్రసాదం ఏమయ్యాయి అని అడుగుతాడు.

అప్పుడు శిష్యుడు, "గురుదేవా! మీరు అంటే గురువుగారు వదిలిన ప్రసాదం పవిత్రమయినది. నేను దానిని అలాగే ఎందుకు పారేస్తాను. అందుకే ఆ మొత్తం ప్రసాదాన్ని తినేసాను" అని చెబుతాడు.

మైండ్ (మనస్సు) చూడండి. ఎంత చక్కగా అక్కడ సంఘటనలని తనకి అనుగుణంగా మార్చుకున్నదో. ఎక్కడ ఏవిషయంలో ఆడుకోవాలో అక్కడ దానితో ఆదుకున్నాడు. అదీ తనకి అనుకూలంగా ఉండే విధంగా చేసుకున్నాడు. అతనికి పని చేయి బుద్ధి వేయనప్పుడు నేను అర్హుడని కాదు, అందుకే మీ పాదాలు ముట్టుకోను అన్నాడు. తినాలనుకున్నప్పుడు అది గురుదేవుల ప్రసాదం అని మొత్తం తినేసాడు.

మనలో ఉండే భావాలకి ఆధారం కోసం మనం చాలా విషయాలని సేకరించు కుంటాము. అందుకే అంటారు 'దయ్యాలు వేదం వల్లించినట్లు' అని లేదా 'దెయ్యాలు బైబిల్‌ని ఉదహరించినట్లు' అని ఎవరయినా పవిత్ర గ్రంధంలోనివి ఉదాహరణగా చెప్పారు అంటే వారు దయ్యాలు అని అర్ధం అలా కాకుండా పవిత్ర గ్రంధాలని అర్థం చేసుకుంటే మీరే దేవుడు మీరు పవిత్ర గ్రంధాలనుంచి ఉదాహరణలు

భగవద్గీత - అధ్యాయం 12

చెప్పనవసరం లేదు. ప్రజలు మీ మాటలనే ఉదాహరణలుగా చెప్పకుంటారు. ఎప్పుడయితే పవిత్ర గ్రంధాలని అర్ధం చేసుకోకుండా అందులో మాటలని ఉదహరించితే అది దయ్యపు పనే. ఎందుకంటే వాటిని అర్ధం చేసుకున్న వాళ్ళు వాటిని పదే పదే పదే చెప్పరు.

ఎప్పుడయితే మీ లక్ష్యం నిరర్థకమయినది అని తెలుసుకుంటారో అలాగే మీ ఐశ్వర్యాలు అర్ధం లేనివి అని తెలుసుకుంటారో, ఆ ఐశ్వర్యం మీకు కలకాలం ఉండదు అని అర్ధం చేసుకుంటారో అప్పుడు అన్నీ పైన చెప్పిన మంచి లక్షణాలన్నీ మీ నుంచి అన్ని దిశలకీ వ్యాపించుతాయి. అప్పుడు మీరు ఒక వ్యక్తిగా రూపాంతరం చెందుతారు. ఆ వ్యక్తి క్షమాగుణం కలిగి సమదృష్టికల మనస్సుతో సంత్పప్తిగా యోగంలో ఐక్యమయి ఉంటాడు. ఎప్పుదయితే మీరు అంతరంగంలో పరమానందంతో ఉంటారో మీరు ఈ లక్షణాలని అన్నివైపులకి మీ నుంచి వ్యాపింప చేస్తుంటారు. ఎవరయితే అంతరంగంలో నిత్యానంద స్తితిని పొంది ఉంటారో, ఆ వ్యక్తి తన ఆనందాన్ని ఏకారణం లేకుండానే అన్నివైపులకి ప్రసరింప చేస్తాడు.

నేను ఈ మధ్యనే ఒక ఉపన్యాసం ఇచ్చాను. అందులో ఇలా చెప్పాను. మనం నిరంతరం మన లోపల కోపం పుట్టించే గుణాన్ని (ఇరిటేషన్‌ని) మోస్తూ ఉంటాము. దాంతో ఎప్సుడు ఎవరిమీద విరుచుకు పడదామా అని చూస్తుంటాము. ఏక్షణంలో మనకి అవకాశం వస్తే ఆక్షణంలో ఎదుటివారి మీద దూకి వారి మీద అరచి యాగీ చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకి తెలియదు. వాళ్ళ మీదకి దూకుతాం, వాళ్ళని కరుస్తాం. చిన్నగా మనని రెచ్చగొడితే చాలు, చాలా పెద్ద గొడవ చేస్తాము. ఎందుకంటే మనలోపల మనం ఇరిటేషన్ అనే గుణాన్ని మోస్తుంటాము. దాంతో ఎదుటివారికి నిరంతరం బాధలని, కష్టాలని చూపిస్తుంటాము.

ఈ విధమయిన గుణం మనలో ఎందుకు ఉంటుంది? ఎందుకంటే మనం నిరంతరం మాట్లాడుతూ ఉంటాము. ఇదంతా మనం అనుకున్నది అనుకున్నట్టు

జరగదు, అందుకే అలా చేస్తాము. మన వ్యధలు, బాధలు అన్ని కూడా జరిగిపోయిన విషయాల ఆధారంగా మనకి జరగబోయే విషయాల గురించే ఉంటుంది. భవిష్యత్‌లో మనకి ఏమి జరగబోతోందో అనేది మన అసలు బాధ. ఇది మనం ఆశించిన దానికి మనం అది సాధించటానికి మనకి ఉన్న సామధ్యానికి మధ్య ఉన్న ఖాళీవలన మనం బాధలు అనుభవించుతాము. అందుకే మనం అనుకున్నవి భవిష్యత్‌లో మనకి జరుగుతాయో లేదా అనే ఆతృతతో ఉంటాము.

వ్యధలు, బాధలు అనేవి ఏమాత్రం ఉపయోగం లేని విషయాలు ఎందుకంటే మనం ఏదయినా సాధించాలి అని అనుకుంటే, అది సాధించటానికి మన సామర్యం ఒక్కటే సరిపోదు. దాని కంటే కూడా కావలసిన విషయాలు చాలా ఉన్నాయి. మనం చేయిబోయే పని నుంచి దేనినైనా ఆశించటం నిరర్థకమయినది, ఎందుకంటే భవిష్యత్ అసలు నమ్మకం లేనిది. అది ఊహ. మన తరువాత శ్వాసనే మనం నియంత్రించలేము. మన తరువాత శ్వాస తీసుకుంటాము అని కచ్చితంగా చెప్పలేము. మనం ఎటువంటి గర్వంతో మనం మన భవిష్యత్‌ని నిర్ణయించగలం. అలాగే మనం చేసే పనుల ఫలితాలని కూడా ఏమాత్రం నిర్ణయించలేము.

బాధ, ఆతృత, ఆందోళన, కోపం కలిగించే గుణం ఇవన్నీకూడా మనం వర్తమానంలోనికి రాగానే కరిగిపోతాయి. ఎప్పుడయితే మనం పూర్తిగా వర్తమానంలో ఉండగలుగుతామో అప్పుడు మనం మన పనులని ప్రభావితం చేయగల స్థితిలో ఉంటాము. అలాగే వాటి ఫలితాలని ప్రభావితం చేయవచ్చు. ఎప్పుడయితే మనం వర్తమానంలో స్థిరపడతామో మన ఆలోచనలన్నీ పోతాయి అలాగే బాధలు, ఇరిటేషన్, ఆతృత మాయం అవుతాయి. అప్పుడు మన వ్యధ అనేది ఎంత ఉపయోగం లేని విషయమో మనకి అర్ధం అవుతుంది.

నేను ధ్యానం కార్యక్రమాలలో క్లాసుకు వచ్చిన వారిని వాళ్ళ బాధలు వ్రాయమనే వాడిని. వాళ్ళు చాలా రాసేవారు. నేను వాళ్ళని ఆపేపర్లు దాచి ఉంచి,

ఆరునెలలయ్యాక అసలు అందులో నిజంగా వారికి వచ్చిన బాధలు ఎన్నో చెప్పమనే వాడిని. నేను చెబితే మీరు ఆశ్చర్యపోతారు, అందులో కనీసం ఇరవై శాతం బాధలు కూడా వారికి రాలేదు.

బాధలు, ఇరిటేషన్ అనేవి అసలు ఆధారం లేని విషయాలు ఒక్కసారి మీరు అవి ఎంత అర్ధం లేనివో, ఎంత ఉపయోగం లేనివో తెలుసుకోగలగితే, మిమ్మలని ఎంత రెచ్చగొట్టినా, ఎంత ఇరిటేట్ చేసినా అవి మీ దగ్గర పనిచేయవు. ఆతృత, కోపం అనేవి అసలు మీలో ఉండవు. మీరు సచేతనస్తితిలో ఎలా జీవించుతారో, ఏ చేతన స్థితిలో అయితే ఒక దానిని ఎంచుకుంటారో అది మాత్రమే మీతో ఉంటుంది. మీరు మీ ఉనికి యొక్క స్టితిని అర్ధం చేసుకుంటే, మీరు అప్రయత్నంగానే మీలోని మనోహరమయిన ఆనందాన్ని వ్యాపించటం ప్రారంభించుతారు. మీలోంచి సంతోషాన్ని వెదజల్లుతారు.

నేను ఒక చిన్న ధ్యాన పద్ధతిని అందరికీ నేర్పిస్తుంటాను. ఆ ధ్యానం మనకి నిజమయిన భక్తియోగం యొక్క అనుభవాన్ని ఇస్తుంది. ఈ చిన్న ధ్యానపద్ధతిని సాధన చేయండి. అది మీలోని సౌమ్యతని తెలియచేసేలా చేస్తుంది. దానిని ఎలా చేయాలి? మీరు ఉదయం నుంచీ రాత్రి వరకూ చాలా మనోహరమయిన ఆనందం యొక్క లక్షణాలని మాత్రమే శ్వాసించండి. కేవలం అందమయిన ఆనందాన్ని మాత్రమే మీ లోపలికి తీసుకుంటున్నారు : ఆనందాన్ని మాత్రమే ఊపిరిగా వదులుతున్నారు అని ఊహించుకోండి. అప్పుడు మీ అంతరంగం, మీ ఉనికి మొత్తం సంతోషంతో నిండిపోయి ఉంటుంది. మొదటిలో మీరు ఊహించుకుంటారు కొన్ని రోజులుకాగానే దాని గొప్పతనమేమిటో మీరే తెలుసుకుంటారు.

మరొక విషయం అర్ధం చేసుకోండి. కల్పన, భావన అనేవి రెండు వేరు వేరు విషయాలు. కల్పన అంటే కొన్ని విషయాలని ఊహించటం. ఆ విషయాలు నిజ ప్రపంచంలో జరుగవు. ఉదాహరణకి ఒక ఏనుగుకి పది తొండాలు ఉన్నట్టుగా

ఊహించుతారు. కానీ అది నిజంగా జరగదు. అలాంటిది ఉండదు. కాబట్టి కల్పన అంటే జరగనిది. భావన అంటే జరగేవాటిని ఊహించటం. జరిగే వాటిని ఇప్పుడు ఊహించటమే భావన.

పగలు మీరు కూర్చొని నక్షత్రాలు ఉన్నాయని ఊహించారనుకోండి అది భావన. అది కల్పన కాదు. ఎందుకంటే నక్షత్రాలు అక్కడ ఉన్నాయి కానీ మనకి కనపడటం లేదు. అంతే కాబట్టి ఇక్కడలేని దానిని చూడగలగటం భావన అదే ఊహ. మీరు చూడలేని దానిని ఊహించటం కల్పన. అదీ ఊహ

స్పష్టంగా అర్ధం చేసుకోండి. దేవతలు, దేవుళ్ళ మీద ధ్యానం చేయటం కల్పన కాదు. అది భావన. వాళ్ళు అక్కడ ఉన్నారు. మీరు వాళ్ళ శ్రుతిలో పడగలగాలి. అది ఎలా అంటే మీ టి.వి.ని మీకు కావలసిన ఛానల్‌కి ఎలా ట్యూన్ చేస్తారో అలాగే మీరు దేవుడులు, దేవతల ట్యూన్‌లో పడాలి. కాబట్టి అక్కడ ఉన్నదానిలోనికి ట్యూన్ చేసి వాటిని చూడటం భావన అదే ఊహ.

మీరు నిరంతరం ఆనందాన్ని శ్వాసిస్తున్నట్లు భావించండి. మీ ఆనందాన్ని, ప్రాణాన్ని లోపలికి తీసుకుని బయటకి వదులుతారు. ప్రాణం అంటే జీవించటానికి కావలసిన ముఖ్యమయిన శక్తి. ఒక విషయం అర్ధం చేసుకోండి. ప్రాణం అంటే గాలి కాదు. అది శక్తి. అది గాలి ద్వారా మీ లోపలికి వెళుతుంది. ఉదాహరణకి లారీ సామానుతో మీ ఇంటి దగ్గరకి వచ్చి, సామాను మీ ఇంట్లో దింపేసి వెళ్ళిపోతుంది. ప్రాణం సామాను అయితే గాలి లారీ. ప్రాణం గాలి కాదు. గాలి ఆధారంగా ప్రాణం మీలోకి వస్తుంది. ప్రాణశక్తి గాలిలో ఒక సూక్ష్మభాగం మాత్రమే. ప్రాణశక్తి ఆనందశక్తి, ఆనందం ఒక శక్తి.

అందుకే మీరు ఊపిరి తీసుకున్నప్పుడు, అనందాన్ని లోపలికి తీసుకుంటున్నట్టుగా ఊహించండి. అలాగే ఊపిరి విడిచేటప్పుడు ఆనందాన్ని బయటకి విడిచినట్టు

భగవద్గీత - అధ్యాయం 12

ఊహించండి. అలాగే ప్రకాశవంతమయిన వెలుగుని లోపలికి తీసుకొని ఆ ప్రకాశాన్ని ఊపిరిగా వదలండి. అప్పుడు మీ అంతరంగం ప్రకాశంతో నిండిపోతుంది అనే భావనలో ఉండండి. మీ అంతరంగం ఆనందంతో, ప్రకాశంతో నిండిపోయినట్లు ఊహించండి. అప్పుడు అప్పయత్నంగా మీరు ఆనందాన్ని అన్నివైపులా వ్యాపింపచేసారు. ఇక మీరు కోపం, అసూయ, ఇటువంటివాటిని ఎదుటివారి మీదకు వదలరు. మీరు ప్రేమని ఆనందాన్ని ఎదుటివారి మీద కురింపించుతారు.

అటువంటి భక్తుడు నాకు ప్రియమయిన భక్తుడు అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఆయన ఈ విధంగా చెబుతాడు, అలా ఉండే భక్తుడే నాకు అత్యంత ఆప్తుడు. ఆయన మనని ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పడు ఆయన ఇంకా ఎటువంటి రూల్స్, సూచనలు మనకి చెప్పటం లేదు. ఆయన రూల్స్ చెప్పి చెప్పి అలసిపోయాడు. ఆయన ఏస్థితికి వచ్చాడంటే, నీవు చేయగలిగితే ఇది చేయి. లేదా ఏమి చేయాలి? అలాగే కానివ్వు. ఆయన చాలా రిలాక్స్‌డ్ మూడ్‌లో ఉన్నాడు.

నేననుకోవటం ఏమిటంటే ఇది అందరు యోగులకి జరిగే అనుభవమే. అందరూ ఏదో ఒక సమయంలో ఈ స్థితికి వచ్చేసారు. కొంత కాలమయ్యక వాళ్ళు ఇలా చెబుతారు. "సరే! అలాగే. నీ ఇష్టమయిన విధంగానే చేయి. ఏంచేస్తాం మరి? మిమ్ములని కొంత వరకూ తీసుకెళ్ళగలం. కొంతవరకూ దారి చూపించగలం". కొంతకాలం అయ్యాక వీళ్ళు ఏమనుకుంటారు ఇందులో గురువులకి ఏదో స్వార్ధం ఉన్నది. అందుకే మనని జ్ఞానోదయం వైపు తీసుకువెళుతున్నారు. అది ఏదో నేను పదిమందికి జ్ఞానోదయం కలిగించితే నాకు స్వర్గంలో ఏదో ప్రత్యేక స్థానం దొరుకుతుంది, లేదా నా జీతం పెరుగుతుంది అని అనుకుంటారు. అర్ధం చేసుకోండి. మనం ఆనందం, సంతోషం ద్వారా పొందిన దానిని నలుగురితో పంచుకుంటాము. అంతే.

ఒక చిన్న కథ :

ఒక చూపులేని అంధవ్యక్తి హిమాలయాలలో నడుస్తుంటాడు. ఆకస్మాత్‌గా

అతని చేతిలోనికి మంచులో గడ్డ కట్లుకుపోయిన పాము పడుతుంది. అతనికి కుర్రలా అనిపిస్తుంది. ఆ వ్యక్తి దానిని కుర్ర అనుకొని "ఓహా! నాకు మంచి చేతి కుర్ర దొరికింది' అని అనుకొని దాంతో నడుస్తుంటాడు.

దారిలో ఒక సన్యాసి ఆ అంధుని చేతిలో పాము చూసి "ఓ! అయ్యా! నీ చేతిలో దానిని పారవేయి. నువ్వ అనుకుంటున్నట్లుగా అది కుర్రకాదు. అది పాము. ఇంకొక గంటలో సూర్యకిరణాలు వస్తాయి. అప్పుడు ఆ పాము మామూలు స్థితికి వస్తుంది. అది నిన్ను కాటు వేస్తుంది. నిన్ను చంపేస్తుంది" అని గట్టిగా చెబుతాడు.

దానికి ఆ అంధవ్యక్తి "అదేమీ కాదు! నాకు తెలుసు. నీవు మరి మాట్లాదుకుండా నీ పని నీవు చేసుకో" అంటాడు.

సన్యాసి అతనికి నచ్చచెప్పటానికి ప్రయత్నిస్తాడు. అది కుర్ర కాదు. అది పాము నిన్ను కరిస్తే చనిపోతావు. దానిని పారవేయి అని. అతనికి చాలా కోపం వస్తుంది. సన్యాసితో ఇలా అంటాడు " బహుశః నీకు కుర్ర లేదనుకుంటాను. నేను దీనిని పారేస్తే దాన్ని నీవు తీసుకోవాలి అని చూస్తున్నావు. నేను కుర్రని పారవేయను. నాకు నీలాంటివాళ్ళు సంగతి బాగా తెలుసు," అంటాడు.

అప్పుడు సన్యాసి ఇలా అంటాడు "ఓ తెలివితక్కువ మూర్ఖుడా! అది కుర్ర కాదు. అది నిన్ను చంపేస్తుంది" అని అతని చేతిలో పాముని లాగేయటానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ అంధుడు దానిని సన్యాసికి ఇవ్వకుండా ఆ కుర్రతోనే సన్యాసిని కొడతాడు. జీవితంలో సరిగ్గా ఇలాగే జరుగుతుంది.

ఎప్పుడయితే గురువులు 'నేను, నాది' అనేవాటిని పారేయమంటే మీరేమనుకుంటారు, అమ్మో వాటిని పారేస్తే గురువు వాటిని తీసేసుకుంటాడు అని అనుకుంటారు. గురువు వాటిని తీసి పారేస్తాడు. మరేం చేయాలికి వాళ్ళు అనుకుంటారు, గురువుకి ఇది కావాలి అని. ఆయన మనని అవి పారేయమని చెప్పి ఆయన తీసేసుకుంటాడు అని అనుకుంటారు. వాళ్ళు నిరంతరం

భగవద్గిత - అధ్యాయం 12

అనుమానంతో ఉంటారు. అందుకే గురువులు ఏమంటారంటే " ఇది అసలయిన దారి, మీకు ఎలా కావాలంటే అలా చేయండి".

ఎవరయితే వారి మనస్సుని, మేధస్సుని (బుద్దిని) నాయందు నిలుపుతారో…. అని అంటాడు శ్రీకృష్ణుడు. భక్తులకి, శిష్యులకి కూడా గురువులకి కాని విశ్వశక్తికి కానీ ఆధీనమవటం చాలా కష్టం.ఎంత కాలమయితే గురువు వారిని వారు ఇష్టంవచ్చినట్టు ఉండనిస్తాడో, అన్ని విషయాలు వారి ఇష్ట ప్రకారం జరుగుతాయో వారికి గురువు చాలా గొప్ప వ్యక్తి. ఆయనని పూజించటానికి, ఉత్సవం చేయటానికి అర్హుడు అని అనుకుంటారు. కాని గురువు ఒక్కసారి తన భాద్యతని సీరియస్‌గా తీసుకొని ఆధ్యాత్మిక ఆపరేషను మొదలు పెట్టగానే శిష్యులు పారిపోతారు.

నేను ఎప్పుడు చెబుతాను " నేను మీకు సరియైన గురువునా కాదా అని ముందుగా నిర్ణయించుకోండి". ఒక్కసారి అవును అనుకుంటే గురువులు ఆ బాధ్యతని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఆయనకి ఉండే పెద్ద బాద్యత సర్జరీ. అహంకారం అనే కాన్సర్‌ని ఆపరేషన్ చేసి తీసేయటం. ఒక్కసారి శిష్యుడు ఒప్పుకుంటే గురువు చాలా బాధ్యతాయుతంగా ఆ పనిని చేపడతాడు. ఆపరేషన్ టేబుల్ మీద నుంచి పారిపోతే అది చాలా ప్రమాదం. అలా చేస్తే ఈ జీవితాన్ని కోల్పోతాడు. తిరిగి అతను ఆ అవకాశం కోసం కొన్ని జన్మలు ఎదురు చూడాలి.

ఇక్కడ శ్రీకృష్ణుడు అదే స్థితిలో ఉన్నాడు. ఆయన అందుకే "నాకు ప్రియమైన భక్తుడు ఇలా ఉంటాడు' అని చెబుతాడు. అంతే ఆయన శిష్యుడు యొక్క నిబద్ధత గురించి చెబుతాడు.ఆయన ఇలా అంటాడు "ఎవరయితే నాకు ఆధీనులవుతారో ఎవరయితే వారి మనస్సు బుద్ధిని నాయందు స్థిరపరచుతారో అతను నాకు ప్రియమయిన భక్తుడు. అతనికి నేను స్వేచ్చని ఇస్తాను. బంధ విముక్తుణ్ణి చేస్తాను."

కృష్ణుడు ఈ అధ్యాయాన్ని చాలా అందంగా ముగించుతాడు. ఇది చాలా చిన్న అధ్యాయం. అందుకే మనం మొత్తం అధ్యాయమంతా చూడగలుగుతున్నాము.

యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హరామర్ష భయో ద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః (12:15)

అర్థము : యస్మాత్ = ఎవని వలన : లోకః = ప్రపంచము : న = లేదో : ఉద్విజతే = భయమును : చ= మరియు : యః = ఎవరు : హర్ష, అమర్ష భయ ఉద్యేగైః = సంతోషము, కోపము, భయము, ఆదుర్దా : ముక్తః = స్వేచ్చ పొందాడో : సః = అతడు : చ= మరియు : మే = నాకు : ప్రియః = ప్రియమయిన వాడు.

భావము : ఎవరివలన ప్రపంచము భయమును పొందక, లోకము వలన ఎవరు భయము పొందరో, ఎవరు సంతోషము, క్రోధము, భయము, ఆదుర్దా లేకుండా ఉంటారో అతనే నాకు ప్రియమయిన వాడు.

ఎవరయితే ప్రపంచము వలన వ్యతిరేకముగా ప్రభావము కారో, ఎవరి వలన ప్రపంచం భయపడదో లేదా ఆపద తెచ్చుకోదో….

మనందరం ఎవరైతే ఈ ప్రపంచంలో జన్మించామో, ఈ ప్రపంచంలో జీవిస్తున్నామో మనం ఒంటరిగా జీవించటం లేదు. జాన్‌దోన్ అనే తత్త్వవేత్త అంటారు" ఏవ్యక్తి కూడా ఒక దీపం కాదు" అని

మనం ఎవరమూ ఒక ద్వీపం కాదు. మనందరం ఒకరితో ఒకరం పరస్సర సంబంధాలు కలిగి ఉంటాము. మనం ఏమి ఆలోచిస్తామో, ఏమి చేస్తామో, ఏది కోరుకుంటామో అవన్నీ ఈ ప్రపంచంలో ఉండే ఇతరులని ప్రభావితం చేస్తాయి. మన ఆలోచనలు, కోరికలు, చర్యలు ఈ భూమి మీద ఉండే శక్తి తరంగాలని సృష్టిస్తాయి. తిరిగి ఈ విశ్వం ఇంకా కొన్ని తరంగాలని సృష్టిస్తుంది. ఇవన్నీ మిగతావారి భావాలతో పనులతో పరస్సర సంబంధం నెలకొల్కొని తిరిగి మరిన్ని తరంగాలని సృష్టిస్తాయి.

కార్ల్ జంగ్ అనే మానసిక విశ్లేషకుడు, ఫ్రాయిడ్ నిర్వచించిన ఐ.డి. మరియు అహంకారానికి, అధిక స్థానంలో ఉండే అహంకారాన్ని (super ego) కలిపాడు.

వీరి ఉద్దేశ్యం ప్రకారం ఐ.డి. మానవులలో ఉండే ముఖ్యమయిన మేధస్సుని తెలియచేస్తుంది. అందులో జ్ఞాపకాలు ఒక పరిణామ క్రమంలో అమర్చబడి ఉంటాయి. మెదడులోని ఈ ప్రాంతాన్ని రెపటీలియన్ మెదడు అంటారు. ఇందులోని జ్ఞాపకాలు మామల్స్ అనేవి భూమిమీదకు రాక ముందు నుంచీ ఉంటాయి.

ఐ.డి. అనేది మెదడులోని సహజమయిన బుద్ధి యొక్క చర్యలకి సంబంధించినది. అవే అచేతన సుషుప్తస్థితులు. మనలో తొంభై శాతం పనులు, మనస్సుయొక్క చర్యలు ఇందులోనే జరుగుతాయి. సహజంగా ఈ ప్రాంతం అందుకే తయారు

చేయబడినది. ఇది మనకి అత్యంత ప్రమాదం సంభవించినప్పుడు మనలని రక్షిస్తుంది. మెదడులో ఈ ప్రాంతం గుడ్డిగా, అత్యంత వేగంగా పనిచేస్తుంది. అది చేతనస్థితిలో పనిచేసే మెదడుకంటే 10 కోట్ల రెట్లు వేగంగా పని చేస్తుంది.

అహంకారం మన గుర్తింపుకు ప్రతినిధిగా ఉంటుంది. మన మైండ్ (మనస్సు)లోని ఈ ప్రాంతమే మనకి వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. ఈ అహంకారమే మన చేతనస్థితిలో అర్థం చేసుకోకుండా నిర్ణయాలు చేస్తుంది. అది మీ ఐ.డి.లో ఉన్నటువంటి జ్ఞాపకాల ఆధారంగా ఒక్కొక్క పరిస్థితిలో మన ప్రవర్తన ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. దీనితో సమస్య ఏమిటంటే, మనం అలా నిర్ణయాలు చేసినట్లు మనకి తెలియదు. మనమే నిర్ణయాలు చేసాము అని మనం అనుకున్నా అవి చేసేసి,అలా ఎందుకు చేసాము అనేది మనకి తెలియక అయోమయపడతాము.

అధికస్థితిలో ఉండే అహంకారం అంటేనే (పోగు చేయబడిన మన జాతియొక్క అచేతనస్థితి యొక్క రూపం. జంగ్ ఈ సందర్భంగా ఇలా చెబుతారు. మనం ఈవిధంగా చేయాలి ఇలా ప్రవర్తించాలి అనేది ఒకదానికాకటి సంబంధించి జరుగుతుంది. దీనిని హేతుబద్ధంగా వివరించటం కష్టం.

శాస్త్రవేత్తలు దీనినే 100 మంకీ (కోతి) ప్రిన్సిపల్ అన్నారు. ఇది ఎలా ఉంటుందంటే : 100 కోతులు ఉన్నాయి అని అనుకోండి. ఇవన్నీ ఒక ఒంటరిగా ఉన్న ద్వీపంలో చిక్కుపడిపోయాయి. ఆ ద్వీపం మిగతా భూభాగంతో సంబంధం లేకుండా తెగిపోయింది. ఇప్పుడు వీటికి ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్పించితే లేదా అవి నేర్చుకుంటే, వాటి సమూహంలో వాటి ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఈ నైపుణ్యాన్ని ప్రధాన భూభాగంలో ఉండే కోతులకి కూడా చేరుతుంది. అయితే వాటిమధ్య ఎటువంటి భౌతిక, మానసిక సంబంధం లేకుండానె ఇది జరుగుతుంది.

ఇది నిజం! ప్రపంచంలో ఉండే కోతులన్నింటినీ వేరుగా ఉంచనవసరం లేదు. ఒక

భగవద్గిత - అధ్యాయం 12

గ్రూపు తీసుకొని వాటికి శిక్షణనిస్తే చాలు దీని తరువాత భూమి మీద ఉన్న కోతులన్ని ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించుతాయి. అవి పుస్తకాలు చదవనవసరం లేదు. అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకోనవసరం లేదు. అవి టి.వి. చూడనవసరం లేదు. ఇంటర్‌నెట్ ఓపెన్ చేయనవసరం లేదు. ఈ జ్ఞానం, నైపుణ్యం వాటికి చేరుతుంది. అది ఎలా చేరుతుంది అనే విషయాన్ని శాస్త్రజ్ఞులు ఇంతవరకూ తెలుసుకోలేకపోయారు. ఇది జరుగుతున్నది అని తెలుసు కానీ ఎలా జరుగుతుందో తెలియదు.

ఈ విధంగా ఒక విషయం లేదా విశేష నైపుణ్యం మరొక చోటికి అప్రయత్నంగా వెళ్ళటం అనేది శాస్త్రీయ పరిశోధనలలో చాలా సార్లు జరిగింది. మేడమ్ క్యూరి రేడియంలో ఉండే రేడియో యాక్టివిటినీ కనుగొన్నప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాలలో వేరువేరుగా శాస్త్రజ్ఞులు ఇదే విధమయిన పరిశోధనలని వెల్లడి చేసారు.

అత్యున్నత అహం అనేది ఒక సామూహిక అచేతన స్థితి యొక్క రూపం. అయితే ఇది నిజానికి అచేతనస్థితి కాదు. ఇది అత్యున్నతమయిన చేతనస్థితి. సమూహంగా ఉండే చేతనస్థితి మానవజాతి ఉనికికి చాలాముఖ్యమయిన విషయం. మనందరం ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉంటాము. మన ఆలోచనలు, పనులు వేరే వారిని ప్రభావితం చేస్తాయి. ఈ సమూహంలోని చేతనస్థితిలోనికి ప్రవేశించటం ద్వారా మనం విశ్వశక్తి యొక్క పరిధిలోనికి ప్రవేశించుతాము. మన వ్యక్తిగతం ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ, విశ్వ ఆత్మలో ఒక భాగం అవుతుంది. మనం భగవంతుడవుతాము.

సమూహ చేతనస్థితిలోనికి మనం చేరువయినప్పుడు ఒక కొత్త విషయం, ఒక కొత్త సంగతి జరుగుతుంది. దానికి చేరువ కాకముందు మనం తరంగాలు సృష్టిస్తుంటాము. మనం ఒకరికి ఒకరు ప్రభావితం చేసుకుంటాము. చాలసార్లు అది చాలా చెడుగా ప్రభావితం చేస్తాం. ఎందుకంటే మనలో నిస్వార్ధం అనేది

ఉండదు. కేవలం స్వార్ధమే ఉంటుంది. ఎప్పుడయితే సమూహ చేతన స్థితి యొక్క పరిధిలోనికి మనం వెళతూనే మనం ఒకరితో ఒకరం ఎంతగా కలసిపోతామంటే, అందరూ ఒకటిగానే అయిపోతాము. ఈ స్థితిలో మనం ఎటువంటి తరంగాలని సృష్టించలేము. ఎందుకంటే అందరూ ఉండేది ఒకే స్థితి, ఒకే సముద్రం, ఒకేనదిలా ఎటువంటి భేదం లేకుండా ప్రవహిస్తుంటాము.

ఇక్కడ కృష్ణుడు చెప్పిన "ప్రపంచంలో ప్రభావితం కాకుండా తాను ప్రపంచాన్ని ప్రభావితం చేయకుందా" అనే మాటకి అర్థం ఇదే .మనం సామూహిక చేతన స్థితికి చేరటమే. అదే భగవంతుని స్థితి : అక్కడ మీరు నేను, ఆయన అందరూ ఒక్కటే.

కృష్ణుడు ఇంకొక మాట కూడా అంటాడు. "ఎవరయితే సంతోషం కోపం, ఆదుర్దా అనేవి లేకుండా ఉంటాదో... దీని అర్ధం ఏమిటి? మనం కోపం ఆదుర్దా అనేవాటిని అర్ధం చేసుకోగలం, కానీ సంతోషం ఏమిటి? మనం ఎవరయినా కారణం లేకుండా సంతోషంగా ఉంటే, ఇతనికి ఏమయింది అని అడుగుతాము.

మనలో చాలా మందికి సంతోషం అంటే విచారానికి సంతోషం లేని స్థితికి మధ్యన ఉండే సమయం. రెండు యుద్ధాల మధ్య కాలాన్ని మనం శాంతి అని ఎలా అంటామో ఇదీ అంతే. ఇది ఒక అసత్యం.

సంతోషం ఉల్లాసం అనేవి స్పర్శేంద్రియాల ద్వారా బయట ప్రపంచం నుంచి మనకి కలిగిన అనుభవం. అది తప్పని సరిగా దుఃఖానకి దారి తీస్తుంది. సంతోషం అనేది మనం ఆశించినది పొందినప్పుడు మనకు దొరికే ఒక ఉపవస్తువు మనం ఆశించినది జరిగినప్పుడు, మనం సంతోషపడతాము. అవకాశాలు, నిజమయిన అవకాశాలు తరువాత దొరకకపోవచ్చు. అది జరిగినప్పుడు సంతోషం బదులు విచారం కలుగుతుంది.

భగవద్గిత - అధ్యాయం 12

సంతోషం అనేదానిని మనం మన అంతరంగం నుంచి మాత్రమే అనుభవించగలం. అది శాశ్వతమయినది. దానినే పరమానందం, నిత్యానందం అంటాము. పరమానందం శాశ్వతమయినది. సంతోషం స్థిరమయినది కాదు. పరమానందం శాశ్వతమయినది. మనం ఆశించటం అనే దానిని వదలగానే మనం దేనికీ అతిగా సంబంధం లేకుండా ఉంటామో, అప్పుడు కలిగే ఆనందమే పరమానందం. అదే నిత్యానందం.

సత్సంగత్యే నిశ్చంగత్వం నిస్పంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలితత్వం నిశ్చలితత్వే జీవన్ముక్తి

ఇది శంకరాచార్యులు రచించిన భజగోవిందంలోని ఒక ప్రసిద్ధి అయిన పాట.

ఈపాటలో శంకరాచార్యులవారు ఈ విధంగా చెబుతారు. అన్నిరకాల సంబంధాలని వదిలివేయటం ద్వారా కోరికలని పూర్తిగా తొలగించవచ్చు. కోరికలు లేని స్థితి మనలని నిశ్చలం, ప్రశాంతమయిన మనః స్థితిని కలిగిస్తుంది. ప్రశాంతత పరమానందాన్ని నింపుతుంది. పరమానందం మనకి ముక్తిని ప్రసాదించుతుంది.

శ్రీకృష్ణుడు సంతోషం లేనిస్థితి అని చెప్పినదానికి అర్ధం శాశ్వతమయిన సంతోషం. అది మన సంస్కారాల వలనకలుగుతుంది. అటువంటి సంతోషం వస్తుంది, పోతుంది. అది సంస్కారాలతో మనకి ఉన్నసంబంధాల వలన వస్తుంది. దానికి భ్రమలు, కల్పనలు శక్తిని ఇస్తాయి. మనం ఎప్పుడయితే ఇటువంటి సంతోషానికి అతీతంగా సంతోషం యొక్క శిఖరాగ్రానికి చేరతామో అదే పరమానంద స్థితి.

మనం పరమానంద స్థితికి చేరాలంటే సంతోషం, విచారం అనేస్థితికి అతీతంగా, సర్వోన్నత స్థితిని చేరాలి.

ఆదుర్దా లేదా ఆతృత అనేది మన ఆత్మకి ఉన్న కాన్సర్. మనం ఎప్పుడయితే ఆలోచించగల స్థాయికి చేరతామో, మనం ఆదుర్దాలో ఉండటం మొదలుపెడతాము. దీనితో వ్యధ చెందుతాము. మనం నిరంతరం బాధపడుతుంటాము. బాధపడటం, ఆదుర్దా పడటం. ఒత్తిడి అనేవి మన జీవితానికి ఊతకుర్రలు వంటివి.

ఆదుర్దా అనేది మనం అనుకున్నది చేయలేమేమో అనే భయం వలన కలుగుతుంది. మనకి మన కోరికలు ఆశలు ఉంటాయి. మనకి తెలిసిన మన నైపుణ్యం, శక్తి మనకి ఉంటాయి. కానీ చాలా సార్లు మన కోరికలు మనశక్తికి మన నైపుణ్యానికి సరిపడా ఉండవు. అవి నిజంగా సాధించగల దిశలో ఉండవు. అక్కడ కొంత ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ఖాళీ ప్రదేశమే వ్యధ, బాధగా రూపాంతరం చెందుతుంది.

మనం కళ్ళుమూసుకొని ఒకదానిమీద కాని ఒక సంఘటన మీద కాని ఏకాగ్రత నిలపాలి అని అనుకోగానే, మన ప్రయత్నాన్ని ఆలోచనలు అడ్డుకుంటాయి. మనం దేనిమీద అయితే ఏకాగ్రత నిలపాలనుకుంటామో అది తప్ప మిగతా ఆలోచనలు వస్తాయి. అదే మన మనస్సు మన అంతరంగంలో నిరంతం మాట్లాడే వ్యర్ధపు మాటలు (chatter) దీనినే బుద్ధుడు 'కోతి వంటిమనస్సు' 'మనస్సు కోతి' (monkey mind) అని అంటాడు.

ఈ అంతరంగలోని మాటలు అనేవి మన మైండ్ అస్థిరంగా మన భూత, భవిష్యత్‌ల మధ్య తిరుగుతూ ఉండటం వలన జరుగుతాయి. ఇది మన మనస్సు మనకి జరిగిపోయిన అనుభవాలు మనం జాగ్రత్తగా నిలువచేసిన జ్ఞాపకాలు వీటికి, మనకు తెలియని మన ఆశలు, ఆశించటాలు జరగబోయేవి ఊహించే విషయాలకి మధ్య ప్రయాణిస్తూ ఉంటుంది. ఇలా స్థిరం లేకుండా మనస్సు చేసే ప్రయాణాన్నే ఆలోచనలు అంటాము.

ఆదుర్దా అనేది ఎప్పుడయితే మనం ఆశించినది జరగదు అని మన మైండ్ తెలుసుకుంటుందో అప్పుడు కలుగుతుంది. ఇది అసలు జరగని ఏదో ఒక దానికి

భగవద్గిత - అధ్యాయం 12

సంబంధించిన నష్టం. ఇది పూర్తిగా ఒక ఊహ. అది మనలోపల తీవ్రమయిన భావావేశాలని సృష్టిస్తుంది. మనం ఏదో ఒక భయంకరమయినది జరగబోతున్నది అని ఆదుర్దాతో చూస్తాము. అయితే అసలు ఏదీ జరగకముందే మనం ఆచెడు జరిగే దాని గురించి చూస్తామ. ఆతరువాత తీవ్రమయిన కోపంతో అది జరిగేదాకా ఎదురు చూసాము.

చాలాసార్లు మీరు చెడు జరుగుతుంది, అని అనుకున్నది జరిగిపోయాకా చాలా విరామంగా అయిపోతారు. ఎప్పుడయితే భవిష్యత్ వర్తమానంలోనికి వస్తుందో మీలో ఆదుర్దా అనేది ఉండదు.

ఆదుర్దా అనేది భవిష్యత్‌కి సంబంధించినది : దాని మూలం మన అహంకారం. అహంకారం ఆశలు, ఆశించటాలు వంటి వాటిని సృష్టిస్తుంది. అవే 'నేను' 'నాది' అనేవి ఆశించినది జరగదేమో అనే భయం. దీనితో పాటు వస్తుంది. ఆదుర్దాని దాటిపోవాలి అంటే మనం వర్తమానంలో ఉండాలి.కేవలం వర్తమానం అనే ఆ పాయింట్ దగ్గరే మన అంతరంగంలోని మాటలు ఆగిపోయేది. ఎప్పుడయితే ఆ మాటలు ఆగిపోతాయో అప్పుడే ఆదుర్దా అనేది మాయం అవుతుంది.

శ్రీకృష్ణుడు 'ఎవరయితే ఆదుర్దా లేకుండా ఉంటారో, వారే నన్ను పొందగలగుతారు' అని అంటాడు. ఈ మాట అర్ధం ఏమిటంటే ఎవరియితే వర్తమానంలో, అంటే ఈ క్షణంలో ఉంటారో వారే నా దగ్గరకి రాగలరు అని. వర్తమానంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడు మనం మన ఉనికిలోని సత్యాన్ని స్పష్టంగా చూడగలుగుతాము.అదే శ్రీకృష్ణుని చేతనస్థితి. అప్పుడే మనం అతనిలో ఒకటిగా అయిపోగలం.

కోపాన్ని పోనివ్వు. ఎవరికైతే కోపం ఉండదో అతను నన్ను చేరగలడు అని భగవానుడు అంటాడు. పై మాటలని యథాతథంగా అర్ధం చేసుకుంటే మనం ఎవరం కూడా శ్రీకృష్ణని చేరలేము.

మనందరం ఎప్పుదో ఎక్కడో ఏదో ఒక సందర్భంలో కోపాన్ని ప్రదర్శించినవారమే. కోపం అనేది అనుకూలమయిన శక్తి సంపద (positive energy) కోపాన్ని ప్రదర్శించటం అనేది చాలా అనుకూలమయిన మంచి విషయం. ఇది కోపాన్ని ప్రదర్శించిన వ్యక్తికి, దానిని తీసుకున్న వ్యక్తికీ ఇద్దరికీ మంచి చేస్తుంది. ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు.

చాలా సందర్భాలలో కోపం అనేది అపరాధ భావంతో బయటకి వస్తుంది. ఎప్పుడయినా భార్యకాని భర్తగాని ఎవరయినా తప్పు చూపించితే మనం మనని సమర్థించుకోవటం ప్రారంభిస్తాము. మనం చేసిన తప్పును తెలుసుకోగానే, మనలో అపరాధ భావం బయటికి వస్తుంది. అయితే ఆ విషయం మనం ఒప్పుకోము. దాని బదులు కోపం తెచ్చుకుంటాము. మనం చేసిన తప్పు దాచాలి అని చూస్తాము. దానిని ఎవరైనా బయటకి తీసి చూపించితే మనకి ఇష్టం ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే చిరుతపులి తన మచ్ఛలని దాచి పెట్టటానికి ప్రయత్నించినట్లుగా ఉంటుంది.

ఇటువంటి కోపం మనపైకి గురిపెట్టబడి ఉంటుంది. మనలోని అపరాధభావం అంతరంగంలో మన బలహీనతల మీద కోపంగా మారుతుంది. అపరాధభావం అనేది మనం చేసే ఒక పెద్ద పాపం. మనం ఏ పని చేసినా ఆ సమయంలో మన తెలివితేటలతో, తెలుసుకో గల స్థితిలో ఉండి ఆ సమయానికి సరిపడే విధంగా చేసాము. ఒకసారి మనం ఏమిచేయాలనుకున్నాయో దానిని చేసేసాక, ఇక ఎట్టి పరిస్తితులోను దానిని మార్చలేము.

'కదిలే చేయి వ్రాస్తుంది, వ్రాయబడిన తరువాత ముందుకి కదులుతుంది' అని ఉమర్ కయ్యాం అంటారు. అది వ్రాసాక కదులుతుంది. ఆతరువాత మీ కన్నీరు కాని, మీ సానుభూతి కాని దానిని వెనుకకి తేలేవు. జరిగిపోయిన దానిని తిరిగి మార్చలేము. కాని అపరాధ భావాన్ని మార్చవచ్చు. ఆ భావాన్ని వదిలివేయవచ్చు.

భగవద్గిత - అధ్యాయం 12

మీరు చేసిన దానిని ఒప్పుకోండి. అంతే ముందుకి సాగండి. మీరు చేసిదానిని ఒప్పుకోను అని చెప్పి, ఆ విషయాన్ని ఒప్పుకుని ముందుకు సాగండి. మీరు అపరాధ భావాన్ని మీ నుంచి వెళ్ళిపోనీయండి. దానిని వదిలివేయండి.

ఎప్పుడయితే మనం అపరాధ భావాన్ని వదిలివేస్తామో, మన కోపం కూడా పోతుంది. ఎప్పుడయితే అపరాధ భావాన్ని వదిలివేస్తామో, మనలో అణిచివేయబడిన కోపం, పశ్చాత్తాపం, సమర్థించుకోవటం, లోపల లోపల కోపంతో మండిపోవటం ఇటువంటి భావావేశాలన్నీ వాటంతట అవే మాయమయిపోతాయి. అణచివేయబడిన కోపం వలన కాన్సర్ రావచ్చు. ఎవరయితే కోపాన్ని అణిచేసుకుని, నిశ్చలంగా శాంతంగా ఉంటూ, దానిని బయటకి వెల్లడి చేయరో వాళ్ళు ఆటంబాంబు మీద కూర్చున్నట్టే. అది ఎప్పుడైనా అనుకోకుండా పేలిపోతుంది. దాంతో అది కోపం ఉన్నవారికి, ఎదుటివారికి కూడా కష్టాన్ని నష్టాన్ని మిగుల్చుతుంది. లేదా అది అణగారిపోయి కాన్సర్‌లా బయటపడుతుంది.

మలేషియన్ సంస్కృతిలో చిన్నతనం నుంచీ పిల్లలని కోపం, దుఃఖం మొదలయిన వ్యతిరేకపు భావావేశాలు బయటకి ప్రదర్శించ కూడదు, అని నేర్పిస్తారు. ప్రతి ఒక్కరూ నిశ్చలంగా, శాంతంగా ఉండాలి అని చెబుతారు. కానీ ఎప్పుదో ఆకస్మాత్‌గా అగ్నిపర్వతం బ్రద్ధలవుతుంది. దాంతో వాళ్ళు పూర్తిగా అదుపు తప్పి చాలా కల్లోలాలు రేపుతారు. భావావేశాలని నియంత్రించటానికి ప్రయత్నించితే, మనం మన మీద పూర్తి నియం(తణని పోగొట్టుకుంటాము.

అప్పుడు మీరు అడగవచ్చు. ఈ బయటపడే కోపం సంగతి ఏమిటి? కోపాన్ని వెల్లడి చేసినప్పుడు బయటపడే హింసాత్మక కల్లోలం సంగతి ఏమిటి? ఒక్కసారి కోపాన్ని దానంతట అదేగా పోనిస్తే అప్పుడు బయటపడే కోపం, అంతరంగంలో కోపం ఇలాంటివి ఏవీ ఉండవు. మనం ఆవేశాలని సీసాలో పెట్టి గట్టిగా మూసేస్తాము. అది బద్దలవుతుంది. మన అంతరంగంలో కోపం మన చిన్నతనం

నుంచి అలా పేరుకుపోతూ ఉంటుంది. అది ఏవేవో చాలా కారణాల వలన గుట్టలుగా ఏర్పడిపోతుంది. మనం మనలోని వ్యతిరేకపు ఆలోచనలని సమాజానికి వ్యతిరేకంగా మనలో నింపుతుంటాము. సమాజపు నిబంధనలననుసరించి మనం వాటిని వెల్లడి చేయలేము. అలా చేయటం సంస్కారం కాదు కాబట్టి, బాగుండదు కాబట్టి వెల్లడి చేయము. అయితే అది ఎప్పుదో ఒకప్పుడు ఆకస్మాత్‌గా పేలిపోతుంది.

మనం కోపాన్ని మనుషుల మీద చూపించే కంటే విషయాల మీద చూపించటం నేర్చుకోవాలి. కోపం మనుషుల మీద వచ్చినప్పుడు దానిని వెంటనే కోపకారణమయిన అసలు సంగతి మీదకి మరలించాలి. అంతేకాని అది మనుషుల మీద ఉండకూడదు. వ్యక్తులు కేవలం కోపానికి మీరు చూపే కారణం మాత్రమే. అలా మనుషుల మీద కోపం వెల్లడి చేస్తే, అసలు విషయం లోతుగా ఎక్కడో కప్పబడిపోతుంది. అది ఎప్పుదో ఒక ప్రమాధికారిగా తిరిగి వస్తుంది. అది ఒక ఛేదించలేని విషవలయంలా తయారవుతుంది.

ఏదిఏమయినా మనం కోపాన్ని వెల్లడి చేయాలి. దాన్ని పూర్తిగా ఆ సంఘటన మీద చూపించండి. అంతేకాని దానికి వ్యక్తులకు సంబంధాన్ని పెట్టవద్దు. మనం మనకి కాని, ఎదుటి వారికి కానీ హాని కలుగకుందా కోపాన్ని వెల్లడి చేసి దానిని వదిలించుకోవాలి. అది సంభవమే. దీనికి కొంచెం సాధన చేయాలి. అంతే.

ఎప్పుడయితే కోపాన్ని వెల్లడి చేస్తామో దానికి సంబంధించిన జ్ఞాపకాలు కరిగిపోతాయి. ఇక కోపం ఉండదు. అలా కొంతకాలం గడిచే సరికి కోపం అనేది రాకముందే అది మాయం అయిపోతుంది.

శ్రీకృష్ణ భగవానుడు ఈ స్థితినే కోపానికి అతీతమయిన స్థితి అని అంటాడు. ఆ స్థితికి చేరినవారు ఆయనని చేరగలరు.

ారాయ అనపేక్ష శ్నుచిర్లక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారమ్బ పరిత్యాగీ యో మద్మక్త స్ప మే (పియః (12:16)

అర్గం : అనపేక్ష = కోరికలు లేనివాడు : శుచిః = శుభ్రత గలవాడు : దక్షః = కార్యసమర్థుడు : ఉదాసీనః = తటస్తంగా ఉండేవాడు : గత వ్యధః = దిగులు, కలత లేనివాడు : సర్వారంభ పరిత్యాగి = సర్వకార్యములని పరిత్యజించిన వాడు : యః = ఎవడు : మద్భక్తః = నాయందు భక్తి కలవాడును : సః = అతడు : మే = నాకు : (పియః = (పియమయినవాడు

భావం : కోరికలు లేనివాడు, బాహ్యాంతరాలలో శుద్ధికలవాడు, కార్య సమర్థుడు, (సమయస్ఫూర్తి కలవాడు) తటస్నుడు, కలత లేనివాడు, సమస్త కార్యములయందు కర్మత్వమును త్యజించినవాడు, నాయందు భక్తి గలవాడు ఎవరు కలరో వారే నాకు (పియమయిన వారు.

ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా ఉన్నత స్థాయికి వెళతాడు. ఎప్పుడయితే మీరు సంతోషం, ఆతృత, కోపం వంటి భావావేశాలని వదిలివేస్తారో, మీరు ఒక విధమయిన నిశ్చలస్థితిని, శాంతి స్థితిని చేరతారు. ఆ నిశ్చలస్థితి మిమ్మలని భగవంతునికి దగ్గరగా తీసుకువెళుతుంది. దేనితోనూ సంబంధాలు పెంచుకోకుండా, భావావేశాలతో ఉన్న సంబంధం నుంచి కోరికలపై మమకారం తెంపుకునే స్థితికి మీరు చేరతారు.

మనం అవసరాలకి, కోరికలకి మధ్య తేదా తెలుసుకోవాలి. ఈ భూమి మీద మనం జీవించటానికి మనం మన అవసరాలని తీర్చుకోవాలి. అవి భోజనం, నిద్ర, ఇల్లు ఇలాంటివి. మహావీరుడు ఈవిధంగా చెబుతాడు. ఈ విశ్వశక్తి నీకు కావలసిన అవసరాలన్నింటినీ నీవు జన్మించినప్పుడే నీకు సమకూర్చింది.

మీరు కేవలం ఆ విశ్వశక్తిని (భగవంతుని) నమ్మితే చాలు. మనం ఈ భూమి మీద ‌బ‌త‌క‌టానికి కావ‌ల‌సిన‌వ‌న్నీ స‌మ‌కూరుతాయి. అంత‌కుమించి మ‌న‌కి ఏమీ కోరిక‌లు ఉండవు.

కానీ మనం ఇంకా కావాలి అని అడగటం మొదలుపెడతాం. మన అవసరాలు తీరటం మనకి సరిపోదు. మనం మన చుట్లు ప్రక్కల ఉన్నవారిని గమనించి, వాళ్ళు మన కంటే సౌకర్యాలతో జీవిస్తున్నారు అని అనుకుంటాము. ఎదుటివారు మనకంటే సంతోషంగా ఉంటే మనం భరించలేము. మనం ఎదుటివారు నిరంతరం బాధపడుతుంటే అప్పుడు ఆనందంగా ఉంటాము. ఎందుకంటే వారితో పోల్చితే మన దుఃఖం తక్కువగా అనిపిస్తుంది.

మన ప్రక్క ఇంటివారు కొత్త ఎ.సి. మెషిన్ కొంటే, మన ఇంట్లో వేడి పెరిగిపోతుంది. మన ఎదురింటి వారు రిఫ్రిజిరేటర్ ((ఫ్రిజ్) కొంటే, మన ఇంట్లో ఆహార పదార్దాలు పాడయిపోతుంటాయి. ఇవన్నీ మన మైండ్ ప్రారంభిస్తుంది. ఎదుటివారు కొత్తకారు

కొనగానే మనకారు స్లోగా అయిపోతుంది. ఇలా ప్రతి ఒక్కటి ఎదుటివారితో పోల్చుకోవటంతో సరిపోతుంది.

ఇది మనలో నిరంతరం 'తరువాత' ఏమిటి, తరువాత ఏమిటి? అని అనటమే మనం సాధించినది. సంపాదించిన కోరికని ఉపయోగించుకోవటం మొదలు పెట్టకుందానే, మన తరువాత కోరికకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాము. మనం పొందిన దానితో ఎప్పుడూ సంతోషపడటం. కోరిక వెనుక పరుగులు తీయటంలోనే ఆనందపడతాము. ఈ కోరిక వెనుక పరిగెత్తటానికి అంతం (చివర) ఉండదు.

మీరు మీ కుటుంబంలో అందరి కంటే ధనవంతులయితే, ఆ వీధికి ధనవంతులు అవ్వాలనుకుంటారు. ఆ తరువాత ఆ ఊరికి, దేశానికి ప్రపంచానికి ఇలా వెళుతూనే ఉంటారు. దీనికి చివర అనేది ఉండదు.

భగవాన్ రమణ మహర్షి చాలా అందంగా, ఆర్థంగా ఇలా చెబుతారు. " ఈ విశ్వం ప్రపంచంలో అందరి అవసరాలు తీర్చగలుగుతుంది : కానీ ఒక్క మనిషి కోరికలని మాత్రం తీర్చలేదు".

కోరికలకు అంతం ఉండదు. కోరికలు అంటే బాధలే. కోరికలు అనేవి మనం ఎదుటివారితో పోల్చుకున్నప్పుడు వస్తుంటాయి. అవసరాలు మనం ముందుకు పోగల శక్తిని ఇస్తాయి. మనకి దేనినైనా సాధించే శక్తిని ఇస్తాయి. కోరికలు మాత్రం బాధలని, కలతలని మోసుకువస్తాయి.వాటిలో మన బాధలు యొక్క విత్తనాలు ఉంటాయి.

నేను THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్పురణ కార్యక్రమం (NSP) లో క్లాసులు తీసుకున్నప్పుడు అందులో పాల్గొన్నవారిని శక్తి పొరల నుంచి ప్రయాణం చేయించుతాను. మనం చనిపోయినప్పుడు ఆత్మ మనలో ఉండే ఏడు శక్తి పొరలని దాటి వెళుతుంది. ఆ

క్రమంలో, బయటికి వెళ్ళిపోయే ఆత్మ తను ఆ శరీరంలో ఉన్నన్ని రోజులు జరిగిన వన్నింటినీ గుర్తు చేసుకుంటుంది. ఇది పాస్ట్రెరిప్లేలా ఉంటుంది. ఆ జీవిత కాలంలో జరిగిన ప్రతి సంఘటన, దాని జ్ఞాపకాలలో ఉంటుంది.

ఇలాంటి ఒక క్లాసులో నేను వారినందరినీ వారి కోరికలు అవసరాల గురించి వ్రాయమంటాను. వాళ్ళు కొన్ని పేజీలు నింపేస్తారు. నేను వాళ్ళని ఆ లిస్ట్ మళ్ళీ మళ్ళీ చూసి మార్పులు చేయిమంటాను. ఆ తరువాత వాళ్ళు ధ్యానం చేస్తారు. ధ్యానం చివరిలో నేను వారిలో ఆ లిస్టులోని కోరికలని గుర్తు తెచ్చుకోమని చెబుతాను. అయితే వాళ్ళు వ్రాసిన లిస్టులో కొంత భాగాన్నిమాత్రమే గుర్తు చేసుకోగలుగుతారు.

ఇది ఎలా వుంటుందంటే, వాళ్ళు వ్రాసిన లిస్ట్‌లోని కోరికలు ఒక పెద్ద వృక్షంలా ఉండి నిండా, కోరికలనే ఆకులతో ఉంటుంది. ధ్యానం చేసే సమయంలో ఆకులన్నీ పండిపోయి ఎండిపోయిన ఆకులులా అన్నీ రాలిపోతాయి. అవి ప్రాణంలేని ఆకులు. మిగిలిన కొంచం ఆకులు ఎంతో ప్రకాశంతో ఉంటాయి. అవి బంగారు ఆకులు.

వారి జ్ఞాపకాలలో మిగిలిన కోరికలే ప్రకాశంతో ఉంటాయి. ఆ కోరికలు అనుకున్నది సాధించటానికి కావలసిన శక్తిని తమలో నింపుకొని ఉంటాయి. ఇవే వారిలో ఉండే నిజమయిన కోరికలు.

ఈ క్రమాన్ని అంతా ఒక పద్ధతిగా జాగ్రత్తగా, పూర్తిగా తెలుసుకునే స్థితిలో చేస్తే, అవన్నీ కూడా నిస్వార్దపు కోరికలే ఉంటాయి. అవి ఆ వ్యక్తికి చాలా ఉపయోగపడతాయి. దానిలో అనుమానం లేదు. ఆ కోరికలు మానవజాతికి ఎంతో ఉపయోగపడతాయి. అటువంటి నిస్వార్ధపు కోరికలు మాత్రమే నిరంతరం తమలో విశ్వశక్తిని నింపుకొని ఉంటాయి. అదే మన నిజమయిన తృప్తిని సాధించటానికి ఉపయోగపడతాయి.

భగవద్గీత - అధ్యాయం 12

(పేమే మీ జీవితం తీర్చిదిద్దుకోండి

ఎప్పుడయితే కోరికలు మన నిజమయిన కోరికలు అవుతాయో, అవి మన నిజమయిన అవసరాలని తీర్చగలగేటట్లు ఉంటాయో, ఎప్పుడయితే అవి మన అంతరంగంలోనికి శక్తిని వెల్లడి చేస్తుంటాయో, అప్పుడు మనం వాటిని సాధించటానికి ప్రయత్నించేసమయంలో మనం నిరాశ నిస్పృహలు పొందము. ఈ కోరికలు సహజంగా జరిగే ఒక క్రమంలో అవి తీర్చబడతాయి అని మనం తెలుసుకోగలుగుతాము. మనం పరుగులు తీయం. మనం సమస్యలలో ఉండం. అవి జరుగుతాయి అని మనం నమ్ముతాము. ఆ నమ్మకాన్ని ఒప్పుకాన్ని ఒప్పుకుంటాము.

శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ విధంగా ఓదార్పుతో చెబుతాడు. " నీ కోరికల బంధం నుంచి విముక్తుడవి అవ్వు. నిస్వార్ధంతో ఉండు అప్పుడు నీకు వ్యధలు ఉండవు. స్వేచ్చని పొందుతావు. అప్పుడు నీవు నన్ను చేరగలుగుతావు."

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభా పరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియంః (12:17)

అర్గం : యః = ఎవరు : న హృష్యతి = సంతోషంతో ఉప్పొంగదో : నద్వేష్టి = ద్వేషింపదో : నశోచతి = శోకింపడో : న కాంక్షతి = కోరికలు కోరదో : యః = ఎవరు : శుభాశుభ పరిత్యాగి = శుభా అశుభములని వదిలివేస్తాడో : సః భక్తిమాన్ = అటువంటి భక్తుడు, మే = నాకు : ప్రియః = ప్రియమయినవాడు.

భావం : ఎవరయితే సంతోషింపదో, ద్వేషింపదో, శోకమును పొందడో, ఎవరయితే శుభాశుభములని వదిలివేస్తాడో, అట్టి భక్తుడు నాకు ప్రియమయినవాడు.

శ్రీకృష్ణుడు మన మనస్సుని నియంత్రించగల మరొక దశకి వెళతాడు.

ఇప్పుడు ఆయన ఎవరయితే ప్రేమించరో, ఎవరయితే ద్వేషించరో అని అంటారు. ఆయన ఎవరినీ ప్రేమించని వ్యక్తి గురించి మాట్లాడటం లేదు. మనం ప్రేమించినప్పుడు అందులో చాలా నియమ నిబంధనలు, షరతులు, అశించటాలు ఉంటాయి. మనం ఆశించేవి అన్నీ అనుకున్నట్లుగా జరుగుతున్నంతకాలం ఈ ప్రేమ బాగానే పని చేస్తుంది. ఎప్పుడయితే మనం ఆశించినదానికి కొంచెం వ్యతిరేకంగా ఏదయినా జరిగితే ఆ ప్రేమ సూర్యకిరణం పడిన మంచు బిందువులా మాయమవుతుంది. అప్పుడు ఆ స్థానంలోనికి ద్వేషం వస్తుంది.

ద్వేషం, ప్రేమ అనేవి ఒక నాణానికి ఉండే రెండు వైపులు. ఇది మన ప్రేమలో నియమ నిబంధనలు, ఆశించటం ఉన్నంత వరకూ ఈ రెండూ ఒకే నాణంలో ఉంటాయి. ఎప్పుడయితే మన ఆశలకి, ఆశించటానికి ఏదైనా సవాలు ఎదురైతే ప్రేమ కాస్తా ద్వేషంగా మారిపోతుంది. ఇటువంటి ప్రేమలో ఉండే సంతోషం కేవలం బయట సంతోషం మాత్రమే.

చాలాసార్లు మనం అనుకునే ప్రేమ కాలానికి, స్థలానికి సంబంధించి ఉంటుంది. ఎంతకాలం అయితే ప్రేమికుల మధ్య దూరం ఎక్కువగా ఉండి, వారు కలసి ఉండే సమయం తక్కువగా ఉంటుందో, అంతకాలం ఒకరిలో మరొకరికి లోపాలు కనిపించవు. ఒకవేళ కనిపించినా చాలా చిన్నవిగా తక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఆశించటాలు తెలపటానికి సరిపడా సమయం ఉండదు. అవి ఏర్పడే అంతగా వారి మధ్య సంబంధం, సంభాషణలు జరగవు. ఎప్పుడయితే ఒకరికాకరు బాగా దగ్గరగా వచ్చి, చాలా సమయం కలసి ఉంటారో అప్పుడు ఒకరినొకరు చాలాసేపు చూసుకుంటారు. అప్పుడు వారిలోని చిన్న లోపాలు స్పష్టంగా కనపడతాయి. వారిలో చికాకు భావాలు మొదలవుతాయి. అది ప్రేమని ద్వేషంగా మార్చుతుంది. ప్రేమ, ద్వేషం అనేవి ఒకే విధమయిన భావాన్ని వెల్లడి చేసే వేరు వేరు పద్దతులు.

వాటిని మనం నిజాలు అనుకుంటాము. వీటిని మార్చాలి అంటే మనం ప్రేమలో ఆశించటాలు, నిబంధనలని వదిలివేయాలి.మనం అతిగా ప్రేమకి సంబంధాలు పెట్టుకోకూడదు. మనం నియమనిబంధనలు లేని ప్రేమని చూపించాలి.

మనం మన జీవితాలలో చాలా రకాలయిన సంబంధాల గుండా వెళుతాము. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం పూర్తిగా మన తల్లిదం(డుల మీద ఆధారపడతాము. మనం వారిచేత చాలా ప్రభావితం అవుతాము. ఈ ప్రేమలో నిబంధనలు ఉండవు. ఎందుకంటే మనకి ప్రత్యామ్నాయాలు ఉండవు. కాబట్టి జీవించాలి అంటే పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడవలసినదే. పిల్లల సహజలక్షణం, వారి ఏకాగ్రత వారి మీద మాత్రమే ఉంటుంది. వారికుండే భావావేశాలన్నీ వారి తల్లిదండ్రుల మీద వారి జీవనం కోసం ఆధారపడటం మీద ఉంటుంది. ఇది పూర్తిగా ఆధారపడే ప్రేమ.

మనం యుక్తవయస్సు వచ్చేటప్పటికి బయట ప్రపంచాన్ని చూస్తాము. మనం పిల్లలుగా తల్లిదంlదుల విషయాలలో అనుకున్న చాలా విషయాలని ప్రశ్నించటం మొదలుపెడతాం. అందుకే ఆ వయస్సులో వారు ప్రతి దానికి తిరగబడతారు. ఎదురించుతారు. వాళ్ళు ఆధారపడటం తగ్గించేస్తారు. వాళ్ళు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. వాళ్ళు నిబంధనలని పట్టించుకోరు.

మనం పెద్దవారమయ్యాక మన జీవనం కోసం సమాజపు నిబంధనలు, కట్టణాట్లు అనుసరించుతాము. ఎందుకంటే మనం సమాజంతో కలిసి ఉండాలి కాబట్టి. అప్పుడు మనం కలసి బతికే సూతాలని నేర్చుకుంటాము. మనం అందరితో కలసి పని చేయటం నేర్చుకుంటాము. మనం వేరే వారితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటాము. లేకపోతే మనం ఈ సమాజంలో ఇమడలేము. పెద్దవారయ్యాక అందరూ నేర్చుకునే చాలా ముఖ్యమయిన పాఠం, అందులో అర్ధవంతమయిన

భగవద్గీత - అధ్యాయం 12

సంబంధ భాందవ్యాలని ఏర్పరచుకోవాలి. వీటిలో ముఖ్యమయినది భార్య భర్తల సంబంధం.

మనం పెద్దవారమయ్యే కొద్దీ మనకి ఆత్మాభివృద్ధి ముఖ్యం అనిపిస్తుంది. దానికి మనం ఇతరుల మార్గదర్శకత్వం తీసుకుంటాము. అప్పుడే మనం గురువుల కోసం వెతుకుతాము. గురువులతో ఉండే సంబంధం మన చిన్ననాటి సంబంధానికి వ్యతిరేకంగా ఉంటుంది. మనం మరొకసారి జీవనం గురించి ఆలోచించుతాము. అయితే ఈ జీవితం మన శరీరం, మనస్సు కాదు ఈ జీవితము ఆత్మకోసం మన ఆత్మయొక్క జీవనం కోసం మనం గురువులతో సంబంధాలని ఏర్పరచుకుంటాము. ఇది పూర్తిగా ఆధారపడే సంబంధం. అయితే ఈ ఆధారపడటం కొంచం వేరుగా ఉంటుంది. ఈ సంబంధాలు పనిచేయాలంటే, ఇది పూర్తిగా నిర్శందాలు లేనిది అయి వుండాలి.

గురువుతో, శ్రీకృష్ణునితో సంబంధం సజావుగా పని చేయాలంటే ఇక్కడ కావలసినది నియమనిబంధనలు లేని ప్రేమ. అది పూర్తి ఆధీనత. ఆధీనతలో ప్రేమ, ద్వేషం ఉండవు. ఆధీనత మాత్రమే ఉంటుంది.

ఎప్పుడయితే గురువుకి, సర్వాంతర్యామికి పూర్తిగా ఆధీనమయిపోతామో అప్పుడు మంచి చెడు, పాపం, పుణ్యం ఇలా ఏమీ ఉండవు. అన్ని మాయమయిపోతాయి.

ఆధ్యాత్మిక పరిధిలో ఆలోచించితే పాపం అనే మాట ఎక్కడా లేదు. మనపైన ఎవరూ కూర్చొని మన పాపాలని లెక్కలు కడుతూ పెన్సిల్, పేపర్ పట్టకుని ఉండరు. అసలు స్వర్గం, నరకం అనే స్థలాలే లేవు. నరకం, స్వర్గం అనేవి ఏవో కంటికి కనపడే స్థలాలు కాదు. మనం మానసికంగా మన మనస్సులో

ఏర్పరచుకున్నవి మాత్రమే. మనం పాపాలు ఎందుకు చేస్తాం అంటే మనం నరకంలో ఉంటాము కాబట్టి. అలాగే మంచిపనులు, ఎదుటివారికి మనకి హాని జరగని పనులు చేస్తున్నాము అంటే మనం మన స్వర్గంలో ఉన్నాము అని అర్ధం.

మతం మనని నియంత్రించటానికి స్వర్గం, నరకం అనే విషయాలని పాపం పుణ్యం అనే మాటలని తీసుకువచ్చింది. అర్ధం చేసుకోండి. పాపం, స్వర్గం, నరకం అనేవి ఎక్కడా లేవు. మిమ్మలని పాపులు అని ఎవరయినా అంటే వారే నిజమయిన పాపులు. వాళ్ళు మిమ్మలని అలా అన్నారు అంటే, వాళ్ళు మిమ్మలని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. అన్ని మతాలు కూడా ప్రజలని భయం, ఆశ అనే వాటితో కంట్రోల్ చేయాలని చూస్తున్నాయి. దానినే కారెట్ స్టిక్ సూత్రం అంటారు. లేకపోతే మతం మనని తన గుప్పెటలో ఉంచుకోలేదు. అవి వ్యాపార సంస్ధలుగా బతకలేవు. ప్రస్తుతం అవి అలాగే వ్యవహరిస్తున్నాయి.

శ్రీకృష్ణుడు ఈ మూసని బ్రద్ధలు చేసాడు. ఆయన మనని మంచి చెడుకి అతీతంగా వెళ్ళమని చెప్పాడు. ఆయన అలా ఎందుకు చెప్పాడంటే అటువంటివి లేవు కాబట్టి. అవన్ని మన మైండ్‌లో మాటలే. ఎప్పడయితే మనం ఇది అర్ధం చేసుకుంటామో, మనం అతని దారిలో ఉన్నట్లే. అది ఆయన మనకు చేసిన ప్రబోధం

నమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః
శీతోష్ణ సుఖదుఃఖేఘ సమస్సజ్గవివర్జితః
తుల్య నిన్ధాస్తుతి ర్యానీ సంతుష్టో యేన కేనచిత్
అని కేతః స్దిర మతిర్బక్రిమాన్మే (పియో నరః

అర్ధం : శత్రౌచ = శత్రువు నందును : మిత్రేచ = మిత్రులయందు : తథా = అటులనే : మానవమానయోః = గౌరవము, అగౌరవమునందు : సమః = సమభావము కలవాడు : శీతోష్ణా = చలియందు, వేడియందు : సుఖ దుఃఖేఘ = సుఖదుఃఖము నందు : సమః = భావముతో ఉండువాడు : సంఘ వివర్జిత = దేనియందు ఆసక్తి లేక అన్ని సంబంధాలు విడిచినవాడు. : తుల్య = సమానముగా : నిన్దాస్తుతి: = నిందలను, ప్రశంసలను : మౌని = మౌనంగా ఉండువాడు : మేనకేనచిత్ = దేనితో నైనా (దొరకిన దానితో) : సంతుష్టః = తృప్తి పొందువాడు : అనికేతః స్థిరమయిన నివాసం లేనివాడు (గృహముల యందు ఆసక్తి లేనివాడు) స్థితివాతిః = నిశ్చయబుద్ధి కలవాడు : భక్తి మాన్ = భక్తిలో నిమగ్న మయినవాడు : మే = నాకు : ప్రియః = ప్రియమయిన వాడు : నరః = మనుష్యుడు

భావం : శత్రువుల యందును, మిత్రులయందును సమాన భావం కలవాడు, గౌరవం, అగౌరవాన్ని, చలి, వేడి పరిస్థితులని సమానంగా చూడగలిగిన వానిని, దేనియందు ఆసక్తి లేనివాడును, ప్రసంశలయందు విమర్శలయందు మౌనంగా ఉండువాడు, దేని చేతనైననూ సంతృప్తి పొందువాడు నిర్దిష్టంగా గృహమునందు ఆసక్తి లేనివాడు, నిశ్చయమగు బుద్ధికల వాడును, భక్తితో గూడి యుండువాడును అగు వ్యక్తి నాకు ప్రియమయిన వాడు.

నీవు ఒకే ఇంటితో అనురాగం లేక ప్రేమ కలిగి ఉన్నట్లయితే, వేరాక నీకు కొత్త ప్రదేశం అవ్వవచ్చు. దానివలన నీవు ప్రయాస పడవచ్చు. ఒకే ఇంటితోనే అనురాగం లేక ప్రేమ అనే ఆలోచనే నీకు లేనట్లయితే నీవు ఎక్కడికెళ్ళినా నీ ఇంటిలో ఉన్న భావనతోనే ఉంటావు.

భగవద్గీత - అధ్యాయం 12

శ్రీకృష్ణ భగవానుడు మరొకసారి "సంపూర్ణమయిన భక్తిలో ఉండే వ్యక్తి నాకు చాలా ప్రియమయిన వాడు" అని అంటాడు. ఆయన ఇక ఎటువంటి రూల్స్ చెప్పటం లేదు. అంటే ఆయన తన సూచనలనీయటం ముగించబోతున్నాడని అర్ధం. అయన ఇలా అంటాడు. ఈవిధంగా ఎవరయితే ఈ మార్గంలో ఉంటాడో అతనిని నేను ప్రేమిస్తాను. అంతే. నాకు మరి దేని మీదా ఆసక్తి లేదు.

శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతాడు 'ఎవరైతే స్నేహితులని, శత్రువులని ఒకే విధంగా చూదగలదో, ఎవరయితే గౌరవం పొందినప్పుడు అగౌరవం పొందినప్పుడు ఒకేవిధంగా ఉండగలరో, ఎవరయితే వేడియందు, చలియందు ఒకే విధంగా నిలవగలిగితే, సంతోషం బాధ కలిగినపుడు ఒకే విధంగా ఉంటే, ఎవరయితే పొగడలకి, విమర్శలకి ఒకే విధంగా స్పందించుతారో, ఎవరైతే తనకు ఉన్నదానిలో సంత్సప్తిని పొందుతారో ఎవరైతే నిశ్చితమయిన మనస్సుతో ఉంటారో గృహమందు ఆసక్తి లేకుందా ఉంటారో అటువంటి వ్యక్తి, సంపూర్ణ భక్తితో నిండి ఉన్న వ్యక్తి, నాకు చాలా ప్రియమయిన వ్యక్తి.

ఇక్కడ ఒక చక్కని మాట ఉన్నది. ఎవరయితే ఎటువంటి ఇల్లు అనే దానిని పట్టించుకోదో, ఎవరయితే తన కోసం ఇల్లు కట్టుకోవాలి అని అనుకోదో....

మీకు ఒక కథ చెబుతాను. రావణాసురుడు ఒక కల్పకాలం (చాలా వేల సంవత్సరాలు) జీవించుతాడు. వ్యాసమునీంద్రులు నాలుగు కల్పాలు జీవించుతారు. రావణుడు లంకాపురిని కట్టుకుంటాడు లంకాపురిని శివుడు రావణునికి బహుమతిగా ఇస్తాడు. దానిని అతను బాగా అభివృద్ధి చేస్తాడు.

ఒకసారి వ్యాసుడు లంకాపురికి వస్తాడు. రావణుడు ఆయనతో "ఓ వ్యాసా! నా భవనం చూసావా! నాదేశాన్ని చూసావా! ఎంత గొప్పగా ఉన్నయో కదా!" అంటాడు. దానికి వ్యాసుడు "అవును నేను చూసాను" అంటాడు.

భగవద్గీత - అధ్యాయం 12

ప్రేమే మీ జీవితం ఉద్దేశం

రావణుడు వ్యాసుణ్ణి నగరంలోనికి తీసుకెళ్ళి అంతా చూపించుతాడు. ఎంతో గర్వంగా తన వైభవాన్ని చూపిస్తాడు. ఆ తరువాత రావణుడు వ్యాసమునిని "నీవు కూడా నీ కోసం ఒక భవంతిని నిర్మించుకోవచ్చు కదా!" అంటాడు.

అప్పుడు వ్యాసముని చిరునవ్వు నవ్వి "రావణా! నా జీవిత కాలం నాలుగు కల్పాలే. నాకు అంత సమయం లేదు. ఇల్లు కట్టుకుంటూ ఉన్న ఈ కొంచం సమయాన్ని నేను వృధా చేయలేను. ఇక్కడ నేను ఉండేది కేవలం నాలుగు కల్పాల కాలం మాత్రమే. ఎందుకు నేను ఇల్లు కట్టి సమయం వృధా చేసుకోవాలి?" అని అంటాడు.

రావణుడు జీవించినది కేవలం ఒక కల్పమే. దాని కోసం అతను అంత పెద్ద భవంతిని నిర్మించుకున్నాడు. వ్యాసుడు నాలుగు కల్పాలు జీవించాడు. రావణుడి కంటే నాలుగు రెట్లు ఎక్కువ కాలం జీవించాడు. అయినా కూడా ఇల్లు కట్టుకోవటం సమయాన్ని, తన జీవితంలో ఒక భాగాన్ని వృథా చేయటమే అని అనుకున్నాడు.

కాబట్టి ఎవరయితే తనకోసం ఇల్లు కట్టుకోవాలి అని ఏమాత్రం అనుకోని వ్యక్తి, పూర్తిగా భక్తితో నిండి ఉండే వ్యక్తి నాకు ప్రియమయిన వాడు అని శ్రీకృష్ణుడు చెబుతాడు.

ఇక్కడ మీకు నేను ఒక విషయం చెప్పాలి. నేను భక్తుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారు నన్ను అడుగుతుంటారు "స్వామీజీ! ఇది కొత్త స్థలం. ఇల్లు మీకు కొత్త కదా! మీకు నిద్రపట్టిందా?"

నేను వాళ్ళకి చెబుతాను, ఎప్పుడయితే మీకు ఒక ఇంటితో మాత్రమే సంబంధం ఉంటే, అప్పుడు కొత్త చోటికి వెళ్ళినపుడు కష్టపడతారు. మీకు ఏ ఇంటితో ఎక్కువ అనుబంధం లేకపోతే మీరు ఎక్కడికి వెళితే అదే మీ ఇల్లు అనుకుంటారు.

ఆశ్రమ రికార్డుల ప్రకారం గత రెండేళ్ళలో నేను కొన్ని ఇళ్ళకి వెళ్ళాను. కొన్ని సార్లు భరత్ లో ఒకేసారి కొన్ని ఇళ్ళకి కూడా వెళతాము. కొన్నిసార్లు ప్రతి ఇంటిలో పాదపూజ చేస్తారు. నేను అలా ఇంటికి వెళ్ళి వారిని దీవించి వస్తుంటాను. నేను ప్రపంచమంతా కొన్ని వందల ఇళ్ళల్లో ఉన్నాను. నేనెప్పుడూ ఎక్కడా ఇది కొత్త ప్రదేశం అని అనుకోలేదు. ఉండటానికి కష్టపడలేదు. నాకు ఎక్కడ ఉన్నా అది నా ఇల్లే అనిపించేట్లు ఉంటాను. మర్నాడు వారు నన్ను అదుగుతుంటారు "స్వామీ! మీకు సౌకర్యంగా ఉన్నదా! మీరు బాగా నిద్రపోయారా?" అని

నేను వారికి చెబుతాను, ఇందులో ఏముంది, నేను చేయి చాపితే భోజనం వస్తుంది. కాలు జాపితే నిద్రవస్తుంది. అంతే. అదే జీవితం. అంతకుమించి ఏమీ లేదు. మీరు ఏ ఒక్క ఇంటితో అనుబంధం పెంచుకోకుండా ఉంటే, మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా విశ్రాంతిగా ఉండగలుగుతారు.

కొంతమంది నన్ను అడుగుతుంటారు. నిరంతరం నేను ఎలా ప్రయాణాలు చేయగలుగుతున్నాను అని.

ఈ ప్రశ్న ముఖ్యంగా వ్యాపార విషయంపై బాగా ప్రయాణాలు చేసే వారి దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు ఇలా చెబుతారు. "మేము ఒకటి రెండు చోట్లకి వెళితే, తిరిగి వచ్చాక వారంరోజులకి కానీ పూర్తిగా సర్దుకోలేము. అప్పటికి కానీ మేము మా రోజు వారి పనిలోనికి పూర్తిగా వెళ్ళలేము. సౌకర్యంగా ఉండలేము. మీరు ఎలా అలా నిరంతరం ప్రయాణాలు చేస్తూనే ఉంటారు?"

నేను ఒక వారం కంటే ఎక్కువగా ఎక్కడా ఉండను. ఇప్పుడు లాస్యాయాంజిల్స్ లో ఆశ్రమం వచ్చాక అక్కడ మాత్రం నేను ఒక వారం కంటే ఎక్కువ ఉంటున్నాను. లేకపోతే ఎక్కడా ఒక్క వారం మించి ఉండను.

నేను ఇలా ప్రయాణాలు చేస్తూ సౌకర్యంగా ఉండటంలో గల రహస్యం ఏమిటంటే నేను ఏ ఇంటితో కూడా అనుబంధం పెంచుకోను. అప్పుడే మనం ఈ ప్రపంచం మొత్తంతో అనుబంధం పెంచుకోగలం. అటువంటప్పుడు మీరు ఎక్కడ ఉన్నా విశ్రాంతిగా ఉండగలరు. ఆనంద పారవశ్యంలో ఉండగలరు. శ్రీకృష్ణుడు చెప్పినట్టు, ఎవరియితే ఏ ఇల్లుని పట్టించుకోదో, అటువంటి వ్యక్తి భక్తితో ఉంటాడు. అతనే నాకు చాలా ప్రియమయిన వ్యక్తి.

ఎవరయితే ఏదో ఒక ప్రాంతానికి స్థిరపడిపోడో అతను తన మైండ్‌లో (మనస్సుతో) స్థిరపడగలడు.

ఎప్పుడయినా ఎవరయినా రమణమహర్షి దగ్గరకి వచ్చి ఎలా ధ్యానం చేయాలి అని అడిగితే ఆయన అరుణాచలం కొండ మీద ఏకాగ్రతని నిలిపి దాని చుట్టూ ప్రదక్షణ చేయమనే వారు (తిరగమనేవారు). దానికి వారు ఆశ్చర్యపోయేవారు. ఆయన ఎందుకు అలా చెప్పాడు? అలా అయితే ధ్యానం ఎలా చేస్తాం. నడుస్తూ చేయం కదా! ధ్యానం అంటే నేల మీద కూర్చొని చేసేది కదా! అని అనుకునే వారు.

అది కాదు. అర్ధం చేసుకోండి. ఎప్పుడయితే శరీరం కదులుతూ ఉంటుందో, మనస్సుని స్థిరంగా ఉంచటం తేలిక. మా చక్రా ధ్యాన కార్యక్రమం, లైఫ్ బ్లిస్ కార్యక్రమాలలో ఒక ధ్యానం చేయించుతాము. ఆ ధ్యానం విశుద్ధి చక్రం మీద (గొంతు దగ్గర ఉండే చక్రం) చేయించుతాము. ఆ ధ్యానంతో చాలా చురుకుగా శరీరాన్ని కదపాలి. అలా కదుపుతూ (నడుస్తూ) విశుద్ధి చక్రం మీద ధ్యాస ఉంచాలి. ఇది శక్తిని ఇచ్చే చాలా గొప్ప ధ్యాన పద్ధతి. ఎప్పుడయితే శరీరం కదులుతూ ఉంటుందో, మనస్సుని స్థిరంగా ఉంచటం చాలా సులభం.

ఎప్పుడయితే ఎవరయినా పూర్తి వర్తమానంలో ఉంటారో, ఎప్పుడయితే తెలుసు కోగల స్థితిలో ఉంటారో, ఎప్పుడయితే వారి చేతనస్థితి విప్పారి ఉంటుందో, అప్పుడు వారిలో ద్వైత్వం ఉండదు. అప్పుడు ఆత్మ పరమాత్మలో, విశ్వాత్మలో లీనమయిపోతుంది. మనం భగవంతునితో ఒకటిగా అయిపోతాము. అప్పుడు అందరూ మనవారే అయిపోతారు. అప్పుడు స్నేహితులు, శత్రువులు అనే తేడా ఉండదు. మనం ప్రకృతిలో ఒకటి అయిపోతాము. అప్పుడు చలి, వేడి అని అనుకోము కదా! దానితో అసౌకర్యంగా ఉండే ప్రశ్న లేదు. ఈ అనంత విశ్వంలో మనమూ ఒక భాగమయినప్పుడు అంతా ఒక్కటే అని అనుకున్నప్పుడు ఇంకా గౌరవం అగౌరవం అనే మాట ఉండదుగా. గౌరవం, అగౌరవం ఎవరి నుంచి? ఎవరితో? అనుభవమూ, అనుభవం పొందే వ్యక్తి ఇద్దరూ ఒక్కటే. అనుభూతిని వెల్లడి చేయటం, అనుభవము అన్నీ ఒక్కటే.

శ్రీ కృష్ణుడు మన అందరినీ ఒక స్థితికి తీసుకువెళుతున్నాడు. అదే శ్రీకృష్ణుని యొక్క చేతనస్థితి. అదే భగవంతునిలో ఒకటిగా విలీనమయ్యే స్థితి. ఆ భగవంతుని లోనే ద్వైత్వం అంతా విలీనం అయిపోతుంది.

యే తు ధర్మ్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ద ధాన మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః (12.20)

అర్థం : యేతు = ఎవరైతే : శ్రద్దధానాః = శ్రద్ధవంతులై : మత్పరమాః = నన్నే పరమాత్మగా నమ్మినవారై : ఇదమ్ = ఈ : ధర్మ్యామృతమ్ = అమృతరూపమగు ధర్మమును : యథోక్తమ్ = ఈ ప్రకారం : పర్యుపాసతే = అనుసరించుతారో : తే భక్తాః = అట్టి భక్తులు : మే = నాకు : అతీవ = మిక్కిలి : ప్రియాః = ప్రియమయిన వారు

ఎవరైతే శ్రద్ధవంతులై, నన్నే పరమగతిగ నమ్మి, ఈ అమృత రూపమగు (నాశనము కాని) ధర్మమును విశ్వాసంతో అనుసరించుతారో అట్టి భక్తులు నాకు చాలా ప్రియమయిన వారు.

శ్రీకృష్ణుడు భగవంతునిలో భక్తితో విలీనం అయ్యే భక్తియోగం అనే ఈ అధ్యాయాన్ని ఈ మాటలతో ముగించుతున్నాడు. అంతా శుభం

ధర్మం అంటే అధ్యాత్మిక నీతి. దీనికి సమాజం చెప్పే నీతినియమాలకి, రూల్స్‌కి ఏమీ సంబంధం లేదు.

రూల్స్‌ని పాటించకపోవటం మానవుల లక్షణం. స్పీడు తక్కువగా వెళ్ళాలి అని రూల్ ఉంటే, అక్కడ పోలీసు లేకపోతే స్పీడుగా కారు డ్రైవ్ చేస్తూ వెళుతారు. రూల్స్ అంటే మన స్వేచ్ఛని అణిచేస్తాయి అనే ఒక ఆలోచన ఉంటుంది.

సమాజపు రూల్స్ మన స్వేచ్చని తగ్గించి, మనని అన్ని రకాలుగా వెల్లడి చేయనీయవు. రూల్స్ అనగానే అవి ఎదుటి వారికే కానీ, మనకి కాదు అని అనుకుంటారు.

మతపరమైన రూల్స్ ఇంకా ఘోరమయినవి. అవన్నీ ఆశ, భయం అనే సూత్రాల మీద తయారు చేయబడ్డాయి. వాటిని కేవలం అందరినీ నియంత్రించాలనే ముఖ్య ఉద్దేశంతో తయారు చేసారు. సమాజంలోని నాయకులలా తమకి రాజ్యాంగపరమయిన అధికారాలు లేవు అని మతాధికారులకి తెలుసు. కాబట్టి వాళ్ళు చాలా సూక్ష్మంగా రూల్స్ తయారుచేసారు. ఇవన్నీ అందరినీ తమ గుప్పిటలో పెట్టుకోవటానికే. అందులో ఒకటి పాపం.

పాపంతో పాటు మతం. స్వర్గం నరకం అనేవాటిని కూడా సృష్టించినది. స్పష్టంగా అర్ధం చేసుకోండి. స్వర్గం, నరకం అనేవి ఎక్కడా లేవు. అవి మీ మెంద్స్‌లో ఉంటాయి. మీరు పాపం ఎందుకు చేస్తారంటే, మీరు మానసికమయిన నరకంలో ఉంటారు కాబట్టి. అంతే కానీ మరొకటి కాదు. మీరు పాపం చేసాక నరకానికి వెళ్ళరు.

అయితే మతం అనేది బతకాలి కదా! బతకాలి అంటే అందరినీ కంట్రోల్ చేయాలి. వాళ్ళు మిమ్మలని భగవంతుడే, భగవత్ స్వరూపాలే అని తెలుసుకోగలిగితే, వాళ్ళు మిమ్మలని ఎలా నియంత్రిస్తారు. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఉండగలిగే (జీవించే) అవకాశం తగ్గిపోతుంది. మతాధికారులు అలా నిలబడాలంటే, వాళ్ళు మిమ్మలని 'పావులు' అని అనాలి. వాళ్ళు మిమ్మలని మతం మాత్రమే మోక్షమిస్తుంది అని నమ్మించాలి. మీలో పాపాలు పోవు అని చెబుతారు. ఎందుకంటే మీరు పుట్టుకతోనే పావులు అని అంటారు.

అర్ధం చేసుకోండి. మీరు పావులు కాదు. మీలో భగవంతుడు ఉన్నాడు. మనలో ఉండే ఒకే ఒక పాపం మనలోని భగవంతుడిని గుర్తించలేకపోవటమే. కాబట్టి మనం మోక్షం కోసం పాట్లు పడనవసరం లేదు. మీ లోపలి భగవంతుడిని తెలుసుకోండి.

హిందూ పవిత్ర గ్రంధాలలో ఆధ్యాత్మిక సత్యాలని 'యామా' అంటారు. అవి : సత్యం, అహింస, ఆస్తేయ, అపరిగ్రహ : బ్రహ్మచర్యం ఇవన్నీ టెన్ కమాండ్ మెంట్స్ వంటివే.

సత్యం : సత్యం అంటే నిజము. ఆలోచనలలో మాటలలో మనం చేసే పనులలో సత్యం ఉండాలి. మన అంతరంగంలో ఏముందో అదే బయటకి ప్రదర్శించాలి. సత్యాన్ని ప్రకటించాలి అంటే మనం వర్తమానంలో ఉండాలి. ఎప్పుడయితే, మనస్సు, అహంకారం అనేవి ఈ విషయంలో కల్పించుకోవో, అప్పుడు మనం బయటకి చెప్పేవాటిని వడపోయము. అప్పుడు మన అంతరంగంలో ఉన్నది ఉన్నట్టుగా బయటికి చెప్పగలము.

అహింస : మన ఆలోచనలు, మాటలు పనులలో అహింస అనేది పూర్తిగా ఉండాలి. అహింస అనేది మనం సామూహిక చేతన స్థితిని అర్ధం చేసుకున్నప్పుడు దానిని పాటించగలము. సామూహిక చేతనస్సితిలో మనందరం ఈ విశ్వంలో ఒక భాగం, అందరం ఒక్కటే అని తెలుసుకుంటాము. ఎప్పుడయితే ఈ విషయాన్ని తెలుసుకుంటామో, ఎవరినైనా బాధపెడితే అది మనని మనం బాధపెట్టుకోవటం అని తెలుస్తుంది. అప్పుడు హింస కరుణగా మారుతుంది.

ఆస్తేయ అంటే తనది కాని దానిని కోరుకోక పోవటం, అత్యాశ లేకపోవటం. సామూహిక చేతనస్థితిలో తన ప్రత్యేకతని తెలుసుకోగలగటం మరొకరికి సంబంధించిన వాటిని కోరకుండా ఉండగలగటం.

అపరిగ్రహ అంటే సామాన్య జీవితాన్ని గడపటం. కేవలం మనకి అవసరమయిన అవసరాలు మాత్రమే తీర్చుకొని, కోరికలు లేకుండా ఉండటం, దేనిపై అత్యాశ చూపకుండా ఉండటం.

బ్రహ్మచర్యం అంటే నిజములో ఉండటం. బ్రహ్మచర్య అనే మాటని తప్పు అర్ధంతో చెబుతారు. మామూలుగా వివాహం కానివారికి చెబుతారు. మనలో ఉండే కల్పనలకి, ఊహలని, (భ్రమలని, ఆశించటాలని వదిలివేసి విప్పారిన జీవితం గలవారు, బ్రహ్మచారులు.

అయితే ఈ ఐదు సూత్రాలు ఈ రోజులలో కచ్చితంగా పాటించటం కష్టం. సన్యాసులు ఈ ఐదు ప్రమాణాలు చేస్తారు. అవి పాటించటానికి కష్టపడతారు. అలాంటిది సామాన్య మానవులకి దైనందిన జీవితంలో వీటిని పాటించటం చాలా కష్టం

నా అనుభవంతో నేను చెబుతున్నాను. ఈ ఐదు సూత్రాలు జ్ఞానోదయానికి మార్గాలు కాదు. జ్ఞానోదయం పొందాక మనకు దొరికే విషయాలు ఇవి. ఆధునిక యుగంలో శ్రీకృష్ణుడు బోధించిన : ఆయనను చేరే ధర్మమార్గం, ధ్యాన మార్గమే. ఎప్పుడయితే ధ్యాన మార్గాన్ని అనుసరించుతారో మీరు అప్రయత్నంగా ధర్మచక్రంగా పడతారు. అది మిమ్ములని శ్రీకృష్ణుని యొక్క చేతనస్థితికి తీసుకువెళుతుంది.

ధ్యానం అంటే మన మనస్సుని నిశ్చలంగా చేసి దానిని ఆపటం అంటే మైండ్ లేని స్థితి అప్పుడు అహంకారం పోతుంది. ఎప్పుడయితే అహంకారం పోతుందో, మనం భగవంతునిలో ఈ అనంత విశ్వాత్మలో ఒక భాగమే, మనలో భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకునే దారిలో ఉండే అద్దంకులు పోతాయి. అప్పుడు మనం ఏమిటో మనకి తెలుస్తుంది. మనం భగవంతునిలో ఒక భాగమే. మనమూ భగవంతుడు ఒక్కటే అని తెలుసుకోగలుగుతాము.

ప్రశ్నలు - స‌మాధానాలు :

చాలా అధ్యాయాలకి సంబంధించి, చాలా ప్రశ్నలు వచ్చాయి. వీటిలో కొన్ని ప్రశ్నలకి జవాబులు ఇస్తాను. తరువాత ఈ సెషన్ ముగించుదాము.

ప్ర : స్వామీజీ ! సంస్కృతంలో డైవోర్స్ (విడాకులు) అనే మాట లేదు అని అన్నారు. కానీ పశ్చిమ దేశాలలో ఇది సత్యం. ఆధ్యాత్మికంగా విడాకులు సాధ్యమేనా?

జ : స్పష్టంగా తెలుసుకోండి. మీరు ఆధ్యాత్మికులు అయితే విడాకులు అవసరం లేదు. మీరు విడాకులు కావాలి అని అనుకుంటే ఏదో ఒక పెద్ద సమస్య ఉండి ఉంటుంది. అర్ధం చేసుకోండి. నిజమయిన ఆధ్యాత్మికత మిమ్మలని ఒక మంచి భర్త, మంచి భార్యగా తయారు చేస్తుంది. మీరు అబ్బే! లేదు నా భర్త అసలు ఆధ్యాత్మికంగా ఉండడు, అతను నా పంధాలో నడవడు ఇలాంటి ఫిర్యాదులు చేయవద్దు. మీరు ఎందుకు ఫిర్యాదులు చేస్తారంటే మీరు ఏదో ఆశించుతారు. అందుకే.

మన సంస్కారాలు, అంటే మన పాత జ్ఞాపకాలమీద ఆధారపడి ప్రస్తుతం మన చుట్టు ప్రక్కల ఉన్న వాటిని చూస్తాము. మనం ప్రతి ఒక్కరం మనకి అనువైన మూసలని తయారు చేసుకుంటాము. ఆ మూసలో, ఆ ప్రేమలో మాత్రమే మన జీవిత భాగస్వామిని చూస్తాము. మనం జీవిత భాగస్వామిని వెతుక్కోవటం అనేది ప్రకృతి సహజంగా జరిగే ఒక ప్రక్రియ. దీనివలననే మానవజాతి అనేది ఈ భూమి మీద నిలవగలుగుతుంది.

మనం చూసేది మనకి దొరకదు. మనం ఒక అందమయిన దృశ్యాన్ని చూసి, అది అందమయినది అనుకొని ప్రేమలో పడతాము. అర్ధం చేసుకోండి. మనం ఎప్పుడూ

భగవద్గీత - అధ్యాయం 12

ప్రేమే మీ జీవితం, ప్రాథమిక

ప్రేమలో లేచాము అని అనం. మనం ఎప్పుడూ ప్రేమలో పడాము అని అంటాము. అది కిందికి రావటమే కాని, ఎప్పటికీ ఉన్నతస్థితికి చేరటం కాదు. ఎప్పుడయితే మనం దగ్గరవుతామో, అలాగే కలసి ఉండే సమయం ఎక్కువగా ఉంటుందో, మనం చూసిన దృశ్యాలలోని రంగులు మారిపోయి అందమయిన గులాబి రంగు మురికి పసుపు రంగుగా మారిపోతుంది. అదే వివాహం.

ఒక వ్యక్తి తన స్నేహితునికి పెళ్ళి కానుకగా ఒక కుక్కపిల్లని ఇచ్చాడు. ఆరు నెలలయ్యాక తన స్నేహితుణ్ణి కలసి ఎలా ఉంది జీవితం అంటాడు. దానికి స్నేహితుడు 'కొత్తలో కుక్కపిల్ల అరిచేది, నాభార్య పేపరు తెచ్చి ఇచ్చేది. ఇప్పుడు కుక్కపిల్ల పేపరు తెస్తుంది. నాభార్య అరుస్తుంది" అని జవాబు ఇస్తాడు.

మనందరం ఎన్నో ఆశలు, ఆశించటాలతో నిండిపోయి ఉంటాము. మనం ఊహలు, కల్పనలలో ఉంటాము. దాంతో ఎదుటి మనిషిని అసలు ప్రశంసించలేము. భార్య లేదా భర్తని మెచ్చుకోలేము. మనందరినీ భగవంతుడు సృష్టించాడు. మనం భగవంతుడు సృష్టించిన మనిషిని అంతకంటే గొప్పగా చేయగలమా? అది అసాధ్యం కానీ మనం ఏమి చేస్తాం. ఒక బ్రష్, రంగులు తీసుకొని ఆ వ్యక్తికి తిరిగి మనం ఊహించిన, మన కల్పనలలో ఉన్న రంగులని వేయటానికి ప్రయత్నించుతాము. లేదా ఉలి, సుత్తి తీసుకొని ఆ మనిషిని మన ఊహలకి తగినట్లు చెక్కటం ప్రారంభించుతాము. అందుకే వివాహ జీవితాలలో రక్తం ప్రవహించుతుంది.

శివ సూత్రాలలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఈ విధంగా అడుగుతుంది "స్వామీ! ఏవి భార్యా భర్తలని సంతోషంగా ఉండేలా చేస్తాయి?".

ఆదిగురువు పరమేశ్వరుడు ఇలా జవాబు ఇస్తాడు " ప్రతి వివాహం లోనూ నలుగురు మనుషులు ఉంటారు. భర్త, అతని ఊహలలో స్త్రీ, భార్య ఆమె ఊహలలోని పురుషుడు. ఎప్పుడయితే భార్య, భర్త తమ ఊహలలోని రూపాలని వదిలిస్తారో అప్పుడు ఇద్దరే ఉంటారు. వాళ్ళ వివాహ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.

నేను మీకు ఒక విషయం చెబుతాను. మీరు దేనినైతే ప్రొజెక్షను చేస్తారో దానినే చూస్తారు. ఇది మీ అహంకారాన్ని గాయపరచవచ్చు. కానీ మీరు లోపలకి చూడండి. మీరు కూడా సమస్యకి కారణమే అని తెలుస్తుంది. ఎవరూ మిమ్మలని మీ అనుమతి లేకుండా బాధపెట్టరు. ఎవరూ మీ అంగీకారం లేకుండా మీ నిశ్చలతని భంగం చేయరు. ఎవరూ మీ అనుమతి లేకుండా మిమ్మలని ఆధీనపరచుకోరు.

మీకు ఏదో స్వార్ధం ఉండి ఆ వ్యక్తిని మీ జీవితం లోనికి రానిస్తారు. మీకు సరిపడని వ్యక్తిని ఆకర్షించి మీ జీవితంలోనికి రానివ్వటం అసలు ఆధ్యాత్మికత కాదు. అంటే మీ అంతరంగంలో మీ అసలయిన ఉనికి దగ్గర ఏదో సమస్య ఉన్నది. దానిని వెతకండి. దానికి చికిత్స చేయండి. అప్పుడు అన్నీ స్పష్టమై శుభ్రపడతాయి.

ప్ర : నేను మరణానికి సమీపంగా వెళ్ళిన వ్యక్తుల మరణ అనుభవాన్ని చదివాను, వారి దగ్గర విన్నాను. అది శరీరం బయట జరిగి అనుభవం. అందరూ కూడా దానిని చాలా అందమయిన అనుభవం అని చెప్పారు. మరి దానిని గీత ఎందుకు బాధతో కూడిన విషయంలా చెబుతుంది. వెయ్యి తేళ్ళుకుట్టిన బాధ అని ఎందుకు అయింది?

జ : అర్ధం చేసుకోండి. నేను మరణ అనుభవం గురించి మాట్లాడింది, ఒక సామాన్య మానవుని యొక్క మరణ అనుభవం. కానీ ఇక్కడ మీరు చెప్పినది 'నేను మరణాన్ని సమీపించిన వారి అనుభవాన్ని చదివాను విన్నాను' అని ఎప్పుడయితే మీరు 'నేను చదివాను' అని అంటారో మీరు చదివింది వారి అనుభవాన్ని. మీరు విన్నది కూడా మధ్యవర్తుల ద్వారా వినటమే, లేదా ఆధ్యాత్మిక సంబంధమయిన వ్యక్తుల ద్వారా వినటమే. అందుకే వారికి అనుభవం అయ్యి తిరిగి వెనక్కి వచ్చారు.

నేను చెప్పే విషయం మరణించిన వారి సంగతి. వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయిన వారే. మీరు చెప్పేది వారు అనుభవమయ్యాక వెనక్కి వచ్చిన వారి సంగతి. అనుభవం

భగవద్గీత - అధ్యాయం 12

అయ్యి వెనక్కి వచ్చారు అంటే అది ఆధ్యాత్మిక అనుభవం. అది మరణ అనుభవం కాదు. కానీ నేను మీతో చెప్పినది నిజమయిన భౌతికమయిన మరణం గురించి, అంతేకాని సచేతన స్థితిలో జరిగే మార్పు గురించి కాదు.

రమణ మహర్షికి జరిగిన అనుభవం ఆయన చేతనస్థితిలో జరిగింది. కానీ నేను మీకు వివరించినది మామూలు వ్యక్తికి సంభవించే భౌతిక మరణం. ఆ తేడా అర్ధం చేసుకోండి. ఇది ఒక సాధారణమయిన మనిషికి సంభవించే మరణం.

నా అనుభవమయిన సత్యం ఏమిటి అంటే, మరణ సమయంలో ఆత్మ ఏడు శక్తి దశలు (పొరలను) దాటి, వాటి గుండా వెళుతుంది. అప్పుడు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అక్కడ ఆత్మ తిరిగి గుర్తు చేసుకుంటుంది. అన్ని సంఘటనలు వివరాలతో సహా చూడగలుగుతుంది. అప్పుడు ఆత్మ యొక్క ఉనికి బాధలని, ఆనందాన్ని, అపరాధ భావాన్ని కోరికలని అన్ని రకాల భావావేశాలని బయటకి చూపిస్తుంది. అదే మీరు నరకం, స్వర్గం ద్వారా వెళ్ళటం అంటే.

అప్పుడు అనుభవించే బాధనే వేయి తేళ్ళు ఒకేసారి శరీరాన్ని కుట్టిన బాధ, శరీరం మొత్తాని కొట్టిన బాధ. ఈ బాధ నుంచి తప్పించుకోవాలి అంటే మీకు అంతిమ సత్యం యొక్క క్షణ దర్శనం జీవితంలో ఒక్కసారియినా జరగాలి. దానిని మీరు ధ్యానం ద్వారా సాధించగలరు.

నిత్యానంద స్పురణ కార్యక్రమంలో నేను మిమ్మలని మరణ సమయంలో ఆత్మ వెళ్ళే ఆ ఏడు శక్తి మార్గాల గుండా తీసుకువెళతాను. మిమ్మలని మీ సంస్కారాల (పాత జ్ఞాపకాల) మీద ధ్యానం చేయమంటాను. అది ప్రతి దశలోనూ జరుగుతుంది. అప్పుడు మీలోని సంస్కారాలన్నీ కరిగిపోతాయి. దాంతో మీకు బాధలేని మరణం సంభవిస్తుంది. మీకు పునర్జన్మ ఉండదు.

ప్ర : స్వామీజీ, శ్రీకృష్ణుడు తన భక్తులు ఎప్పటికీ నశించరు అని అన్నారు కదా.

మరి ప్రతిదీ భగవంతుడయినప్పుడు, ఇక నశించేది ఏమిటి? అంటే శ్రీకృష్ణని ఉద్దేశం తన భక్తులు నశించరు కాని మిగతారు నశిస్తారు అనేనా? దయచేసి ఈ విషయాన్ని వివరించి నా అనుమానాన్ని నివృతి చేయండి.

జ. అర్ధం చేసుకోండి. మీరు ఏక్షణాన అయితే నాశనం అవ్వము అని తెలుసుకుంటారో, అప్పుడే మీరు కృష్ణునికి భక్తులవుతారు. ఎక్కడా కృష్ణభక్తులు, మరొకరు అనే గ్రూపులు లేవు. అలాగే కృష్ణభక్తులు నాశనం కారు, మిగతా వారు అవుతారు అనేది ఎక్కడా లేదు. ఎవరయితే తాను నాశనం లేనివాడిని అని అనుకుంటారో అతను కృష్ణ భక్తుడే. మీరు ఏక్షణాన ఈ విషయం అర్ధం చేసుకుంటారో అప్పుడు మీరు భక్తుడుగా మారిపోతారు. ఆయన భక్తుడిగా అవుతారు. స్పష్టంగా తెలుసుకోండి. ప్రతిదీ భగవంతుడే అయినప్పుడు, ఏదీ కూడా నాశనం కాదు.

'నమే భక్తా ప్రణశ్యతి.' భగవానుడు ఇలా చెబుతాడు, నా భక్తునికి నాశనం ఉండదు. ఇది పోల్చి చెప్పే మాట. మీరు ప్రతిదీ భగవంతుడే అని తెలుసుకున్నప్పుడు, ఏదీ నశించదు అని తెలుస్తుంది. మీరు ఆ దశని అర్ధం చేసుకున్నప్పుడప్పుడు, ఆ దశని చేరినప్పుడు, ఈ మాటలు మీ కోసం కాదు. ఇది సామాన్య మానవులకి చెప్పే మాట. ఎవరయితే భక్తి దారిలో (మార్గంలో) ఉన్నారో, ఎవరైతే దీనిని అర్ధం చేసుకోలేదో ఇది వారికోసం. ముఖ్య విషయం ఏమిటంటే మీరు ప్రతిదీ భగవంతుడే అనే విషయాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకొని ఉంటే మీరు అసలు ఈ మాటలు పట్టించుకోనవసరం లేదు.

తరువాత విషయం, ఎప్పుడయితే మీరు ఏదీ నాశనం చేయలేనిది అని తెలుసుకుంటారో అప్పుడు మీరు కృష్ణభక్తులవుతారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఇక్కడ ఏ మాటలూ పక్షపాతంతో అనేవి కాదు. ఆయన ఎవరి పక్షపాతంతో అనేవి కాదు.

భగవద్గీత - అధ్యాయం 12

ఆయన ఎవరి పక్షం మాట్లాడటం లేదు. ఆయన కేవలం ఇలా చెప్పాడు. 'నా భక్తులకు నాశనం అనేది ఉండదు' అన్నాడే కాని ఆయన "నా భక్తులకి నాశనం లేదు, కానీ వేరే భక్తులు నశించుతారు" అని అనలేదు.

ఆయన ఆవిధంగా అనలేదు. ఆ మాటలలో ఆ అర్ధం లేదు. ఎవరయితే ఈ తత్వాన్ని అర్ధం చేసుకుంటారో వారు నశించరు. ఎవరికైతే ఈ శాస్త్రం అర్ధమవుతుందో వారికి నాశనం అనేది ఉండదు. ఇదంతా అర్ధమయిన తరువాత కూడా మీరు కృష్ణుని మురళికి లేదా నెమలి ఈకకి భక్తులు కాకపోయినా మీకు నాశనం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని పట్టించుకోకండి.

మీరు ఎప్పుడైతే కృష్ణుడు అనగానే మురళి, నెమలి ఈక అని అనుకుంటారో ఈ సమస్య, ఈ ప్రశ్న వస్తాయి. శ్రీకృష్ణుడు మురళి, నెమలి ఈక వీటన్నింటికీ అతీతుడు అని అర్ధం చేసుకోగలిగితే మీకు ఈ అనుమానం రాదు. నా భక్తులకి నాశనం ఉండదు, అన్ని శ్రీకృష్ణని మాటలతో అర్ధం చేసుకుంటే ఆవ్యక్తికి క్షీణదశ ఉండదు. అదే శ్రీకృష్ణుని సందేశంలో అర్ధం.

శ్రీకృష్ణుడు అంటే మీరు చూసే శ్రీకృష్ణుడు కాదు. ఆయనది మీరు చూసే ఒక రూపం కాదు. ఆయనది అత్యున్నత చేతనస్థితి. విశ్వ చేతనస్థితి. ఆయనే విశ్వశక్తి, పరాశక్తి.

శ్రీకృష్ణని భక్తులు కొందరు నా కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళు నన్ను ఈవిధంగా అడిగారు : మీరు గీత గురించి ఎంతో అద్భుతంగా మాట్లాడతారు. మీరు కృష్ణుణ్ణి నమ్ముతారా?

నేను "అవును, నమ్ముతాను" అని అన్నాను.

దానికి వాళ్ళు "అలా అయితే మీరు మిగతా దేవుళ్ళ గురించి, దైవం గురించి ఎలా మాట్లాడతారు. మీకు ఆశ్రమంలో దక్షిణామూర్తి గుడి ఉన్నది అని విన్నాము, అది ఎలా సాధ్యం? మీరు అలా ఎలా చేసారు? శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెబుతాడు, నేనే సర్వస్వం అని వేరే ఏదీ లేదు అని" అన్నారు.

అప్పుడు నేను వారికి ఈ విధంగా వివరించాను. మహాభారత యుద్ధం తరువాత అర్జునుడు, శ్రీకృష్ణుడు బయట విహ్యాళికి వెళతారు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణనితో " శ్రీకృష్ణా! యుద్ధ ప్రారంభంలో నీవు నాకు చాలా విషయాలు చెప్పావు. కానీ నాకు ఏమీ గుర్తులేదు. దయచేసి నాకు మరొకసారి ఆ విషయాలు చెప్పగలవా?"

కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ! అర్జునా! నేను కూడా మర్చిపోయాను. అయ్యో! ఏమీ అనుకోవద్దు. నేను ఆ విషయాలన్నీ మరిచిపోయాను. " అని అంటాడు.

అర్జునుడు కొంచం కలవరపాటు పడి ఇలా అడుగుతుంది. "కృష్ణా అది ఎలా సాధ్యం".

ఆ ప్రశ్నకి శ్రీకృష్ణ ఈ విధంగా జవాబు ఇస్తాడు. "నేను నీకు యుద్ధ భూమిలో ఆ విషయాలు చెప్పినప్పుడు, నేను అత్యున్నత చేతనస్థితి కలిగిన పరుబహ్మ శ్రీకృష్ణదిని. ప్రస్తుతం నేను మామూలు వసుదేవ కృష్ణుణ్ణి. రూపంలేని విశ్వశక్తిగా ఉండి నేను నీకు ఏమి చెప్పానో నాకు గుర్తులేదు.

అయితే కరుణామూర్తి, ప్రేమమూర్తి అయిన శ్రీకృష్ణుడు మరొక సారి అర్జునునికి తన బోధలలోని ముఖ్యమయిన విషయాలు చెబుతాడు. దానినే మనం అనుగీత అంటాము.

ఎప్పుడయితే శ్రీకృష్ణుడు దివ్యచేతనస్థితి అని అర్ధం చేసుకుంటారో అదే దైవత్వం. అది ఏ రూపంలో అయినా ఉంటుంది, దానిని మనం ఏ రూపంలో అయినా పూజించవచ్చు అని చెప్పాను. వారు తృప్తి చెందారు.

శ్రీకృష్ణుడు " నా భక్తులకు నాశనం ఉండదు 'అని చెప్పినప్పుడు ఆయన పరిబ్రహ్మ శ్రీకృష్ణ. ఆ స్థితిలో ఆయన మనందరిలో ఉంటాడు. ఎప్పుడయితే ఆ సత్యాన్ని మనం అర్ధం చేసుకుంటామో, మనం ఆయన భక్తులు అవుతాము. మనం కూడా కృష్ణులం అవుతాము. మనం శ్రీకృష్ణని చేతనస్థితిలో ఒక భాగం అవుతాము. మనకి నాశనం ఉండదు.

ప్ర. స్వామీజీ! దయచేసి సంస్కారాలని (మనలో ఉండిపోయిన జ్ఞాపకాలని) ఎలా పూర్తిగా వదలగమో, ఎలా సర్వస్వం వదిలి అధీనులం అవ్వగలమో వివరించండి.

జ. మీరు సంస్కారాలని, సర్వస్వాన్ని ఎలా వదిలి ఆధీనులు అవ్వాలో అడుగుతున్నారు. మీరు రేపు ఎల్లుండి క్లాసులకి రండి. ఆ వివరాలు చెబుతాను. తరువాత రెండు రోజులూ ఉపన్యాసమంతా సంస్కారాల మీద ఉంటుంది. మనం మన ప్రతి సంస్కారం మీద చాలా లోతుగా పనిచేస్తాం. కోరికల సంస్కారాలు, అపరాధభావ సంస్కారాలు, వ్యధ ఇలా ఒక్కొక్క దాని మీద పనిచేస్తాం.

అప్పుడు ఉపన్యాసమే కాదు మీరు ఏదయినా అడగవచ్చు, చెప్పవచ్చు. మనందరం కలసి సంస్కారాల మీద కొంత పని చేస్తాము. ముఖ్యంగా గుణాతీత యోగా అధ్యాయలలో మనం పూర్తిగా సంస్కారాల గురించే నేర్చుకుంటాము. మనం వీటి గురించి చూస్తాము. (ఈ అధ్యాయాలు వేరే పుస్తకాలలో ఉన్నాయి)

ప్ర. పనికి వస్తుందా? లేక మేము కూర్చొని మాత్రమే ధ్యానం చేయాలా?

జ. మీరు పడుకుంటే నిద్దపోతారు. నిజానికి కూర్చొని కూడా నిద్దపోతారు. సహజంగానే పదుకోగానే నిద్దపోతారు. కాబట్టి పదుకుని ధ్యానం చేయకండి. మీరు నిద్రపోయేటప్పుడు ధ్యానం చేయండి కాని మీరు ధ్యానం చేసే సమయంలో నిద్రపోకండి. మీరు నిద్రపోతూ ధ్యానం చేయవచ్చు. కానీ మీరు ధ్యానం చేసేటప్పుడు నిద్రపోతే మీలో ఏదో పొరపాటు ఉంటుంది. కాబట్లి ధ్యానం చేయటానికి శవాసనం వేయకండి. మీరు శవాసనం వేసినప్పుడు ధ్యానం చేయండి.

ప్ర. స్వామీజీ, శివరాత్రి రోజున, లేదా మరే పవిత్రమయిన రోజన మరణించితే ఆత్మ తిన్నగా స్వర్గానికి వెళుతుందా?

జ. నేను ఈ ప్రశ్నకి ఒకసారి జవాబు ఇచ్చాను అని అనుకుంటున్నాను. దక్షిణాయన (సూర్యుడు దక్షిణం వైపు చేసే ప్రయాణం, జూన్ 22 నుంచి డిసెంబర్ 22 వరకు) ఉత్తరాయణ (సూర్యుడు, ఉత్తరం వైపు చేసే ప్రయాణం డిసెంబరు22 నుంచి జూన్ 22 వరకూ) ఇవన్నీ మానసిక మయినవే కాని కాల క్రమమైనవి కాదు. నేను ఉత్తరాయణ అని చెప్పినా, శ్రీకృష్ణుడు ఉత్తరాయణ అని చెప్పినా, దాని అర్ధం ఆ సమయంలో మీలోని శక్తి ఉన్నతస్థితివైపు ప్రయాణించుతుంది. అదే ఉత్తరాయణం. ఎప్పుడుయితే మీరు మీతో చాలా హాయిగా ఉండగలరో అదే ఉత్తరాయణం.

స్పష్టంగా తెలుసుకోండి. ఇది కేవలం మానసికమయిన ఊహ. అటువంటిది ఏమీ లేవు. డిస్నీ ఓల్డ్ ఎందుకంటే అప్పుడు ఎక్కువమంది ఉందరు. అందుకే ఆ రోజులలో స్పెషల్ ఆఫర్ ఇస్తారు. కానీ స్వర్గానికి అలాంటి డిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్స్ ఉండవు. మీ జీవితంలోని నాణ్యత వాటిని నిర్ణయించుతుంది. అంతేకాని ఎటువంటి ఆఫర్స్ ఉండవు.

శివ. శివ అంటే పవిత్రమయిన. పవిత్రత అనేది అప్రయత్నంగా వస్తుంది. దానికి కారణం ఉండదు. అది సహజంగా వస్తుంది. దైవం పవిత్రమయినది. రాత్రి అంటే తీవ్రమైనది అని, అంతేకాని అది కేవలం రాత్రి మాత్రమే కాదు. శివరాత్రి లేదా మహాశివరాత్రి అంటే పవిత్రత అత్యున్నత స్థాయిలో ఉన్న సమయం అని అర్ధం. మీరు నిజాయితీగా తెలుసుకునేతత్వంతో చేసే ప్రార్ధనలను ఆ భగవంతుడు స్వీకరించి మీకు జవాబు ఇస్తాడు. ఆ పూజలు, ప్రార్ధనలు అందరికీ మంచి చేసేవిగా ఉంటే ఆ ప్రార్ధనలకి భగవంతుడు సమాధానం ఇస్తాడు.

నేను మీకు ఇంతకు ముందే చెప్పాను. స్వర్గం అనేది లేదు. అది కేవలం మతాల డిక్షనరీలలోనే ఉన్నది. అది ఏదో ఒక స్థలం కాదు. అది మీ మైండ్‌లో ఉన్నది. మీరు చేతనస్థితిని చేరితే పరమానందాన్ని పొందగలుగుతారు. అప్పుడు మీరు స్వర్గంలోనే ఉంటారు.

ప్ర. ఒకవేళ ఎవరికైనా ఏ లక్ష్యం లేదనుకోండి. అప్పుడు పరమానందాన్ని పొందటం అనేదే ఒక లక్ష్యం అవ్వదా? దయచేసి దీనిని నేను అర్ధం చేసుకోవటానికి సహాయం చేయండి.

జ. పరమానందాన్ని పొందటం అనేది మీ లక్ష్యంగా చేసుకోకండి. అలా చేస్తే మీరు దానిని కోల్పోతారు. అంతా గందరగోళం అయిపోతుంది. మీ గోల్స్‌ల (లక్ష్యాలన్ని)న్ని వదిలి వేయండి. అప్పుడు పరమానందం మీలో జరుగుతుంది. మీరు పద్మాన్ని వికసించేలా చేయలేరు. మీరు దానికి అనుకూలమయిన పరిస్థితులు కల్పించి, అది వికసించే వరకూ ఎదురు చూడాలి. అప్పుడు ఆ పద్మం దానంతట అదే వికసించుతుంది. మీరు ఈ విషయంలో ఏమీ చేయలేరు. మీరు రేకులని బలవంతంగా విప్పితే ఆ పుష్పం చనిపోతుంది. అది జీవంలేని పుష్పం. మీరు జీవం లేని ఆనందాన్ని అతికించిన నవ్వుతో పొందటానికి ప్రయత్నించవద్దు. మీ చిరునవ్వు మీ అంతరంగం నుంచి రావాలి. అది మీలోని సంతోషంతో ఉప్పొంగి ప్రవహించాలి.

మీరు ఒక మొక్కని నాటితే దానికి కావలసిన సరియైన పరిస్థితులని కల్పించాలి.

అప్పుడు అది చిగిర్చి, మొగ్గలు వేసి పూలు పూస్తుంది. అలా కాకుండా మీరు విత్తనాన్ని బయటకి తీసి చూస్తే అది మొక్కగా పెరగదు. మీకు ఏమీ దొరకదు.

మీకు ఒక కథ చెబుతాను. మూడు కోతులకి ఒక మామిడి పండు దొరుకుతుంది. అవి దానిని పంచుకోవటానికి ఇష్టపడవు. ఎవరు దానిని తినాలో అవి నిర్ణయించుకోలేకపోతాయి. ఈ సమస్యని వాళ్ళ గురువయిన మరొక కోతికి చెబుతాయి. ఆ గురువు కోతి ఇలా చెబుతుంది. "ఈపందుని నేను తింటాను. మీరు విత్తనాన్నితీసుకువెళ్ళి నాటండి. అది చెట్టుగా పెరిగి చాలా కాయలు ఇస్తుంది. అప్పుడు చాలా పళ్ళు ఉంటాయి. మీరు హాయిగా తినవచ్చు" అని అంటుంది.

కోతులు ఒప్పుకుంటాయి. గురువు కోతి కాయ తిన్నాక మూడు కోతులూ విత్తనాన్ని నాటుతాయి. ఒక కోతి రోజు నీరు పోసేది, ఒక కోతి దానికి ఎరువులు వేసేది, మూడవది విత్తనానికి కాపలా కాసేది. చాలా కాలం అయ్యాక కూడా మొక్కరాదు. అవి గురువు దగ్గరకి వెళ్ళి "నీవు మా కాయ తినేసావు. మమ్మలని విత్తనం నాటమన్నాను. కానీ మొక్కరాలేదు. నీవు మమ్మలని మోసం చేసావు అని ఫిర్యాదు చేస్తాయి".

గురువు కోతి ఎవరు ఏ పని చేసారో అడుగుతుంది. మొదటి కోతి క్రమం తప్పకుండా నీరు పోసాను అని చెబుతుంది. రెండవది ఎరువులు వేసాను అని చెబుతుంది. మూడవది ఆ విత్తనం ఎవరూ తీసుకెళ్ళకుండా జాగ్గత్తగా కాపాలాకాసాను అంటుంది.

అప్పుడు గురువు కోతి ఎలా కాపాలా కాసావు అని అడుగుతుంది. అప్పుడు మూడవ కోతి "నేను రోజూ ఆ విత్తనాన్ని బయటకి తీసి ఉన్నాదా లేదా అని చూసి మరలా లోపలపెట్టే దాన్ని " అని చెబుతుంది.

భగవద్గీత - అధ్యాయం 12

కాబట్టి మీరు జరుగుతుందా లేదా అని పరీక్ష చేసుకున్నంత కాలం ఏమీ జరగదు. మీరు పరమానందం నా లక్ష్యం అనే భావనని వదలటమే కాదు, దానిని గురించి ఆలోచించటం కూడా మానేసేయాలి. మీరు ధ్యాన మార్గాన్ని అనుసరించండి. అప్పుడు పరమానందం దానంతట అదే వస్తుంది. మీరు ప్రతిరోజు మీ మైండ్‌లోనికి వెళ్ళి, పరమానందం వచ్చిందా రాలేదా అని చూసే అది మీకు జరగదు.

ప్ర. ప్రియమయిన స్వామీజీ, ఒక వ్యక్తి జీవితాంతం డబ్బు గురించే ఆలోచిస్తూ గడిపాడనుకోండి, అతను తరువాత జన్మలో ఎటువంటి జీవితాన్ని గడుపుతాడు? ధనవంతుడా లేక పేదవాడిగానా?

జ. అది మీ వివేకం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎంత బాధ్యత తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో దాని మీద నిర్ణయించబడుతుంది. మీకు బాధ్యత తీసుకోగలిగే తెలివితేటలు ఉంటే వచ్చే జన్మసంగతి ఆలోచించకండి. ఈ జన్మలోనే మీరు ధనవంతుడిగా జీవించవచ్చు. మీకు భాద్యత తీసుకునే వివేకం లేదనుకోండి, దాని గురించి పని చేయరనుకోండి, ఈజన్మలోనే కాదు ఏజన్మలోనూ ధనవంతుడిగా జీవించలేరు. మీరు ధనవంతునిలా జీవించటానికి కావలసినవన్నీ సమకూర్చుకోగలిగితే ధనవంతునిగానే జీవిస్తారు.

చూడండి. ఒక కూర చేయాలంటే దానిలో చాలా వస్తువులు కలపాలి. అప్పుడే రుచికరమయిన కూర తయారవుతుంది. ఇది కూడా అంతే. ఏదో కొన్నిసార్లు అది వేరుగా అవుతుంది. అది వేరే విషయం.

ఒకామె ఏదో వండుతుంటుంది. ఆమె భర్త వచ్చి ఏమి వండుతున్నావు అని అడుగుతాడు. దానికి ఆమె ఇంకా పేరు పెట్టలేదు. అది తయారయ్యాక దానికి పేరు పెడతాను అంటుంది.

కాబట్టి ఒక్కొక్కసారి వంటలో అన్నీ వేసినా అది మనం అనుకున్నట్లుగా తయారవదు. కానీ ఒక కూర చేయాలంటే దానిలో చాలా రకాల వస్తువులు వేయాలి. అలాగే ధనవంతునిలా జీవించాలి అంటే మీరు చాలా విషయాలను జీవితానికి కలపాలి. భాధ్యత, నిర్ణయాలు చేయగల నైపుణ్యం, ధైర్యం, జీవితాన్ని ఎదుర్కొనగల నేర్పు, ఇలాంటివన్నీ మీ జీవితంలో కలపగలిగితే, మీరు ధనవంతులుగా జీవించవచ్చు, దాని కోసం మీరు వేరే జన్మవరకూ చూడనవసరం లేదు.

కొంతమంది నన్ను అడుగుతుంటారు. 'ఎవరూ కూడా బిక్షగాళ్ళుగా జన్మించాలి అని అనుకోరు : అది అసాధ్యం. అప్పుడు ఎందుకు బిక్షగాళ్ళు ఉంటారు?

జీవితంలో చాలా ధనవంతుడయిన వ్యక్తి, చాలా ఆస్తి కూడ బెట్టి ఉండవచ్చు. ఇప్పుడు అతని ఆత్మకి ఇంక ఆస్తి మీద కోరిక లేకపోవచ్చు. అతనికి ఏమాత్రం బాధ్యతలు లేని జీవితం కావాలనిపించవచ్చు. దానినే వాసన అంటారు. ఆ ఆత్మ, మైండ్ అలా అయిపోయి అది ఆత్మలో ఉండి ఉంటుంది. అందుకే ఆత్మ బిక్షగాని జీవితాన్ని, ఎటువంటి బాధ్యతలూ లేని జీవితాన్ని కోరుకున్నది.

ప్ర. నేను మీ శిష్యుడిగా ఉండవచ్చునా? నేను మిమ్మలని అనుసరించ వచ్చునా?

జ. అర్ధం చేసుకోండి. నేను ఈ ప్రశ్నకి జవాబు ఇచ్చాను. మీరు రూపం లేని రూపంలో భగవంతుని ఆరాధించేవారయితే నన్ను తేలికగా అర్ధం చేసుకుంటారా? నాతో అనుబంధం పెంచుకో గలరా? నేను చెప్పాను. నేను నా శిష్యులకి స్పష్టమైన సూచనలు ఇస్తాను. వాళ్ళు నా రూపం మీద ధ్యానం చేయకూడదు. అలా చేయలేరు. వాళ్ళు చేతనస్థితిలో అనుభవం లోనికి వెళ్ళగలగాలి. వాళ్ళు నా రూపంతో ఆగిపోకూడదు. అక్కడ చిక్కుపడిపోకూడదు. నా రూపమే కాదు ఏ గురువు రూపంలోనూ చిక్కి ఉండిపోకూడదు.

మీలో చాలామందికి భగవంతుడు అంటే ఒక భావన, ఒక కల్పన. కానీ జ్ఞానోదయమయిన యోగులకి భగవంతుడు ఒక సత్యం. ఒక జ్ఞానోదయమయిన గురువు, దేవుడి కంటే గొప్ప. ఎందుకంటే ఆయన మీకు సత్యము. ఆయన కల్పన కాదు. గురువు ఉన్నా లేకపోయినా, ఆయన సమక్షం పనిచేస్తూ ఉంటుంది.

నేను మీ ముందు ఉన్నప్పుడు నేను ఉన్నాను అని అనుకోవద్దు. అలాగే మీరు నా సమక్షంలో లేనప్పుడు, నేను మీ దగ్గర లేను అని అనుకోవద్దు.

నేను నా శిష్యులకి చెబుతుంటాను. మీరు నా ముందు కూర్చొని నా వైపు ఆరాధనతో చూస్తూ ఉండవద్దు అని. మీరు నా వెంటపడితే అది పనిచేయదు. మీరు నా లక్ష్యసాధనకి పని చేయండి. అప్పుడు నేను మీ వెంట పడతాను. నేను మీ హృదయాలలో ఉంటాను.

అది శ్రీకృష్ణని అత్యున్నత చేతనస్థితి యొక్క సందేశం.

ప్ర. ఎందుకు జ్ఞానోదయం పొందిన యోగులు తిరిగి జన్మించుతారు? దాని అర్ధం ఏమిటి?

జ. కరుణతో, ఈ ప్రపంచానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో పరాశక్తి (విశ్వశక్తి) కొంతమంది జ్ఞానోదయం పొందిన వారిని భూమి మీదకి పంపిస్తుంటుంది. పరాశక్తి కొంతమంది జ్ఞానోదయమయిన వారిని ఈ భూమి మీద సహాయపడటం కోసం పంపిస్తుంది. ఇది ఆమె నిర్ణయం. దీనిని గురించి మనం ఏమీ చేయలేము. ఆమె దేని ఆధారంగా నిర్ణయించుతుందో కూడా తెలియదు. మనం ఆమెకి అప్లికేషన్ పెడతాం. అంతే, అది ఎలా వస్తుందో తెలియదు. ఎందుకు వస్తుందో తెలియదు. అది ఎందుకు రాదో కూడా తెలియదు. ఇది అమెరికా వీసా లాంటిది. మీరు అప్లికేషన్ ఇచ్చి, ఎదురు చూడటమే. అది ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు అనే విషయాలు ఏమీ తెలియవు. దీని గురించి మనం ఏమీ చేయలేము. అదే విధంగా పరాశక్తి నిర్ణయం కూడా మనకి ఏమీ తెలియదు.

జ్ఞానోదయమయిన యోగికి సంస్కారాలన్నీ కరిగిపోతాయి. ఆయనకి వాసన (కోరిక)లు ఉండవు. పునర్జన్మ ఉండదు. తిరిగి పుట్టాలి అనేది ఆయన నిర్ణయం కాదు. ఇక్కడ ఏదో ఉండి అది గర్బంలోనికి లాగుతుంది.

నేను పుట్టినప్పుడు అక్కడ ఒక కాంతి ఉన్నది. అదే అరుణాచలం. ఆ కాంతి నా శక్తికి దారి చూపించినది.

రామకృష్ణ పరమహంస తన పునర్జన్మ గురించి ఇలా చెబుతారు. జ్ఞానోదయమయిన కొందరు యోగుల మధ్య పసిబిడ్డ కనపడతాడు. ఆ పసిబాలుడిని వారంతా దీవించుతారు. ఆ బాబు రామకృష్ణ. ఆయనే తిరిగి మానవునిగా జన్మించుతారు. ఆయనని దీవించిన ఒక యోగి వివేకానందుడు. జ్ఞానోదయం పొందిన యోగులు సృష్టించే శక్తివలయమే దైవం. అంతా పరాశక్తి నిర్ణయం.

ప్ర. గౌరవనీయులయిన స్వామీజీ, ప్రతి రోజు నేను ఇక్కడికి వచ్చి చాలా చక్కని విషయాలు నేర్చుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది. వెనక్కి వెళ్ళాక కొంచం అయోమయంగా ఉంటుంది. అసలు ఏమి జరుగుతుంది.

జ : మీకు సరియైనదే జరుగుతుంది. దీని గురించి బాధ పడవద్దు. మీలో ఏమి జరుగుతుందో అది సరియైన విషయమే. ముందు దశలలో ఇలానే ఉంటుంది. మీరు అయోమయాన్ని, మానసిక వ్యధని లెక్కించండి. మీ దీవెనలని లెక్కించండి. చూడండి, చంద్రుడు తన వెన్నెల కాంతిలో మచ్చలు చూపించుతాడు. అదేవిధంగా ఎందుకు అయోమయంలో ఉన్నారు అని తెలుసుకోవచ్చు. మీరు మానసికంగా

భగవద్గీత - అధ్యాయం 12

వ్యధ చెందుతున్నారు. మీరు అయోమయంలో ఉన్నారు అని తెలుసుకున్నారు అంటే మీరు తెలివైనవారు అని అర్ధమవుతుంది. అది మీ తెలివితేటలలో చక్కని వృద్ధిని సూచించుతుంది. ఆ ప్రకాశం వ్యాపించటం మొదలయింది.

మీకు ఆలోచనలు లేనప్పుడు మీలో అయోమయం ఉండదు. మీకు ఉన్నతస్థితికి చేరే క్లూ దొరకదు. మీరు మీ పనులలో, అంటే తినటం, ఆడుకోవటం, పనిచేసుకోవటం వీటితో చాలా సంతోషంగా ఉంటారు. ఆలోచనలు లేనివారు వారి పద్ధతిలో వారు ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఆలోచించరు. వారు మనుషులులా ఆలోచించరు. వాళ్ళు వెతికే ఆనందం, పశుపక్ష్యాదులు వెతికే సంతోషం అది. వాళ్ళు ఆ దశలో ఉండే ఆనందంతో తృప్తిపడతారు. ఆ విధంగా జీవించి మరణించుతారు.

ఎప్పుడయితే మీరు ఆలోచించుతారో, మీకు సమస్యలు ప్రారంభమవుతాయి. మీరు ఇక్కడ ఉండి చేయవలసిన పని చేయటం లేదు అని తెలుసుకోగలుగుతారు. మీరు ఒక ఉద్దేశం కోసం వెతుకుతారు. మీరు అయోమయంలో ఉంటారు. స్పిరంగా ఉండలేరు. కొంతకాలం మీరు ఎంతోకాలంగా అనుభవిస్తున్న సుఖాలకి ఆకర్షింపబడతారు. తరువాత వాటిని తిరస్కరించుతారు. అవి మీకు ఆనందాన్ని ఇవ్వవు అని తెలుసుకుంటారు. ప్రకాశాన్ని చూస్తారు. క్రమంగా, నెమ్మదిగా, చాలా నెమ్మదిగా చీకటి నుంచి వెలుతురు వైపు వెళతారు. అక్కడ మీకు గురువు దొరుకుతాదు. అక్కడ నుంచి ఆయన మిమ్మలని అజ్ఞానం అనే చీకటి నుంచి సత్యం అనే వెలుగు వెపు తీసుకువెళతాదు.

అప్పుడు మీరు మైండ్ లేని స్పితికి చేరతారు. అప్పుడు ఆలోచనలు ఉండవు. అది మీకు అంతకుముందు ఉన్న ఆలోచనలు లేని స్పితి కాదు. అది దైవత్వంతో కూడిన స్థితి. ఇది ఆత్మపభోద స్టితి. ఆలోచనల స్పితి తార్కికమయిన మానవస్థితి.

భగవద్గీతలోని సంభాషణలు మొత్తం అర్హనుని అయోమయం వలన వచ్చినవే. అర్లునుడు మామూలు ఆలోచనలు ఉన్న మనిషిగా అడిగిన అనుమానాలే. వాటిని శ్రీకృష్ణుడు ఆలోచనలు లేని స్లితి నుంచి నివృత్తి చేస్తాడు. అదే శ్రీకృష్ణుని అత్యత్తమ చేతనస్గితి. అనుమానాలు, అయోమయయం మనుషుల లక్షణం. అవన్నీ కూడ ఆలోచనలు లేని స్గితి నుంచి అసలు ఆలోచన అనేది ఉండని (నో మైండ్) ఉత్తమ స్టితికి వెళ్ళే సమయంలో జరిగే విషయాలు.

ప్రశ్న గౌరవనీయులయిన స్వామీజీ, నాకు ఒక ప్రశ్న ఉన్నది. మీరు మెడిటేషన్ మీద లాస్ యాంజిల్స్‌లో ఏవైనా కార్యక్రమాలు చేయబోతున్నారా?

జవాబు గీతా జ్ఞాన యజ్ఞం అయ్యాక ఆరోగ్య స్పురణ కార్యక్రమం ఉంటుంది. అది ఆరోగ్యం గురించి ఉంటుంది. అది మీశరీరం, మనస్సు, ఆత్మలని ఆరోగ్య దిశగా తీసుకువెళుతుంది. అది మీ శరీరానికి, మనస్సుకి, ఆత్మకి చక్కని చికిత్సా పద్దతిని ఇస్సుంది.

నాదృష్టిలో ఆరోగ్యం, ఆధ్యాత్మికత రెండూ ఒక్కటే. ఎప్పుడు మీరు నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే, మీరు చాలా ప్రత్యేకమయిన ఆరోగ్యాన్ని అన్ని దశలకూ వ్యాపింపచేస్తారు. అది మీ శరీరానికి అతీతంగా ఉంటుంది. శరీరం అనారోగ్యమయం, అందుకే ఇంక ఏవిధమయిన అనారోగ్యం దానిమీద దాడి చేయలేదు. శరీరమే అనారోగ్యం కాబట్టి నా దృష్టిలో మీరు ఎప్పుడయితే హద్దులు లేని స్వేచ్ఛని పొందుతారో, అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు.

ఈ రెండు రోజుల కార్యక్రమం మీరు హద్దులులేని చేతన స్గితిని పొందటానికి, హద్దులు లేని స్వేచ్చని పొందటానికి సహాయం చేస్తుంది. సహజంగానే అది మన శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. లైఫ్ బ్లిస్ ప్రోగ్రాం ధ్యానపీఠం ఆచార్యులు నిర్వహించుతారు. నేను రెండు సెషన్స్‌కి మాతం ఉంటాను. అయితే నేను పూర్తిగా ఆరోగ్య స్సురణ కార్యక్రమం తీసుకుంటాను. నేను అమెరికాలో నిత్యానంద స్సురణ కార్యక్రమం చేయటం లేదు. ఒకటి మాత్రం వేంకోవర్‌లో చేస్తాను.

నేను మా ఆశ్రమంలో ఉండేవారికి మాత్రం పూర్తి శిక్షణని ఇస్తున్నాను. దీనిలో హీలర్స్ కూడా పాల్గొనవచ్చు. మీరు హీలరుగా నాచేత నియమించబడితే, మీరు ఈ క్లాసుకి రావచ్చు. నేను గీతా జ్ఞాన యజ్ఞం అయ్యాక రాత్రిపూట క్లాసులు తీసుకుంటున్నాను. ఉదయం క్లాసులకి ఎవరయినా రావచ్చు. కానీ సాయంత్రం క్లాసు మాత్రం కేవలం హీలర్స్‌కే. ఎందుకంటే అందులో ధ్యానం చాలా లోతుగా, తీవ్రంగా ఉంటుంది. నేను ఆశ్రమం వారితో ఎక్కువ సమయం ఉండాలి కాబట్టి నేను వేరే కార్యక్రమలు చేయటం లేదు. కేవలం ఆరోగ్య స్సురణ కార్యక్రమం ఒకటే చేస్తున్నాను.

ప్రశ్న యుద్దం చేసారు. ఎందుకు?

జవాబు మహాభారత యుద్ధం మొదలులో అందరూ ధర్శాన్ని అనుసరించారు. అందరూ నీతి మార్గంలో ఉండేవారు. ఆ తరువాత ఆధర్మం మొదలయింది. అవినీతితో, రాతిపూట చంపటం ఇలా జరగటం మొదలయింది. ఉప పాందవులని నిద్దపోయే సమయంలో చంపేసారు. అర్హునుడు కర్ణుణ్ణి, చేతిలో ఆయుధాలు లేని సమయంలో చంపాదు. అభిమన్యూణ్డి, చేతిలో ఆయుధం లేని సమయంలో అందరూ కలసి చంపారు. అప్పుడు అతను చాలా చిన్నవాడు. అతనిని అతని తాత కళ్ళముందే బంధువులే చంపేసారు.

మీరు అడిగిన ప్రశ్న సరియైనదే. అసలు అప్పుడు ఏమి జరిగిందంటే యుద్ద ప్రారంభంలో ధర్మం ఉండేది. క్రమంగా కౌరవులు అధర్మం మొదలు పెట్టారు.

అలాగే పాండవులు కూడా ధర్మం వదిలారు. అలా ఒకరి తరువాత ఒకరు అధర్మదారులలో యుద్ధం చేసారు.

పదవరోజు వచ్చేసరికి నిబంధనలని వదిలేసారు. అది క్రూర యుద్ధంగా మారింది. అవినీతి యుద్ధంలా మారింది. ఇక అది ధర్మక్షేతం కాదు. భీష్ముడు బతికి ఉన్నంత వరకూ ధర్మం ఉన్నది.ఆయన చనిపోగానే అధర్మం మొదలయింది. అది యుద్ధభూమి కాదు క్రకూర యుద్ధ భూమి. అధర్మ భూమి అయింది.

ప్రశ్న స్వామీజీ, ప్రతి నిద్ద పోవటం, మేలుకొనటం, మరణం, జీవమయితే, మనం జన్మించినప్పుడు లౌకిక జీవితాన్ని సృష్టించుతాము. ప్రపతి మేలుకొలుపు కొత్త జీవితానికి ఒక అవకాశమేనా?

జవాబు అవును. ప్రతిరోజు మీరు భౌతికంగా, మానసికంగా మారటానికి ఒక అవకాశం. మీకు వివరంగా చెబుతాను. మీరు మీ శరీరాన్ని కూడా మార్సవచ్చు. మీ మనస్సునే కాదు, మీ శరీరాన్ని కూడా మార్చవచ్చు. ఎందుకంటే మీ మైండే మీ శరీరాన్ని తయారు చేస్తుంది. స్పష్టంగా తెలుసుకోండి. ప్రతీ రోజు మీరు మారటానికి మీకొక అవకాశం ఇస్తుంది. ప్రతీ నిద్దా మరణం. ప్రతి మేలుకొలుపు పునర్దన్మ. ఇది జనన మరణం అని స్పష్టంగా తెలుసుకోండి. ప్రతిరోజు మీరు మారటానికి ఒక అవకాశం.

మీరు ఎప్పుడయితే మేలుకుంటారో అప్పుడు మీ సూక్తు శరీరం మీ శరీరంలో సర్శుకుంటుంది. అప్పుదు మీకు ఉండే అలోచనలు, మీ మానసిక స్గితి, మీ మూడ్ అన్నీ మీరు ఆ రోజు చేయబోయే పనులని ప్రభావితం చేస్తాయి.

మీరు నిద్దలేచినప్సుడు, మంచం మీద పదుకునే, మీ చేతులతో మీ శరీరాన్నంతా, తల దగ్గర నుంచి కాలివేళ్ళ వరకూ తడమండి మీ చేతులు తల దగ్గర ఉన్నప్పుడు, నాకు చాలా అందమయిన తల ఉన్నది అని అనుకోండి. మీ జుట్టు చాలా

అద్భుతంగా ఉన్నది అనుకోండి. మీకు నిజంగా ఉన్నదా లేదా అనే విషయం పట్టించుకోవద్దు. అలా చేయండి. అంతే. అప్పుడు సర్వాంతర్యామికి కృతజ్ఞతలు చెప్పండి. మీకు అంత అందమయన తలని, జుట్టుని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపండి. ఈ విధంగా మీరు మీ శరీర భాగాలన్నింటినీ స్పృసించి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పండి.

ఇలా చేయటానికి మీకు 10 నిముషాల సమయం పట్టవచ్చు. ఇది చాలా శక్తివంతమయిన సుఫీ పద్ధతి. ఇలా చేస్తే మీ మూడ్ బాగా ఉదంటమే కాదు, మీ మీద మీకు ప్రేమ పెరుగుతుంది. ఇలా చేసినప్పుడు మీకు ఇతరులన్నా కూడా ప్రేమ కలుగుతుంది. అవును. ప్రతి మేలుకొలుపు మీ జీవితాన్ని మార్చుతుంది. అయితే అలా మారాలి అంటే, మీరు దానిని ఎలా మార్చాలో తెలుసుకొని, దానిని మారనీయాలి.

మనందరం పరబ్రహ్మ శ్రీకృష్ణని ప్రార్గించుదాము. ఆయన మనవి భక్తియోగంలో సత్యాలని మనకి అనుభవం కలిగేలా చేయమని, ప్రతి ఒక్కరినీ మనం ప్రేమించగలిగే శక్తినివ్వమని ప్రార్ధించుదాము. మనందరికి సచేతనమయిన భక్తిని ప్రసాదించమని, ప్రేమని ఇవ్వమని శాశ్వతానందమయిన నిత్యానందాన్ని దాని అనుభవాలని వ్యాపింప చేయుదురు గాక. నిత్యానందం.

ధన్యవాదాములు.

శ్లోకం

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం.

వసుదేవ పుత్రా, కంసచాణూరలని వధించిన దేవాది దేవా,

దేవకీ మాతకి పరమాంనందాన్ని ఇచ్చే శ్రీకృష్ణా, జగద్గురువైన నీకు వందనములు దీనితో 12వ అధ్యాయమయిన భక్తియోగం అనే శ్రీకృష్ణార్జునుల మధ్య సంభాషణ సంపూర్ణం. ఇది బహ్మ విద్యా యోగ శాశ్రస్తమయిన భగవద్గీత అనే ఉపనిషత్తు నుంచి తీసుకొనబడినది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM:

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఈ రోజు మన మధ్యఉన్న ఒక అద్భుతమయిన మహాయోగి, పరమపావన గురు దేవులు. ఆయన శాశ్వతానంద స్థితిని చేరాలి అనే ఒకే ఒక సిర సంకల్సంతో అతి చిన్న వయస్సులోనే తీవ్రవమయిన తపస్పు చేసారు. స్వామీజీ భరత దేశమంతా పాదచారియె తిరిగారు.

ఆయన భారతదేశం, నేపాల్ లోని గొప్పగొప్ప యోగులు, రుషుల దగ్గర యోగా, తంత్రము, తూర్పుదేశాలకి సంబంధించిన వేదాంతా ఆది భౌతిక తత్త్య శాస్త్రాలు మొదలయిన విద్యలని సశాస్త్రీయంగా అభ్యసించారు. ఆయన అద్భుతమయిన ఆధ్యాత్మిక అనుభవాలను లోతుగా, గాధంగా తెలుసుకున్న గొప్ప యోగీశ్వరుడు

స్వామీజీ యొక్క ప్రత్యేక లక్ష్యం ప్రతీ వ్యక్తి తనలో దాగి ఉన్న అద్భుత శక్తిని తెలుసుకునే విధంగా వారికి సహాయం చేయటం. ఆచరణాత్మకమయిన కరుణతో కూడిన ద్సక్సదంతో స్వామీజీ ప్రతి వ్యక్తీ యొక్క అంతరంగంలోనికి ఆత్మసాక్షాత్రార జ్ఞానాన్ని కలిగించాలి అని నిరంతరం వారిని తన ఆత్మీయ స్పర్శతో ప్రోత్సహించుతూ, ప్రపంచ నలుమూలలా లక్షల మందిలో అనూహ్యమయిన మార్పుని తెచ్చి వారి జీవిన విధానంలో పెనుమార్పుని తెచ్చారు.

స్వామీజీ, తన దివ్య ఆరోగ్య చికిత్సా స్పర్శతో నిత్య ఆధ్యాత్మిక చికిత్నా పద్ధతిని ప్రపేశ పెట్టారు. ఇది ఒక సశాస్త్రీయమయిన ఆధ్యాత్మిక చికిత్స పద్దతి. ధ్యానం ద్వారా అనారోగ్య లక్షణాలని బాగుచేసి ఆరోగ్యమంతులని చేసే పద్ధతి. స్వామి ప్రత్యక్షంగా తన దివ్య స్సర్శతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో ఆరోగ్యవంతులని చేసారు. స్వామీజీ చేత శిక్షణ పొంది ఆయనచే నియమించబడిన హీలర్స్ అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్యవంతులుగా చేసే పుణ్యకార్యంలో నిరంతరం నిమగ్సమయి ఉంటారు. స్వామీజీ, ఆయనచే నియమించబడిన హీలర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో నిమగ్నమయి, తలనొప్పి వంటి చిన్న వ్యాధులు నుంచి కేన్సర్ వంటి భయంకరమయిన వ్యాధుల వరకు బాగుచేస్తున్నారు.

స్వామీజీ యొక్క ముఖ్య సందేశమైన ధ్యానము, శాశ్వతానందం (నిత్యానందం) అనే విషయాలని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన నిత్యానందా ఫౌందేషన్ సంస్థ ద్వారా అందరికీ అందేలా చేస్తున్నారు. ఈ విష్లవాత్మకమయిన కార్యక్రమాల ఆధ్యాత్మిక ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉన్నది. అదే విధంగా పశ్చిమ దేశాలలో జరిగే కార్యక్రమాల ప్రధాన కార్యాలయం లాస్ ఏంజిల్స్ ఉన్నది. ఈ కార్యక్రమం మొత్తం కేంద్రాల ద్వారా దేశాలలో నిరంతరం కొనసాగుతూ ఉన్నది. ఈ మొత్తం కార్యకలాపాలు ప్రతి వ్యక్తిలో మార్సుని తెస్తూ దాని ద్వారా సమస్త మానవ జాతిలో మార్పుని తేవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో పని చేస్తున్నాయి.

స్వామీజీ ధ్యాన పద్గతుల గురించే ఇచ్చే స్పష్టమయిన, ప్రయోగాత్మకమయిన వివరణ ప్రపతి వ్యక్తీ భౌతికంగా మానసికంగా, ఆధ్యాత్మకంగా వికసించటానికి ఎంతో సహయం చేస్తుంది. ఈ విషయంలో కొన్ని వేల మంది ఆనందసేవకులు ప్రపంచం అంతటా నిరంతరం పనిచేసున్నారు.

స్వామీజీ తనకుతాను ఒక ప్రయోగశాలగా మారి, ప్రపంచవ్యాప్తంగా శాశ్వంజ్ఞలతో కలిసి పనిచేస్తూ పశ్చిమదేశాల సాక్ష్యాధారమయిన హేతువాదానికి, ప్రాచీన తూర్పుదేశాల అద్భుత మర్మయోగాకి మధ్య వారధి నిర్మిస్తూ సర్వ మానవాళి శ్రేయస్సు కోసం, వారి ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం స్వామి నిరంతరం కృషి చేస్తున్నారు.

శా స్త్ర విజ్ఞానానికి ఆధ్యాత్మికతకు మధ్యవారధి

పరమహంస శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వైద్యులు, శాశ్రస్త్రజ్ఞలతో కలసి ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించి దాని ద్వారా మనవాతీత ఆధ్యాత్మిక విషయాలపై ప్రయోగాత్మక విశ్లేషణ చేసారు. ఆయన తన నాడీ వ్యవస్థపై (ముఖ్యంగా మెదడు యొక్క పని తీరు) అధ్యయనం చేసి వాటి ఫలితాలను వైద్యశాస్త్రంలోని రహస్యాలను అధ్యయనం చేయటానికి ఉపయోగించారు. ఈ అధ్యయన ఫలితాల ఆధారంగా, కొన్ని రకాల వ్యాధులకు, ముఖ్యంగా కాన్సర్, ఆర్గటీస్, మత్తుపానం వంటి వ్యాధులను తగ్గించే అవకాశం, అది సాధించే మార్గం ఉన్నాయి అని శా స్తజ్ఞులు అనుకుంటున్నారు. అంతేకాకుండా, ఈ ప్రయోగాల ఫలితంగా వారు మానవ మెదడుకి తన శరీరంలోని వ్యాధులను బాగుచేయాలి అని నిర్ణయం చేయగల శక్తి ఉన్నది అని చెప్పారు.

కొన్ని శతాబ్దాలుగా శాస్త్ర విజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము మానవాళికి అత్యవసరమయిన ఈ విషయాలను వెల్లడి చేయటానికి పోరాదుతున్నాయి. ఆధ్యాత్మిక గురువులు ఎన్నోసార్లు, మైండ్‌లేని స్టితి అనే విషయం సత్యం అని, ప్రతి ఒక్కరు కచ్చితంగా ఆ స్గితిని సాధించగలరు అని చెబుతున్నా, శాస్ట్రజ్ఞలు మాతం ఆ విషయాన్ని ఆధారాలు లేవు అనే వాదనతో అంగీకరించలేదు.

ఈ శతాబ్దంలో మొట్లమొదటిసారి, అసాధారణమయిన అద్భుతాలు, శాస్త్రీయ వివరణకు అతీతమయిన విషయాలను శాస్త్ర విజ్ఞానానికి నిరూపించగలిగే తాకంచెవి వారికి దొరికింది. ఆధ్యాత్మికంగా అద్భుతాలు సాధించిన వ్యక్తికి చాలా శక్తులు ఏ విధంగా ఉంటాయో వెద్యపరమయిన నిరూపణలతో, సశాస్త్రీయమయిన వివరణ, స్వామీజీ పై చేసిన ప్రయోగాల ద్వారా దొరికినది. స్వామీజీ యొక్క మెదడు పనితీరుపై చేసిన పరిశోధనల ఫలితాలను ఈ క్రింది పేజీలలో వివరించబడినది. స్వామీజీ అమెరికాలో ఉండగా ఈ ప్రయోగాలు జరిగాయి

అద్భుతమయిన ఒక యోగీశ్వరుని మెండ్ :

డా. మురళీకృష్ణ, పెసిదెంట్, COO, INTEGRIS మెంటల్ హెల్త్ & జేమ్సా, ఎల్.హాల్ Jr. సెంటర్ ఫర్ మెంద్, బాడీ & స్పిరిట్, ఒక్షహామా వారు ఇచ్చిన నివేదిక ఈ విధంగా ఉన్నది.

A Mind Matters Column™ The Mind of a Mystic By R. Murali Krishna, M.D. President COO, INTEGRIS Mental Health & James L. Hall, Jr. Center for Mind, Body and Spirit

పరమహంస శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చక్కని ఆరోగ్యం కలిగిన యువకుడు. ఆయన చామనఛాయ శరీర ఛాయ కలిగి, భుజాల వరకూ పెరిగిన జుట్టుతో ఉన్న సౌమ్యత కలిగిన అందమయిన యువకుడు. ఆయన చాలా విశాల భావాలు కలిగి, చాలా కుతూహలం ఉన్న వ్యక్తి. ఆయన చూడటానికి అమెరికాలోని ఒక కాలేజీ విద్యార్ధిలా ఉంటారు. కాకపోతే ఆయనతో పోల్చినప్పుడు అమెరికాలోని కాలేజీ విద్యార్థి కొన్ని విషయాలలో వేరుగా ఉంటాడు. అమెరికాలోని కాలేజీ విద్యార్థి కాషాయ వస్త్రాలు ధరించరు, తలపాగ కట్టుకోరు. అతనికి ఆధ్యాత్మిక జ్ఞానోదయం వంటి అనుభవాలు లేవు. ఆ విద్యార్షిని ఎవరూ గురువుగా, హీలర్‌గా, అద్భుతమైన యోగిగా ప్రపంచంలో అన్ని మూలల నుంచి లక్షల మంది గుర్తించరు.

అద్భుతమయిన యోగి అనే మాట స్వామీజీకి సరీగ్గా సరిపోతుంది. ఇటువంటి యోగులు భగవంతునితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటారు, అనే విషయం యోగీ సంస్మృతి తెలియజేస్తుంది. యోగులు అంతిమ సత్యాలని పొంది ఉంటారు అని చెబుతారు. అది ఏవిధంగా ఉంటుంది అనేది తెలియదు. యోగీశ్వరుదు అని మనం అసుకోగానే మన ముందు నిత్యానందం తో నిందుగా ఉండే వ్యక్తి, ఉన్నతమైయిన, మహత్తరమయిన ఆలోచనలతో ఉండి మనలో ఎవరికీ లేని ఆత్మసాక్షాత్మారం పొందిన వ్యక్తియొక్క చిత్రం మన కళ్ళముందు ఉంటుంది. అటువంటి యోగీశ్వరుని గురించిన ఆలోచన మాత్రం చేత మనలో గొప్పశాంతి సౌఖ్యం కలుగుతుంది.

ఇదంతా కూడా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM పూర్తిగా సరిపడే వివరణ. స్వామి 27 సంవత్సారాల, దక్షిణ భరత వ్యక్తి, స్వామీజీ దగ్గరికి ప్రపంచం అన్ని మూలల నుంచి లక్షలాది మంది తమలో ఉన్న వ్యాధుల నివారణ కోసం వస్తుంటారు. ఆధునిక వైద్యం పరిష్కరించలేని సమస్యలతో వారు స్వామీజీ సమక్షానికి వస్తారు. ఆయన తన దివ్య స్సర్శతో వ్యాధులని నిర్మూలించుతారు. స్వామీజీ జీవిత చరిత్ర అంతా అద్బుతాలతో నిండియున్నది. ఆయన చిన్న వయస్సులో ఇల్లువదలి, భారతదేశంలో అనేక ఆశ్రమాలలో ఉండి, వేదాంత విషయాలు, ఆధ్యాత్మిక విద్యలు విస్తృతంగా చదివి, ధ్యాన పద్ధతులని శాస్త్రీయంగా మలచి ఆ సాధనలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించారు.

ఈ మధ్య స్వామీజీ ఒక్లహామా పట్టణం గుండా ప్రయాణిస్తూ అక్కడ ఆగారు. అప్పదు నేను ఆయనని కలిసి, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పద్ధతులలో ఆయన ధ్యానం చేసే సమయంలో మెదడుని పరిశీలించి అధ్యయనం చేయాటానికి అనుమతి అడిగాను. నా ఉద్దేశం ఏమిటంటే ధ్యానం అనే అద్భుతం జరిగే సమయంలో

మెదడులో జరిగే విషయాలను అర్ధం చేసుకొని, వాటి పరిమాణం లెక్కకట్ట తెలుసుకోవాలి. స్వామీజీ ధ్యానం అనేది శాశ్త్రీయ ప్రపక్రియ అని నమ్ముతారు ఆయన

ఈ ప్రయోగానికి వెంటనే ఆనందంగా ఒప్పుకున్నారు.

స్వామీజీ పాల్గొన్న ఈ ప్ర‌యోగంలో ఒక్షహామాలోని పేరు, అనుభవం ఉన్న దాక్టరు, శాగ్రస్తజ్ఝలు కూడా ఉన్నారు. వాళ్ళు దా॥ ఫోర్టీస్, డా॥ రువే, డా॥హిగ్గిన్స్ వీరందరూ జిమ్ తోర్సే రిహాబిలిటేషన్ సెంటర్, న్యూరోసైకాలజీ డిపార్షుమెంట్‌కి సంబంధించిన వారు. దా॥ చాకో, PET సెంటర్, ఒక్లహామాకు చెందినవారు వీరంతా ఈ ప్రయోగాన్ని పరిశీలించి అధ్యయనం చేసారు. వారు స్వామీజీని అధ్యయనం చేయటానికి సాధారణంగా పేషెంట్లకి ఉపయోగించే సాంకేతిక పద్ధతులనే ఉపయోగించారు.

అధ్యయన ఫలితాలు "చాలా కచ్చితంగా ఇది అసాధారణ స్గితి అని నిర్ధారించాయి"

మెదడు యొక్క చర్యల చిత్రాలు

స్వామీజీ మెదడు యొక్క మొదటి దృశ్యాలని Positron Emssion Tomography పరికరం సహయంతో చూసారు. సాంప్రదాయ పరికరాలయిన X-rays, CT స్మానింగ్‌లా కాకుండా MRI, PET పరికరం మెదడులోని కణాల జీవరసాయన క్రియ ద్వారా మెదడులో జరిగే చర్యలని చిత్రాలుగా చూపించుతుంది. గూక్షోజ్ లాంటి పదార్ధన్ని రేడియో యాక్షివ్ PET ట్రేసర్‌కి అతికించారు. అప్పుడు PET స్కానర్ మెదడులోని జీవరసాయన చర్యలని ఎప్పుడు అవసరమయితే అప్పుడు చూపించేది.

స్వామీజీ విషయంలో దేనిని మెదడులో అయిన మెలకువగా, తెలివి కలిగిన స్థితిలోన్నప్పుడు మెదడులోని అతి చురుకుగా ఉన్న ప్రాంతాలని గుర్తించటానికి ఉపయోగించారు. దీనిని వాళ్ళు స్వామీజీ ధ్యానం ప్రారంభించిన ఆ సమయంలో ఆ తరువాత పూర్తిగా లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు మెదడులోని చర్యలని గుర్తించటానికి ఉపయోగించారు.

PET స్కానర్ పరీక్షల ఫలితాలు చూసి వారు నిర్ఘాంతపోయారు. ముందుగా నొసటివెపుగా ఉండే భాగాలతో మెదడు యొక్క చర్యలు అత్యంత చురుకుగా ఉన్నాయి. అవి ధ్యానం ప్రారంభ దశలో కూడా చాలా చురుకుగా ఉన్నాయి. ఆ చర్యలు సాధారణ వ్యక్తుల మెదడులో జరిగే చర్యలకంటే చాలా రెట్లు, అధికమయిన చురుకుతనంలో ఉన్నాయి. మెదడులోని ఈభాగం తెలివితేటలు, lశ్రద్ధ చూపటం, వివేకం, నిర్ణయాలు చేయటం మొదలయిన పనులని చేస్తుంది.

మేము స్వామీజీన గాధమయిన, లోతయిన ధ్యానంలోనికి వెళ్ళమని కోరినప్పుడు రెండు విశేషమయిన ఫలితాలని కనుగొన్నాము.

అందులో మొదటిది స్వామీజీ మెదడులోని అత్యధిక భాగం 90% నిశ్దుబ్ద మయిపోయింది. అది పూర్తిగా తన చర్యలని నిలిపివేసింది. అది ఎలా ఉంది అంటే స్వామి మెదడు అన్ని పాక్ చేసుకొని శలవలకి వెళ్ళిపోయిందేమో అనిపించేటట్టుగా ఉన్నది. అది పూర్తిగా నిశ్నబ్దంగా, విశ్చలంగా, పూర్తి ప్రశాంతతతో ఉంది. ఇది అంతా స్వామీజీ చేయాలి అని కల్పించిన పరిస్ధితి

రెండవ ఆశ్చర్యకరమయిన పరిశీలన ఏమిటంటే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM గాధమయిన లోతయిన ధ్యానంలో ఉన్నపుడు ఆయన మెదడులోని ముందు వైపు క్రింది భాగం చాలా ‌ప్ర‌కాశ‌వంతంగాను, స్ప‌ష్టంగా ఉన్న‌ది. ఈ భాగం అద్భుత‌మ‌యిన మూద‌వ‌క‌న్నుకి సంబంధిన భాగం

మేము తరువాత THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMని ఆ సమయంలో మీరు ఏమి చేసారు అని అడిగినప్పుడు అయిన తన మూడవ కన్ను తెరచినట్లు చెప్పారు.

మూడవ కన్ను అనేది ఆత్మ యొక్క స్థానమని, ఇది విశ్వజ్ఞానం అంతరంగ జ్ఞానం యొక్క కలయికతో ఏర్సదే [పదేశం అని, ఇది స్పష్టతకి [పశాంతతకి నిలయమని అంటారు. లోతైన ధ్యానంలో ఉంటే మెదడులో తెరవబడే భాగం బహుశః సర్వాంతర్యామితో సంబంధం ఏర్సరచవచ్చు. అలాగే విశ్వశక్తితో సంభాషించే అవకాశం కల్పించవచ్చు అని అనుకోవచ్చు. ఈ భాగం ద్వారా యోగి తన అంతరంగ లోతులలోనికి, అక్కడ జరిగే అద్భుతాలలోనికి చూడగలుగవచ్చు. PET స్కాన్ చూపించిన ఈ భాగానే నేను మెదడులోని డి ప్రాంతం D-Spot అంటాను. డి అంటే దైవం కావచ్చు. అనందం కావచ్చు లేదా దొపామైన్ అనే ఒక పదార్గం కావచ్చు. (డొపామైన్ అనే పదార్గం శరీరానికి ఆసందాన్ని ఇస్తుంది) అంటే ప్రారంభదశరోని గుర్తుల [పకారం ధ్యానం ఆ ఆనందాన్ని [పేరేపించవచ్చు

మెదడులోని తరంగాలని కొలవటం (QEEG)

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMపై చేసిన మరొక అధ్యయనం(QEEG) ని తెలుసుకోండి. QEEG అనేది మెదడులోని విద్యుత్ తరంగాలని లేదా మెదడులోని తరంగాలుని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది

మానవ మెదడులో నాలుగురకాల తరంగాలు ఉంటాయి. ఒక్కొక్క తరంగం ఒక్కొక్క వేగాన్ని కలిగి ఉండి మెదడు యొక్క వివిధ స్గితులను సూచిస్తుంది. ఉదాహరణికి బీటా తరంగాలు చిన్నవి, వేగంగా ఉండి అవి మెదడులోని మెలకువ స్గితిని సూచిస్తాయి. అల్పా తరంగాలు నెమ్మదిగా ఉండి పెద్గగా ఉంటాయి. అవి మనం బాగున్నాము. అనే ఆలోచనలకు సంబంధించి ఉంటాయి. తీటా తరంగాలు మన చేతన స్గితిని తెలియజేస్తాయి. అవి నిద్ధావస్గకి దగ్గరగా ఉంటాయి. ఈ స్థితిలో నిశ్శబ్దంగా నిశ్చలంగా, ప్ర‌శాంతంగా ఎటువంటి చుర‌క‌యిన ఆలోచ‌న‌లు లేని స్లితిని తెలియచేస్తాయి.

ఒక రోజులో చాలా మంది వ్యక్తులు ఈ నాలుగురకాల తరంగాలకదలికలని

Part 3: Love is Your Very Life_Telugu_part_3.md

భగవద్గీత - అధ్యాయం 12

(పేమే మీ జీవితం

కలిగిఉంటారు. అయితే ఒకదానిలోంచి మరొక తరంగంలోనికి వెళ్ళటం అనేది వారి ఆధీనంలో ఉండదు.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM (QEEG) ఆధారంగా చూస్తే మెదడులోని తరంగాల కదలిక మీద పూర్తి నియం(తణ ఉన్నది అని నిరూపణ జరిగింది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM గాధమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన మెదడు అతి మృదువుగా ఒక స్గితి నుంచి మరొక స్పితికి మారగలిగింది. ఎటువంటి అడ్డంకు అనుమానం లేకుండా మెదడులోని ద్రదవ పదార్ధం ఒక స్గితి సుంచి మరొక స్గితికి మారుతుండేది. అది ఎలా అంటే ఎంతో నెపుణ్యం గల పియానిస్ట్ ఒక [శుతి నుంచి మరొక [శుతిలోనికి మారినంత అద్భుతంగా మారుతుంది. (QEEG) మెదడులోని తరంగాలని అయిదు రంగులలో చూపిస్తుంది. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMని గమనించినప్పుడు ఇంధ్రనస్సులోని రంగులు ఒక దాని నుంచి మరొకటి కదులుతున్నట్లుగా అనిపించింది.

ముగింపు వాక్యాలు

మానవ శరీరంలో మెదడు అత్యంత క్లిష్టమైన భాగం. దీనిలో 100 బిలియన్న (100కోట్లు) న్యూరాన్లు ఉంటాయి. [పతి న్యూరాన్ మరో 10,000 న్యూరాన్ల్‌తో రసాయన విద్యుత్ సంబంధాలు కలిగి ఉంటాయి. విషయాలని నియం(తించి ముందుకు పంపించే పని చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది.

అంత క్లి ష్ట మంబన వెంద డు ప నీతీరుని THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM చాలా తేలిక గా నియంత్రించగలుగుతున్నారు. THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM యొక్క మనస్సు అంటే ఆయన ఆలోచనలు, భావావేశాలు, తెలివితేటలు మెదడుని నియంత్రించగలుగుతున్నాయి. ఆయన ఒక ద్దవ పదార్గంగా ఎంతో సులభంంగా మెదడు చేసే పనులని, తరంగాలని ఒక స్పితి సుంచి మరొక స్గితికి మార్చగలుగుతున్నారు.

మేము చేసిన ఈ ప్ర‌యోగంతో మా ప్ర‌శ్న‌ల‌కి జ‌వాబులు తెలుసుకోగ‌ల‌గ‌టం కంటే కూడా, మాకు కూతుహలం కలిగించే రహస్యాలు కలిగిన ఎన్నో ప్రపశ్నలు మా

పరిశోధనలకి దొరికాయి. ఉదా: మానవ జీవితాలలో సమతుల్యాన్ని (పశాంతతని తేగల పద్శతులని మనం నేర్చుకోగలమా?

ప్రత్యేక శిక్రణ ద్వారా అనారోగ్యాన్ని బాగు చేసే |కియలని తీసుకురాగలమా? వ్యాధులను నియంత్రించి బాధలను నియంເతించే పద్ధతులని మనం నేర్చుకోగలమా? డి. ప్రాంతాన్ని చురుకుగా చేయగల పద్ధతిని మనం నేర్చుకోగలమా? అలా చేసి సర్వాంతర్యామితో [పత్యక్ష సంబంధాన్ని నెలకొల్పగలమా? శాశ్వత ఆనందాన్ని పొందగలమా?

మేము THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAMతో జరిపిన పరిశోధనా ఫలితాలు మెదడుపై జరిపే పరిశోధనలలో కొత్త పేజీలని ఈ ప్రపంచానికి అందించాయి. మెదడు తన శరీరాన్ని అనారోగ్యాన్ని నియంເతించి దానిని బాగుచేసుకోగలదు అనే విషయాన్ని సూచిసుంది.

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మన కంటికి కనిపించని, అద్భుతాలతో నిండిన [పాచీన [ప్రపంచానికి మనకి కనిపించే ఆధునిక శాస్త్ర విజ్ఞాన పరిశోధనల ప్రపంచానికి మధ్య వారిధి లాంటి వారు. మెదడుపై పరిశోధనలు చాలా విస్పతంగా జరుగుతున్నాయి. మనం సరియైన సమయంలో ఈ అద్బుతాలని శాస్త్ర జ్ఞానంలోనికి తీసుకురాగలిగితే మానవాళి ఆరోగ్యవిషయంలో ముందదుగు వేసినట్టే

లెఫ్ బ్లిస్ ఫౌండేషన్ కోరు అంబస్సున్న కార్యక్రమాలు

lప్రపంచ వ్యాప్తంగా ధ్యాన పద్గతుల మీద కొన్ని (ప్రత్యేక కార్యక్రమాలని తయారు చేసి నిరంతరం అందరికీ అందుబాటులోనికి తేవటానికి THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ఫౌండేషన్ lపయత్నిస్తుంది. ఈ ధ్యాన పద్ధతులు మానవాళికి భౌతిక, మానసిక ఆధ్యాత్మిక స్థితులలో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఫౌండేషన్ అందిస్తున్న ధ్యాన కార్యక్రమాలు ఈ క్రింద ఇవ్వబడాయి.

  1. ఆనంద స్పురణ (పో|గాం / లెఫ్ బిస్ పో|గామ్ (Ananda Spurana Program (ASP)/ Life Bliss Program (LBP) (మిమ్ములని శక్తివంతులుగా చేసుకోవటం)

Asp Or Lbp అనేది చక్రా ధ్యాన కార్యక్రమం

ఈ కార్యక్రమంలో మనలో ఉండే 7 శక్తి పీఠాలని, వాటినే మనం చక్రాలు అంటాము, వాటి పని తీరు అవి మన శరీరం మీద మానసిక స్లితి మీద ఎలా [ప్రభావం చూపుతాయో తెలియచేస్తుంది. ఈ ప్రోగ్రాం చక్రాలకి మన భావావేశాలకి మధ్య ఉన్న ప్ర‌త్య‌క్ష‌ సంబంధాన్ని వివ‌రించుతుంది. ఈ ప్రోగ్రాంలో సుల‌భ‌మ‌యిన ధ్యాన పద్ధతులని నేర్పించుతారు. వాటి ద్వారా మనం మన భావావేశాలని సమర్ధవంతంగా నియంత్రించగలుగుతాము. మన మానసిక స్గితి మీద స్పష్టమయిన అవగాహన ఏర్పదుతుంది. మన మధ్య సత్సంబంధాలు ఏర్పడటానికి సహాయం చేస్తుంది. దీనితో మనం ఆనందమయ జీవితాన్ని సాధించే దిశగా పని చేయగలుగుతాము. ఇదే ప్రొగాం విద్యార్ధుల కోసం తయారుచేయబడినది. అది విద్యార్థుల ASP ప్రోగ్రాం

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్పురణ ప్రోగాం THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM Spurana Program (NSP) (మరణ రహస్యాన్ని చేధించటం)

అన్ని రహస్యాలలోకి గొప్ప రహస్యం లేదా మర్మం మరణం. మన జీవితంలో [ప్రతి క్షణం మరణ భయం మనలని అంటిపెట్టుకొని ఉంటుంది. అది మన భావావేశాలలో వ్యతిరేక భావాలని సృష్టిస్తుంది. దీనితో ఆనందంగా జీవించగలిగే నేర్పుని మనం కోల్పొతున్నాము.

ఈ కార్యక్రమంలో మరణం అంటే ఏమిటి, మరణ సమయంలో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మనలోని 7 శక్తి కేంద్రాలు (7 చక్రాలకు) మనలోన భావావేశాలయిన కోరికలు, భయం అపరాధభావం, బాధలు, ఆనందం మొదలయిన వాటితో [పత్యక్ష సంబంధాన్ని స్పష్టించుతుంది. ఈ భావావేశాల ఏవిధంగా మొదలవుతాయి. ఆత్మ విడిపోయే సమయంలో ఈ 7 శక్తి కేంద్రాలు ఏవిధంగా దాటుతుంది తెలియజేస్తుంది. మన పూర్వ జన్మల నుండి మనలో నింపబడిన చేతన, అచేతన భావావేశాలని బయటకి తీసుకువచ్చి వాటి నుంచి మనలని విముక్తులని చేస్తుంది. ఈ ప్రోగ్రాం ఒక విధమయిన ఆధ్యాత్మిక స్నానం వంటిది. అది మనకి [కొత్త జన్మని ఇస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మనం ఆనందంగా ఎలా ఉండగలమో తెలుసుకోవచ్చు మనలోని లోతైన అజ్ఞానాన్ని తొలగించి ఆ స్గలంలో తెలుసుకునే తత్వాన్ని ప్రవేశపెడుతుంది.

శకి స్పురణ ప్రోగాం Shakti Spurana Program (SSP) (మిమ్మలని శుభ్రపరచుకోవటం)

ఇది ఒక ధ్యాన సంబంధమయిన ప్రోగ్రాం. దీని ద్వారా మనలోని మూడు శక్తి శరీరాలయిన భౌతిక, సూక్తు కారణాత్మకమయిన శరీరాలు గురించి

తెలుసుకుంటాము. మనలో అణచివేయబడిన భావావేశాలు, తీరని కోరకలు, అవితాంతి, సోమరితనం వంటిభావావేశాలని ఈ మూడు శరీరాలతో సంబంధాన్ని నెలకొల్పి వాటి గురించి నేర్చుకుంటాము. మనలో విజ్ఞాన జ్యోతాలు వెలిగించటానికి, మన భావావేశాల నుంచి స్వేచ్ఛ పొందటం నేర్చుకుంటాము.

ఆత్న స్పురణ |పో|గాం Atma Spurana Program (ATSP) (మీతో సంబంధాన్ని నెలకొల్పటం)

ఈ సర్వ విశ్వ సృష్టిలో, సర్వాంతర్యామిలో మానవులు ఒక భాగం ఈ విషయాన్ని ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా, అంతిమ సత్యం తెలుసుకోవటంలో మనకి కలిగే అడ్డంకుల విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ ప్రోగ్రాం మనలోనికి 5 శరీరాలయిన కోశాల గురించి తెలియజేస్తుంది. వీటి ద్వారా మనలో తెలుసుకునే తత్వాన్ని బయటకి తీస్తుంది. దానితో మనం మనతో సంబంధాన్ని నెలకొల్పుకోవచ్చు

భక్తి స్పురణ ప్రొగ్రాం (Bsp)

(మనలోని భావావేశాలని సంవృద్ధిపరచుకోవటం)

మన జీవితాలలో కొన్ని సంవత్సరాలు గడిచే సరికి మైండ్ మన ఉనికిని అణిచి తానే అన్ని నిర్ణయాలు చేస్తుంది. మానవాళి క్రమంగా నిరుపయోగమయిన తెలివితేటల బారిన పడిపోతుంది. దీని ఫలితంగా మనలోని భావాలు బాధలలో ఉండిపోతాయి.

మన అంతరాత్మ యొక్క నిజమయిన భాష భక్తి. ఇది భగవంతులని పై మనకుండే అత్యున్నతమయిన [పేమ. అది మనలోని [కిందిస్తాయిలో ఉండే భావావేశాలనుంచి మనని బయటకి తెస్తుంది. అది మన మైంద్‌కి సంపూర్ణ సఫలసిద్ధిని సమ దృష్టితో చూడగలగటం నేర్పుతుంది. ఈ కార్యక్రమం మన కోర్కెలకి అతీతంగా మనలో తీసుకువెళుతుంది. భక్తి స్పురణ ప్రోగాం 4 రోజులు కార్యక్షమం. ఇందులో ఆధునిక మానవులకి భక్తిమార్గాన్ని చూపించే దిశగా కార్యక్రమం తయారు చేయబడినది. ఇది మనలని తెలివితేటల దశ నుంచి లౌకిక పుణ్యకార్యకమాల నుంచి భగవంతునికి అతి సన్నిహితంగా మనలని తీసుకువెళుతుంది.

నిత్యానందం

THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM

(తీవ్రమయిన ఆత్మసాక్రాత్యారంగా )

ఇది తీవ్రమయిన ధ్యాన కార్యక్రమము. ఇది మొట్లమొదటిసారిగా THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్టితిని చేరగలిగే ఒక ప్రత్యేకమయిన సాంకేతిక పద్దతి. జ్ఞానోదయివు అనుభవాలకు పొందగలిగతే తాళం చెవులని మన చేతికి అందించే ఒక [పత్యేక కార్యక్రమం ఇందులో ఉంటుంది. ఈ కార్యక్రమం మొత్తం THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మన శరీరం, మైంద్‌కి అతీతంగా వెళ్ళి స్వచ్చమయిన సచేతన స్గితి యొక్క అనుభవాలని పొందవచ్చు

ధ్యాన స్పురణ (పో|గాం Dhyana Spurana Program (DSP) (మైంద్ ఒక కల్పన, తెలుసుకొని స్వేచ్ఛని పొందండి)

మన మైండ్ అనేది మన ఆలోచనల సమూహము మాత్రమే. స్వాభావికంగా, మన ఆలోచనలు ఒకదానికొకటి సంబంధం లేని, అర్గంలేని విషయాల క్రమం కానీ మనం వాటి మధ్య సంబంధం ఏర్పరచటానికి [పయత్నించుతూ మనకి మనం బాధలని సృష్టించుకుంటాము. ఎప్పదయితే మన ఆలోచనలు ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి అని తెలుసుకుంటామో అప్పుడు మనం మన

మెండ్‌ని వదిలివేస్తాము. దాని బంధం నుంచి వేరు పడతాము. ఎప్పుదయితే మనం మన మైండ్‌ని వదిలివేస్తామో అప్పుడు మనం స్వేచ్ఛని పొందుతాము. ధ్యాన స్పురణ ప్రోగ్రాంలో మనకి నేర్పించే ధ్యానం మన మైంద్‌ని వదిలివేస్తామో అప్పుదు మనం స్వేచ్ఛని పొందుతాము. ధ్యాన స్పురణ ప్రోగ్రాంలో మనకి నేర్పించే ధ్యానం మన మైంద్‌ని వదిలివేయటానికి సహాయపదుతుంది. మనం మన చేతనస్సితి మీద పూర్తిగా కేంద్రీకరించగలుగుతాము.

ఆరోగ్య స్పురణ ప్రోగ్రాం & చికిత్సా ధ్యానం Arogya Spurana Program And Meditation Therapy

మంచి ఆరోగ్యం అంటే వ్యాధులు లేకుండా ఉండటం కాదు. అది వాస్తవంగా నిశ్చయింగా మంచి స్గితిలో ఉండగలిగితే మన అంతరంగపు ఉనికి.

ఆరోగ్య స్పురణ ప్రోగ్రాంలో శాస్త్రీయంగా శరీరం, మైండ్ అత్మ అనే వాటిని అనుసంధానం చేయగలిగే తీవ్రమయిన ధ్యానాన్ని నేర్పించుతారు. ఈ కార్యక్రమం ద్వారా మన శరీరం కేవలం ఒక జీవ సంబంధమయిన యంత్రాంగం కాదు అని తెలుస్తుంది. మన శరీరం యొక్క వేర్లు మన లోతైన చేతన స్లితిలో, మన బుద్ధి కుశలతలో ఉంటాయి అని తెలుసుకుంటాము.

ఆరోగ్య స్పురణ ధ్యాన చికిత్సా కార్యక్రమం. ఆరోగ్యపరమయిన చికిత్సా విధానము. ఇందులో నేర్పించే ధ్యాన పద్గుతులు మనలోని [పత్యేకమయిన వ్యాధులను నివారించుతాయి. అంతేకాకుండా మనలో ఒక [కొత్త మానసిక స్టితిని నెలకొల్సుతాయి. దానితో మనలో నిశ్చయమయిన వాస్తవ దృక్పధం ఏర్పడుతుంది.

నిత్య స్పిరిచ్యువల్ హీలింగ్ ఇనిషియేషన్ The Supreme Pontiff Of Hinduism Bhagawan Sri Nithyananda Paramashivam Spiritual Healing Intiation

(నిత్యా ఆధ్యాత్మిక చికిత్సా దీక్ష – హీలర్ అవ్వటం)

ఈ కార్యకమం ద్వారా శాస్త్రీయ పద్దతిలో (పతి ఒక్కరిని ఆనందగంధ చక్రంలో

నియమించుతారు. దీనితో ఎదుటివారికి చికిత్స చేయగలిగే దివ్యశక్తి మీద్వారా ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుద్ధికుశలత అనే విషయం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఈ ప్రోగ్రాం పత్యేకత ఏమిటంటే, అది మీరు ఎదుటి వారికి చికిత్స చేసే సామర్యాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి సహాయం చేస్తుంది. బయటికి ఇది చికిత్సా పద్ధతి. అంతరంగంలో ఇది ఒక ధ్యాన పద్ధతి.

ఆనంద యోగం

Ananda Yogam (విస్తృతమవ్వండి విస్పోటమవ్వండి)

ఆనందయోగం అనే కార్యక్రమమం 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండే యువత కోసం తయారుచేసిన ప్రోగ్రాం. ఇది ఆశ్రశ్నంలో సంవత్సరం పాటు యువతకి ఇచ్చే ఒక ఉచిత ట్రయినింగ్ కోర్పు. ఈ ప్రోగ్రాం తూర్పు దేశాల యోగాతం తం, వేదాల ఆధారంగా ఉండి, ఆధునిక యువతని ఈ విషయంలో సాధికారత సాధించేలా చేస్తుంది. ఇందులో

  • విజయసాధనకి సూత్రం మరియు జీవిత సత్యాలు @
  • చికిత్సా విధానం, ధ్యానం, యోగా మొ॥ సంపూర్ణ సఫలతకి
  • మనలో ఉండే పూర్తి శక్తి యుక్తులని తెలుసుకోగలగటం
  • సృజనాత్మకతతో కూడిన బుద్ధి కుశలత, అప్రయత్న సిద్ధత ఈ కార్యక్రమం [పతి ఒక్కరిలో ఒక స్పష్టమయిన, స్లిరమయిన మానసిక స్పితిని ఏర్సరచుతుంది. మనలో ఉండే అంతర్గత శక్తిని తెలుసుకునేలా చేసి మనలని బయట ప్రపంచంలో అత్యున్నతులుగా చేస్తూ మనలో మనం ఏకాగ్రతని నిలిపేలా చేస్తుంది. ఇది మనలో [పాచీన వేద సూత్రాలని నింపుతుంది. దానితో పాటు

(పేమే మీ జీవితం

ఆధునిక తర్శ వాదాన్ని నేర్సుతుంది. ఇది ప్రపతి ఒక్కరికి ఆర్గికంగా, ఆధ్యాత్మికంగా స్టిరమయిన వారిగా తీర్చిదిద్దుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఒక జ్ఞానోదయమయిన గురుదేవుని సమక్షంలో నేర్చుకునే జీవితావకాశాన్ని మనకి ఇస్లుంది.

ఆనంద గ్యాలరీయా (డివైన్ షాప్) Ananda Galleria

ఆనందగెలీరియా అనేది ఒక షాపు. ఇందులో THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్వామిజీ యొక్క (పవచనాలు పుస్తక రూపంలో అన్ని భాషలలోనూ దొరుకుతాయి. ఇవి ఇంగ్లీషు, తమిళం, కన్నడ గుజరాణీ, తెలుగు, హిందీ పోర్చుగీసు, [ఫైంచ్ ఇంకా అనేక భాషలలో దొరుకుతాయి. స్వామీజీ ప్రపచనాల సి.డి.లు వీడియోలు దొరుకుతాయి ఇంతేకాకుండా స్వామీజీ ఫోటోలు, శాలువలు, మాలలు, గొలుసులు, టి. షర్ణులు ఇలా అన్ని రకాల వసువుల దొరుకుతాయి.

మీరు చదవటానికి ఇతర గ్రగంధాలు:

నమ్మకమయిన పరిష్కారాలు : Guaranteed Solutions

నమ్మకమయిన పరిష్మారాలు అనే పుస్తకం మనలోని భావావేశాలయిన కామం, భయం, వ్యధ, గ్రశద్ద ఆశించటం, అసూయ, అహంకారం, అసంత్సప్తి మొదలయిన వాటిని కూలంకషంగా అర్గం చేసుకునే ఉద్దేశంతో ప్రచురింపబడినది. ఇందులో ఉండే సమాచారం మొత్తం పరమహంస శ్రీTHE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM ప్రపంచ వ్యాప్తంగా వివిధ ధ్యాన కార్యక్రమాలలో, ఆనంద స్పురణ, లైఫ్ బ్లిస్ ప్రోగ్రాం, మొదలయిన వాటిలో ఇచ్చిన ప్రపచనాలు. ఈ పుస్తకం మనలోని ఏడు ప్రధాన శక్తికేంద్రాలు, వీటినే మనం చక్రాలు అంటాము, గురించి, అవి ఏవిధంగా మన భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని (పభావితం చేస్తాయో వివరంగా ఇవ్వబడినది.

ఎ.యస్.పి/ఎల్.బి.పి. ధ్యాన కార్యక్రమాలు ఈ శక్తికకేంద్రాలకి మనలోని భావావేశాలకి మధ్య ఉండే సంబంధాలని వివరిస్తారు. ఈ భావావేశాలు సూక్ష్మంగా మనపై ఏవిధంగా పనిచేస్తాయో నేర్పించుతారు. భావావేశాలు కేవలం ఆధారంలేని నీడలని మనకి నేర్సించుతారు. ఈ భావావేశాలని సంభాళించటానికి మనకి శక్తివంతమయిన ధ్యాన పద్గతులని నేర్సించుతారు. ఈ భావావేశాల ప్రభావం లేని స్వేచ్ఛాయుత జీవితాన్ని మనం గడపవచ్చుఅని నేర్పించుతారు. ఈ కార్యక్రమాలు మనం అయోమయం నుంచి, మానసిక కుంగు బాటు నుంచి ఏవిధంగా స్వేచ్ఛని పొందవచ్చునో వివరించుతాయి. ఈ కార్యక్రమాలలో మనని మానసిక బానిసత్వం నుంచి స్వేచ్ఛ పొందేలా నేర్పించుతారు. ఈ కార్యక్రమాలు మన అంతరంగంలో ఒక ప్రదేశాన్ని సృష్టించి, దాని నుంచి మన ఉనికికి ఆత్మకి తిరిగి మనతో సంబంధాన్ని ఏర్సరచుతారు. అది శరీరానికి మైంద్‌కి అతీతమయినది. అది స్వచ్చమయిన, శాశ్వతమయిన పరమానందం. అదే THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM. ఈ ధ్యాన కార్యక్రమాలని నిరంతరం శిక్షణ పొందిన ఆచార్యులు ఏర్పాటు చేస్తుంటారు.

పరమానందం మీ మార్గం మీ లక్ష్యం Bliss Is The Path And Goal

ఈ పుస్తకంలో స్వామీజీ ప్రపచనాలు ఉంటాయి. అవి చాలా అంశాలకి సంబంధించి ఉన్నాయి. మైండ్ ఎలా పనిచేస్తుంది అనే విషయం నుంచి మనం మన శరీరాన్ని ఏవిధంగా ద్వేషించుతాము అనే విషయం వరకూ, అలాగే సంపూర్ణ ఆధీనులవటం నుంచి వస్తు ప్రపంచపు జీవితం, ఆధ్యాత్మిక జీవితం వరకూ, ఇలా చాలా అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం మనలో ఉండే అనేక ప్రశ్నలకి జవాబులిస్తుంది. మన అంతరంగపు జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. మన అంతరంగంలోని చేతన స్థితిని తెలుసుకునేలా చేస్తుంది. మన శరీరం, మైండ్ మన ఉనికి విషయాలలో మార్గాన్ని నిర్దేశించే పుస్తకం. ఇది మనం THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM స్థితిలో ఎలా జీవించగలమో చెబుతుంది.

జీవన మరణాలకి అతీతంగా Beyond Life And Death

ధ్యానం జీవితాన్ని మరణాన్ని అనుసంధానం చేస్తుంది. ఇది మనకి జీవించే కళని మరణించే కళని నేర్పిస్తుంది. లేకపోతే మనం జీవన మరణాలు అనే వలయంలో చిక్కుకుపోతాము. స్వామీజీ తన ప్రపవచనాల ద్వారా మరణ రహస్యాలని చేధించి అది అర్గమయ్యేటట్టుగా మనకి వివరిస్తారు. అయిన ఒక విషయం స్పష్టంగా చెబుతారు. మనం మరణాన్ని అర్థం చేసుకున్నప్పుడు జీవితాన్ని ఒక ఐశ్వర్యంలా జీవించవచ్చు

Glimpses Of My Master

ఒక జ్ఞానోదయం పొందిన యోగీశ్వరులయిన గురుదేవుని సమక్షం అనేది మనిషి జీవితంలో దొరికే ఒక అరుదయిన అపురూప అవకాశం. అటువంటి గురుదేవుని సమక్షంలో మనం పొందే అనుభవాలే మనకు జ్ఞానోదయ మార్గాలు. ఈ పుస్తకంలో స్వామీజీ శిష్యుదు స్వామీజీ యొక్క అద్భుతమయిన జీవిత విశేషాలని చెబుతారు. వాస్తవాలు శాస్త్రీయమయినవి, చారితాత్మకమయినవి, కాలక్రకమమయినది. కానీ అంతిమ సత్యం వీటన్నింటికి అతీతమయినది, శాశ్వతమయినది. ఇందులో ఉపోద్యాతంలో ఒక జ్ఞానోదయం పొందిన యోగి యొక్క మహత్తరమయిన అవతారం గురించి ఇవ్వబడినది.

From Ignorance To Enlightenment

ఈ పుస్తకంలో శ్రీ THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM మనకు పతంజలి యొక్క యోగ సూత్రాలని గురించి చెబుతారు. సూతాలు అంటే లఘువాఖ్యాలు అని అర్ధం. చిన్న సూతాల ద్వారా అనంతమయిన విషయాలు చెప్పటం అని అర్ధం. కాలాతీతమయిన ఈ సత్యాలపై THE SUPREME PONTIFF OF HINDUISM BHAGAWAN SRI NITHYANANDA PARAMASHIVAM వాఖ్యానం ఇస్తారు. అవి ఆధునిక మానవులకి అర్ధమయ్యే రీతిలో చెప్పబద్దాయి. ఇందులో సాధకులు అడిగిన [పశ్నలకి స్వామీజీ ఇచ్చిన జవాబులు ఉన్నాయి.

Nithyopanishnad

ఉపనిషత్తు అంటే గురుదేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవటం. నిత్యోపనిషత్‌లో స్వామీజీ గురు శిష్య సంబంధం మీద ఇచ్చిన [పవచనాలు ఉన్నాయి. స్వామీజీ హిమాలయాలలో గంగానది ఒడ్డున అనేక సత్యాలని ప్రాచీన ఉపనిషత్తుల సాంధ్రపదాయంలో వివరించారు. ఎవరికయినా నాకు గురువు యొక్క అవసరం ఏమిటి అనే ప్ర‌శ్న ఉంటే, దాని జ‌వాబు ఇక్క‌డ దొరుకుతుంది.

భారత్

నిత్యానంద ధ్యానపీఠం నిత్యానందపురి, కల్లుగోపహళ్ళి, మైసూరు రోడ్, బిడది. బెంగుళూర్ – 562109, కర్నాటక

నిత్యానంద ధ్యానపీఠం ఆనందేశ్వరి దేవాలయం, నిత్యానందగిరి, పాశంబండ, సాతంరాయ్ గ్రామము, శంషాబాద్ మందల్, రంగారెడ్డి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

నిత్యానంద ధ్యానపీఠం 36/1, కామాక్షి అమ్మన్ స్ట్రీట్, పెరమనూర్, సేలం - 636 007. తమిళనాడు